వికలాంగుల చేయూత పెన్షన్ దారుల మహాగర్జన.

వికలాంగుల చేయూత పెన్షన్ దారుల మహాగర్జన సదస్సును జయప్రదం చేయండి

నేటిధాత్రి చర్ల

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-33.wav?_=1

చర్ల మండలం వీహెచ్పీఎస్ మండల అధ్యక్షుడు రేగళ్ల సుధాకర్ ఆధ్వర్యంలో ఈనెల 24 న టీఎన్జీవో ఖమ్మం ఫంక్షన్ హాల్ నందు మహా గర్జన సన్నాహక సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సారధ్యంలో వికలాంగుల పెన్షన్ పెంచుటకు వితంతువుల చేయూత 4వేల రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లాలో వికలాంగులు మరియు వితంతువులు భారీ బహిరంగ సదస్సు నిర్వహించడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు గాను వికలాంగులకు నెలసరి 6000 రూపాయలు ఇవ్వాలని వితంతువులకు 4 వేల రూపాయలు ఇవ్వాలని హెచ్ఐవి పేషెంట్లకు ఏఆర్టి పెన్షన్ పెంచాలని వృద్ధులకు 4000 రూపాయలు పెన్షన్ గత ఎలక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి చర్ల మండలం వికలాంగులు వితంతువులు చేయుత పెన్షన్ దారులు ప్రతి ఒక్కరూ మరియు మండల ఎంఆర్పిఎస్ ఎంఎస్పి విహెచ్పిఎస్ నాయకులు భారీ సంఖ్యలో హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మచ్చ రాజా వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నం రామ్మూర్తి మండల ప్రధాన కార్యదర్శి పూసం ముత్యాలరావు కార్తీక్ ఇల్లందుల జైరామ్ గుద్దేటి నాగరాజు బోయిల్లా ప్రవీణ్ సురేష్ రెడ్డి సతీష్ సాగర్ సుబ్రహ్మణ్యం శంకరాచారి కమల నానమ్మ తదితరులు పాల్గొన్నారు

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం.

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం

పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-28.wav?_=2

ములుగు జిల్లా, నేటిధాత్రి:

రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శుక్రవారం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (టిఎస్ జెయు) ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో టిఎస్ జెయు రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగౌని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, ఎన్ యుజె (ఐ) జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలు పావుశెట్టి శ్రీనివాస్, నాగపురి నాగరాజ్, ములుగు జిల్లా అధ్యక్షులు చల్లగురుగుల రాజు, ప్రధాన కార్యదర్శి సంఘ రంజిత్ కుమార్, ఉపాధ్యక్షులు నాగపురి హరినాథ్ గౌడ్, వరంగల్ జిల్లా అధ్యక్షులు కందికొండ మోహన్, ఉపాధ్యక్షులు కందికొండ గంగరాజు, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రాము, ప్రధాన కార్యదర్శి హరికృష్ణ, జాయింట్ సెక్రెటరీ దాడి బిక్షపతి, జనగాం జిల్లా అధ్యక్షుడు యు. నరేందర్, మహబూబ్ బాద్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ ధీర్, కార్యదర్శి సతీష్ చారి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంతోష్, కార్యదర్శి దొమ్మాటి రవి, ఉపాధ్యక్షులు బండారి రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం ములుగులో జరిగింది. టిఎస్ జెయు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మాట్ల సంపత్, కార్యవర్గ సభ్యులుగా గండ్రాతి విజయాకర్, టిఎస్ జెయు మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మందాటి రజిని, ఉపాధ్యక్షురాలుగా పోచంపల్లి రజిత లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభ్యులు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా యూనియన్ సభ్యులు చల్లూరు మహేందర్ పెండం బిక్షపతి, ధనుంజయ్, రాము తదితరులు పాల్గొన్నారు.

ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే జిఎస్ఆర్.

ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే జిఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-25.wav?_=3

భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని ఆలయాలను సీజీఎఫ్ నిధులతో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం భూపాలపల్లి రూరల్ మండలం ఆజంనగర్, గొల్లబుద్దారం గ్రామాలల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఆజంనగర్ గ్రామంలో రూ.10 లక్షలతో శ్రీ శివ కేశవస్వామి దేవాలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గొల్లబుద్దారం రూ.50 లక్షలతో శ్రీ రామాలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎస్ఆర్ మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గంలో అన్ని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు భూపాలపల్లి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనులను చూసి ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్యే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం రామాలయంలో ఎమ్మెల్యే మొక్కను నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రూరల్ మండలం అధ్యక్షుడు సుంకర రామచంద్రయ్య తాసిల్దార్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

హీరో విజయ్‌కు మద్రాసు హైకోర్టు నోటీసు..

హీరో విజయ్‌కు మద్రాసు హైకోర్టు నోటీసు.. విషయం ఏంటంటే..

