జహీరాబాద్ ఏరియా ఆసుపత్రి ని సందర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు ఏరియా ఆసుపత్రి ని సందర్శించి* ఆసుపత్రిలో ప్రతి విభాగాన్ని తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ప్రతి విభాగంలో రోగులతో మాట్లాడుతూ వారి సమస్యలను మరియు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
MLA Manik Rao
అనంతరం సూపరెండింట్ డాక్టర్ శ్రీధర్ ,డాక్టర్ గిరి, ఇతర వైద్యులు & స్టాఫ్ తో మాట్లాడుతూ హాస్పిటల్ కు వచ్చే రోగులకు ప్రతి విభాగంలో స్టాప్ అంకితభావంతో సేవలందించాలని వచ్చే నెలలో తిరిగి ప్రతి విభాగంతో సమావేశం అవుతా అని అన్నారు.ఎమ్మెల్యే గారి తో పాటుగా సీనియర్ నాయకులు నామ రవికిరణ్ ,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ ,బండి మోహన్, తదితరులు ఉన్నారు .
రాజీవ్ గాంధీ వర్ధంతి…చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ, మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ సెంటర్ నందు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు, ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి, డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి ,మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ బండారు వెంకన్న, సీనియర్ నాయకులు బండారు దయాకర్
ఈ సందర్భంగా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ:-స్వతంత్ర భారత యువ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించి యువత రాజకీయాల్లోకి వచ్చేలా స్ఫూర్తి నింపిన నేత రాజీవ్ గాంధీ అని అన్నారు.
18సంవత్సరాల వారికి ఓటు హక్కు కల్పించడం పంచాయతీ రాజ్ నవోదయ విద్యాలయాలు లాంటి అనేక పథకాలు ఆయన హయంలో వచ్చాయి అని గుర్తుచేశారు.
టెలికాం ఐటీకమ్యూనికేషన్ రంగాలలో భారత్ అభివృద్ధి కి ఆయన చేసిన కృషి మరువలేనిది అని పేర్కొన్నారు.
దేశానికి సాంకేతికతను తీసుకొని వచ్చి ప్రపంచంలో టెక్నాలజీ విప్లవంలో భారత్ ను నిలిపింది రాజీవ్ గాంధీ నే అని అన్నారు.
దేశం కోసం తన ప్రాణాలను అర్పించి దేశ ప్రజల గుండెలు చిరకాల నిలిచిన ఘనత మహనీయుడు రాజీవ్ గాంధీ గాంధీ సొంతమన్నారు.
అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశన్ని నిలిపిన ఘనత ఆయనదేనని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముదిగిరి సాంబయ్య,మార్కెట్ డైరెక్టర్ ఎండీ ఆయుబ్ ఖాన్,బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి పోలేపాక నాగరాజు,మాజీ ఉప సర్పంచ్ బానోత్ వెంకన్న,దామరకొండ ప్రవీణ్,పోకల శ్రీనివాస్,గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి,ప్రతాప చారి, గండి శ్రీనివాస్ గౌడ్,రాజులపాటి మల్లయ్య,సట్ల శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలు,గోపాల్ రెడ్డి,ముల భూలోక్ రెడ్డి,కళ్ళెం శ్రీనివాస్ రెడ్డి,తరాల సుధాకర్, రషీద్ ఖాన్,బన్నిశెటి వెంకటేష్,ఎలేందర్,ఆగే చిన్న వెంకన్న,పరకాల కుమార్,చిన్న సాంబయ్య, బోడా విక్కి,బదవత్ శంకర్, ఎండీ అలీమ్,ఉప్పునూతల శ్రీను,కనుకుల రాంబాబు,సామల నరసయ్య, భూక్యా అరుణ్,హనుమ,సుందర్ వెంకన్న,బాధ్య,మామిడిశెట్టి మల్లయ్యా,నరసింహ రెడ్డి,రామ కృష్ణ,కార్యకర్తలు, మండల