వర్ధన్నపేటలో నిరుపేదలకు సీఎం సహాయనిధి పంపిణీ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-21T131500.204.wav?_=1

నిరుపేదలకు అపర సంజీవని సీఎంఆర్ఎఫ్…వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య.

పేదలకు గోపవరం సీఎం సహాయనిధి.

పేదలకు వైద్య నిధి-ముఖ్యమంత్రి సహాయనిధి:
-ఏఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య.

వర్దన్నపేట( నేటిదాత్రి )

వర్ధన్నపేట మండలం, కట్రియాల గ్రామానికి చెందిన చిక్కొండ ధూడేలు, గజ్జెల సరోజన, ఇటికాల గౌతం,కామిండ్ల రాజకుమార్ మరియు కాసు యాకమ్మ గార్లకు గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు శ్రీ కె.ఆర్.నాగరాజు సహకారంతో మంజూరైన 400000 /-(నాలుగు లక్షలు) రూపాయల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను వర్ధన్నపేట శాసనసభ్యులు కే.ఆర్.నాగరాజు ఆదేశానుసారం వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామాశాఖ అధ్యక్షులు బండారి సతీష్ గౌడ్,దేవస్థాన చైర్మన్ కట్ట వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండి అక్బర్,మండల మహిళా నాయకురాలు& ఇందిరమ్మ కమిటీ సభ్యులు తీగల సునీత గౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు తాటికాయాల కుమారస్వామి,యూత్ కాంగ్రెస్ మండల నాయకుడు ఎలికట్టే చిన్న రాజు,మానుక మల్లయ్య యాదవ్ గారులు కట్రీయాల గ్రామములో లబ్దిదారుల నివాసాల వద్దకే వెళ్లి సదరు సిఎంఆర్ఎఫ్ చెక్కులను వారికీ అందచేయడం జరిగింది.
ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు సహకారముతో మంజూరు అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య మాట్లాడుతూ… సీఎంఆర్ఎఫ్ పథకం ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అపర సంజీవనిలా నిలుస్తుందని ఏఎంసీ చైర్మన్ అభివర్ణించారు. తీవ్ర అనారోగ్యంతో పడుతున్న నిరుపేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన చికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎల్ఓసిలు కూడా అందించి ఎమ్మెల్యే ఆదుకుంటున్నారని తెలిపారు.
అనారోగ్యంతో ఆర్థిక స్తోమత లేక అప్పో ,సప్పో చేసి కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకున్న నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు ఎవ్వరూ కూడా అప్పులపాలు కాకూడదని అని భావించి వేడి నీళ్లకు సన్నీళ్ళు తోడు అన్నట్టుగా ముఖ్యమంత్రి సహాయనిధి(CRMF) నుండి ఒకే గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఏకకాలంలో 5 మందికి రూ.400000/- విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగిందని తెలిపారు.కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకుని అట్టి వైద్య ఖర్చుల సహాయం నిమిత్తం ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఈ విధంగా “ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF)” నుండి సహాయం అందిస్తున్నారని తెలిపారు.CMRF తో పాటు కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఎక్కువ బడ్జెట్ తో వైద్యం చేయించుకోవడానికి మరియు ఖరీదైన శస్త్ర చికిత్సలు చేయించుకోవడానికి ముందస్తుగా ఇచ్చే LOC లు కూడా సీఎంఆర్ఎఫ్ నుండి లబ్ధిదారులకు గౌరవ ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు అందిస్తున్నారని తెలిపారు.

టి సహ చర మిత్రుని కుటుంబానికి ఆర్థిక చేయూత

టి సహ చర మిత్రుని కుటుంబానికి ఆర్థిక చేయూత

దాతృత్వం చాటుకున్న మండల టాక్సీ డ్రైవర్స్” ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండల టాక్సీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం చేయడం జరిగింది. కోమటిరెడ్డి రామకృష్ణారెడ్డి అకాల మరణం చెందడం జరిగింది, వారు కేసముద్రం ట్యాక్సీ యూనియన్ లో సభ్యులుగా ఉన్నారు వారికి శనివారం యూనియన్ తరపు నుండి చిలుముల మహేష్ అధ్యక్షుల ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 20వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే యూనియన్ సభ్యులంతా వారికి ఎప్పుడు ఏ అవసరమైన ఉన్నామని మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది కార్యక్రమంలో అధ్యక్షులు చిలుముల మహేష్,
ఉపాధ్యక్షులు పింగిలి సంతోష్
కోశాధికారి నాగన్న బోయిన నర్సయ్య
కార్యవర్గ సభ్యులు సిలువేరు గణేష్
సభ్యులు గాడి పెళ్లి సంతోష్ రావుల అనిల్.
పాల్గొనడం జరిగింది

మృతిడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత..

మృతిడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-25T141610.925.wav?_=2


శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం గంగిరెణిగూడెం గ్రామానికి చెందిన గుగులోతు మాన్య నాయక్ మరణించగా, వారి చిత్ర పటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామ ర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందచేసిన బిఆర్ఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ రాంశెట్టి లత లక్ష్మారెడ్డి మాజి సర్పంచ్ శానంమంజుల పరమేష్, జాలిగాపు అశోక్, గండి రాజయ్య,పోతు రమేష్, శానం కుమారస్వామి, దాసరి రాజు, శ్రీపతి అశోక్, శానం నరేష్,గుగులోతు రమేష్, మల్రాజ్ జితేందర్, మహమ్మద్ మగ్దూన్ పాషా, శోభన్, రాజు, ఇర్యానాయక్ పాల్గొన్నారు.

ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక చేయూత.

ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక చేయూత….

ఆటో డ్రైవర్లకు ఆరోగ్య బీమా పథకంకు కృషి…

ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-20.wav?_=3

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

నిత్యం రోడ్ల పై తిరుగుతూ జీవనం సాగిస్తున్న ఆటో డ్రైవర్లు వారి ఆరోగ్యం పై జాగ్రతలు తీసుకోకుండా అనారోగ్యాల బారిన పడుతున్నారని, వారికి ఎలాంటి ఆరోగ్య బీమాలపై సరైన అవగాహన ఉండట్లేదని అందుకే ఆటో డ్రైవర్లకు ఆరోగ్య భీమా పథకం అమలు చేయించేందుకు కృషి చేస్తానని రామకృష్ణాపూర్ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య అన్నారు.
రామకృష్ణాపూర్ పట్టణంలోని కనకదుర్గ కాలనికి చెందిన ఆటో డ్రైవర్ కొండ్ర రవి అనారోగ్యానికి గురై గత వారం మృతి చెందాడు.మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిది చాలా పేద కుటుంబం కావడంతో వారి ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని వారి కుటుంబానికి రామకృష్ణాపూర్ ఆటో యూనియన్ సభ్యులు పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు ఎనగంటి సంపత్, ఉపాధ్యక్షులు పాక అంజయ్య, ప్రధాన కార్యదర్శి జీడి రవి, చెన్నాల సారయ్య ,ముల్కల నరసయ్య, ఆల్క పున్నం, వాసం సది తదితరులు పాల్గొన్నారు.

ఫోటోగ్రాఫర్ కిరణ్ కు 5000 ఆర్థిక సహాయం.

ఫోటోగ్రాఫర్ కిరణ్ కు 5000 ఆర్థిక సహాయం

జిల్లా అధ్యక్షుడు రఘోత్తం రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

నూతన జిల్లా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టగానే ఫోటో గ్రాఫర్ల సంక్షేమం కోసం పని చేస్తూ అందరి మన్ననలను పొందుతున్నాడు ఫోటోగ్రాఫర్ల సంఘం జిల్లా అధ్యక్షులు రఘోత్తం రెడ్డి మంగళవారం
రేగొండ మండలం కొడవటంచ గ్రామ ఫోటోగ్రాఫర్ సింగరి కిరణ్ ఇటీవల బైక్ పై నుండి కిందపడి కాలు ప్యాక్చర్ కావడం జరిగింది. విషయం తెలుసుకున్న నూతన జిల్లా అధ్యక్షులు బండ రగోతంరెడ్డి ఫోటోగ్రాఫర్కు ఆపుద వస్తే నేనున్నానని భరోసానిస్తూ 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ మండల అధ్యక్షులు జంబుల రఘు, ఫోటోగ్రాఫర్స్ జిల్లా కోశాధికారి ఎల్దండి రాకేష్, టేకుమట్ల మండల ఫోటోగ్రాఫర్స్ అధ్యక్షులు దాసారపు సదానందం, ప్రధాన కార్యదర్శి గుగులోతు రాజేందర్ నాయక్, కోశాధికారి బండి కమలాకర్,రేగొండ ఫోటోగ్రాఫర్స్ మోరే మొగిలి, మల్లె బోయిన స్వామి, సింగరి సతీష్, సామల సురేందర్ రెడ్డి, కోల రాజు,చుక్క ప్రశాంత్, పబ్బ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

పేద విద్యార్థి రాము 20 వేలు ఆర్థిక సాయం

పేద విద్యార్థి రాము 20 వేలు ఆర్థిక సాయం

శ్రీ శ్రీనివాస లైన్స్ క్లబ్ సభ్యులు లయన్ శాంతి

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 11:

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఓ పేద విద్యార్థి రాము ఉన్నత చదువుల కోసం 20000 రూపాయలు శ్రీ శ్రీనివాస లయన్స్ క్లబ్ సభ్యురాలు శాంతి ఆర్థిక సాయం అందజేశారు. తిరుపతి లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆర్కాడ్ కృష్ణ ప్రసాద్ వేలూరు జగన్నాథం ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాసా లయన్స్ క్లబ్ సభ్యురాలు శాంతి తన పుట్టినరోజు సందర్భంగా ఓ పేద విద్యార్థి ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ వారు మాట్లాడుతూ ఆ భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో శాంతి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని అలాగే ప్రతి సంవత్సరం ఇలాంటి పేదవారికి సహాయాన్ని అందించాలని ఆమెకు ఆసక్తిని భగవంతుడు ఇవ్వాలని ఆ విద్యార్థి మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలను నిర్వహించి తను కూడా ఇలాంటి సహాయ సహకారాలు మరి కొంతమందికే అందించాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు,
ఈ కార్యక్రమంలో ఆర్కాట్ కృష్ణ ప్రసాద్, వేలూరు జగన్నాథం, శంబోలా హరి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు .

అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.

అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు

పారిశ్రామిక వాడలో జరిగిన అగ్నిప్రమాద ఘటన స్థలిని పరిశీలించిన హరీష్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి

 

 

 

 

 

పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన
అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కనీసం సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం అత్యంత దారుణమని ఎద్దేవా చేశారు.

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన స్థలిని ఎమ్మెల్యేలు మాణిక్ రావు,చింతా ప్రభాకర్, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ,ఇతర నాయకులతో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో మాట్లాడి అందిస్తున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ఘటన జరిగి ఐదు గంటలు గడుస్తున్నా సహాయక చర్యలు అందించడంలో, కుటుంబ సభ్యులకు వివరాలు తెలపడంలో వైఫల్యం అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం ఇంత పెద్ద పేలుడు జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.

వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, ప్రమాదం జరిగే సమయంలో కంపెనీలో మొత్తం 140 మంది పని చేస్తున్నట్లు తెలుస్తున్నది.

మొత్తం నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది.

8 మంది మృతి చెందగా, దాదాపు 26 మందిని పలు ఆసుపత్రులకు తరలించారు.మిగతా వారి పరిస్థితి తెలియరావడం లేదు.

ఎంత మంది బయటికి రాగలిగారు అనేది అర్థం కాని పరిస్థితి కుటుంబ సభ్యులు వచ్చి ఆందోళన చెందుతున్నారు.

తమవారి జాడ చెప్పాలని అధికారులను వేడుకుంటున్నారు.

కుటుంబ సభ్యులకు వివరాలు తెలిపే ప్రయత్నం చేయాలని కలెక్టర్, ఎస్పీ లను కలిసి చెప్పాను.

ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ పని చేస్తున్నారు.

కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు.

ప్రమాదం జరిగి 5 గంటలు గడుస్తున్నా, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.కంట్రోల్ రూం పెట్టండి, కామన్ ఫోన్ నెంబర్ పెట్టండి అని అధికారులకు సూచించారు.ప్రమాదం జరిగి 5 గంటలు అవుతున్నది ఏం చేస్తున్నారు?

వివరాలు తెలియక కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నరు?

ప్రమాదంలో చిక్కుకున్న వారి జాడ వెతికేందుకు ఎన్డీఆర్ఎఫ్ అద్బుతంగా పని చేస్తున్నది.

కానీ, ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రభుత్వం, అధికార యంత్రాంగం పని చేస్తున్నది అని ప్రశ్నించారు.

ప్రత్యేక అధికారులను పెట్టుకోండి, అటెండెన్స్ లిష్ట్ పెట్టుకోండి.డ్యూటీలో ఎంత మంది ఉన్నరు అంటే కలెక్టర్ ఒక లెక్క, ఎస్పీ ఒక లెక్క చెబుతున్నారని ఆరోపించారు.

5 గంటల నుంచి ఏ వివరాలు లేవు, బాధ్యత రాహిత్యంగ పని చేస్తున్నది ప్రభుత్వం
అసలు కార్మిక శాఖ, ప్రభుత్వం ఏం చేస్తున్నది?

ఇక్కడకు వచ్చే కుటుంబ సభ్యులు ఎవరిని కలవాలో చెప్పండి.

హ్యాండ్ మైక్ పెటుకొని గైడ్ చేసే బాధ్యత లేదా?