పార్టీ పతాకంలో ఎరుపు, పసుపు, ప్రత్యేక రంగుల వినియోగంపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై, అఫిడివిట్‌ దాఖలు చేయాలని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌కు మద్రాసు హైకోర్టు నోటీసు జారీచేసింది.

చెన్నై: పార్టీ పతాకంలో ఎరుపు, పసుపు, ప్రత్యేక రంగుల వినియోగంపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై, అఫిడివిట్‌ దాఖలు చేయాలని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌(Vijay)కు మద్రాసు హైకోర్టు నోటీసు జారీచేసింది. తొండై మండల సన్నోర్‌ ధర్మ పరిపాలనసభ అధ్యక్షుడు పచ్చయప్పన్‌ మద్రాసు హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌లో… తొండై మండల సన్నోర్‌ ధర్మ పరిపాలన సభ తమిళనాడు ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ విభాగంలో నమోదుచేసి ట్రస్ట్‌గా పనిచేస్తుందన్నారు.

ఈ సభ జెండాను ఎరుపు, పసుపు రంగులతో రూపొందించామన్నారు.నిర్ధిష్ట రంగులు వినియోగించే హక్కు తమ సభకు మాత్రమే ఉందన్నారు. కానీ, నటుడు విజయ్‌ 2024లో ప్రారంభించిన టీవీకే జెండాలో ఎరుపు, పసుపు రంగులున్నాయని, అందువల్ల టీవీకే జెండాలోని రంగులు తొలగించేలా ఉత్తర్వులు జారీచేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ గురువారం విచారించిన హైకోర్టు న్యాయమూర్తి సెంథిల్‌కుమార్‌ రామమూర్తి… ట్రేడ్‌ మార్క్‌ సర్టిపికెట్‌ సరుకులకు మాత్రమే వర్తిస్తుంది,

రాజకీయ పార్టీల జెండాలకు ఎలా వర్తిస్తుంది? అని ప్రశ్నించారు. ట్రేడ్‌ మార్క్‌ సర్టిఫికెట్‌ సరుకులకు మాత్రమే కాకుండా సేవలకు వర్తిస్తుందని, స్వచ్ఛంధ సంస్థలు, ట్రస్ట్‌లకు కూడా ఈ సర్టిఫికేట్‌ వర్తిస్తుందని పిటిషనర్‌ తరపు న్యాయవాది వివరించారు. అనంతరం న్యాయమూర్తి, ఈ పిటిషన్‌పై టీవీకే అధ్యక్షుడు విజయ్‌ అఫిడివిట్‌ దాఖలుచేయాలని ఉత్తర్వులు జారీచేసి, విచారణ వాయిదావేశారు.

ఇచ్చిన హామీలను నెర చేర్చనున్న మాజీ మంత్రి కేటీ రామారావు..

ఇచ్చిన హామీలను నెర చేర్చనున్న మాజీ మంత్రి కేటీ రామారావు……

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-23.wav?_=4

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన కర్క బోయిని కుంటయ్యకు వారి కుటుంబ సభ్యులను సిరిసిల్ల బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో కలిసిన బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. ఈ సందర్భంగా. ఇటీవల పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య పాల్గొన మాజీ ఎంపిటిసి కుంటయ్యకుటుంబానికి ఇచ్చిన హామీ ప్రకారం తన చిన్న కుమార్తె పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేసి ఆర్థిక సహాయం అందజేసిన మాజీ మంత్రి అలాగే పెద్ద కుమార్తె వివాహ పూర్తి బాధ్యతను తమదేనని. కుంటయ్య కుటుంబానికి తెలియజేసిన మాజీ మంత్రి కేటీ రామారావు. ఇట్టి కార్యక్రమంలో. బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ రామారావు తో పాటు. జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య. తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు. టే స్కబ్. చైర్మన్ కొండూరి రవీందర్రావు మాజీ జెడ్పిటిసి అరుణ. పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ శ్రేణుల్లో ఆశలు..!

కాంగ్రెస్ శ్రేణుల్లో ఆశలు..!

కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో పదవుల పందెం మొదలైంది. జిల్లా అధ్యక్ష పదవి కోసం జిల్లా వర్కింగ్ ప్రెసి‌డెంట్‌గా ఉన్న కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పార్లమెంట్ స్థానానికి పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన వెలిచాల రాజేందర్రావు, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కుర్ర సత్యప్రసన్నరెడ్డి, సీనియర్ నేత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి పోటీ పడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ (Congress Party) సంస్థాగత పునర్నిర్మాణంపై దృష్టిసారించడంతో పార్టీ శ్రేణుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అధికారంలో లేకపోవడం, ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చినా ఆటు సంస్థాగత పదవులు గానీ, ఇటు నామినేటెడ్ పదవులు (Nominated Posts) దక్కక నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, క్రియాశీల కార్యకర్తలు, గ్రామీణస్థాయి నాయకుల్లో ఇప్పుడు ఉత్సాహం మొదలైంది. పార్టీ ఆధిష్టానవర్గం సంస్థాగత పునర్నిర్మాణంపై దృష్టిసారించడమే కాకుండా ఉమ్మడి జిల్లాల స్థాయిలో (Karimnagar) ఇన్చార్జీలను పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించడంతో వారు తమకు అప్పగించిన బాధ్యతల్లో పనిచేయడం ప్రారంభించారు.. ఉమ్మడి జిల్లా సంస్థాగత ఇన్చార్జి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (MLC Addanki Dayakar) ఉమ్మడి జిల్లా పరిధిలోని జిల్లాల్లో పర్యటన ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆయన సమావేశం ఏర్పాటు చేసి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక జిల్లా ఉపాధ్యక్షున్ని, ప్రతి బ్లాక్ నుంచి ఒక ప్రధాన కార్యదర్శిని, ప్రతి మండలం నుంచి ఒక కార్యదర్శిని తీసుకుంటామని ప్రకటించారు. క్షేత్రస్థాయి నేతలు ఆయా పదవుల క్రీడ కోసం అప్పుడే తమ ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా తీవ్రమైన పోటీ నెలకొన్నది.

