ఇందిరమ్మ ఇండ్ల రాకతో నిరుపేదల కళ్ళలో ఆనందం.

ఇందిరమ్మ ఇండ్ల రాకతో నిరుపేదల కళ్ళలో ఆనందం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఎస్సీ కాలనీ లో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు కొయ్యడ సుమలత సమ్మయ్య ఇందిరమ్మ ఇల్లు అమలు కావడం చాలా సంతోషకరంగా ఉంది గత 10 సంవత్సరాల కాలం నుండి గుడిసెలలో అంటూ ఎన్నో ఇబ్బందులు పడ్డాము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ రాకతో ఇందిరమ్మ ఇల్లు రావడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి కి భూపాలపల్లి శాసన సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇట్టి కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ మొలుగూరి రాజు కొయ్యాడ భద్రయ్య ఎడ్ల లింగయ్య జన్నే సుమంత్ గ్రామస్తులు పాల్గొన్నారు

స్థానిక సంస్థల ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి.

స్థానిక సంస్థల ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి

నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-64.wav?_=1

నర్సంపేట,నేటిధాత్రి;

త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని నర్సంపేట నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ పిలుపునిచ్చారు.మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు దుగ్గొండి మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఎంపీటీసీ పరిధి బిఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం గ్రామ పార్టీ అధ్యక్షులు కందిపల్లి శంకర్ అధ్యక్షతన నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా నర్సంపేట నియోజకవర్గ యూత్ కన్వీనర్,ఎంపిటిసి పరిధి ఇన్చార్జ్ శానబోయిన రాజ్ కుమార్ పాల్గొని ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట ప్రాంతానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను నెమరువేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ సాంఘిక సంక్షేమ పాఠశాలలు, ప్రభుత్వ జిల్లాఆసుపత్రిగాఏర్పాటు అలాగే జిల్లా కేంద్రంలో ఉండే మెడికల్ కళాశాల ఏర్పాటు చేయించారని అన్నారు.మండల కేంద్రాలకు లింకు రోడ్లు వేయడం ప్రతి గ్రామంలో ఇంటర్నల్ రోడ్లు 100 శాతం నిర్మించడం,రైతులకు సరిపడ యూరియా, రైతు బందు, వ్యవసాయ పనిముట్లు సబ్సిడీలో అందించడంలో నర్సంపేట ముందు వరుసలో ఉందన్నారు.కేసీఆర్ హామీలు ఇవ్వని అనేక సంక్షేమ పథకాలు ఎన్నో అమలు చేశారని గుర్తుకు చేశారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ పాలన
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పట్ల ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు నాయకులకు సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాల పట్ల ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని రాజ్ కుమార్ తెలిపారు. వచ్చే స్థానిక జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలలో గ్రామంలో అభ్యర్థి గెలుపు కొరకు అందరు కంకణ బద్దులమై ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మహమ్మదాపురం పిఎసిఎస్ చైర్మన్ ఊరటి మహిపాల్ రెడ్డి,డైరెక్టర్లు నాంపల్లి సుధాకర్,వ్యవసాయ కమిటీ అధ్యక్షులు రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ విజయ మోహన్,మండల నాయకులు ఊరటి రవి,తాళ్లపల్లి వీరస్వామి,మాజీ సర్పంచ్ దారావత్ రాజు, మాజీ ఉపసర్పంచ్ ఉరటి జయపాల్ రెడ్డి, గుండెబోయిన రవి, కక్కర్ల సాంబయ్య, ఏడాకుల రమణరెడ్డి,దుగ్గొండి మండల బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గొర్కటి రాజు కుమార్, గ్రామ పార్టీ సభ్యులు ఉప అధ్యక్షులు ఊరటి రామచంద్రు,మంద రాజు,అదర్ సండే రాజు, గోర్కటి రఘుపతి,కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జర్నలిస్టులు రాస్తారోకో..

ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జర్నలిస్టులు రాస్తారోకో

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-60.wav?_=2

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కాకతీయ ప్రెస్ క్లబ్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. సెంటర్ లో ప్లకార్డ్ తో రోడ్డుపై బైఠాయిచి రాస్తారోకో చేశరు. నేడు జిల్లాలో కొనసాగుతున్న ముగ్గురు మంత్రుల పర్యటనను బహిష్కరించి నిరసన తెలిపారు.

MLA Gandra Satyanarayana Rao

జర్నలిస్టుల పై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పుష్ప..

మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పుష్ప

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-53.wav?_=3

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి అంబేద్కర్ కూడలిలో మలహల్ రావు మండల్ నాచారం గ్రామానికి చెందిన మేకల సారమ్మ వైఫ్ ఆఫ్ రమేష్ అంబేద్కర్ కూడలిలో నిండు గర్భిణీ రక్త స్రావంతో బాధపడుతున్న మహిళను ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పుష్ప వెంటనే వైద్య సిబ్బందిని కలిసి తక్షణమే డెలివరీ చేయించడం జరిగింది మహిళకు మగ శిశువు జన్మించాడు హక్కున చేర్చుకున్న ఎద్దు పుష్ప వారం రోజులు ఆసుపత్రికి వెళ్లి
జన్మనిచ్చిన తల్లి పుట్టిన బాలుడు మంచి చెడ్డలు చూసుకున్నారు. పుష్ప ను డెలివరీ అయిన మహిళా కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బంది పలువురు అభినందించారు

గత సంవత్సరం కంటే మిన్నగా యూరియా నిలువలు.