నాయకులు, జిల్లా నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి పట్టణంలో 4 వ వార్డు లో అర్ యస్ నాయకుడు రామ స్వామి ఆహ్వానం మేరకు వారి సోదరుడు కుమారుడు శేఖర్ లావణ్య వివాహానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ నూతన వధూవరులను ఆశీర్వదించారు మాజీ మంత్రి వెంట బీ ఆర్ ఎస్ నేతలు వాకిటి శ్రీధర్ పలస రమేష్ గౌడ్ జిల్లా, మీడీయా ఇంచార్జి నందిమల్ల అశోక్,గులాం ఖాదర్ బండారు కృష్ణ తిరుమల్ నాయుడు నీల స్వామి సూర్యవంశంగిరి జోహెబ్ హుస్సేన్ సునీల్ వాల్మీకి రామస్వామిబీఇమ్రాన్ చిట్యాల రాము బాలరాజు నరేందర్ ,ముని పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు
ఓటర్ లిస్ట్ ఆధారంగా 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించాలి
రాష్ట్ర ఆర్యవైశ్య జిల్లా మహాసభ ఆదేశాలు పాటించాలి
వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి పట్టణంలో త్వరలో జరగబోయే ఆర్యవైశ్య సంఘం అధ్యక్షు డి ఎన్నికల సందర్భంగా వనపర్తి పట్టణంలో ఆర్యవైశ్యుల ఓటర్ లిస్ట్ ఆధారంగా పురుషులు స్త్రీలు 18 సంవత్సరాలు నిండినవారికి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఎన్నుకోవడానికి ఓటు హక్కు కల్పించాలని పలువురు ఆర్యవైశ్యులు డిమాండ్ చేశారు
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం కమిటీ చైర్మన్ గా నియమించాలని కమిటీ ని వేరుగా ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేశారు .
ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షుడి ఎన్నికలు జరిగే ముందు వనపర్తి ఆర్యవైశ్యుల సమావేశం ఏర్పాటు చేయాలని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయమునకు సంబంధించి చిట్యాల రొడ్డు లో షాపుల అద్దెలు ఆస్తులు ఆర్యవైశ్య సంగములో చిట్టీలు ఎత్తిన ఆర్యవైశ్యులు ఎంతమంది ఉన్నారు .
ఎంతమందికి చిట్టి డబ్బులు ఎత్తిన వారికి డబ్బులు ఇవ్వలేదు.
వాటి వివరాలు ఆర్యవైశ్య సంగం వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య ల సమీక్షములో సమర్పించాలని పూరిబాల్ రాజ్ డిమాండ్ చేశారు.
అప్పులు ఆదాయం ఫంక్షన్ హాల్ అనగా అమ్మవారి దేవాలయంలో వివాహాలు ఇతర అద్దెలు నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా వచ్చిన ఆదాయం వాటి వివరాలు రెండున్నర సంవత్సరాలలో ఖర్చులు ఆదాయం అప్పులు అన్ని సమర్పించాలని వనపర్తి సీనియర్ ఆర్యవైశ్యులు మేధావులు న్యాయవాదులు ఉపాధ్యాయులు పట్టణ ఆర్య వైశ్యుల తరుపున కోరారు.
ప్రశాంతంగా ఓపికగా లెక్కలు సమర్పించి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుటకు సహకరించాలని పూరి కోరారు వనపర్తి ఆర్యవైశ్యులు మేధావులు కన్యకా పరమేశ్వరి దేవాలయంలో జరిగే వాటిని అన్ని గమనిస్తున్నారని.
అన్నారు ఈ విషయంలో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదని వెంటనే ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఎన్నికల నిర్వహించాలంటే
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయమునకు సంబంధించి లెక్కలు అప్పులు ఆదాయం అద్దెలు అన్ని సమర్పించి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆదేశాలు పాటించి ఎన్నికలు ప్రశాంతంగా జేరుగు.