ప్రయత్నాలు ముమ్మరం చేసిన నేతలు..

సంస్థాగత ఇన్చార్జి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో సమావేశం ఏర్పా టు చేయడంతో డీసీసీ పదవిని ఆశిస్తున్నవారు అలర్ట్ అయి అందుకు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రధానంగా పదవి కోసం ప్రస్తుతం కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసి‌డెంట్‌గా ఉన్న కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పార్లమెంట్ స్థానానికి పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన వెలిచాల రాజేందర్రావు, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కుర్ర సత్యప్రసన్నరెడ్డి, సీనియర్ నేత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి పోటీ పడుతున్నారు

ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీల అమలు.!

ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీల అమలు ఎప్పుడు?

కార్మిక సంఘాల నాయకులను గనుల పైన నీలదీయండి

కార్మికులకు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం పిలుపు

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

సింగరేణిలో ఎన్నికలు జరిగి 18 నెలలు కాలం గడుస్తున్నప్పటికీ కార్మికులకు ఇచ్చిన హామీల అమలు ఎప్పుడు?అని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు నిలదీశారు. గురువారం నస్పూర్ కాలనీలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం బెల్లంపల్లి రీజినల్ సెక్రెటరీ సమ్ము రాజయ్య ఆధ్వర్యంలో టీఎస్ యుఎస్ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య మాట్లాడుతూ,సింగరేణిలో ఎన్నికలు జరిగి 18 నెలల కాలం గడుస్తున్నప్పటికీ ఎన్నికలలో గుర్తింపు పొందిన ఏఐటీయూసీ,ప్రాతినిత్య ఐఎన్టియుసి కార్మిక సంఘాలు ఎన్నికలలో పెద్ద పెద్ద మేనిఫెస్టోలలో కార్మిక సమస్య చేర్చి మా సంఘానికి ఓట్లు వేసి గెలిపించండి మీకు ఇస్తున్న హామీలు తూచ తప్పకుండా కంపెనీతో కొట్లాడి పోరాడి సమస్యలు పరిష్కరిస్తామని కార్మికుల ఓట్లు దండుకొని గెలుపొందిన ఏఐటీయూసీ,ఐ ఎన్ టి యు సి కార్మిక సంఘాల నాయకులు తమ ఆర్థిక ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయని, కార్మికులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా పరిష్కరింపబడలేదని గుర్తింపు ప్రాదీనీత్య సంఘాలు కార్మిక హక్కులు సాధించడంలో విఫలం చెందాయని,కేవలం ఈ రెండు సంఘాలు తమ ఆర్థిక ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయని అన్నారు. కార్మికుల హక్కుల కోసం కాదని కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, ఎన్నికలకు ముందు కార్మికులకు ఇచ్చిన హామీల అమలకై కంపెనీతో గుర్తింపు ప్రాతీనిద్య సంఘాలు పోరాడాలని గత ఏడు సంవత్సరాల కాలం నుండి సింగరేణిలో మారుపేర్లు విజిలెన్స్ పెండింగ్ ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని,కార్మికులకు 300 గజాల ఇంటి స్థలం పట్టణ ప్రాంతాలలో కేటాయించాలని,శరీరక శ్రమ మీద ఆధార పడి పనిచేస్తున్న బొగ్గు గని కార్మికులకు ఇన్కమ్ టాక్స్ రద్దు చేయాలని అన్నారు.బొగ్గు గనుల ప్రాంతంలో బొగ్గు ఆదరిత పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, సింగరేణిలో పనిచేస్తున్న కాంటాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి. డిపెండెంట్ ఉద్యోగాల ఇన్వల్యూషన్ విషయంలో కొనసాగుతున్న కుంభకోణంపై ధర్యాప్తి జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.మెడికల్ బోర్డు కు దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుల వారసునికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.బొగ్గు తట్ట పనిని కూడా సింగరేణి సంస్థ నిర్వహించాలి.ఎట్టి పరిస్థితులలో ప్రవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించరాదని డిమాండ్ చేశారు.సింగరేణిలో అక్రమంగా తొలగించిన డిస్మిస్ కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గనులను ప్రైవేటీకరణ చేసే ఆలోచనను ఆపాలి.సింగరేణి పబ్లిక్ రంగ సంస్థల కొనసాగించాలి. కేంద్రం బొగ్గు గనులను బహిరంగంగా వేలం వేసే పద్ధతిని ఆపి తెలంగాణకే సింగరేణి సంస్థలను అప్పజెప్పాలి. 2024-2025 కంపెనీకి వచ్చిన లాభాల నుండి 40 శాతం లాభాలను కార్మికులకు పంచాలి.సింగరేణి పరిరక్షణ కార్మిక హక్కుల కోసం ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.కలిసి వచ్చే కార్మిక సంఘాలను కలుపుకొని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ నీరేటి రాజన్న,గోదావరిఖని రీజినల్ కార్యదర్శి ఎం ఎఫ్ బేగు, పి.చంద్రశేఖర్,గుంపుల సారయ్య తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన

సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన

కాంగ్రెస్ పై మండిపడ్డ కేటీఆర్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ..
అరు దశాబ్దాలుగా జరిగిన జలదోపిడి ఒక ఎత్తు అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక‌ కోవర్ట్గా మారి‌ తెలంగాణను ఢిల్లీ లో తాకట్టు పెట్టారని.బనకచర్ల గురించి చర్చ అయితే పోను అన్న రేవంత్ రెడ్డి ఎలా మీటింగ్కి పోయాడు.
చంద్రబాబు కి తొత్తు రేవంత్ రెడ్డి.అదిత్యనాథ్ సాగునిటి సపహాదారుడుగా పెట్టుకోవడమే పెద్ద తప్పు. అలాంటిది ఎలా పెట్టుకున్నాడని ప్రశ్నించాడు.కాళేశ్వరం, సితారామ ప్రాజెక్టు లకి అనుమతులు ఇవ్వోద్దని అడ్డుకున్నదే చంద్రబాబు నాయుడు.తెలంగాణ హక్కులని కాపాడడానికి కెసిఅర్ ఉన్నాడనీ కేటీఆర్ తెలిపారు.
ఒకపక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయినా మరోపక్క చంద్రబాబు కోవర్టులా పాలన జరుగుతుందని చెప్పాడు.బనకచర్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండ్ మార్చకపోతే మరొసారి ఉద్యమానికి బిఅర్ఎస్ సిద్దం అవుతుంది తెలిపారు.
నేడు ఆంధ్ర పాలకుల కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు కనుసైగలలో నడుస్తుంది.చిలుక రేవంత్ రెడ్డి అయితే పలుకులు మాత్రం చంద్రబాబువి.
ఇచ్చంపల్లి ప్రాజెక్టు గతంలో ఉన్న ప్రాజెక్టే.
గోదావరి జలాల విషయం లో తెలంగాణ కి ఇంకా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది.
ఎలాంటి‌ అనుమతులు లేకుండానే బనకచర్ల ప్రాజెక్టు కట్టాలని చూస్తున్నారు.సి.యం రేవంత్ కి ఏ బేసన్ లో ఏ ప్రాజెక్టు ఉందన్న విషయం తెలియదు అని మీడియా ముఖంగా తెలియజేశారు.
రేవంత్ రెడ్డి కి తెలిసింది రియల్ ఎస్టేట్ వ్యాపారమే.
కెసిఆర్ రాయలసీమ,ఆంధ్రా కూడా బాగుండాలి మావాట తెలాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించాలని చుస్తున్నాడు అని తెలిపారు..

వనపర్తి రెండో వార్డ్ లో కార్యకర్తలతో కలిసి.!

 

వనపర్తి రెండో వార్డ్ లో కార్యకర్తలతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే తూడి

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్త లతో కలిసి 2వ వార్డులో వనపర్తి ఎమ్మెల్యే తుడిమేగారెడ్డి పర్యటించి రెండో వార్డు ప్రజల సమస్యలను తెలుసుకున్నారు . ఈ సందర్భంగా 2వ వార్డు ప్రజలు కొందరు ఇందిరమ్మ ఇల్లు మంజూర అయిందని అన్నదమ్ములు ఉన్నారని ఇల్లు ఇల్లు నిర్మించుకోవడానికి స్థలం సరి పోవడం లేదని ప్రభుత్వ ఇల్లు మంజూరైన వారు మంజూరు అయినవారు తన తన దృష్టికి తెచ్చారని విషయం జిల్లా కలెక్టర్ తో మాట్లాడి వారికి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు . కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వనపర్తి పట్టణ ప్రజలను వార్డుల్లో పలకరించగా సన్న బియ్యం కొన్ని సిసి రోడ్లు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని పరీక్షలు వ్రాసి అర్హులు అయితే ప్రవేటు ఉద్యోగాలు రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీనవర్గాలకు స్లం ఏరియాలకు పేరు ఉన్నదని అభివృద్ధి విషయంలో ముందంజలో ఉంటుందని ఎమ్మెల్యే మేగారెడ్డి విలేకరుల సమావేశంలో చెప్పారు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ కౌన్సిల ర్ లుగా పోటీ చేసే అభ్యర్థులను గెలిపించి చైర్మన్ గా ఎన్నుకొవాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో వనపర్తి అభివృద్ధి చేసుకుందామని అన్నారు ఇంకా రెండో వార్డులో కొంతమంది ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మించుకోవడానికి ఆర్థిక స్తోమత స్థలం లేదని మాకు డబుల్ బెడ్ రూములు కేటాయించాలని నిరుపేదలు అడిగారని ఈ విషయం అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యుత్తు ఇనుప స్తంభాల గురించి ఎమ్మెల్యే దృష్టి కి తెచ్చారుఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల చందర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ కాంగ్రెస్ నేతలు తైలం శేఖర్ ప్రసాద్ రహీం మీడియా సెల్ కోఆర్డినేటర్ డి వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు ఉన్నారు

