మక్కల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం..

మక్కల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం

కొనుగోలు కేంద్రాలను వెంటనే పెంచాలని డిమాండ్

రైతులకు న్యాయం చేయకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరిక

రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట, నేటిధాత్రి:

అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల మక్కలు పండించిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ రోడ్లపైకి వస్తున్నారని రాష్ట్ర సివిల్ సప్లైస్ మాజీ చైర్మన్,బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత, నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపురం మండలంలో ఆయన మీడియాతో మాట్లాడారు.నియోజకవర్గ పరిధిలో ఈ యాసంగి సీజన్‌లో 70 వేల ఎకరాలకు పైగా రైతులు మక్కజొన్న సాగు చేసినప్పటికీ, దిగుబడికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. వ్యవసాయ అధికారుల వద్ద ఖచ్చితమైన గణాంకాలు ఉన్నప్పటికీ రైతులకు సరైన సదుపాయాలు కల్పించడం లేదన్నారు.పాకాల సరస్సులో గోదావరి నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ, సాగునీటిని అందించడంలో స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలను నామమాత్రంగా ప్రారంభించిందని, ఇప్పటి వరకు రైతులకు చెల్లింపులు కూడా చేయలేదని తెలిపారు.ప్రభుత్వం ప్రకటించిన బోనస్‌పై ఎలాంటి స్పష్టత లేదని, రూ. 2400 మద్దతు ధర ఉన్న మొక్కజొన్నను రైతులు ప్రైవేట్ వ్యాపారులకు రూ. 1700–1800కే విక్రయించాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో సాగునీరు, రైతుబంధు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు భరోసా కల్పించారని గుర్తు చేశారు.వాతావరణ శాఖ వర్షాల హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే గ్రామాల వారీగా మక్కల కొనుగోలు కేంద్రాలను పెంచి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులకు మద్దతుగా నిరసనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ తక్కల్లపల్లి రవీందర్ రావు,మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, మాజీ జడ్పీటీసీ,మండల పార్టీ అధ్యక్షుడు,సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు, సర్పంచులు, క్లస్టర్ బాధ్యులు, మండల పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఎన్నికల మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి: సుదర్శన్ రెడ్డి

మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

మంచిర్యాల,నేటి ధాత్రి:

ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు.శనివారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు- కలెక్టర్లు,ఈ. ఆర్. ఓ. లతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు ముందు గా చేపట్టిన మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు.బూత్ స్థాయి అధికారులకు సహాయ సహకారాలు అందిస్తూ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని,ఇందుకుగాను గ్రామ పాలన అధికారులు,ఇతర అధికారులను బూత్ స్థాయి అధికారులకు మ్యాపింగ్ లో సహాయకులుగా నియమించి మ్యాపింగ్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడి వారి పార్టీ నుంచి బూత్ స్థాయి ఏజెంట్లను నియమించేలా అవగాహన కల్పించాలని తెలిపారు.బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాలని,బూత్ స్థాయి అధికారుల పర్యవేక్షకులు,ఏ ఈ ఆర్ ఓ లు వారికి మ్యాపింగ్ చేయడంలో సహాయ సహకారాలు అందించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జరిగేలా పకడ్బందీగా ప్రక్రియ చేయాలని తెలిపారు.40 సంవత్సరాల లోపల ఉన్న మహిళల మ్యాపింగ్ ను వారి తల్లిదండ్రుల వివరాల ఆధారంగా చేయాలని,బూత్ స్థాయి అధికారుల వివరాలు ప్రజలకు తెలిసేలా ప్రచారం నిర్వహించాలని తెలిపారు.పెండింగ్ లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను త్వరిత గతిన పరిష్కరించాలని,బ్లర్డ్ ఫొటోస్,డబుల్ ఎంట్రీలపై దృష్టి సాధించాలని తెలిపారు.జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.జిల్లాలోని బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి పరిశీలించడం జరుగుతుందని,బూత్ స్థాయి అధికారులతో మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేలా పర్యవేక్షిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్,మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాసరావు,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ,ఎన్నికల అధికారులు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరణించిన ఓటర్లను విచారణ జరిపి తొలగించాలి…

మరణించిన ఓటర్లను విచారణ జరిపి తొలగించాలి
వనపర్తి నేటిదాత్రి .