గత సంవత్సరం కంటే మిన్నగా యూరియా నిలువలు.

యూరియా కొరత అనేది డీలర్ల సృష్టి…

అధికారులపై మండిపడ్డ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట డివిజన్ పరిధిలో
గత సంవత్సరం కంటే మిన్నగా యూరియా నిలువలు ఉన్నాయని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నర్సంపేట డివిజన్లో యూరియా కొరతలు అధికమవడం వలన రైతులు ఇబ్బంది పడుతున్నారని వస్తున్న ఫిర్యాదుల మేరకు నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ,సహకార,రెవెన్యూ శాఖల అధికారులతో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా యూరియా కొరత రైతులు పడుతున్న ఇబ్బందులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత సంవత్సరం కన్నా మిన్నగా యూరియా సరఫరా ఉందని,రైతులు ఆందోళన చెందొద్దని తెలియజేశారు.సహకార సంఘం,వ్యవసాయ శాఖ రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి డీలర్ల నుండి రైతులకు యూరియా ఎరువులు పంపిణీ జరిగేలా చూడాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మీ పర్యవేక్షణ లోపం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రతిపక్షాలు అల్ప సంతోషంతో రైతులను రెచ్చగొడుతూ పత్రికల్లో ప్రకటన కోసం హడావుడి చేస్తున్నారని అన్నారు.రైతులు కూడా జాగ్రత్తగా ఎరువులను వాడుకోవాలని,అధిక మోతాదులో యూరియాను వినియోగించకుండా తగిన మోతాదులో వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డిఓ ఉమారాణి నర్సంపేట వ్యవసాయ శాఖ వసంచాలకులు దామోదర్ రెడ్డి, నర్సంపేట ఎమ్మార్వో రవిచంద్ర రెడ్డి, నర్సంపేట వ్యవసాయ శాఖ అధికారి కృష్ణ ప్రసాద్, వివిధ మండలాల ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

అర్హులైన పేదలందరికీ ఆహార భద్రత కార్డులు.

అర్హులైన పేదలందరికీ ఆహార భద్రత కార్డులు ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

అర్హులైన పేదలందరికీ ఆహార భద్రత కార్డులు అందించడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ధ్యేయమని, గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో జిల్లా పౌరసరఫరాల శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులను అందజేశారు. అనంతరం రేగొండ, గణపురం, చిట్యాల, మొగుళ్ళపల్లి, టేకుమట్ల మండలాలల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలల్లో ఎమ్మెల్యే పాల్గొని లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులను అందజేశారు. అనంతరం ఆయా మండలాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని గత పదేళ్లు పాలించినోళ్లు ఒక్క రేషన్ కార్డూ ఇవ్వకపోగా, పేదలను నిరుపేదలుగా మార్చిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వంకే దక్కుతుందని ఎమ్మెల్యే ఆరోపించారు. పేదలకు కూడా సన్నబియ్యం అందించాలన్న ఉద్దేశంతో దేశంలో ఎక్కడాలేని విధంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టినట్లు ఎమ్మెల్యే వివరించారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో పేదలకు ఒక్క రేషన్‌ కార్డు కాని, ఒక్క కిలో సన్న బియ్యం కాని ఇవ్వలేదన్నారు. అనంతరం కొత్త రేషన్ కార్డులను లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆయా మండలాల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

బోనస్పూర్ వరకు బిటి రోడ్డు పునరుద్ధరణ పనులను.

జహీరాబాద్ నుండి బోనస్పూర్ వరకు బిటి రోడ్డు పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టేలి

