అభివృద్ధి–సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సురేఖ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-56-3.wav?_=1

అభివృద్ధి–సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం : మంత్రి కొండా సురేఖ

వరంగల్, నేటిధాత్రి.

అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మొత్తం రూ. 5.87 కోట్లు వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆమె గురువారం శంకుస్థాపన చేశారు. జిడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో 15వ ఆర్థిక సంఘ నిధులు, జనరల్ ఫండ్ మరియు ఎస్ఎఫ్సి పథకాల కింద రూ. 4.87 కోట్ల విలువైన పలు పనులను ప్రారంభించారు. వీటిలో బస్తీ దవాఖాన, బీఆర్ నగర్లో సీసీ రోడ్లు, ఎన్ఎన్ నగర్, జ్యోతినగర్లో సీసీ రోడ్లు, అంబేడ్కర్ భవన్ కమ్యూనిటీ హాల్, బీరన్నకుంట కమ్యూనిటీ హాల్ నిర్మాణం, బట్టలబజార్ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో కిచెన్ షెడ్, రంగశాయిపేటలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణం ఉన్నాయి. అదనంగా ఆర్అండ్బి శాఖ కింద రూ.

Minister Konda Surekha

కోటి వ్యయం తో మషూఖ్ రబ్బానీ దర్గాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదనంగా, బీరన్నకుంట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మంత్రి, మేయర్, జిల్లా కలెక్టర్, జిడబ్ల్యూఎంసీ కమిషనర్తో కలసి మధ్యాహ్న భోజనం వడ్డించారు. తరువాత కరీమాబాద్ పరపతి సంఘ భవనంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. తూర్పు నియోజకవర్గంలో 2690 కొత్త కార్డులను జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 6815 రేషన్ కార్డులు మంజూరు, వాటిలో 26766 కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసినట్లు వివరించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ….

Minister Konda Surekha

ప్రతి నిరుపేద కుటుంబానికి ఆహార భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను అందజేస్తోందని, గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యం స్థానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు సన్న బియ్యం అందిస్తున్నారని,
లబ్ధిదారులకు అన్ని సంక్షేమ పథకాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. అదనంగా, జిల్లాలోని విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించేందుకు రామకృష్ణ మిషన్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో 123 ప్రభుత్వ పాఠశాలల్లో కార్యక్రమం ప్రారంభించామన్నారు.

Minister Konda Surekha

మొదటి విడతలో కరీమాబాద్ సహా 55 పాఠశాలల్లో అమలు చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్ నగరాన్ని హైదరాబాద్ తరహాలో సమగ్ర అభివృద్ధి చేయడానికి మామునూరు విమానాశ్రయం, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పనులు వేగవంతం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే ముంపు నివారణకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని చెప్పారు.నియోజకవర్గంలో అర్హులైన పేదల కోసం 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్టు, మరో 3500 ఇళ్లు ఈ సంవత్సరం కేటాయించనున్నట్టు వెల్లడించారు. దేవాదాయ శాఖ ద్వారా జిల్లాలోని అన్ని దేవాలయాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహాత్ బాజ్ పాయి, కార్పొరేటర్లు, రెవెన్యూ అధికారులు, బల్దియా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Minister Konda Surekha

ఎర్రబెల్లి స్వర్ణ జన్మదిన వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-55-5.wav?_=2

వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పుట్టినరోజు వేడుకలు
* పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

వర్దన్నపేట (నేటిధాత్రి)
వర్ధన్నపేట మండల ప్రభుత్వ ఆసుపత్రిలో వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి వందమంది పేషెంట్స్ కి పండ్లుపంపిణీ చేయడం జరిగింది. జాతీయ యువజన అవార్డు గ్రహీత వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు జక్కి శ్రీకాంత్ మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు చేస్తూ వర్ధన్నపేట నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు ఆపద కాలంలో పార్టీని కాపాడి ప్రజా సేవే ఏకైక లక్ష్యంగా జీవిస్తున్న ఎర్రబెల్లి స్వర్ణ వరదరాజేశ్వరరావు గార్ల నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. అర్హత నైపుణ్యం కలిగిన యువ నాయకత్వాన్ని బలపరుస్తూ భవిష్యత్తు తరాలకు దిక్సూచిగా నిలిచారు..

 

ఈ కార్యక్రమంలో , తెలంగాణ అంబేద్కర్ సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నర్సయ్య,వర్ధన్నపేట పట్టణ మాజీ కౌన్సిలర్ తుమ్మల రవీందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దుబ్బ యాకయ్య, ఎండీ షాబీర్, పోలుసనీ దేవేందర్ రావు,దుబ్బ ఎల్లన్న, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు ఈరెల్లి శ్రీనివాస్, తెలంగాణ అంబేద్కర్ జంగిలి భాస్కర్, వర్దన్నపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు నందిపక భాస్కర్, చేరిపల్లి బాబు, సమ్మెట రాంబాబు, యువ నాయకులు మంద రవీందర్, కుమారస్వామి, రాములు, రమేష్, శ్రీనివాస్ , రాజు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

స్ధానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి.

స్ధానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి.

బిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు.