వనమహోత్సవంలో భాగంగా విద్యార్థులతో కలిసి మొక్కల నాటింపు.

వనమహోత్సవంలో భాగంగా విద్యార్థులతో కలిసి మొక్కల నాటింపు.

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-14.wav?_=5

నాగర్ కర్నూల్ జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలో విద్యార్థులతో కలిసి వనమహోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మన ప్రియతమ నాయకుడు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కల్వకుర్తి రోడ్డులో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పునాదులు వేశారు.
అంతేకాకుండా, మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం సమీపంలో నూతనంగా మంజూరైన డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి అభివృద్ధి పథంలో మరో అడుగు వేసారు.పర్యావరణ పరిరక్షణతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తోన్న ప్రజాప్రతినిధికి అభినందనలు.ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ ఛైర్మెన్ రమణ రావు , మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ జంగయ్య ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్ , మాజీ ఎంపీపీ బండా పర్వతాలు ,తెల్కపల్లి మండల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మహిళా సదస్సు ప్రాంగణాన్ని పరిశీలించిన.

మహిళా సదస్సు ప్రాంగణాన్ని పరిశీలించిన జిల్లా అధికారులు కాంగ్రెస్ నాయకులు.

చిట్యాల, నేటి ధాత్రి :

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-11.wav?_=6

చిట్యాల మండలంలో మహిళా సదస్సు ప్రాంగణాన్ని పరిశీలించిన చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి* ఈనెల 18వ తారీకున మహిళా సదస్సు కార్యక్రమానికి పంచాయతీరాజ్ మహిళా ,శిశు ,సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క విచ్చేస్తున్న సందర్భంగా సభా ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లను ముమ్మరం పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహిళా సదస్సు చిట్యాల మండల కేంద్రంలో నిర్వహిస్తున్నాం జిల్లాలోని మహిళలందరూ విచ్చేసి సదస్సును విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ…కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే దిశగా అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీ ప్రజా పరిపాలన అందులో భాగంగానే శిశు సంక్షేమ శాఖ మాత్యులు సీతక్క విచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పతకాలు , మహిళల సాధికారిక అనేక అంశాలపై ప్రసంగిస్తారు కావున వివిధ మండలాల గ్రామాల్లోని మహిళలు విధిగా జిల్లాలోని ప్రతి ఒక్క మహిళ యొక్క ఈ కార్యక్రమానికి విచ్చేసి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఎ పి డి డిపిఎంలు ఎంపీడీవో జయశ్రీ ఎంపీ ఓ రామకృష్ణ జిల్లా అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మధు వంశీకృష్ణ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ , కాంగ్రెస్ నాయకులు చిలుముల రాజమౌళి బుర్ర శ్రీను బుర్ర మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్సై కాశీనాథ్ తెలిపారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి యువత మత్తు పదార్థాలు దూరంగా ఉండాలని జహీరాబాద్ రూరల్ ఎస్సై కాశీనాథ్ అన్నారు. రంజోల్ గ్రామంలో యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ సహకారంతో రంజోల్ వాకింగ్ వారియర్స్ పేరుతో 25 మంది యువకులకు వాకింగ్ షూస్ తో పాటు టీ షర్టులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు _ మాట్లాడుతూ యువతను ప్రోత్సహించేందుకు టీ షర్ట్లు షూస్ పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. మత్తు పదార్థ వినియోగం సరదాగా మొదలై వ్యసనంలా మారి చివరకు జీవితాన్ని నాశనానికి దారితీస్తుందన్నారు. మత్తు పదార్థాలు సేవించడం ఆరోగ్యానికి హానికరమని, వినియోగించే వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

SS Kashinath

ప్రతి ఒక్కరు ఆరోగ్యకరంగా ఉండేందుకువాకింగ్ తో పాటు వ్యాయామం చేయడం అలవర్చుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి టీషర్టులతో పాటు షూస్ అందించడం జరుగుతుందని తెలిపారు.