◆:- బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ పరిసర గ్రామాల మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీ లు నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నుండి బోనస్పూర్ వరకు రెండున్నర సంవత్సరాల కిందట గత బిఆర్ఎస్ ప్రభుత్వం జహీరాబాద్ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనింటి మానిక్ రావు గారు ఉమ్మడి మెదక్ జిల్లా DCMS చైర్మన్ శ్రీ శివకుమార్ గారు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసన సభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి సహకారంతో బీటీ రోడ్డు పనుల పునరుద్ధరణకు నాలుగు కోట్ల 36 లక్షల రూపాయలను మంజూరు చేయించినారు అట్టి పనులను అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ ఇప్పటివరకు పనులు చేపట్టలేదు గత పది నెలల కిందట షేకాపూర్ లో ప్రముఖ షేక్ షాబుద్దీన్ దర్గా ఉర్సు ఉత్సవాల ముందు కాంగ్రెస్ నాయకులు రోడ్డు పనులు ప్రారంభిస్తామని సదరు కాంట్రాక్టర్ ను తీసుకువచ్చి పనులు ప్రారంభించి తూతూ మంత్రంగా షేకాపూర్ ప్రధాన రోడ్డును తవ్వి కంకర వేసి వదిలేసినారు ఈ రోడ్డు మీదుగా ప్రతిరోజు వేల వాహనాలు ఆనేగుంట మల్చల్మ గొట్టిగార్పల్లి వెంకటాపూర్ కుంచారం తాండూర్ కర్ణాటక చించోలి తదితరు రూట్లలో ప్రజలు ప్రయాణాలు సాగిస్తుంటారు రోడ్డు గుంతల మయంగా మారడంతో అనేకమంది వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు
కొందరు ప్రాణాలను సైతం కోల్పోవడం జరిగింది కావున అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క బీటీ రోడ్డు పనులను ప్రారంభింపజేసేలా కాంట్రాక్టర్ను ఆదేశించాలని లేదా కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలని ఈరోజు ఆర్ అండ్ బి డిఈ కార్యాలయంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా తట్టు నారాయణ మాట్లాడుతూ షేక్ శాబోద్దీన్ దర్గా ఉత్సవాలు జరగడానికి ముందే ఈ యొక్క పనులను కంప్లీట్ చేయాలని లేకపోతే పక్షం రోజుల్లో సమీప గ్రామాల ప్రజలను సమీకరించుకొని జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డును దిగ్బంధం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు కార్యక్రమంలో శేఖపూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ చిన్న రెడ్డి, మాజీ సర్పంచులు జగదీష్, మాజీ ఎంపీటీసీ లు ప్రేమ్ బాణోత్, ఇస్మాయిల్ ,మోయిన్,మండల బిఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు వహీద్ అలీ, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు హీరు రాథోడ్, మండల సోషల్ మీడియా అధ్యక్షులు విజయ్ రాథోడ్ ఉప సర్పంచ్ మహబూబ్ ఖాన్, నాయకులు రాథోడ్ బీమ్ రావ్,మోహన్ రాథోడ్, గులాబ్ సింగ్, చందర్, సికిందర్ తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని.!

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని సాధించాలి.

బిజెపిరాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తి రెడ్డి.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనీ చిట్యాల మండలంలో జుకల్ గ్రామంలోని బిఎన్ అర్ ఫంక్షన్ హాల్ లో జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయి స్థానిక సంస్థ ల ఎన్నికల కార్యాశాల నిర్వహించడం జరిగింది ,ఈ సమావేశంనీ కి ముఖ్య అతిథులుగా ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు జిల్లా ప్రబారి గల్ల సత్యనారాయణ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల బలం ఉన్న పార్టీ బీజేపీ. వారి కష్టం ఎప్పుడూ మర్చిపోము.మోడీ సర్కార్ మూడు నెలల రేషన్ బియ్యం ఇచ్చింది – రైతులకు బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ మోసం చేసింది.దేశంలో మతం పేరుమీద ఓట్లు అడిగిన పార్టీ కాంగ్రెస్. రాహుల్ గాంధీ ఎవ్వరు ఎంత ఉంటే అన్ని పదవులు ఇవ్వాలని అంటున్నారు.”
రేవంత్ రెడ్డి కేబినెట్‌లో ఎంత మంది బీసీలు ఉన్నారు? కుల గణన ప్రకారం కనీసం 8 మంత్రిత్వ పదవులు రావాలి.”
మతపరమైన రిజర్వేషన్లు ఉండకూడదని బీఆర్ అంబేద్కర్ స్పష్టం చేశారు – ఆ రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాం. కాని కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు.”ఏ రాజ్యాంగం ప్రకారం మైనార్టీలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు”ప్రపంచవ్యాప్తంగా 26 దేశాలు ప్రధాని మోడీకి అత్యుత్తమ పురస్కారాలు ఇచ్చాయి.గ్రామాల్లోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించండి” అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు నాగపురి రాజమౌళి గౌడ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపన్న గారు చదువు రామచంద్రారెడ్డి గారు పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నే మొగిలి రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్ రాయరాకుల మొగిలి రాష్ట్ర నాయకులు బట్టు రవి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల గణపతి అసెంబ్లీ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి చిట్యాల మండల అధ్యక్షులు బుర్ర వెంకటేశు గౌడ్ మరియు రాష్ట్ర జిల్లా మండల నాయకులు వివిధ మోర్చా జిల్లా అధ్యక్షులు వివిధ మండలాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు స్థానిక సంస్థల ప్రబారీలు కన్వీనర్లు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .

ఇందిరమ్మ ఆదర్శంగా ఇంద్రరమ్మ ఇండ్లు అందజేస్తున్నాం.

ఇందిరమ్మ ఆదర్శంగా ఇంద్రరమ్మ ఇండ్లు అందజేస్తున్నాం.

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం.

‌ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.