కాశీబుగ్గ నేటిధాత్రి

పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశానుసారం ఆత్మకూరు మండలంలోని ఆగ్రాంపాడ్,లింగమడుగుపల్లె గ్రామాల్లో గ్రామకమిటీ అధ్యక్షులు శీలం సాంబయ్య, డుకిరే నాగేశ్వరరావు అధ్యక్షతన,మండల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశాల్లో మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో బి ఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన పనులు,సంక్షేమ పథకాలు కనిపిస్తున్నాయి అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పేరు చెప్పి కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో మట్టి అమ్ముకుంటున్నారని,దీనిని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశం లో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బొల్లోజు కుమారస్వామి, మాజీ ఏ ఏం సి చైర్మన్లు బొళ్లబోయిన రవియాదవ్,కాంతాల కేశవరెడ్డి,సర్పంచ్ ల ఫోరమ్ మాజీ మండల అధ్యక్షుడు సావురే రాజేశ్వరరావు, మండల యూత్ అధ్యక్షుడు బత్తిని వంశీగౌడ్, రెండు గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు,యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నారాయణపూర్ పై రవిశంకర్ ను కాంగ్రెస్ ధ్వజమెత్తింది..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-54-3.wav?_=3

నారాయణపూర్ పై మాట్లాడే అర్హత మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ కు లేదు

ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి నారాయణపూర్ నిర్వాసితుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ఘనుడు రవిశంకర్

ఐదేళ్లు నారాయణపూర్ ప్రజలకు ముఖం చూపించకుండా తప్పించుకు తిరిగిన చరిత్ర నీది కాదా?

రైతు సమస్యలు, ప్రజా సంక్షేమంపై పూర్తి అవగాహన ఉన్న గొప్ప నాయకుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి కోసం రూ. 43 కోట్లు మంజూరు చేయించిన ఘనత చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ది

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్

గంగాధర మండలం మధురానగర్ ప్రజా కార్యాలయంలో విలేకరుల సమావేశం

గంగాధర నేటిధాత్రి :

గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ గురించి మాట్లాడే అర్హత మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్కు లేదు. ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి నారాయణపూర్ నిర్వాసితుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ఘనుడు రవిశంకర్, నారాయణపూర్ నిర్వాసితుల సమస్యలను పట్టించుకోకుండా ఐదేళ్లు మొఖం చాటేసిన ఘన చరిత్ర ఆయనది. సాగునీరు అందించి పంటలు ఎండిపోకుండా కాపాడాలని కోరితే, రాళ్ల వర్షం పడి పంట నష్టపోయాం అనుకోవాలని రైతులకు నిర్లక్ష్యమైన సమాధానమిచ్చిందెవరో రైతులు మరచిపోరన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఏనాడైనా సకాలంలో నారాయణపూర్ రిజర్వాయర్ కు నీటిని విడుదల చేయించిన చరిత్ర నీకుందా, పంటలు సాగు చేయడానికి ముందే నారాయణపూర్ రిజర్వాయర్ కు సాగునీటిని విడుదల చేయించి రైతులపై తమకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ నారాయణపూర్ నిర్వాసితులకు న్యాయం చేయలేక పోయింది. అబద్ధపు హామీలు పబ్బం గడుపుకోవడం తప్ప చేసింది ఏమీ లేదు. నారాయణపూర్ నిర్వాసితులకు ఒక్క రూపాయి పరిహారమైన ఇప్పించావా, పుట్టిన ఊరు అని చెప్పుకునే నువ్వు నారాయణపూర్ గ్రామానికి ఏం చేశావు, మధురానగర్ చౌరస్తాలో చర్చకు సిద్ధమా. చొప్పదండి ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాది కాలంలోనే నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి, పరిహారం కోసం రూ.43 కోట్లు మంజూరు చేయించిన గొప్ప నాయకుడు మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. రైతు సమస్యలపై, సంక్షేమంపై అవగాహనతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పనిచేస్తున్నారు. ఫోటోల కోసం ఫోజులు ఇస్తూ, వాటిని పేపర్లో చూసుకుంటూ మురిసిపోవడం తప్ప మాజీ ఎమ్మెల్యే రవిశంకర్కు ఏమి చేతకాదు అని నిరూపితం కావడంతోనే, చొప్పదండి నియోజకవర్గం ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. ఇప్పటికైనా అబద్ధపు ప్రచారం మానుకోవాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బసి బుచ్చన్న,జాగిరపు శ్రీనివాస్ రెడ్డి,బూర్గు గంగన్న, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి,రోమాల రమేష్, సాగి అజయ్ రావు,వేముల అంజి,మంత్రి మహేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

చల్ల లక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే దొంతి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-53-5.wav?_=4

చల్ల లక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే దొంతి

#నెక్కొండ, నేటి ధాత్రి:

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చల్ల పాపిరెడ్డి తల్లి చల్ల లక్ష్మి గత కొద్ది రోజుల క్రితం మరణించగా గురువారం చల్ల లక్ష్మి దశదినకర్మలకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరై లక్ష్మి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బొంపల్లి దేవేందర్ రావు, డీసీసీ ప్రధాన కార్యదర్శి పెండ్యాల హరిప్రసాద్, కాంగ్రెస్ నాయకులు తిరుమల్ నాయక్, చల్ల శ్రీపాల్ రెడ్డి, దొడ్డ విజయ్, రావుల తిరుపతిరెడ్డి, మెరుగు విజయ్, మహిళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు రామారావు శిరీష, సింగం ప్రశాంత్, పోలిశెట్టి భాను ప్రసాద్, చిన్నూరి కార్తీక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ అంజిరెడ్డికి స్వాగతం పలికిన తాండూర్ మండల బిజెపి నాయకులు

*ఎమ్మెల్సీ అంజిరెడ్డికి స్వాగతం పలికిన తాండూర్ మండల బిజెపి నాయకులు*

తాండూరు( మంచిర్యాల) నేటి ధాత్రి :