గుటకు కృషి చేయాలని 18 సంవత్సరాలు నిండిన వారికి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తామని చెప్పారు ఎన్నికలు అవకతవకలు జరగకుండా ప్రశాంతంగా జరుగుటకు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నేతలు జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు సీనియర్
ఆర్యవైశ్యులు వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు సహకరించాలని పూరి కోరారు ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాల్ రాజ్ మాట్లాడుతూ వాసవి అమ్మవారి గుడికి చెందిన
లెక్కలు జమ ఖర్చు లు గత కార్యవర్గ ము వెంటనే సమర్పించాలనిఆర్యవైశ్య ల తరుపున డిమాండ్ చేశారు వనపర్తి లో 2023 2024 లో పాలన చేసిన
ఆర్యవైశ్య కార్యవర్గ ము లెక్కలు ఇవ్వనoదు కు వనపర్తి ఆర్యవైశ్య లు వివిధ రకాలుగా చర్చి oచు కుంటున్నారని పూరి బాలరాజు శెట్టి సెల్ 9642139213 ఆవేదన వ్యక్తంచేశారు
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే
పాలకుర్తి నేటిధాత్రి
పాలకుర్తి మండలంలోని చెన్నూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఎఫ్ ఎస్ సి ఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వ ధాన్యం కొనుగోలు విధానం, మద్దతు ధర అమలు పరిస్థితులు, కేంద్రంలో ఉన్న సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించిన ఎమ్మెల్యే, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగవంతమైన ధాన్యం కొనుగోలు జరుగాలని అధికారులను ఆదేశించారు. తూకంలో పారదర్శకత ఉండాలని, తడిపడిన ధాన్యాన్ని తిరస్కరించకూడదని స్పష్టం చేశారు. అలాగే తక్షణమే ధనరాశిని రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతుల నుంచి ఫిర్యాదులు, సూచనలు స్వీకరించిన ఎమ్మెల్యే, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సంగారెడ్డి జిల్లాలో సీఎం పర్యటన విజయవంతం చేయాలి: మంత్రి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలో 23 న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రాష్ట్రంలో చారిత్రాత్మకం కావాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సీఎం పర్యటనతో సంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో రూపురేఖలు మారుతాయన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సీఎం పర్యటన విజయవంతం చేయాలన్నారు. అధికారులు సీఎం పర్యటన కోసం రూట్ మ్యాప్ ప్రణాళిక, సెక్యూరిటీ, బందోబస్తు, బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు, హెలిప్యాడ్, హెల్త్ క్యాంప్ లు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు.
ఇందిరమ్మ మైనారిటీ మహిళ శక్తి పథకం ద్వారా కుట్టు మిషన్ లను పంపిణి.
కల్వకుర్తి / నేటి ధాత్రి :
నేడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోనీ కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి పట్టణ కేంద్రంలో పంక్షన్ హల్ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ద్వారా మైనారిటీలకు ఇందిరమ్మ మైనారిటీ మహిళ శక్తి పథకం ద్వారా మంజూరు అయిన 150 కుట్టు మిషన్ ల పంపిణి కార్యక్రమం రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుళ్ల కొత్వాల్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి పాల్గొని కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి,రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుళ్ల కొత్వాల్ కలిసి మైనారిటీ మహిళకు కుట్టు మిషన్ లను పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు,పొల్యూషన్ బోర్డు మెంబెర్ బాలాజీ సింగ్ గారు కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తాజా &మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న మహిళపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాడి
బిజెపి జిల్లా అధ్యక్షుడు ఏడు నూతుల నిశిధర్ రెడ్డి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం బుర్రకాయల గూడెం లోవడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న మహిళలపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు విచక్షణ రహితంగా దాడి చేసిన విషయం తెలుసుకొని వడ్ల కొనుగోలు కేంద్రం నీ సందర్శించి వారి నుండి వివరాలు అడిగి తెలుసుకునీ,ఉన్నత అధికారులతో ఫోన్ లో మాట్లాడీ వారికి ధైర్యం నింపి నిర్వహించిన బిజెపి జిల్లా అధ్యక్షులు ఏడునుతుల నిశిధర్ రెడ్డి వారితో బిజెపి నాయకులు బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు మంద మహేష్ సోమ దామోదర్ మా దాస్ మొగిలి తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవ జాతరను జయప్రదం చేద్దాం.
రజతోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.
హైదరాబాద్ జలవిహార్ రజతోత్సవ సభకు తరలిరావాలి.
టీయూడబ్ల్యూజె జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా.
“నేటిధాత్రి”, వేములవాడ.
తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవ సంబరాల పోస్టర్ ను రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్, వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా మంగళవారం యూనియన్ ప్రతినిధుల మధ్య ఆవిష్కరించారు.
తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవ సభ కు జర్నలిస్టు సమాజం పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని టీయూడబ్ల్యూజె రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా పిలుపునిచ్చారు.
టీజెఎఫ్ ఆవిర్భావ దినోత్సవం ఈనెల 31 వ తేదీన 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ జలవిహార్ లో నిర్వహించే రజతోత్సవ సభకు జిల్లా నుండి జర్నలిస్ట్ సోదరులు పెద్ద ఎత్తున కదలి రావాలని విజ్ఞప్తి చేశారు.
మంగళవారం టీజేఎఫ్ రజతోత్సవాల సంబంధిత పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
2001 మే నెలలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమే ఊపిరిగా టీజెఎఫ్ ఆవిర్భవించిందని గుర్తు చేశారు.
ఆనాడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందు వరుసలో నిలబడి రాష్ట్రం సాధించడంలో కీలక భూమిక పోషించిందన్నారు.
టీజెఎఫ్ ఏర్పడి 25 సంవత్సరాలు, పూర్తి అవుతున్న సందర్బంగా హైదరాబాద్ లోని జలవిహార్ లో ‘జర్నలిస్ట్ ల జాతర ‘ను నిర్వహిస్తున్నారని, ఈ జాతరకు అన్నీ రాజకీయ పార్టీల ముఖ్యలు హాజరవుతారన్నారు.
హైదరాబాదులోని జలవిహార్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభను విజయవంతం చేయాలన్నారు.
ఈ జాతరకు జిల్లాలోని అన్ని మండలాల నుంచి జర్నలిస్టు సోదరులు హాజరుకావాలని కోరారు.
టీయూడబ్ల్యూజే -H143 రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ అధ్యక్షతన రజతోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో టెంజు జిల్లా అధ్యక్షులు ఇరుకుల్ల ప్రవీణ్ కుమార్, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి సామల గట్టు, వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, యూనియన్ సీనియర్ ప్రతినిధులు గరదాస్ ప్రసాద్, పరకాల ప్రవీణ్, చల్ల ప్రసాద్ రెడ్డి తంగళ్ళపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వెంగల శ్రీనివాస్ తో పాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టు సోదరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ నియోజకవర్గంలో సీఎం పర్యటన చరిత్రత్మకం కావాలి
◆ సీఎం పర్యటనతో అభివృద్ధిలో జిల్లా రూపురేఖలు మారాలి
◆ ప్రభుత్వ శాఖల సమన్వయంతో సీఎం పర్యటన విజయవంతం చేయాలి — రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ,సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఈనెల 23వ తారీఖున జహీరాబాద్ లో ముఖ్యమంత్రి పర్యటనపై కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ఈ నెల 23వ తారీకున సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మకం కావాలన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో సంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో రూపురేఖలు మారుతాయన్నారు.
అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సీఎం పర్యటన విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
అధికారులు సీఎం పర్యటన కోసం రూట్ మ్యాప్ ప్రణాళిక, సెక్యూరిటీ ,బందోబస్తు, బారికేడ్లు , ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు,హెలిప్యాడ్ , హెల్త్ క్యాంప్ లు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు.