‌ పేదలందరికీ పక్కా ఇల్లు ఉండాలని సంకల్పంతో నాడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందని ఆమెను ఆదర్శంగా తీసుకొని నేటి ప్రజా ప్రభుత్వం పతిపేదవానికి ఇల్లు ఉండాలని సంకల్పంతో ఇంద్రమ్మ ఇళ్లను అందిస్తున్నామని మొగుళ్ళపల్లి కాంగ్రెస్ నాయకులు అన్నారు శనివారం మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు సహకారం చేస్తూ ముగ్గు పోస్తూ ల్యాండ్ మార్కింగ్ ఆన్ లైన్ చేయడం జరిగిందిఅధికారులుహౌసింగ్ ఏఈ గ్రామ కార్యదర్శి పాల్గొని ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని కాంగ్రెస్ నాయకులు అన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి గ్రామంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అందించడానికి కృషి చేస్తున్నామన్నారు టిఆర్ఎస్ హయాంలో ప్రజలకు నమ్మించి మోసం చేశారని ఆరోపించారు పది సంవత్సరాలు రేషన్ కార్డులు కోసం ఎదురు చూశారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గౌరవ అధ్యక్షుడు పడిదల ప్రకాష్ రావు టౌన్ అధ్యక్షులు క్యాతరాజు రమేష్ ఏలేటిసదాశివరెడ్డి మలసాని రాజేశ్వరరావు బద్దం మోహన్ రావు పాల్గొన్నారు

అభివృద్ధి పనులపై బిఆర్ఎస్ పార్టీ నాయకులు..

అభివృద్ధి పనులపై బిఆర్ఎస్ పార్టీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమా..

#పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

#చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రభుత్వంపై దుష్ప్రచారం.

#మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:
కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసినారని వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని గ్రామల అభివృద్ధిని మేమే చేసినాం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏం లేదని బిఆర్ఎస్ మండల నాయకులు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తున్నామని మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్ అన్నారు. శనివారం మండలంలోని నారక్కపేట గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీపతి సుమన్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యకర్త సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గత పాలకులు 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధిని గాలికి వదిలేసి వారు మాత్రం కోట్లకు పడగలెత్తారు. ఇల్లు లేని పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని, దళితులకు దళిత బంధు ఇస్తామని, రైతులకు రైతు రుణమాఫీ చేస్తామని ఏ ఒక్కటి ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం వల్లనే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పిన కూడా ఇంకా మేమే అధికారంలో ఉన్నామని భ్రమలో బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీఫామ్ తో ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతో చేతి గుర్తుపై గెలిచి ఎంపీపీగా గద్దెనెక్కి కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి అర్హత భానోత్ సారంగపాణి కు లేదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేస్తూ పేదల పక్షాన ప్రభుత్వం అండగా ఉంటుందని దానికి నిదర్శనమే రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్ ప్రయాణం, ఉచిత కరెంటు, మహిళలకు వడ్డీలేని రుణాలు, కుల సంఘాలకు భవనాలు, మహిళా సంఘాలకు భవనాలు, విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు భోజన వసతి, సీసీ రోడ్ల నిర్మాణం, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, పేదవాడికి సన్న బియ్యం లాంటి అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు లబ్ధి చేకూరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంటే ఓర్వలేక ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ బిఆర్ఎస్ నాయకులు పబ్బంగడుపుతున్నారని. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చొరవతో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని ఇవేమీ ప్రతిపక్ష నాయకులకు కనబడటం లేదని ఆయన విమర్శించారు.
ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో మేము చేపట్టిన అభివృద్ధి పనులను నిరూపించడానికి మేము బహిరంగ చర్చకు మేము సిద్ధం మీరు సిద్ధమా దమ్ముంటే రండి ఇప్పటికైనా ప్రజలకు మాయమాటలు చెప్పి అబద్ధ ప్రచారాలను మానుకోండి లేకుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే మీకు తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు .ఈ సమావేశంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోగుల కుమారస్వామి, ఉపాధ్యక్షులు అడపరాజు, ప్రధాన కార్యదర్శి వక్కల యోగేశ్వర్, మాజీ ఉపసర్పంచ్ వడ్లూరి రమేష్, మాజీ ఎంపీటీసీ గుండాల రాజ కొమురయ్య నాయకులు కోడూరు రాయ సాబ్, పాక కుమారస్వామి, అడిగిచెర్ల శ్రీనివాస్ ,కుంచాల రాజు, చిందం కుమారస్వామి, మెరుగు మల్లయ్య, వైనాల మొగిలి ,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

బోరు మంజూరు చేసినందుకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రికి కృతజ్ఞతలు..

బోరు మంజూరు చేసినందుకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రికి కృతజ్ఞతలు

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామంలో అడగగానే బోర్ మంజూరు చేపిచ్చిన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో శాలివాహన సంఘం నాయకులు, తిర్మలాపూర్ గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యులు, రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ కేంద్ర హోంశాఖ సహాయమంత్రికి విన్నవించుకోగానే నిధులు మంజూరు చేశారని, నిధులు మంజూరు చేయడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యం కృషి చేస్తున్నారని, కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని వారు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని,బీజేపీ తోనే కేంద్ర ప్రభుత్వంతోనే అభివృద్ధి జరుగుతున్న విషయాన్ని ప్రజలు గమనించాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, సీనియర్ నాయకులు తడగొండ అశోక్, బూత్ కమిటీ అధ్యక్షులు పెంచాల నరేష్, పాదం సాగర్, పాదం రవి, శాలివాహన సంఘం నాయకులు పాల్గొన్నారు.

సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు విడుదల జాప్యం.

సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు విడుదల జాప్యం : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

సర్పంచ్ ల బిల్లులు విడుదల చేయకపోవడం పట్ల మాజీ సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సర్పంచ్ లను మరిచిందని, వారి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించడంలో ఈరెండు ప్రభుత్వాలు విఫలమయ్యారని అన్నారు. పెండింగ్ బిల్లులు రాక,అప్పులు తీర్చలేక మాజీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే ఈప్రభుత్వం బిల్లులు వేయాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ నలబై రెండు శాతం బిసిలకు వ్యతిరేకం కాదని, బిసి రిజర్వేషన్లు లలో ముస్లింలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతి రెడ్డి, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, జిట్టవేని అంజిబాబు, కారుపాకల అంజిబాబు, దళిత మోర్చా మండల అధ్యక్షులు సంటీ జితేందర్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు బొమ్మకంటి భాస్కర్ చారి, అనుపురం శంకర్ గౌడ్, శేవాళ్ళ అక్షయ్, రాజేందర్ చారి, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో చోటా గజదొంగ కేటిఆర్ ..!!

రాష్ట్రంలో చోటా గజదొంగ కేటిఆర్ ..!!

#18 నెలల్లో మేము చేసింది ఏంటో తెలంగాణ యావత్ ప్రజానీకానికి తెలుసు…

#చట్టాన్ని నమ్ముకున్నాం కాబట్టే మేము చట్టపరంగా వస్తున్నాం.

#మీరు చేసిన తప్పులకు తప్పకుండా జైలుకు పోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.

#మీ అయ్యా,మీరు కేసుల పేరుతో ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు.

#మేము ఆ భాష మాట్లాడాలంటే నీకంటే ఎక్కువ వస్తాయి.

#బీజేపీ పార్టీకి బీ టీమ్ బి ఆర్ ఎస్ అని అందరికీ తెలసు..

#దోచుకున్న డబ్బులకు సాక్ష్యాధారాలు ముందు ఉన్నాయి.

#మీ హయాంలో జరిగిన ఫోన్ ట్యాంపరింగ్ కేసులో ఆనాటి అధికారులు జైళ్లలో మగ్గుతున్నారు.

మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ,కే ఆర్ నాగరాజు…

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-50.wav?_=4

హన్మకొండ, నేటిధాత్రి:

పదేళ్లలో చేసిన పాపాలకు శిక్షలు అమలు చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న జైళ్లు సరిపోవని,స్థాయిని మరచి మాట్లాడితే ఊరుకునేది లేదని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి,వర్ధన్నపేట శాసన సభ్యులు శ్రీ కే ఆర్ నాగరాజు హెచ్చరించారు.శనివారం రోజున హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు..
చట్టాన్ని నమ్మి వచ్చిన వారిమి కాబట్టే మీ పాపాలకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వేచి చూస్తామని అన్నారు.
పదేళ్లలో ప్రశ్నించడమే పాపంగా 54 కేసులు పెట్టినారు.
మీ తప్పులకు జైలుకు పోయే రోజులు దగ్గర పడుతున్న క్రమంలో ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నావ్.
మీరు చేసిన పాపాలకు,దౌర్జన్యాలకు,దోచుకున్న డబ్బులకు పూర్తి ఆధారాలు ఉన్నాయని త్వరలో ముందుకు వస్తాయి…
కెసిఆర్ హయాంలో పెద్ద పెద్ద రిపోర్టులను సైతం అవహేళన్ చేసిన దాఖలాలు సమాజంలో ఉన్నాయి.
మీ హయాంలో నిర్మించి కాళేశ్వరంలో పనిచేసిన ఇరిగేషన్ అధికారుల ఇండ్లలో సోదాలు చేస్తే వందల కోట్ల విలువైన ఆస్తులు బయటకు వచ్చాయి.
నిరసన తెలిపే స్వేచ్సుకూడా లేకుండా చేసినవ్..
నీ అయ్యా వరంగల్ మూడు రోజులు ప్రగల్భాలు పలికిన మాటలు ప్రజలకు ఇంకా గుర్తున్నాయి.
ప్రజా ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలలో ఉచిత 200 యూనిట్ల విద్యుత్తు లేదా,ఉచిత బస్ లేదా,రైతు రుణమాఫీ లేదా..ఇందిరానగర్ ఇళ్లు లేవా..
అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలను కళ్లుండి చూడలేని కబోదివి నువ్వు కేటిఆర్.
ముఖ్యమంత్రి పై నువ్వు మాట్లాడే భాష నీకంటే మాకు ఎక్కువ వస్తాయి.
మేము భాష మాట్లాడితే బిడ్డా మీరు ఇక్కడ ఉండరు.
ప్రశ్నించే మీడియా వారిని ఇతరులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారు.
మీ అనైతిక నిర్ణయం వలన జిల్లా ముక్కలుగా ఏర్పడటం వలన ఈ రోజు జిల్లాలో ఉన్న మేధావులు జిల్లాలను కలపాలని వార్తల్లో వస్తున్నాయి.
పెద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉచిత విద్యా అందించాలనే సంకల్పంతో హనుమకొండలో ఇంటి గ్రేటెడ్ మోడల్ పాఠశాల ఏర్పాటుకు శ్రీకారం చుడితే ఈ రోజు 33 విద్యార్థి సంఘాలు స్వాగతిస్తుంటే ఒక్క సంఘం వ్యతిరేకిస్తున్నది.
అభివృద్ధి పేరుతో పదేళ్లు మోసం చేసింది బి ఆర్ ఎస్ పార్టీ.
అణగారిని వర్గాల అభివృద్ధి,అభ్యున్నతి కోసం పాటుపడుతున్నది కాంగ్రెస్ అని ఎమ్మెల్యేలు తెలిపారు.