గత మూడు రోజులుగా పోడు భూముల సమస్య పరిష్కారం కోసం,జీవో నంబర్ 49 శాశ్వతంగా రద్దు చేయాలని నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారికి సంఘీభావం తెలిపేందుకు విచ్చేస్తున్న గౌరవ ఎమ్మెల్సీ శ్రీ అంజి రెడ్డి గారిని ఈరోజు మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని ఐబి వద్ద బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్,మండల అధ్యక్షులు దూడపాక భరత్ కుమార్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యాల ఏమాజీ,జిల్లా ఉపాధ్యక్షులు పులగం తిరుపతి,జిల్లా కార్యదర్శి గోవర్ధన్,జిల్లా అధికార ప్రతినిధి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు, సీనియర్ నాయకులు చిలువేరు శేషగిరి,అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్,జిల్లా కార్యవర్గ సభ్యులు కేశెట్టి విజయ్,జిల్లా ఎస్సీ మోర్చ ప్రధాన కార్యదర్శి పాగిడి చిరంజీవి,మండల ప్రధాన కార్యదర్శి పుట్ట కుమార్,మండల ఉపాధ్యక్షులు రేవెల్లి శ్రీనివాస్, మండల కోశాధికారి రాచర్ల సురేష్ జిల్లా కౌన్సిల్ సభ్యులు శనిగారపు శ్రావణ్,సీనియర్ నాయకులు అజ్మీర శ్రీనివాస్,దుర్గ చరణ్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి అరికెల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం ఏర్పడి 20 నెలలైనా అమలు కానీ పంచాయతీ కార్మికుల హామీలు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-73-2.wav?_=5

ప్రభుత్వం ఏర్పడి 20 నెలలైనా అమలు కానీ పంచాయతీ కార్మికుల హామీలు

హామీల అమలుకై సమరశీల పోరాటాలు

మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి

వేతనాలు నెలవారి సక్రమంగా చెల్లించాలి సిఐటియు డిమాండ్

 

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.,నేటిధాత్రి…

 

 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా నేటికీ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని హామీల అమలుకై పంచాయతీ కార్మికులు సమరశీల పోరాటాలకు సిద్ధమవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల జనరల్ బాడీ సమావేశం గుమ్మడవెల్లి కృష్ణ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిందని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని వేతనాలు క్రమం తప్పకుండా బ్యాంకు ద్వారా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు వారికి పిఆర్సి అమలు చేయాలని పిఎఫ్, ఈఎస్ఐ ,రిటైర్మెంట్ బెనిఫిట్ తదితర సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు నూతన కమిటీ గౌరవాధ్యక్షులుగా గుమ్మడవెల్లి కృష్ణ, అధ్యక్షులుగా గాంధర్ల ధనంజయ్, ప్రధాన కార్యదర్శిగా చర్ప సాంబశివరావు ట్రెజరర్ గా ఉప్పలి సాంబశివరావు లతోపాటు పదిమంది ని కమిటీ సభ్యులుగా కంగాల సురేష్, వడ్లకొండ శ్రీను, కొమరం ప్రశాంత్, మెంతిని శంకర్, కల్లూరి రమేష్ నిట్టా ప్రసంగిలను ఎన్నుకున్నారు ఈ సమావేశంలో సిఐటియు నాయకులు కొమరం కాంతారావు పాల్గొన్నారు

చిరంజీవి పుట్టినరోజు కోసం కరీంనగర్ నుంచి మెగా అభిమానుల ర్యాలీ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-43-2.wav?_=6

వేల్పుల వెంకటేష్ ఆధ్వర్యంలో తరలి వెళ్తున్న మెగా అభిమానుల ర్యాలీని ప్రారంభించిన వెలిచాల

కరీంనగర్, నేటిధాత్రి:

సుదీర్ఘ కాలం పాటు వెండితెరపై విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో మెగాస్టార్ చిరంజీవి చెరగని ముద్ర వేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి మరిన్ని మంచి సినిమాలు తీస్తూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. మెగాస్టార్ కు మరింత మంచి పేరు వస్తుందని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి డెబ్బైవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం హైదరాబాదులో జరిగే వేడుకలకు కరీంనగర్ జిల్లా నుంచి చిరంజీవి యువత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల వెంకటేశ్ ఆధ్వర్యంలో నాలుగు వందల మంది మెగా అభిమానులు తరలి వెళ్లారు. హైదరాబాద్ తరలి వెళ్లే వాహనాల ర్యాలీని కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలో దేవక్కపల్లిలో వెలిచాల రాజేందర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ తనకు చిరంజీవి అంటే ప్రత్యేక అభిమానం అని పేర్కొన్నారు. ఆయనతో ప్రత్యేక ఆత్మీయత అనుబంధం ఉందన్నారు. మాకుటుంబానికి అత్యంత ఆప్తుడని, గతంలో తమ ఇంట్లో కరీంనగర్లో ఐదు రోజులపాటు ఉన్నారని గుర్తు చేశారు. చిరంజీవితో అనుబంధం ఉండడం అదృష్టం అన్నారు. చిరంజీవి విలక్షణమైన నటనతో ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించు కున్నారని తెలిపారు. చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని మెగా అభిమానులు చిరంజీవి యువత ప్రతినిధులు సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. యువత చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల వెంకటేష్ ఆధ్వర్యంలో వందలాది మంది చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు తరలి వెళ్లడం అభినందనీయమన్నారు. ఈసందర్భంగా వేల్పుల వెంకటేష్ ను వెలిచాల రాజేందర్ అభినందించారు. ఈకార్యక్రమంలో చిరంజీవి రాష్ట్ర యువత అధ్యక్షులు వేల్పుల వెంకటేష్, ఆకుల నర్సన్న, ఆకుల ఉదయ్, బట్టు వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లి ఐటీఐలో కొత్త అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-38-7.wav?_=7

ప్రభుత్వ ఐటీఐలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్

అందుబాటులో ఆరు అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోర్సులు.. మొత్తం సీట్లు 172..