ముఖ్యమంత్రి పర్యటనలో బసవేశ్వర విగ్రహావిష్కరణ, కేంద్రీయ విద్యాలయ నూతన భవనం ప్రారంభోత్సవం, మహిళా పెట్రోల్ బంకు, జిల్లా అభివృద్ధికి కావలసిన కొన్ని కార్యక్రమాలను శంకుస్థాపనలు చేసి, వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల పై ఏర్పాటు చేసిన స్టాల్ లను పరిశీలించి సభ లో పాల్గొంటారని తెలిపారు.జహీరాబాద్ ఎంపీ సురేష్ శేఖర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లాకు రావడం చాలా సంతోషమని జిల్లా అభివృద్ధిలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసుకుందామన్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జహీరాబాద్ నియోజకవర్గానికి ఎన్నో పరిశ్రమలను తీసుకువచ్చి ,ప్రజలందరికీ ఉపాధి కల్పించిందని గుర్తు చేశారు.
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు .
జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేయాలని పక్కా ప్రణాళికతో సీఎం పర్యటన ఏర్పాట్లు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్జీవో నాయకులు
జైపూర్ ,నేటి ధాత్రి :
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని చెన్నూర్ పర్యటనకు విచ్చేసిన సందర్భంగా టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో సన్మానం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రికి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలపై చర్చించడం జరిగిందని అన్నారు.
మంచిర్యాల జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున రాష్ట్ర మంత్రి దృష్టికి ఉద్యోగుల సమస్యలు మంచిర్యాల మున్సిపాలిటీ ఇటీవల కార్పొరేషన్ గా ఉన్నతీకరణ జరిగిన సందర్భంగా ఇక్కడ ఉద్యోగులకు నూతన హెచ్ఆర్ఏ ప్రకటించాలని కోరడం జరిగింది.
అదేవిధంగా పెండింగ్ లో ఉన్న 5 డిఎ లను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ బకాయి బిల్లులను వెంటనే విడుదల చేయాలని, పిఆర్సి కమిటీ నివేదిక తెప్పించుకొని 51% తో వేతన సవరణ చేయాలని,
ఈహెచ్ఎస్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సిపిఎస్ తొలగించి పాత పెన్షన్ ఇవ్వాలని,గో 317 ను సమీక్షించి స్థానికత కోల్పోయిన వారికి న్యాయం చేయాలని,సిపిఎస్,యుపిఎస్ ను రద్దు చేసి ఓ పి ఎస్ ను అమలు చేయాలనే విధానం ఓపిఎస్ ఇవ్వాలని,చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న ఇతర 57 డిమాండ్లను పరిష్కరించాలని మంచిర్యాల జిల్లా టీఎన్జీవో పక్షాన కోరడం జరిగిందని తెలిపారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్తానని, ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కొరకు నా వంతు కృషి చేస్తానని తెలపడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి భూముల రామ్మోహన్,కేంద్ర సంఘం కార్యదర్శి పోన్న మల్లయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు,కోశాధికారి సతీష్ కుమార్,ఉపాధ్యక్షులు శ్రీనివాస్,కేజియారాణి,రామ్ కుమార్,నరేందర్,తిరుపతి, సంయుక్త కార్యదర్శి సునీత, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, మందమర్రి యూనిట్ అధ్యక్షులు సుమన్,కార్యదర్శి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నిక అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక గంగాధర్ రాజు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్ళపల్లి మండలం గుడి పహాడ్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కట్టంగూరి రవీందర్ రెడ్డి తెలిపారు భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
జిల్లా అధ్యక్షులు అయిత ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు గుడి పహాడ్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులుగా గంగాధర్ రాజు, ఉపాధ్యక్షులుగా మచ్చిక రమేష్, ప్రధాన కార్యదర్శిగా పాశం పర్వతాలు, కోశాధికారిగా బుర్ర సమ్మయ్య, ప్రచార కార్యదర్శి సమ్మోయి కొమురయ్య, కార్యదర్శి పాశం కిరణ్, సహాయ కార్యదర్శి ములుకోజు సదానందం, కార్యవర్గ సభ్యులు బుర్ర మొగిలి, కోడారి సంపత్, జనప నరసయ్య, బుర్ర కుమారస్వామి, వీరగోని రాజీరు, గంగాధర్ సాంబయ్య, కుమ్మరి కోటి, పాశం ఓదేలు, నకిర్త కుమారస్వామి, వీరగోని పద్మ, గోపు స్వప్న, ములుకోజు రాజమౌళి, బండారి సమ్మయ్య, పాశం రాజు లింగు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అనంతరం నూతన అధ్యక్షులు గంగాధర్ రాజు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు సర్వదా ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పార్టీ
ఏ ఆదేశాలు ఇచ్చిన అందరికీ అందుబాటులో ఉండి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని రాబోయే స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే దిశగా కృషి చేస్తానని తెలిపారు ఈ సందర్భంగా తెలిపారు.