ఐటీడీఏ ద్వారా నిరుపేద గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి..

ఐటీడీఏ ద్వారా నిరుపేద గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి

బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతరావు

నేటిధాత్రి చర్ల

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-46.wav?_=5

ఐటీడీఏ ద్వారా గిరిజన కుటుంబాలకు అదనంగా మంజూరు అయిన 280 ఇళ్లను అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి అర్హులైన ఎస్టీ కుటుంబాలకు మజురు చేయాలిని అల కాకుండా అధికార పార్టీ నాయకుల అనుచరులకు కానీ కమిటీలు సూచించిన లిస్ట్ ప్రకారం అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తే బిఆర్ఎస్ పార్టీ తరుపున కచ్చితంగా నిలదీస్తాం పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా వెనకడబోము అని బిఆర్ యస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు కో కన్వీనర్ ఐనవోలు పవన్ ఎస్టీ సెల్ అధ్యక్ష కార్యదర్శులు తుర్రం రవి కారం కన్నారావు తెలియజేసారు మొదటి విడతలో అధికార పార్టీ నాయకులే బహిరంగంగా లబ్ధిదారుల జాబితాలో కొంతమంది అనర్హులకు ఇల్లు కేటాయించారు అని విమర్శలు చేసుకున్న ఇళ్లు ఉన్న వారికే ఇళ్లు కేటాయించిన అధికారులు ఏమి పట్టనట్టే వున్నారు కనీసం ఈసారైనా మండలంలో వున్న నిరుపేద ఎస్టీ కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి అని బిఆర్ఎస్ పార్టీ తరుపున అధికారులకు తెలియజేస్తున్నామని ఈ విషయంలో గిరిజన నాయకులు కూడా కలిగించుకొని బీద గిరిజనులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నామని పత్రికా ప్రకటనలో తెలిపారు

నూతన జిల్లా గ్రంధాలయ చైర్మన్ ను కలిసిన కోయిల క్రాంతి..

నూతన జిల్లా గ్రంధాలయ చైర్మన్ ను కలిసిన కోయిల క్రాంతి

భూపాలపల్లి నేటిధాత్రి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-45.wav?_=6

జయశంకర్ భూపాలపల్లి నూతనంగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా నియమితులైన కోట రాజబాబు గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసినా ఉమ్మడి రేగొండ మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోయిల క్రాంతి కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

బీజేపీ జెండా ఆవిష్కరించిన గంట రవికుమార్..

బీజేపీ జెండా ఆవిష్కరించిన గంట రవికుమార్

వరంగల్, నేటిధాత్రి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-44.wav?_=7

వరంగల్ వనమాల కనపర్తి గ్రామంలో మండల అధ్యక్షులు మాదాసు ప్రణయ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడిన భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, జాతీయ కౌన్సిల్ మెంబర్ మాజీ శాసనసభ్యులు మార్తినేని ధర్మారావు లు పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. వారూ మాట్లాడుతూ,
ఏకాత్మ మానవత వాదాన్ని మరియు అంత్యోదయ విధానాన్ని రూపొందించి, అందరికీ స్వేచ్ఛ సమానత్వం న్యాయం జరగాలని ఉద్దేశంతో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆశయాలతో అడుగుజాడలలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపగడపకు చేరే విధంగా, రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి బిజెపి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బన్న ప్రభాకర్, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు బండి సాంబయ్య యాదవ్, రాష్ట్ర నాయకులు మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, జిల్లా నాయకులు మహేష్ గౌడ్, నరసింహా, పులి సాగర్, మండల ప్రధాన కార్యదర్శి మద్ది రవితేజ, పొన్నాల రాజు, మండల ఉపాధ్యక్షులు నరికే రాజేషు, శక్తి కేంద్ర ఇన్చార్జి రాజేష్ గౌడ్, బూత్ అధ్యక్షులు శ్రీకాంత్ , నిఖిల్ రెడ్డి, మండల కార్యవర్గ సభ్యులు కిరణ్, ప్రభాకర్, రాజేష్, అభిషేక్, సతీష్, నగేష్, రాజు, సాగర్, శివ, రాము మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ నెల 22న చలో గన్ పార్క్ ను విజయవంతం చేయండి..

ఈ నెల 22న చలో గన్ పార్క్ ను విజయవంతం చేయండి

మందల రవీందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమ కారుల నాయకులు.