ఈనెల 28తో ముగియనున్న దరఖాస్తు గడువు.

పదో తరగతి ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.

గోడ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఉపాధి కల్పన మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా గ్రామీణ ప్రాంత నియోజకవర్గ కేంద్రాల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను(ఏటీసీ) ఏర్పాటు చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం భూపాలపల్లి మంజూరునగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భూపాలపల్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జుమ్లా నాయక్, కళాశాల సిబ్బంది, కాంగ్రెస్ నేతలతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఏటీసీ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం భూపాలపల్లిలో సుమారు రూ.42.64 కోట్లతో కొత్తగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏటీసీలో రెండేళ్ల కాల పరిమితి కలిగిన ఆరు అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సులు ఉన్నట్లు తెలిపారు. పదో తరగతి పాస్ అయిన భూపాలపల్లి నియోజకవర్గ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియాగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఏడాది కోర్సులల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, పార్టిషన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్ ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా, రెండేళ్ల కాలపరిమితితో ఉన్న కోర్సులు బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైర్, అడ్వాన్సుడ్ సిఎంసి మిషన్ టెక్నీషియన్. మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్ పురుషులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మొత్తం 172 సీట్లు ఉన్నాయని, నియోజకవర్గం విద్యార్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియాగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈనెల 28వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకునేవారికి వెబ్ సైట్ చిరునామా https:/iti.telangana.gov.in ను సందర్శించి రూ.100 రుసుము చెల్లించాలని సూచించారు.

భూపాలపల్లిలో జర్నలిస్టుల పక్షంలో TSJU…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-37-5.wav?_=8

జర్నలిస్ట్ ల పక్షాన నిలిచేది టి.ఎస్ జే.యూ యూనియన్

జిల్లా అధ్యక్షులు సంతోష్,ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవిందర్

భూపాలపల్లి నేటిధాత్రి

జర్నలిస్ట్ ల పక్షాన నిలిచేది తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ ( ఎన్ యు జె ఐ) అని జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్,జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్ లు అన్నారు.కాకతీయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జర్నలిస్ట్ ల పక్షాన టి ఎస్ జే యూ పోరడుతుందని స్పష్టం చేశారు.ఇప్పటికే వర్కింగ్ జర్నలిస్ట్ ల పిల్లలకు ప్రయివేటు,కార్పొరేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ కల్పించిన ఘనత మాదే అన్నారు.జర్నలిస్ట్ ల భద్రత దృష్ట్య ఏ యూనియన్ చేయని విధంగా టి ఎస్.జే.యూ రాష్ట్ర అధ్యక్షులు నారగౌని పురుషోత్తం,ప్రధానం కార్యదర్శి తోకల అనిల్,రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్ ల సూచనతో యూనియన్ లో సభ్యత్వం తీసుకున్న ప్రతి జర్నలిస్ట్ కు రూ.5 లక్షల ప్రమా భీమా కల్పించిన ఏకైక యూనియన్ మాదే అన్నారు.అంతే కాకుండా టి ఎస్ జెయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదార్థాల నియంత్రణపై విస్తృత కార్యక్రమం చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు.వర్కింగ్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నామన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కొన్ని యూనియన్లు మా యూనియన్ సభ్యులను మభ్యపెడుతూ తమ యూనియన్లో చేర్చుకుంటున్నట్లు తెలుస్తుంది.ఆ యూనియన్ నేతలు ఇప్పటివరకు జర్నలిస్టులకు ఏం చేశారో చెప్పాకే జర్నలిస్ట్ లు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము.మా యూనియన్ ఎప్పుడు జర్నలిస్ట్ ల సమస్యల పరిష్కారానికి పోరాడుతుందని జర్నలిస్టులు మిత్రులకు గమనించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు..జిల్లా ఉపాధ్యక్షులు గట్టు రవీందర్ గౌడ్,జిల్లా
ప్రచార కార్యదర్శి కారుకూరి సతీష్
సంయుక్త కార్యదర్శి కడపక రవి,బోళ్లపల్లి జగన్ గౌడ్, మారపేల్లి చంద్రమౌలి,దేవేందర్ తదితరులు పాల్గోన్నారు.

మహాదేవపూర్ బీజేపీ మండల కొత్త కార్యవర్గం ప్రకటింపు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-21T133102.779.wav?_=9