మండలస్థాయి సమావేశం విజయవంతం చేయాలి.

బిఆర్ఎస్ మండలస్థాయి సమావేశం విజయవంతం చేయాలి

మండల అధ్యక్షులు,వైస్.ఎంపీపి చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-5-2.wav?_=7

పరకాల నేటిధాత్రి
18 జులై శుక్రవారంరోజున పరకాల పట్టణంలో స్థానిక పద్మశాలి భవన్ లో బిఆర్ఎస్ మండల మరియు గ్రామస్థాయి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుందని,ఈ సమావేశానికి మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ముఖ్య అతిధులుగా హాజరువ్వానున్నారని మాజీ వైస్ ఎంపీపి బిఆర్ఎస్ మండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి తెలిపారు.ఈ సమావేశానికి పట్టణ మరియు మండల,గ్రామ పార్టీ,మరియు అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు,మాజీ జెడ్పిటీసి,ఎంపిటిసి,సర్పంచ్ లు,కోఅప్షన్ సభ్యులు,సోసైటీ ఛైర్మెన్లు,కమిటీ సభ్యులు,యూత్ విభాగం,పార్టీ శ్రేణులు,అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజవంతం చేయాలని కోరారు.

యూత్ కాంగ్రెస్ సేవా సమితి ఆపన్నహస్తం.

యూత్ కాంగ్రెస్ సేవా సమితి ఆపన్నహస్తం:

గుండె సమస్యతో బాధపడుతున్న నిరుపేదకు కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం

రాయికల్, జూలై 16, నేటి ధాత్రి.

మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన సామల్ల లక్ష్మీనారాయణ గుండె సమస్యతో బాధపడుతూ నిరుపేదరికంతో ఆసుపత్రి ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న యూత్ కాంగ్రెస్ సేవా సమితి, ఇటిక్యాల వారు చలించిపోయారు.
మానవతా దృక్పథంతో స్పందించి, లక్ష్మీనారాయణ కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ, దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు

దాతృత్వం చాటుకున్న బీఆర్ఎస్ నాయకులు..

దాతృత్వం చాటుకున్న బీఆర్ఎస్ నాయకులు

బాలిక వైద్య ఖర్చులకు ఇరవై రెండు వేల ఆర్ధిక సహాయం

ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు పదివేల రూపాయల సహాయం

మంగపేట పీఏసీఎస్ చైర్మెన్ తోట రమేష్ 5000/-

ములుగు జిల్లా యువజన విభాగం యూత్ ప్రధాన కార్యదర్శి బాడిశ నాగ రమేష్ 5000/-

బీఆర్ఎస్ జిల్లా మహిళా నాయకురాలు కొమరం ధనలక్ష్మి రెండువేల రూపాయలు
చొప్పున బాలిక తండ్రి కి అందజేత

మంగపేట నేటి ధాత్రి

మంగపేట మండలం కొత్త మల్లూరు గ్రామానికి చెందిన
మాటూరి కోటేశ్వరరావు కూతురు వర్షిత (12) అనుకోకుండా వేడి నీళ్లు పడటం తో శరీరం అంతా కాలిపోయింది.ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది.వైద్యానికి సుమారుగా లక్ష రూపాయలు దాకా ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పగా, డబ్బుల కొరకు తీవ్ర ఇబ్బంది పడుతున్న కోటేశ్వర్రావు బాధ ను స్థానిక బీఆర్ఎస్ నాయుకులు ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు గారిని,పీఏసీఎస్ చైర్మెన్ తోట రమేష్ ను ,ములుగు జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బాడిశ నాగ రమేష్ ,బీఆర్ఎస్ జిల్లా మహిళా నాయకురాలు కొమరం ధనలక్ష్మి వారికి తెలియజేయగా వారు తక్షణమే స్పందించి ఇరవై రెండు వేల రూపాయలను బాలిక తండ్రికి స్థానిక బీఆర్ఎస్ నాయకుల ద్వారా అందజేశారు .అడగగానే స్పందించి సాయం అందజేసిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు,తోట రమేశ్ కు ,
బాడిశ నాగ రమేష్ ,కొమరం ధనలక్ష్మి లకు బాలిక కుటుంబ సభ్యులు,స్థానిక బి ఆర్ ఎస్ నాయుకులు,గ్రామస్థులు కృతజ్ఞతలు తెలియజేశారు.అదేవిధంగా దాతలు బాలిక వైద్యానికి తమ వంతుగా సాయం అందజేయాలని స్థానికులు కోరారు. కార్యక్రమం లో మునిగెల నరేష్ , గుండారపు పూర్ణయ్య, బట్ట శ్రీను , బట్ట రవీందర్, గుండారపు రమేష్, గుంటుపల్లి రవి, బట్ట ధర్మావతి, కన్నమ్మ, మాణిక్యం బట్ట నర్సింహా రావు, పొనగంటి గోపయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మార్పీఎస్ మరియు తీన్మార్ మల్లన్న టీం సభ్యుల.