భూపాలపల్లి నేటిధాత్రి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-42.wav?_=8

కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈనెల 22న హైదరాబాదులోని గన్ పార్క కు ఉద్యమకారులందరూ తరలిరావాలని ఉద్యమ కారుల ఫోరమ్ నాయకులు మందల రవీందర్ రెడ్డి పిలుపినిచ్చారు. ఈ
సందర్భంగా మందల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఉద్యమకారుని గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన కమిటీ వేయాలి.
ప్రతి ఉద్యమకారునికి 250. గజాల స్థలం ఇవ్వాలి.
జార్ఖండ్ రాష్ట్రంలో తరహాలో ప్రతి ఉద్యమకారునికి ప్రతి నెల 25 వేల పెన్షన్ సౌకర్యం కల్పించాలి.
ప్రతి ఉద్యమకారునికి గుర్తింపు కార్డుతో పాటు. ఉచిత బస్సు రైల్వే సౌకర్యాలు కల్పించాలి.
పదివేల కోట్లతో ఉద్యమకారుల సంక్షేమ బోర్డు నే ఏర్పాటు చేయాలి. డిమాండ్ చేశారు

కోటి మంది మహిళలను కోటేశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

కోటి మంది మహిళలను కోటేశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

ఉచిత బస్సు ప్రయాణమే కాదు ఆ బస్సుకు ఓనర్ లను చేసిన ఘనత కాంగ్రెస్ ది .

పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-37.wav?_=9

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని పిఎసిఎస్ గ్రౌండ్ లో భూపాలపల్లి నియోజకవర్గ ఇందిర మహిళా శక్తి సంబరాలు సెర్ప్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అధ్యక్షుతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పంచాయతీరాజ్ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి సితక్క మాట్లాడుతూ తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ దేశంలోని ఆదర్శంగా నిలిచిందని మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఆర్టిసి బస్సులు ఇస్తూ పెట్రోల్ బంకులు ఇస్తూ సోలార్ వంటి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అందిస్తూ మహిళా సాధికారత సాధించే దిశగా మహిళలను చైతన్యం చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు మహిళలకు జీవిత బీమా కల్పిస్తూ మహిళా సంఘంలో ఉంటూ ఆ సభ్యురాలు మరణిస్తే వారి కుటుంబానికి 10 లక్షల రూపాయలు బీమా సౌకర్యం అందిస్తున్నామని అలాగే 15 సంవత్సరాల అమ్మాయిలను కూడా మహిళా సంఘాలలో చేర్పిస్తున్నామని అన్నారు అలాగే ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేస్తూ ప్రభుత్వ బడిలో చదువుతున్న పిల్లలకు యూనిఫామ్లను కుట్టిచ్చి ఇచ్చే బాధ్యత మహిళా సంఘాలకు ఇచ్చామని దీని ద్వారా వాళ్ళు ఆర్థిక అభివృద్ధి సాది స్తున్నారని ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు మహిళల కోసం చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకె కాక రైతులకు కూడా 2 లక్షల రుణాలు మాఫీ చేసి వారికి పెట్టుబడి సహాయం అందిస్తూ దేశంలోనే రైతు సంక్షేమం కోరిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు, భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎంతో లబ్ధి చేకూరుతుందని ఏ ప్రాంతానికైనా ఉచితంగా ప్రయాణిస్తున్నారని మహిళల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్సేనని, అలాగే భూపాలపల్లి నియోజకవర్గంలో చిట్యాల మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరగా వెంటనే సీతక్క సానుకూలంగా స్పందించి తప్పకుండా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది , భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్న తెగిపోయిన రోడ్లను కూడా అభివృద్ధి చేయాలని అడగగా వెంటనే హాని ఇవ్వడం జరిగిందని అన్నారు, అనంతరం మహిళలకు వడ్డీ లేని రుణాలు బ్యాంకు లింకే చెక్కులు, జీవిత బీమా చెక్కులు, టేకుమట్ల చిట్యాల శాయంపేట మండలాలకు ఆర్టీసీ బస్సులను మహిళా సమైక్య లకు మంత్రి సితక్క చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్ విజయలక్ష్మి, సర్ప్ డైరెక్టర్ రజిని మరియు డి ఆర్ డి ఎ పి డి బాలకృష్ణ జిల్లా సెర్ప్ అధికారులు, ఎంపీడీవో మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, మండల కాంగ్రస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి, మధు వంశీ కృష్ణ 6 మండలాల సెర్ప్ అధికారులు ఆరు మండలాల నుంచి వచ్చిన మహిళా సమైక్య సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు మండల జిల్లా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

స్థానికం దిశగా..

స్థానికం దిశగా..

నిర్మల్ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఖరారు అయ్యాయి. ఈ నేపథ్యంలో మెజారిటీ స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి. ప్రస్తుతం జిల్లాలో పండుగ వాతావరణం కనిపిస్తుంది.

ఎట్టకేలకు ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) స్థానాలు ఖరారు కావడంతో ఇక స్థానిక సమరం ఊపదుకోబోతోంది. జిల్లాలో (Nirmal) మొత్తం 18జడ్సీటీసీ స్థానాలు ఉండగా 156 ఎంపీటీసీ స్థానాలకు గానూ మరో ఎంపీటీసీ స్థానం అదనంగా పెరిగింది. దీంతో 157 ఎంపీటీసీ స్థానాలు ఖరారయ్యాయి. ఈ స్థానాల సంఖ్య ఖరారు కావడంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులకు పోటీ చేసే ఔత్సాహికులు ఇక రిజర్వేషన్ల ఆధారంగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 18 జడ్పీటీసీ స్థానాలుండగా మెజార్టీ స్థానాలు దక్కించుకున్న పార్టీకి జడ్పీ చైర్మన్ పదవి దక్కనుంది.