గాయపడ్డ వారిని ప్రైమేరీ కేర్ ఆసుపత్రుల్లో జాయిన్ చేస్తున్నారు.

30శాతం కాలితే డేంజర్, కార్పొరేట్ ఆసుపత్రులకు వారిని ఎందుకు పంపడం లేదు ఏఐజీ, కేర్, అపోలో ఆసుపత్రులకు పంపండి.

మొదటి గంటలో ట్రీట్మెంట్ అందితే ప్రాణాలు కాపాడవచ్చు.

నిర్లక్ష్యంతో గోల్డెన్ అవర్ మిస్ చేస్తున్నారు.

క్షతగాత్రులకు మంచి వైద్యం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని పేర్కొన్నారు.

కుటుంబాలకు సమాచారం అందించడంలోనూ ఫెయిల్ ఎంత మంది డ్యూటీలో ఉన్నారో గుర్తించడంలో ఫెయిల్ పారిశ్రామిక వాడలో వరుసగా ఇది మూడో సంఘటన.

గతంలో జరిగిన సంఘటనలో 5గురు చనిపోయారు.

వరుస అగ్రి ప్రమాదాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు?

ఏడాదిలో మూడో సంఘటన జరగటం దురదృష్టకరం.

ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది.

సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో ఫెయిల్ దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలి.

ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే కాపాడే విధంగా చర్యలు రూపొందించాలి.

చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, క్షతగాత్రులకు మంచి వైద్యం అందించి 50లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు.

ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సహాయం.

ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సహాయం

మందమర్రి నేటి ధాత్రి:

మందమర్రి ఫోటో&వీడియో గ్రాఫర్స్. వెల్ఫేర్ అసోసియేషన్ శాశ్వత సభ్యుడు మామిడాల మధుకర్ గారికి ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగింది విషయం తెలుసుకుని.ఈరోజు వల్ల స్వగృo మందమర్రి పాత బస్టాండ్ కు వెళ్లి యోగ క్షేమములు తెలుసుకొని. మా యూనియన్ సంఘం ఫాండ్ నుండి తక్షణ సహాయం కింద 5000/- రూపాయల చెక్కు కుటుంబానికి అందజేయడం జరిగినది
కార్యక్రమంలో. రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు వడ్లకొండ కనకయ్య గౌడ్. మందమరి పట్టణ అధ్యక్షులు పసుల వెంకటస్వామి. ప్రధాన కార్యదర్శి ఆడెపు అశోక్ కుమార్. కోశాధికారి బద్రి సతీష్.. గౌరవ సలహాదారులు నక్క తిరుపతి. జాడి ముకుందం. వర్కింగ్ ప్రెసిడెంట్ వలస మణిరాజ్ ఉపాధ్యక్షులు లక్కిరెడ్డి అనిధర్ రెడ్డి. ఆర్ సుజిత్. నక్క పవన్.ప్రచార కార్యదర్శి కందుకూరి శ్రీకాంత్
మాజీ ఉపాధ్యక్షులు విక్టరీ అశోక్. బసం అంజి. వరుణ్. తదితరులు పాల్గొన్నారు

ఆర్ధిక సహాయం అందించిన శ్రీ లక్ష్మీనరసింహ దత్త సేన సేవా ట్రస్ట్.

ఆర్ధిక సహాయం అందించిన శ్రీ లక్ష్మీనరసింహ దత్త సేన సేవా ట్రస్ట్

మంగపేట నేటిధాత్రి:

 

శ్రీ లక్ష్మీనరసింహ దత్త సేన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అకినేపల్లి మాల్లారం గ్రామానికి చెందిన ఆవిరి.సూరిరావు కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంవల్ల వారి కుటుంబంలో ఆర్థిక సమస్యలమ ఏర్పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శ్రీ లక్ష్మీనరసింహ దత్త సేన సేవా ట్రస్ట్ చైర్మన్ ఈశ్వర్ చంద్ తెలుసుకొని వారి కుటుంబానికి సహాయంగా 50 కేజీల బియ్యం,ఐదు కేజీల ఆయిల్ క్యాన్ ను ట్రస్ట్ సభ్యుల ద్వారా అందించడం జరిగింది..

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ట్రస్ట్ మండలం అధ్యక్షులు:నూతులకంటి.ఈశ్వర్ చంద్, ట్రస్ట్ సభ్యులు నన్ను బోయిన. సాంబయ్య,నూతులకంటి.గౌరీ శంకర్,జై భీమ్ రామ్మోహన్,రవి తదితరులు పాల్గొన్నారు

శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మెన్ బాడిశ నాగరమేష్ ఆర్ధిక సహాయం.

