తెలంగాణ ఉద్యమకారుల కు… గుర్తింపు ఎక్కడ..

తెలంగాణ ఉద్యమకారుల కు… గుర్తింపు ఎక్కడ?

#ప్రభుత్వం ఇచ్చిన హామీల సంగతేంటి.

#చలో హైదరాబాదును విజయవంతం చేయాలి.

#ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల సాంబారావు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాటంలో అలుపెరుగని పోరు చేసిన తెలంగాణ ఉద్యమకా రులు గుర్తింపు లేక ఆర్థిక అసమానులతో ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆరు గ్యారెంటీలలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీ ఏమైంది అని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల సాంబారావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో మండల అధ్యక్షుడు తంగేళ్ల భాస్కర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో సాంబారావు మాట్లాడుతూ ఈనెల 18న మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్ తార్నాక హైదరాబాదులో ఉద్యమకారుల రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని కావున ఉద్యమకారులందరూ ఇట్టి సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారుల అండదండలతో గెలుస్తున్న ప్రభుత్వాలు ఉద్యమకారులకు మొండి చేయి చూపించడం తగదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఝార్ఖండ్ రాష్ట్ర తరహాలో ఉద్యమకారులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు, ఎకరం భూమి,250 చదరపు గజాల ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు, 25వేల రూపాయలు పెన్షన్ సౌకర్యం, బస్సు రైలు ఉచిత ప్రయాణం, ఆరోగ్య భీమా పథకం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య, టఫ్ మండల ఉపాధ్యక్షుడు పల్లికొండ రవి, జేఏసీ మండల చైర్మన్ వేముల రాజు, ఖ్యాతం శ్రీనివాస్, ఎన్నమల్ల నరసయ్య, పులి రమేష్ గౌడ్, మేరగుర్తి సమ్మయ్య, మామిండ్ల పెద్ద ఐలయ్య, చిన్న అయిలయ్య, కొత్తగట్టు ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

అసెంబ్లీ ముట్టడికి ఉద్యమకారులంతా సిద్దామవ్వాలి…

అసెంబ్లీ ముట్టడికి ఉద్యమకారులంతా సిద్దామవ్వాలి

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పరకాల నియోజకవర్గ అధ్యక్షులు రావుల రంజిత్

పరకాల,నేటిధాత్రి

 

30న తెలంగాణ అసెంబ్లీని ముట్టడిస్తామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పరకాల నియోజకవర్గ అధ్యక్షులు రావుల రంజిత్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.గత8సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల హక్కులపై పోరాటం చేస్తున్నామని,కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టినటువంటి హామీలు తెలంగాణ ఉద్యమకారులకు ఇప్పటివరకు అమలు చేయడం లేదన్నారు,కమిటీ వేస్తానని చెప్పి సంవత్సరాలు కావస్తున్న కూడా కమిటీ వేయడం లేదని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు స్వచ్ఛందంగా అసెంబ్లీని ముట్టడికి సిద్ధమాయ్యమన్నారు.తెలంగాణలోని ఉద్యమకారులు పార్టీలకు అతీతంగా కచ్చితంగా సంఘాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయలని పిలుపునిచ్చారు.

ఉద్యమకారులకు హైకోర్టు తీపి కబురు…

ఉద్యమకారులకు హైకోర్టు తీపి కబురు

తెలంగాణ ఉద్యమకారులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఉద్యమకారులు:

కేసముద్రం/ నేటి దాత్రి

 

తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్ 8 వారాల్లో ఇవ్వాలని హైకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇవ్వడంతో కేసముద్రం మండల తెలంగాణ ఉద్యమకారులు సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం కేసముద్రం పట్టణంలోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో సమావేశమై హైకోర్టు తీర్పు ఉద్యమకారులకు అనుకూలంగా ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు చాగంటి కిషన్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్ 8 వారాల్లో ఇవ్వాలని హైకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చినందున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విధివిధానాలు ప్రకటించి, సంబంధిత జి.వో. విడుదల చేయాలని, వీటితో పాటు కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలైన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, మరణించిన ఉద్యమకారుల కుటుంబాలకు ఆర్థిక సహాయం, అర్హత ఉన్న ఉద్యమకారులకు ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. పిసిసి సభ్యులు గుగులోత్ దస్రూనాయక్ మాట్లాడుతూ ఎన్నికల హామీలను నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల ఉద్యమకారుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మాంకాల కట్టమల్లు, ప్రధాన కార్యదర్శి షేక్ ఖాదర్, విద్యార్థి, యువజన జెఎసి పూర్వ కన్వీనర్ దండు శ్రీనివాస్, భట్టు శ్రీనివాస్, శివారపు శ్రీధర్, గంధసిరి సోమన్న, వంగాల అశోక్, పింగిళి శ్రీనివాస్, జనిగల కొమురెల్లి, బాలు మోహన్, వేం నరసింహారెడ్డి, సోమారపు వెంకటయ్య, జనిగల పరమేశ్వర్, చుంచు సూరయ్య, కీర్తి సమ్మయ్య, మాందాటి ఆంజనేయులు, గాండ్ల మలేంద్రం పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన అగ్ని కణం శ్రీకాంత చారి..

తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన అగ్ని కణం శ్రీకాంత చారి

శ్రీకాంతచారి వర్ధంతికి ఘనమైన నివాళులు

కేసముద్రం/ నేటి ధాత్రి*

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన ఆత్మ బలిదానంతో తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన తొలి అమరవీరుడు శ్రీకాంత్ చారి అని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు చాగంటి కిషన్ అన్నారు. బుధవారం కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చాగంటి కిషన్ మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు అవకాశాలను ఆంధ్ర పాలకులు తెలంగాణ ప్రజలకు దక్కకుండా చేస్తున్న నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ ద్వారా సమస్యలు పరిష్కరించబడతాయని ఉద్యమం లేచిన నేపథ్యంలో ఉద్యమాన్ని ఉవ్వెత్తిన లేపడానికి తన ప్రాణాలను బలిదానం చేసిన అమరవీరుడు శ్రీకాంత్ చారి అని కొనియాడారు. తన శరీరం మంటలతో దహనం అవుతున్న లెక్కచేయకుండా జై తెలంగాణ అంటూ నినదించిన వీరుడని అన్నారు. శ్రీకాంత్ చారి అమరత్వాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోరని అన్నారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రభుత్వం పొందుపరిచిన హామీలలో భాగమైన ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం,ఇళ్లను ఇస్తామని ఆమె ఇవ్వడం జరిగింది తక్షణమే ఇచ్చిన హామీని అమలు చేయాలని అన్నారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్ర స్వాతంత్ర్య సమరయోధులుగా గుర్తించి పెన్షన్ సౌకర్యం, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు దశ్రు నాయక్,మంద భాస్కర్, శివారపు శ్రీధర్ సోమారపు వెంకటయ్య,కళ్ళెం శ్రీనివాస్, వాంకుడోత్ సూర్య, నర్సిరెడ్డి, రమేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ బచ్చవో ముమెంట్ అవిర్బావ ప్రరంభం

తెలంగాణ బచ్చవో ముమెంట్ అవిర్బావ ప్రరంభం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

అగస్టు 20వ తేది నాడు హైదరాబాద్ బాషిరాబాగ్ లో తెలంగాణ బచావో మూవ్మెంట్ వ్యవస్థాపకులు పిడమర్తి రవి తెలంగాణ ఉద్యమకారులు మాజీ తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిలుపుమేరకు తెలంగాణ బచావో మూమెంట్ ఆవిర్భావ దినోత్సవంకి వెళ్ళిన జహీరాబాద్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పి. రాములు నేత తెలంగాణ ఉద్యమకారులు మొహమ్మద్ ఇమ్రాన్ గారు తెలంగాణ ఉద్యమకారులు జె. రవికిరణ్ మాజీ సర్పంచ్ మరియు మాదినం శివప్రసాద్ సీనియర్ నాయకులు గార్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలి వెళ్లి తెలంగాణ బచావో మూమెంట్ ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొని తమ వంతు మద్దతును తెలిపారు ఈ ఉద్యమ స్ఫూర్తిని జహీరాబాద్ నియోజకవర్గం లోని ప్రతి మారుమూల గ్రామమైన పల్లెలోకి తీసుకువెళ్తామని తెలంగాణ దోపిడిదారులను కల్తీ నకిలీ వ్యాపారస్తులను తరిమి కొడతామని జహీరాబాద్ నియోజకవర్గం కార్మికులను పరిరక్షించి వారి సంక్షేమం కోసం పాటుపడతామని తెలిపినారు.

22వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్

22వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలో మంగళవారం కేఫ్ ఎతనిక్ లో వివిధ కుల సంఘల నాయకులందరూ ఈ నెల 22వ తేదీన జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. జహీరాబాద్ పట్టణంలో బాహర్ వాలే హటావ్ తెలంగాణ బచావ్ అనే నినాదాలతో బంద్ కి పిలుపు ని ఇవ్వడం జరిగింది.తెలంగాణ తెచ్చుకుంది ఎవరి కోసం అని తెలంగాణ రాష్ట్ర ఉద్యమా కాలంలో ఎంతో మంది బలిదానాలు చేస్తే తెలంగాణ వచ్చింది అని జహీరాబాద్ పట్టణంలో వివిధ కుల సంఘాల నాయకులు అన్నారు.ఈ కారిక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు రాములునేత,పెద్ద గోల్ల నారాయణ, తిన్మార్ నర్సిములు,మహమ్మద్ ఇమ్రాన్, మాదినం శివప్రసాద్, దిగ్వాల్ రామేష్,మంగాలి ప్రభు,దత్తు,ఉమేష్,సి.హేచ్ శ్రీనివాస్, ప్యార్ల దశరథ్, తదితరులు పాల్గొన్నాడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version