ఎమ్మార్పీఎస్ మరియు తీన్మార్ మల్లన్న టీం సభ్యుల నీ సన్మానించిన జ్యోతి పండాల్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జ్యోతి పండాల్ తన నివాసంలో ఎమ్మార్పీఎస్ మరియు తీన్మార్ మల్లన్న టీం సభ్యులని సన్మానించడం జరిగింది. 30 సంవత్సరాల నుండి అలుపెరుగని పోరాటం చేసి ఏ బి సి డి ఎస్సీ వర్గీకరణ సాధించిన మందకృష్ణ మాదిగ గారికి అండగా ఉండి వారికి సహాయం అందించి, అలాగే మొన్న మందకృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకను జరుపుకున్న సందర్భంగా పార్టీలకి అతీతంగా అందరి నాయకులను పిలిచి సన్మానించి వారి మంచి మనసుని చాటుకున్నారు, వారి మంచి మనసుని అభినందిస్తూ మన జహీరాబాద్ నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులని మరియు ఇన్చార్జిలందరినీ కూడా సన్మానించడం జరిగింది. అలాగే మొన్న జరిగిన తీన్మార్ మల్లన్న బీసీ మీటింగ్ కి చాలా కృషి చేసి ఆ మీటింగ్ని చాలా విజయవంతం చేసినందుకు గాను తీన్మార్ మల్లన్న టీం సభ్యులకి కూడా సన్మానం జరిగింది. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా ఒక చిన్న గ్రామంలో ఒక్క మీటింగ్ తో రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించి మన జహీరాబాద్ పేరుని ఎక్కడికో తీసుకెళ్లిన పవర్ ఫుల్ టీం కి జ్యోతి పండాల్ అభినందించి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జ్యోతి పండాల్, తీన్మార్ మల్లన్న టీం జహీరాబాద్ ఇన్చార్జి నరసింహ, శ్రీకాంత్, హనుమంతు, రాకేష్, ఉల్లాస్ మాదిగ జహీరాబాద్ ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్, జయరాజ్ మాదిగ ఎమ్మార్పీఎస్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు, నిర్మల్ కుమార్ మాదిగ మొగుడంపల్లి ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్, టింకు మాదిగ జహీరాబాద్ మండల ఇన్చార్జ్ ఎమ్మార్పీఎస్, సుకుమార్ మాదిగ ఎమ్మార్పీఎస్ కార్యదర్శి జహీరాబాద్, జీవన్ మాదిగ ఎమ్మార్పీఎస్, రాఘవులు, సాయికుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి, దొంతి చిత్రపటానికి క్షీరాభిషేకం.

సీఎం రేవంత్ రెడ్డి, దొంతి చిత్రపటానికి క్షీరాభిషేకం.

#ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలి.

#మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తే లబ్ధిదారులకు పూర్తి మొత్తంలో బిల్లు వారి ఖాతాలో జమ కావడం జరుగుతుందని మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని బుచ్చిరెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా మొదటి విడతగా గ్రామానికి చెందిన బాధావత్ మౌనిక సుమన్ ఖాతాలో లక్ష రూపాయలు జమ కావడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ కూడలిలో మండల పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చిత్రపటాలకు కార్యకర్తలతో కలిసి క్షీరాభిషేకం చేశారు. అనంతరం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గత పాలకుల 10 సంవత్సర కాలంలో ఏ ఒక్కరికి కూడా ఇండ్లు మంజూరు చేసి అనుకున్న సమయానికి డబ్బు జమ చేయకపోగా. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులకు మంజూరు చేసి నిర్దిష్ట సమయంలో వారి ఖాతాలో డబ్బులు జమ చేయడంతో గత పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల లోపు లబ్ధిదారులందరూ ఇండ్లను పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చార్ల శివారెడ్డి, భూక్య బౌసింగ్, జిల్లా మునిందర్, బేతి భరత్, నల్లగొండ సుధాకర్, డ్యాగాల కృష్ణ, బత్తిని మహేష్, గ్రామ పార్టీ అధ్యక్షుడు భూక్య బాలాజీ, ప్రేమ్ సింగ్, సుమన్, బాదావత్ బాలాజీ, భూక్య రమేష్, జగన్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న దేశిని కోటి.

జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న దేశిని కోటి
(జమ్మికుంట: నేటిధాత్రి)
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ హుజురాబాద్ నిజయోకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఉడతల ప్రణవ్ బాబు కు స్వాగతం పలుకుతూ శాలువాతో సత్కరించిన దేశిని కోటి. దొంత రమేష్. సుంకర రమేష్.జిల్లాల తిరుపతిరెడ్డి.సతీష్ రెడ్డి.మేకల తిరుపతిరెడ్డి. నల్ల కొండల రెడ్డి.శ్రీనివాస్.తదితరులు సత్కరించారు.
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టింది ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్నారు మీరందరూ ఐక్యతగా ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థన గెలిపించాలని విభేదాలు లేకుండా పనిచేయాలని ఎంపీటీసీలను జడ్పిటిసి లను ఎంపీపీలుగా జిల్లా పరిషత్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరడం జరిగింది

ఇసుక మాఫియాను పెంచి పోషిస్తున్న కాంగ్రెస్..