నాపై నమ్మకం ఉంచి నన్ను గ్రామ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు
బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముస్తఫా అనారోగ్యంతో గత కొన్ని రోజుల క్రితం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కంఠ రెడ్డి తిరుపతిరెడ్డి నిజాంపేట మండల కేంద్రం లో గల పార్టీ కార్యాలయంలో సొంతగా 25 వేల రూపాయలు ముస్తఫా కూతురు పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేసి వారి కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమం లో నాయకులు కొండల్ రెడ్డి, మవురం రాజు, రవి, నర్సీములు, బాల్ రెడ్డి,నాగరాజు,రాములు, చింతల స్వామి, ఎల్లం యాదవ్, దుర్గయ్య, నాని, మైసయ్య తదితరులు పాల్గొన్నారు తదితరులు ఉన్నారు.
ఈనెల 23న జహీరాబాద్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన జయప్రదం చేయాలని కాంగ్రెస్ నాయకులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన ఈ సన్నాహక సమావేశంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్, మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్, తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్, మండల అధ్యక్షులు హన్మంత్ రావ్, శ్రీనివాస్ రెడ్డి, రామలింగారెడ్డి, మాక్సూద్ అహ్మద్, నరసింహా రెడ్డి, కండేం నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
తంగళ్ళపల్లి.. పనిచేసే వారికే పట్టం కట్టండి. మండలంలో ఎవరికిచ్చిన పార్టీకి అతీతంగా కార్యకర్తగా పనిచేస్తాను.
మండలంలో. త్వరలో రానున్న తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుల పదవులపై మండలంలో కొందరు నాయకులు పార్టీ ఏదైనా సరే పనికట్టుకొని అవసరమైన ఆరోపణలు చేస్తూ పార్టీకి భంగం కలిగించే విధంగా ప్రయత్నిస్తున్నారని తెలియజేశారు.
ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల అధ్యక్ష స్థానంపై ఎందరిదో కనుపడిందని.
అధికారం ఉంది కదా అని ప్రచారం చేస్తున్న నాయకులు ఇదే విషయమై.ముందుకు రాకపోగా పేరు చెప్పుకో పోగా తెరవెనక రాజకీయాలు నడిపిస్తున్నారని జగమెరిగిన సత్యం.
ఇంతకముందు కొన్ని సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడిగా పార్టీకి సేవకుడిగా ఉన్న వ్యక్తి ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా అరెస్టులకు వెనుకాడకుండా జైలు జీవితం గడిపి.
ఒకప్పుడు.అధికార పార్టీకి భయపడకుండా వెనుకాడకుండా మండలంలోని ప్రజలకు అనుకూలంగా పనిచేస్తూ.
అధికార పార్టీ చేస్తున్న పనులకు వ్యతిరేకంగా పోరాడుతూ పలుసమస్యలు ఎదుర్కొంటూ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని.
మండలంలో కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపై నిలిచిన.
మండల పార్టీ అధ్యక్షుడు నాయకుడు.
అని అటువంటి నాయకుడిపై దొంగ మాయ మాటలు చెప్పి పబ్లిక్ పరంగా అతనిపై వ్యతిరేకత. తమకు అనుకూలంగా ఉన్న.