బీజేపీ మహాదేవపూర్ మండల నూతన కార్యవర్గo ఎన్నిక

మహాదేవపూర్ ఆగష్టు21 నేటి దాత్రి

ఈ రోజు కాటారం మండల్ కేంద్రం లో నిర్వహించిన ఐదు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిథిలు గా బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవ రెడ్డి గారు, మాజీ జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డిచల్ల నారాయణ రెడ్డి విచ్చేసి, ఈ రోజు మహాదేవపూర్ మండల్ బీజేపీ నూతన కార్యవర్గని ప్రకటించారు.
మండల అధ్యక్షులు గా: రాంశెట్టి మనోజ్ కుమార్,
ఉపాధ్యక్షులు,అంకరి రాజేందర్, సూరం మహేష్, శనిగరం కిష్టయ్య, ఆకుల మధుకర్,
మండల ప్రధాన కార్యదర్శులుగుజ్జుల శంకర్,బొల్లం కిషన్,లింగంపల్లి వంశీ,
బల్ల శ్రావణ్ కుమార్ ,
కార్యదర్శులుబంధుగుల సంతోష్, గోరె శ్రీకాంత్, M,R యాదవ్,, శ్యామల ప్రశాంత్
కోశాధికారిగాఉదారి పూర్ణచందర్,
కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు ఓడేటి బాలిరెడ్డి,
ఓబీసీ మోర్చ మండల అధ్యక్షులు సాగర్ల రవీందర్,
SC మోర్చ మండల అధ్యక్షులు బూడే శేఖర్,
ST మోర్చ మండల అధ్యక్షులు దుగ్యాల రాము,
లను నియమించడం జరిగింది, అనంతరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుకర్రె సంజీవ రెడ్డి మాట్లాడుతూ నూతన కార్యవర్గనికి శుభాకాంక్షలు తెలుపి, ప్రతీ ఒక్కరు కూడా బీజేపీ బలోపేతానికి కృషి చెయ్యాలని, అలాగే ప్రధానమంత్రి గౌ, శ్రీ నరేంద్ర మోడీప్రవేశపెట్టే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అలాగే రానున్న స్థానిక,సంస్థల ఎన్నికలలో బీజేపీ కోసం ప్రతీ ఒక్కరు కష్టపడాలని చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమం లో మహాదేవపూర్, మహాముత్తరాం, మలహార్ మండలాల అధ్యక్షులు,రాంశెట్టి మనోజ్ కుమార్, పూర్ణ చందర్ శ్రీకాంత్
దుర్గం తిరుపతి, బండం మల్లారెడ్డి,మండల నాయకులు కన్నెబోయిన ఐలయ్య, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

మహాదేవపూర్‌లో బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-21T132408.472.wav?_=10

ఘనంగా కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ గారి జన్మదిన వేడుకలు

మహాదేవపూర్ఆగస్టు21నేటి ధాత్రి *

మహాదేవపూర్ మండల కేంద్రంలో బీజేపీ మహాదేవపూర్ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్ గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ సందర్బంగా మహాదేవపూర్ బస్టాండ్ లో వివేకానంద విగ్రహం వద్ద కేక్ కటింగ్ చేసి, బాణాసంచా కాల్చి, స్వీట్స్ పంపిణి చేశారు, అనంతరం మహాదేవపూర్ మండల తాసిల్దార్ ఎరాబటి రామారావు మరియు హాస్పిటల్ సూపరెండెంట్ డా, విద్యావతి ముఖ్య అతిధిగా పాల్గొని,ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పండ్లు పంపిణి చేసి ఆసుపత్రి ప్రాంగణం లో చెట్లు నాటడం జరిగింది అలాగే బీజేపీ సీనియర్ నాయకులు కన్నీబోయిన అయిలన్న సహకారంతో ప్రధానోపాధ్యాయురాలు సరిత ఉపాధ్యాయుడు మడుక మధు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలోని 10వ 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు భగవద్గిత పుస్తకాలు పంపిణి చేయడం జరిగింది,
బీజేపీ మహాదేవపూర్ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్ మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ఒక సామాన్య కార్యకర్త నుండి జాతీయ స్థాయి నాయకునిగా మరియు కేంద్ర మంత్రిగా ఎదగడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు, అనేక రకాల ప్రజా ఉద్యమాలు చేసి కింది స్థాయి నుండి వచ్చిన నాయకుడు అని అన్నారు, అలాగే కార్పొరేటర్ స్థాయి నుండి కేంద్ర మంత్రివర్యులుగా ఎదిగిన అయన జీవితం, నేటి కార్యకర్తలకు, యువకులకు ఆదర్శమన్నారు, కష్టపడి పనిచేసే నిజాయితీ కలిగిన కార్యకర్తలకు కేవలం భారతీయ జనతా పార్టీలోనే గుర్తింపు ఉంటుందన్నారు, రాబోవు రోజుల్లో బండి సంజయ్ఆ అమ్మవారి ఆసిస్సులతో మరింత ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆశభావం వ్యక్తం చేసారు, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్ మండల ప్రధాన కార్యదర్శులు బొల్లం కిషన్, సూరం మహేష్, సీనియర్ నాయకులు కన్నీబోయిన అయిలన్న, సాగర్ల రవి, లింగంపల్లి వంశీ, బాలిరెడ్డి,శ్రీనివాస్,శ్యామ్,రాంరెడ్డి, వెంకటేష్, శ్రవణ్,సాయి, సంపత్, రాకేష్, మనోజ్, రాజు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

వర్ధన్నపేటలో నిరుపేదలకు సీఎం సహాయనిధి పంపిణీ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-21T131500.204.wav?_=11

నిరుపేదలకు అపర సంజీవని సీఎంఆర్ఎఫ్…వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య.

పేదలకు గోపవరం సీఎం సహాయనిధి.

పేదలకు వైద్య నిధి-ముఖ్యమంత్రి సహాయనిధి:
-ఏఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య.