 

తెలంగాణ ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, ఆర్డీవో సుబ్రహ్మణ్యంలతో కలిసి హాజరయ్యారు. సీఈఓ మాట్లాడుతూ ఎన్నికల సంఘం అదేవిధంగా మరణించిన ఓటర్ల జాబితాను విచారణ చేసి తొలగిం చాలని కోరారు ఎపిక్ కార్డ్స్, బీఎల్ వో ఐడి కార్డ్స్ పంపిణీ చేయాలని ఆదేశించారు.
వీసీ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఫారం 6, 7, 8 అప్లికేషన్లను త్వరతగతిన పరిష్కరించాలని ఆదేశించారు. 100 ఏళ్లకు పైబడిన ఓటర్లలో ఎవరైనా మరణించిన వారు ఉంటే వారి ఓట్లను తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు.సమావేశంలో డిప్యూటీ కలెక్టర్లు రంజిత్ రెడ్డి, శ్రావ్య, తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఎవరికి…

 ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఎవరికి ?

 

 

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని పార్టీలు ఈ అంశం మీద ఒక నిర్ణయానికి రావడం, తమ మద్దతు ప్రకటించడం జరిగాయి. అయితే,

 ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని పార్టీలు ఈ అంశం మీద ఒక నిర్ణయానికి రావడం, తమ మద్దతు ప్రకటించడం జరిగాయి. అయితే, బీఆర్ఎస్ పార్టీ మాత్రం తన స్టాండ్ ఏంటన్నది చెప్పడంలేదు. ఇప్పుడిది తెలంగాణలో చర్చనీయాంశమైంది. ఉప రాష్ట్రపతి అభ్యర్థుల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల కొన్ని షరతులు పెట్టారు. ఇది రాష్ట్ర రైతుల సమస్యలతో ముడిపడి ఉందన్న కేటీఆర్.. బీఆర్ఎస్ తెలంగాణలో ప్రధాన విపక్ష పార్టీగా ఉన్నప్పటికీ, ఎన్‌డీఏ, ఇండియా కూటమి రెండింటికీ అదే దూరం పాటిస్తోందని చెప్పుకొచ్చారు. ఆగస్టు 20న కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రైతులకు 2 లక్ష టన్నుల యూరియా సరఫరా చేస్తామని హామీ ఇచ్చే కూటమికి మాత్రమే తమ మద్దతు ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ‘కృత్రిమంగా’ సృష్టించిన సమస్య అని కేటీఆర్ ఆరోపించారు. సెప్టెంబర్ 9కు ముందు యూరియా రాష్ట్రానికి రావాలి.. మోదీ ప్రభుత్వం ఇస్తే ఎన్‌డీఏ అభ్యర్థికి, రాహుల్ గాంధీ ఇస్తే ఇండియా అభ్యర్థికి తాము మద్దతిస్తామని కూడా కేటీఆర్ చెప్పారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీలో చర్చలు జరుగుతున్నాయని, ఈ విషయమై ఇంకా ఎవరూ మాతో సంప్రదించలేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రైతుల హితమే మాకు ప్రధానమని అదే సమయంలో కేటీఆర్ అంటున్నారు. కాగా, ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి తెలుగు వాసి, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘తెలుగు గౌరవం’ పేరుతో బీఆర్ఎస్‌ మద్దతివ్వాలని కోరారు. కానీ, కేటీఆర్ దీన్ని తిరస్కరించి, ‘రేవంత్ రెడ్డి మూడో తరగతి సీఎం. కాంగ్రెస్ మూడో తరగతి పార్టీ అని విమర్శించారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీది కపట ప్రేమ అని.. అసలు కాంగ్రెస్ బీసీ అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు.

ఇక, బీఆర్ఎస్ ను ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో మద్దతు కోరుతారా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ సూటిగా సమాధానమిచ్చారు. తనను అధిష్టానం ఆదేశిస్తే, తప్పక బీఆర్ఎస్ పార్టీని కోరతానని తేల్చి చెప్పారు. కాగా, బీఆర్ఎస్ పార్టీకి రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ పార్టీ ఎవరికైనా మద్దతు ఇస్తుందా.. లేక ఎవరికీ ఇవ్వకుండా మిన్నకుంటుందా అనేది తేలాలి. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version