జిల్లాలో కీలకంగా నిలిచే జడ్పీచైర్మన్ పదవిపై ఆటు అధికార కాంగ్రెస్ పార్టీ (Congress) రెండు నియోజకవర్గాలకు నేతృత్వం వహిస్తున్న బీజేపీ పార్టీలు దృష్టి సారించాయి. ఈ రెండు పార్టీల్లోని పలువురు సీనియర్ నాయకులు జడ్పి చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. వీరు మొదట జడ్పీటీసీగా గెలిచేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. జడ్పీటీసీ గెలిచిన తర్వాతే చైర్మన్ పదవిని ఏ నేతకు కట్టబెట్టాలనే అంశాన్ని ప్రధాన పార్జీలు నిర్ణయించనున్నాయి. రిజర్వేషన్లు తమకు అనుకూంలంగా రానట్లయితే రాజకీయంగా తమ ఉనికికి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని వీరు తమ అనుచరుల వద్ద పేర్కొంటున్నారు.
జిల్లాలోని 18 మండలాలకు గానూ ఎంపీపీ (MPP) పదవులపై దృష్టి సారించిన ప్రధాన పార్టీల నేతలు ఎంపీటీసీ స్థానాన్ని గెలుచుకోవాల్సి ఉంటుంది. ఎంపీటీసీ సభ్యులే ఎంపీపీగా ఎన్నిక కానుండడంతో మొదలు తమ ఎంపీటీసీ నియోజకవర్గంపై పట్టుసాధించుకోవాలని యోచిస్తున్నారు. వీరుకూడా రిజర్వేషన్లు (Reservations) తమకు కూలంగా రావాలని కోరుకుంటున్నారు. దీంతో పాటు జిల్లాలోని 400 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులకు పోటీ చేసేవారు కూడా ఇప్పటినుంచే తమ సన్నాహాల్లో నిమగ్నమవుతున్నారు. అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పార్టీ పరంగా జరగనుండగా సర్పంచ్ పదవులు మాత్రం పార్టీలకు అతీతంగా జరగనున్నాయి. అయినా ప్రధాన పార్టీలు సర్పంచ్ పదవులకు తమ కార్యకర్తలనే రంగంలోకి దించి పరో క్షంగా తమ అభ్యర్థులను ప్రచారం చేయనున్నాయి.

కీలకం కానున్న జడ్పీటీసీ పదవులు…

జిల్లాలో అత్యంత ప్రాధాన్యతగల పదవిగా చెప్పుకునే జడ్పీచైర్మన్ పీఠంపై ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పటికే సీరియస్ గా దృష్టి కేంద్రీకరించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెజార్టీ జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకొని తమ ప్రతిష్టను ఇనుమడింపజేసుకోవాలని యోచిస్తోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. నిర్మల్, ముథోల్ అసెంబ్లీ నియోజకవర్గాలు బీజేపీ నేతృత్వంలో కొనసాగుతున్న కారణంగా ఆ పార్టీ జడ్పీటీసీ ఎన్నికలను సవాలుగా తీసుకోనుంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ముథోల్, నిర్మల్ నియోజకవర్గాల్లో భారీ మెజార్టీ రావడాన్ని కూడా ఆ పార్టీ ప్రతిష్టగా భావిస్తోంది. ఎలాగైనా 15 జడ్పీటీసీ స్థానాలను దక్కించుకొని జడ్పీచైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డితో పాటు రామారావు పటేల్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారంటున్నారు. వీరికి తోడుగా స్వత్రంత్ర అభ్యర్థులు సైతం జడ్పీటీసీ పోటీకి ఇప్పటి నుంచే సిద్దమవుతుండడం ఆసక్తిని రేకేత్తిస్తోంది.

సినియారీటిని గుర్తించి రామలింగ రెడ్డి కి ఆత్మ చైర్మన్.

సినియారీటిని గుర్తించి రామలింగ రెడ్డి కి ఆత్మ చైర్మన్ కేటాయించడంపై హర్షం

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-35.wav?_=10

జహీరాబాద్. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసేవారిని గుర్తించి పార్టీ అధిష్టానం అందలం ఎక్కిస్తుందని దానికి ఉదాహరణ కోహిర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ల రామలింగ రెడ్డి కి ఆత్మ కమిటీ చైర్మన్ నియామకం అని, పార్టీ కోసం కష్టపడే వారికి పార్టీ అన్ని రకాలుగా అండగా ఉండి అవకాశాలు ఇస్తుందని, గత మూడు దశాబ్దాలుగా పార్టీ కోసం కృషి చేసిన పట్లోళ్ల రామలింగ రెడ్డి కి జహీరాబాద్ ఆత్మ కమిటీ చైర్మన్ గా అవకాశం ఇవ్వడంపై కోహిర్ మండల కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ షౌకత్ అలీ హర్షం వ్యక్తం చేస్తు పార్టీ అధిష్టనానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా షౌకత్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఐక్యంగా ముందుకు వెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో, నియోజకవర్గంలో పార్టీ విజయం కోసం పార్టీ అమలు చెస్తూన్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version