వర్దన్నపేట( నేటిదాత్రి )

వర్ధన్నపేట మండలం, కట్రియాల గ్రామానికి చెందిన చిక్కొండ ధూడేలు, గజ్జెల సరోజన, ఇటికాల గౌతం,కామిండ్ల రాజకుమార్ మరియు కాసు యాకమ్మ గార్లకు గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు శ్రీ కె.ఆర్.నాగరాజు సహకారంతో మంజూరైన 400000 /-(నాలుగు లక్షలు) రూపాయల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను వర్ధన్నపేట శాసనసభ్యులు కే.ఆర్.నాగరాజు ఆదేశానుసారం వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామాశాఖ అధ్యక్షులు బండారి సతీష్ గౌడ్,దేవస్థాన చైర్మన్ కట్ట వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండి అక్బర్,మండల మహిళా నాయకురాలు& ఇందిరమ్మ కమిటీ సభ్యులు తీగల సునీత గౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు తాటికాయాల కుమారస్వామి,యూత్ కాంగ్రెస్ మండల నాయకుడు ఎలికట్టే చిన్న రాజు,మానుక మల్లయ్య యాదవ్ గారులు కట్రీయాల గ్రామములో లబ్దిదారుల నివాసాల వద్దకే వెళ్లి సదరు సిఎంఆర్ఎఫ్ చెక్కులను వారికీ అందచేయడం జరిగింది.
ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు సహకారముతో మంజూరు అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య మాట్లాడుతూ… సీఎంఆర్ఎఫ్ పథకం ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అపర సంజీవనిలా నిలుస్తుందని ఏఎంసీ చైర్మన్ అభివర్ణించారు. తీవ్ర అనారోగ్యంతో పడుతున్న నిరుపేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన చికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎల్ఓసిలు కూడా అందించి ఎమ్మెల్యే ఆదుకుంటున్నారని తెలిపారు.
అనారోగ్యంతో ఆర్థిక స్తోమత లేక అప్పో ,సప్పో చేసి కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకున్న నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు ఎవ్వరూ కూడా అప్పులపాలు కాకూడదని అని భావించి వేడి నీళ్లకు సన్నీళ్ళు తోడు అన్నట్టుగా ముఖ్యమంత్రి సహాయనిధి(CRMF) నుండి ఒకే గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఏకకాలంలో 5 మందికి రూ.400000/- విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగిందని తెలిపారు.కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకుని అట్టి వైద్య ఖర్చుల సహాయం నిమిత్తం ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఈ విధంగా “ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF)” నుండి సహాయం అందిస్తున్నారని తెలిపారు.CMRF తో పాటు కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఎక్కువ బడ్జెట్ తో వైద్యం చేయించుకోవడానికి మరియు ఖరీదైన శస్త్ర చికిత్సలు చేయించుకోవడానికి ముందస్తుగా ఇచ్చే LOC లు కూడా సీఎంఆర్ఎఫ్ నుండి లబ్ధిదారులకు గౌరవ ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు అందిస్తున్నారని తెలిపారు.

తిరుప‌తి వేదిక‌గా అమ‌రావ‌తి ఛాంపియ‌న్‌షిప్.

*తిరుప‌తి వేదిక‌గా అమ‌రావ‌తి ఛాంపియ‌న్‌షిప్..

*ఈనెల 24, 25, 26వ తేదీల్లో రాష్ట్ర‌స్థాయి పోటీలు..

*శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు.

తిరుప‌తి(నేటి ధాత్రి)

 

తిరుప‌తిలో ఈనెల 24, 25, 26వ తేదీల్లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌రావ‌తి ఛాంపియ‌న్‌షిప్-2025 పేరుతో రాష్ట్ర‌స్థాయి క్రీడా పోటీల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఈనెల 29న జ‌ర‌గ‌నున్న నేష‌న‌ల్ స్పోర్ట్స్ డేలో భాగంగా రాష్ట్ర‌స్థాయి పోటీల‌కు తిరుప‌తి ఆతిధ్య‌మిస్తుంద‌ని తెలియ‌జేశారుజిల్లా స్థాయి, జోన‌ల్ స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్ర‌స్థాయి పోటీల‌కు చేరుకున్నార‌ని వివ‌రించారు. రాష్ట్ర‌స్థాయిలో హాకీ, బ్యాడ్మింట‌న్‌, వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, ఖోఖో, క‌బ‌డ్డీ, బాక్సింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్అథ్లెటిక్స్‌, ఆర్చ‌రీ పోటీలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ పోటీల్లో 2వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్న‌ట్లు తెలిపారు. క్రీడాశాఖామంత్రి రాంప్ర‌సాద్ రెడ్డి, క్రీడాశాఖ ఉన్న‌తాధికారులు హాజ‌ర‌వ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. 29వ తేదీన విశాఖ‌ప‌ట్ట‌ణంలో జ‌రిగే నేష‌న‌ల్ స్పోర్ట్స్ డేకు సీఎం చంద్ర‌బాబునాయుడు ముఖ్య అతిధిగా విచ్చేస్తార‌ని, రాష్ట్ర‌స్థాయి పోటీల్లో గెలుపొందిన విజేత‌ల‌కు సీఎం చేతులు మీదుగా న‌గ‌దు ప్రోత్సాహ‌కాలుప‌త‌కాలు అంద‌జేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

గెలిపిస్తే నెల రోజుల్లో వేతనాలు పెంచుతామన్నారు .. ఏమైంది?

 

గెలిపిస్తే నెల రోజుల్లో వేతనాలు పెంచుతామన్నారు .. ఏమైంది?

సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

ఎన్నికలలో గెలిపిస్తే కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచుతామన్నారని, ఏమైందని సింగరేణి కార్మిక సంఘాల ( జేఏసీ) నాయకులు ప్రశ్నించారు.బుధవారం నాయకులు గట్టు మహేందర్, ఎస్సీ కేఎస్ (సిఐటియు) డివిజన్ కార్యదర్శి మాట్లాడుతూ..సింగరేణిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా,రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 22ను వెంటనే గెజిట్ చేసి కాంట్రాక్టు కార్మికుల వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు.ఈ నెల 22న జెఎసి సంఘాల ఆధ్వర్యంలో ఛలో ప్రజాభవన్ కు కాంట్రాక్టు కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలనే పిలుపులో భాగంగా బుధవారం శ్రీరాంపూర్ ఓసిపిలో కాంట్రాక్టు కార్మికుల అడ్డలో జెఎసి నాయకులు ప్రచారం చేశారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లు, బడాపెట్టుబడిదారుల అనుకూల విధానాలతో కార్మికుల బతుకులు దుర్భరంగా మారుతున్నాయని ఆరోపించారు.చేసే పనులకు అనుగుణంగా కనీస వేతనాలు లేక కుటుంబాలను పోషించుకో లేక సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం గతంలో విడుదల చేసిన 5 జీవోలను (,21,22,23,24,25) గెజిట్ చేయకుండా గత కేసీఆర్ ప్రభుత్వం కాలయాపన చేస్తే, నేడు మమ్మల్ని గెలిపిస్తే నెల రోజుల్లో వేతనాలు పెంచుతామని అధికారంలోకి వచ్చి,సంవత్సర కాలం గడిచిపోయిన నేటికీ కనీస వేతనాల జీవోల గెజిట్ ప్రస్తావన తీయకుండా కార్మికుల నమ్మకాన్ని వమ్ము చేయడం దుర్మార్గం అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం జీవో నెంబర్ 22ను వెంటనే గెజిట్ చేసి కాంట్రాక్టు కార్మికుల వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు.ఈ నెల 22 న ఛలో ప్రజాభవన్ కు పెద్ద ఎత్తున కార్మికులు కదలి రావాలని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బెల్ట్ క్లీనింగ్, రోడ్డు క్లీనింగ్ కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.

తెలంగాణ బచ్చవో ముమెంట్ అవిర్బావ ప్రరంభం

తెలంగాణ బచ్చవో ముమెంట్ అవిర్బావ ప్రరంభం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

అగస్టు 20వ తేది నాడు హైదరాబాద్ బాషిరాబాగ్ లో తెలంగాణ బచావో మూవ్మెంట్ వ్యవస్థాపకులు పిడమర్తి రవి తెలంగాణ ఉద్యమకారులు మాజీ తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిలుపుమేరకు తెలంగాణ బచావో మూమెంట్ ఆవిర్భావ దినోత్సవంకి వెళ్ళిన జహీరాబాద్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పి. రాములు నేత తెలంగాణ ఉద్యమకారులు మొహమ్మద్ ఇమ్రాన్ గారు తెలంగాణ ఉద్యమకారులు జె. రవికిరణ్ మాజీ సర్పంచ్ మరియు మాదినం శివప్రసాద్ సీనియర్ నాయకులు గార్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలి వెళ్లి తెలంగాణ బచావో మూమెంట్ ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొని తమ వంతు మద్దతును తెలిపారు ఈ ఉద్యమ స్ఫూర్తిని జహీరాబాద్ నియోజకవర్గం లోని ప్రతి మారుమూల గ్రామమైన పల్లెలోకి తీసుకువెళ్తామని తెలంగాణ దోపిడిదారులను కల్తీ నకిలీ వ్యాపారస్తులను తరిమి కొడతామని జహీరాబాద్ నియోజకవర్గం కార్మికులను పరిరక్షించి వారి సంక్షేమం కోసం పాటుపడతామని తెలిపినారు.

రాజీవ్ గాంధీ భారతదేశ సమాచార విప్లవ పితామహుడు

రాజీవ్ గాంధీ భారతదేశ సమాచార విప్లవ పితామహుడు

చేవెళ్ల, నేటిధాత్రి:

చిన్న వయస్సులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిదేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమనిచేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ అన్నారు. బుధవారం రాజీవ్ గాంధీ 81వ జయంతిని పురస్కరించుకునిమొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ చౌరస్తాలొ మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే పిన్న వయసులో దేశానికి ప్రధానమంత్రి అయ్యి దేశంలో తరం మార్పుకు సంకేతంగా రాజీవ్ గాంధీ దేశ చరిత్రలో అతిపెద్ద మెజారిటీ సాధించా రన్నారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆధునీకరణ, ఉదారీకరణలపై దృష్టి సారించింది. కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్లు వంటి రంగాలలో అతను అనేక ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశట్టిన రాజీవ్ గాంధీని భారతదేశంలో సమాచార విప్లవ పితామహుడిగా పరిగణిస్తారని అన్నారు. దేశంలో కంప్యూటరైజేషన్,టెలికమ్యూనికేషన్ విప్లవం ఘనత అతనికే చెందుతుందని కొనియాడారు. స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారు. రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారన్నారు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్ , టీ పి సి సి కార్యదర్శులు రామ్ రెడ్డి , మొయినాబాద్ మండలం అధ్యక్షులు మానయ్య , మాజీ జడ్పీటీసీ కె భాస్కర్ , వెంకటాపూర్ మహేందర్ రెడ్డి , ఉపాధ్యక్షులు మర్రి రవీందర్ రెడ్డి , దారెడ్డి కృష్ణ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు గణేష్ గౌడ్, ఎంపీటీసీ కేబుల్ రాజు, అప్పారెడ్డిగూడ కిరణ్ కుమార్, రాములు,డైరెక్టర్ బాలకృష్ణ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ రాఘవేందర్ రెడ్డి, ఫిషార్మెన్ మండల ప్రసిడెంట్ బిక్షపతి, గన్నెపాగ నర్సింగ్ రావు, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి , శ్రీ పాల్ , ఆయా గ్రామాల ఇందిరమ్మ కమిటీమెంబర్స్,మాజీ సర్పంచ్ ,ఉప సర్పంచ్ లు తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధానమంత్రి ప్రియతమ నేత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఆయన జయంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం యువజన కాంగ్రెస్ విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ యూత్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో. రోగులను ప్రజలను అన్నదాన ప్యాకెట్లు పంచే కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు,

భద్రకాళి పరపతి సంఘం ఆధ్వర్యంలో భూమి పూజ

భద్రకాళి పరపతి సంఘం ఆధ్వర్యంలో భూమి పూజ

జనగామ, వరంగల్ నేటిధాత్రి.