పత్రికలలో.
వ్యతిరేకత వార్తలు పెడుతూ మండలంలో.
ప్రజలకు ఏదో జరుగుతుంది అనే సంకేతాలు పంపిస్తున్నారని.
ముసుకు రాజకీయాలు .
కార్య పాలు చేస్తున్నారని అందరికీ తెలుసునని.
అటువంటి నాయకులు.
ముందుకు రావడానికి ఎందుకు వెనుకాడుతున్నారని తెరవెనక రాజకీయాలు మానుకోవాలని.
నీతిగా పనిచేసే వారికే పట్టం కట్టించాల్సిన బాధ్యత సంబంధిత నాయకుల పై ఉందని దీనిపై సమగ్రంగా ఆలోచించాలని.
అలాగే మండలంలో ఎటువంటి సమస్య వచ్చినా తాను ఉన్నానంటూ ముందుండే నాయకుడు కావాలని.
ఒకవేళ అధిష్టానం నిర్ణయించి సదురు ఉన్న అధ్యక్షుడిని జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో గాని తీసుకువెళ్తే ఇక్కడ ఉన్న సామాన్య యువ నాయకుడు పార్టీకి పనిచేసే నాయకుడు కావాలని అలాంటి సమయంలో.
పనిచేసే నాయకునికే పట్టం కట్టాలని మెజార్టీ కార్యకర్తలు నాయకులు కార్యకర్తలుకోరుకుంటున్నారు.
వివాదాలకు దూరంగా ఉంటూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందు ఉండే నాయకుడు కావాలని ఇంత కుముందు పని చేసే నాయకుడు.
అటువంటి సందర్భంలో చాలా సందర్భాల్లో మమ్మల్ని ఆదుకున్నారని ఇంతకముందు అధికార పార్టీ నాయకులు మామీద కేసులు పెట్టిన అరెస్టుకు ప్రయత్నాలు కేసులు పెట్టిన మాకు అండగా నిలిచిన ఏకక నాయకుడు మండల అధ్యక్షుడు అని.
జిల్లా నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం లో మంచి పేరున్న నాయకుడు మన మండల అధ్యక్షుడు ప్రవీణ్ అని.
అధిష్టానం ఆలోచన చేసి మండల అధ్యక్ష.పదవిని. ఎస్సీ. ఎస్టీ. బీసీ .మైనార్టీ. పార్టీలో పనిచేసిన నాయకులకు ఎవరికిచ్చిన పార్టీ అధిష్టాన నాయకత్వం ఆలోచన చేసి పార్టీకి పనిచేసే నాయకుని కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని
ఈ సందర్భంగా మండల ప్రజలు అనుకుంటున్నారు అలాగే.
మండల అధ్యక్ష పదవిపై .
ఆరోపణ చేస్తున్న సదరు నాయకులు తెరమీద కొచ్చి తమ పేరు చెప్పి మాట్లాడాలని తెరవెనుక రాజకీయాలు మానుకోవాలని ఇకనైనా ప్రజలకు మంచి చేయాలి తప్ప మంచి చేస్తున్న నాయకులను ఓర్వలేక అనవసర ఆరోపణ చేయడం మానుకోవాలని రాజకీయం చేయవద్దని ఈ సందర్భంగా మండల ప్రజలు నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు . కోరుతున్నారు
బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్
ప్రభుత్వ భూములను కాపాడండి అంటూ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారికి వినతి పత్రం సమర్పించిన బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్. చెన్నూర్ నియోజకవర్గం లోని మందమర్రి మండలం లో మందమర్రి శివారు సర్వేనెంబర్ 364 ఎకరం 30 గుంటలు, మందమర్రి మండలం అదిల్ పెట్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్ర చెరువు అభివృద్ధి కోసం, రైతుల వద్ద నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమి పై అధికారులకు, వినతి చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను కాపాడకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు ముల్కల్ల రాజేంద్రప్రసాద్.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మెడ గ్రామంలో ఆదివారం జరిగిన వివాహ వేడుకకు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్ హాజరయ్యారు. గ్రామ మాజీ సర్పంచ్ గాజుల బాలకిష్టయ్య మనవరాలు లక్ష్మి (రమ్యశ్రీ )-భగత్ ల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాలోన్నారు.
కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులుగ బుర్ర లక్ష్మణ్ గౌడ్.
చిట్యాల, నేటి ధాత్రి ;
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం కాంగ్రెస్ టౌన్ కమిటీ అధ్యక్షులుగా బుర్ర లక్ష్మణ్ గౌడ్ ను రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి తెలిపారు, టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జిల్లా అధ్యక్షులు ఐత ప్రకాష్ రెడ్డి* నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశం మేరకు చిట్యాల మండల కేంద్రం కార్యకర్తలు నాయకులు జిల్లా, మండల నాయకత్వం సమావేశంలోచిట్యాల టౌన్ కమిటీ అధ్యక్షులుగా బుర్ర లక్ష్మణ్ గౌడ్* ఏకగ్రీవంగా రెండోసారి జరిగింది. ఈ సందర్భంగా బుర్ర లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ నా ఎన్నిక కుసహకరించిన ఎమ్మెల్యేకు జిల్లా నాయకులకు మండల నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిట్యాల టౌన్ ఎంపీటీసీ లా పరిధి ఇంచార్జ్ లు, చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మరియు జయశంకర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ మరియు రాష్ట్ర మహిళా కార్యదర్శి పింగిలి జ్యోతి, బీసీ సెల్ మండల అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ జిల్లా కార్యదర్శి చిలకల రాయకుమురు ,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య, చిట్యాల మండల యూత్ కాంగ్రెస్ అల్ల కొండ కుమార్ కాంగ్రెస్ మండల నాయకులు చిలుములరాజమౌళి కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తిరెడ్డి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలోని బిజెపి నాయకులు సుప్రియ వెడ్స్ క్రాంతి కుమార్ గౌడ్ వివాహం జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి హాజరై నూత న వధూవరులను ఆశీర్వదిం చిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందు పట్ల కీర్తి రెడ్డి నూతన దంపతు లను అక్షింతలు వేసి శుభాకాం క్షలు తెలిపారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు చదువు రామచంద్రా రెడ్డి మండల అధ్యక్షులు నర హరి శెట్టి రామకృష్ణ జిల్లా కౌన్సిలింగ్ నెంబర్ కానుగుల నాగరాజు, సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి బూత్ అధ్యక్షులు సుధాకర్ మేకల సుమన్ కోమటి రాజశేఖర్ బిల్లా రాజ్ కుమార్ దేశెట్టి సునీల్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులుగా పోలోజ్ సంతోష్ ఎన్నిక.
చిట్యాల నేటిధాత్రి:
జూకల్ గ్రామ కాంగ్రెస్ నాయకులు భూపాలపల్లి అభివృద్ధి గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు అలాగే మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆదేశాల మేరకు నూతనకాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. నూతన గ్రామశాఖ*అధ్యక్షుడిగా: పోలోజు సంతోష్* ప్రధానకార్యదర్శిగా: ముష్కే నాగరాజు* వర్కింగ్ ప్రెసిడెంట్ గా: బుస్సరవి ఉపాధ్యక్షుడిగా: బోయిని రవి, మేకల ఐలయ్య* సహాయకార్యదర్శిగా: కురిమిళ్ళ ప్రసాద్ కోశాధికారిగా: భయగాని రాజు* కార్యవర్గ సభ్యులుగా: నల్ల ధర్మారెడ్డి, బయగాని* రమేష్,మంగళంపల్లి శ్రీనివాస్, మొలుగురి రమేష్,ఆవంచ. సదానందం, ఎలమాద్రి భద్రయ్య,* ఎనుమల్ల రాములు, డబ్బాల మహేందర్, బయగాని సదానందం, నూనె సురేందర్ గా ఎన్నుకోవడం జరిగింది.*
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.