ఇసుక మాఫియాను పెంచి పోషిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడు నూతల నిశిధర్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ..ప్రజా సంపదను అడ్డగోలుగా దోపిడీ చేస్తుందని, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు సహజ వనరులను నిలువుగా దోపిడి చేస్తూ..లక్షలాది రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, నేడు భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావులు ఇసుక మాఫియాను పెంచి పోషించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడు నూతల నిశిధర్ రెడ్డి ఆరోపించారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ టేకుమట్ల మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజ్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆయన అనుచరులు చేసిన ఇసుక దందా వల్ల టేకుమట్ల మండలంలోని మానేరు వాగులో ఇసుక దిబ్బలు లేకుండా పోవడంతో భూగర్భ జలాలు అడుగంటుకు పోయాయని, ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆయన అనుచరులు సైతం ఇసుక దందా చేయడం వల్ల ఇసుక దిబ్బలు పూర్తిగా లేకుండా పోతున్నాయని, దీంతో పూర్తిగా భూగర్భ జలాలు అడుగంటుకుపోయి రైతాంగం పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక మాఫియాకు అండగా నిలిచిన గత ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..వారి అనుచరులు ఇసుక మాఫియాపై ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం ఏమిటని నిషిధర్ రెడ్డి ప్రశ్నించారు. ఇసుక మాఫియాలో ఆరి తేరిన ఈ దొంగల ముఠా చీకటి కోణంలో ఇసుకను అక్రమంగా పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. జెసిబిల సహాయంతో రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా ఇసుకను తోడేళ్ల లాగా తోడుస్తూ..ఒక రహస్య ప్రదేశంలో డంప్ చేసి..రాత్రిపూట పట్టణ ప్రాంతాలకు తరలిస్తూ..ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో, దేవాలయాల నిర్మాణాల పేరుతో, అభివృద్ధి పనుల పేరుతో అధికారుల వద్ద అనుమతి పత్రాలు తీసుకొని అక్రమ ఇసుక దందాకు తెరలేపిన ఘనుడు అని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఇదే తరహాలో ఇసుక దందాకు తెర లేపితే..ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని, ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు ఇదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇసుక దందాను ఆపకపోతే రైతాంగం పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
త్వరలో జరగబోయే స్థానిక స్థానిక సమరంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు గట్టిగా శ్రమించి..బార్డర్ లో దేశాన్ని రక్షిస్తున్న సైనికుల వలె కష్టపడి పనిచేసి టేకుమట్ల మండలంలోని అన్ని గ్రామాల్లో కాషాయ జెండాను ఎగురవేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడు నూతల నిశిధర్ రెడ్డి పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని బట్టబయలు చేస్తూ..నేడు ప్రజా ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ..స్థానిక సమరంలో గెలవాలని ఆయన కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను స్థానిక సమరంలో ఎండగట్టాలని కోరారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయలేని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గుర్రపు నాగరాజు గౌడు మాజీ మండల అధ్యక్షుడు దేశెట్టి గోపాల్ మండల ప్రధాన కార్యదర్శి బండారి సమ్మయ్య బిజెపి సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి భూత అధ్యక్షులు అశోకు రామ్మోహన్ రావు మండల నాయకుడు దొమ్మటి రవీందర్ దేశెట్టి రవీందర్ తదితరులు పాల్గొన్నారు

ఎస్సారెస్పీ కాలువకు నీటిని విడుదల చేయాలి-సుంకె..

ఎస్సారెస్పీ కాలువకు నీటిని విడుదల చేయాలి-సుంకె

కరీంనగర్, నేటిధాత్రి:

రైతు వ్యతిరేక కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ బిఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసనకు చేశారు. చొప్పదండి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కొత్తపెల్లి(హ) ఎస్సారెస్పీ కాలువ నీరు లేక ఎండిపోవడంతో క్రికెట్ ఆడుతూ ప్రభుత్వ పాలనను ఎద్దేవాచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎత్తిపోతల పథకం ద్వారా దిగువనున్న జలాలను ఎగువకు మళ్ళించి ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా లోయర్ మానేరు డ్యాం, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, తదితర జిల్లాలకు నీరందించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు ఇచ్చే ఉండి అవకాశం ఉన్నా కూడా పంపులను ఆన్ చేయకుండా వృధాగా దిగువకు విడుదల చేస్తున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. సాగు, త్రాగు నీటికి ఇబ్బంది గురిచేస్తున్నారని మండిపడ్డారు. నాలుగు రోజుల్లోగా నీటిని విడుదల చేసి రైతులకు అందించకపోతే భారీ ఎత్తున రైతులతో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, మాజీ జడ్పిటిసిలు, మాజీ సర్పంచులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version