 

వరంగల్ కాశిబుగ్గ శ్రీ భద్రకాళి పరపతి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జనగామలో తొమ్మిది ఎకరాల స్థలానికి భూమిపూజ నిర్వహించారు. సంఘ అధ్యక్షులు గుళ్ళపల్లి రాజ్కుమార్ (బాంబుల కుమార్) కార్యవర్గ సభ్యుల సహకారంతో ఈ స్థలాన్ని కొనుగోలు చేసి, సభ్యులందరికీ కుడా లేఔట్ రూపకల్పన చేసి ప్రతీ ఒక్కరికీ ప్లాట్లు కేటాయించాలని సంకల్పించారు. ఈ కార్యక్రమంలో కాశీబుగ్గ వర్తక సంఘం అధ్యక్షులు గుండేటి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి, యునైటెడ్ కార్పొరేషన్ అధ్యక్షులు, 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్, ప్రధాన కార్యదర్శి సముద్రాల పరమేశ్వర్, గౌరవ సలహాదారులు ధూపం సంపత్, వివేకానంద యోగ పరపతి సంఘం అధ్యక్షులు కూరపాటి సుదర్శన్, లక్ష్మీ గణపతి సహకార పరపతి సంఘం అధ్యక్షులు వంగరి ప్రసాద్ పాల్గొన్నారు. అలాగే భద్రకాళి పరపతి సంఘం ప్రధాన కార్యదర్శి గోగికార్ కిరణ్, కోశాధికారి మాటేటి విద్యాసాగర్, ఉపాధ్యక్షులు గోరంట్ల మనోహర్, సల్లా రాజేందర్, సిద్ధోజు శ్రీనివాస్, ఇప్పలపల్లి శివాజీ, కోయల్ కార్ నందకిషోర్, గుర్రపు సత్యనారాయణ, గుత్తికొండ నవీన్, గుళ్ళపల్లి సాంబశివుడు, వంగరి రవి, వెంగళ లక్ష్మణ్, సిందం చంద్రశేఖర్, రామ యాదగిరి, పోత్కనూరి రాజు, ములుక సురేష్, బండారి శ్రీనివాస్ తదితర కమిటీ సభ్యులు, పలు సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. సభ్యులందరికీ ఆర్థిక సహాయం సంకల్పంతో ఈ భూసేకరణ చేసి, శాశ్వత నివాస వసతి కల్పించడమే సంఘ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

ఘనంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు..

ఘనంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు..

కేసముద్రం/ నేటి ధాత్రి

 

దేశ అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ అనుసరించిన బాటలో పయనించేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుండాలి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు

నవ భారత నిర్మాత మాజీ ప్రధాని, భారత రత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం కేసముద్రం మండల కేంద్రంలో గాంధీ సెంటర్ నందు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు మహబూబాబాద్ జిల్లా ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి పిసిసి మెంబర్ దశ్రు నాయక్

ఈ సందర్భంగా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ,
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని దేశంలో ప్రవేశపెట్టి ఎంతో మంది యువతకు ఉపాధి కల్పన, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర వహించారని అన్నారు. అలాగే గ్రామపంచాయతీలకు నేరుగా కేంద్రం నుండి నిధులను పంపిణీ చేసి గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పారు. రాజీవ్ గాంధీ యువతకు ఐకాన్ అని కొనియాడారు. ఆయన ఆశయాలను పునికి పుచ్చుకున్న రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముందున్న కర్తవ్యం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ ఎండీ ఆయుబ్ ఖాన్, చింతకుంట్ల యాదగిరి, నాయకులు దామరకొండ ప్రవీణ్,వేముల శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ వెంకన్న,గ్రామ పార్టీ అధ్యక్షులు పోలేపల్లి వెంకట్ రెడ్డి,భెలియ, భూలోక్ రెడ్డి,పోకల శ్రీనివాస్, తరాల సుధాకర్,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లం గణేష్, ఎండీ రషీద్ ఖాన్, ఎండీ నవాజ్ అహ్మద్, మాజీ ఉప సర్పంచ్ రఫీ, మాజీ వార్డు మెంబర్ బాలు నాయక్,సాంబయ్య,అల్లం నిరంజన్,కనుకుల రాంబాబు,నయీం,తోట అఖిల్, ముజ్జు షేక్,కాట్రేవుల హరికృష్ణ, ఎండీ సమీర్, ఎండీ అలీమ్, కొల్లూరి శ్రీనివాస్,వెలిశాల కమల్,బాల్మోహన్, బాధ్య నాయక్,సుందర్ వెంకన్న,శ్రీను,కళాధర్,సముద్రాలమహేష్, బోడా విక్కి,కాట్రేవుల సతీష్,రాజేష్,పరకాల కుమార్, ఆగే చిన్న వెంకన్న,నూరోద్దీన్,విజేందర్ రెడ్డి, కార్యకర్తలు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version