దశ దిన కర్మలకు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మెన్ బాడిశ నాగరమేష్ ఆర్ధిక సహాయం

మంగపేట నేటిధాత్రి:

 

ములుగు జిల్లా మంగపేట మండలం ప్రొద్దుమూర్ గ్రానానికి చెందిన బద్ది పాపారావు ఇటీవల రోడ్ ఆక్సిడెంట్ లో మరణించగా వారి కుటుంబం తీవ్ర దుఃఖం లో వున్నారు.రోజు వారి పనులకు వెళ్లి జీవనం సాగించే ఇంటి పెద్ద అనుకోని ప్రమాదం లో చనిపోవడం ,మృతునికి ఇద్దరు చిన్న పిల్లలు ఉండటం ఏం చేయలేని నిస్సహాయ స్థితి లో ఉన్న వారి కుటుంబ పరిస్థితి ని స్థానికులు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ వారికి తెలియజేయగా దశదినకర్మల నిమిత్తం (4000 రూపాయలవిలువైన)50 కేజీల బియ్యం,నిత్యవసర సరుకులు స్థానికులు చే వారి కుటుంబానికి అందజేశారు.అడగగానే సహాయం అందజేసిన శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ కు మరియు ట్రస్ట్ సభ్యులకు స్థానికులు కృతజ్ఞతలు తెలియచేసారు .ఈ కార్యక్రమంలో మాను పెళ్లి. వేణు,కలల రాంబాబు,గుగ్గిల సురేష్,బద్ది రఘుబాబు,మానపల్లి రోహిత్. బద్ది సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

మృతి చెందిన ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక చేయూత.

మృతి చెందిన ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక చేయూత..

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్కే ఫోర్ గడ్డ ఏరియాలో నివాసం ఉండే ఆటో డ్రైవర్ గోగర్ల భీమయ్య గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 9న మృతి చెందగా శుక్రవారం గోగర్ల భీమయ్య కుటుంబానికి ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య, అధ్యక్షులు ఎనగంటి సంపత్ ఆధ్వర్యంలో 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ మనోధైర్యాన్ని అందించారు. భీమయ్య మృతి తోటి డ్రైవర్లను కలిచివేసింధని తోటి డ్రైవర్లు అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు పాక అంజయ్య, కమిటీ సభ్యులు ఆల్క పున్నం, చెన్నాల సారయ్య, శ్రీనివాస్, కున్సోత్ సీతారాం నాయక్, నర్సయ్య, రవి,కిషన్ తదితరులు పాల్గొన్నారు.

బైక్ యాక్సిడెంట్ బాధితులకు ఆర్థిక సహాయం.

బైక్ యాక్సిడెంట్ బాధితులకు ఆర్థిక సహాయం

ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం మైలారం గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన దసరాపు భద్రయ్య కు ముత్యాల సంపత్ కు ఇటీవల బైక్ ఆక్సిడెంట్ కావడం జరిగింది దీనితో వారికి తలకు బాడీకి తీవ్రమైన దెబ్బలు తగలడంతో హైదరాబాదులోని హాస్పిటల్ తీసుకువెళ్లడం జరిగింది వారిది నిరుపేద కుటుంబం కావడంతో వారి కుటుంబం దాతల సహకారం కోరగా విషయం తెలుసుకున్న ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్నికి మనోధైర్యం కల్పించి వారి వైద్యానికి 5,000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది అలాగే వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటారని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఇంచార్జ్ ఆకుల ప్రతాప్,మొర్రి గణేష్, తది ఇతర సభ్యులు పాల్గొన్నారు

ఆర్థిక సహాయం అందించిన మండల అధ్యక్షులు.

ఆర్థిక సహాయం అందించిన మండల అధ్యక్షులు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం

జిల్లా..నేటిధాత్రి..

 

 

shine junior college

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కరకగూడెం గ్రామానికి చెందిన బంధు ప్రవీణ్ అనే యువకుడు ప్రమాదంలో గాయపడి భద్రాచలం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని ఆసుపత్రికి వెళ్లి యువకుడిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకొని తనవంతుగా ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

భూ భారతి సహాయక కేంద్రం పరిశీలించిన జిల్లా కలెక్టర్.

భూ భారతి సహాయక కేంద్రం పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూ భారతి సహాయక కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం పరిశీలించారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో సిబ్బంది పని తీరును, ప్రజలకు అందుతున్న సేవలను ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 3వ తేది నుండి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు భూ సంబంధిత సమస్యలు వేగంగా పరిష్కారానికి భూ భారతి రెవెన్యూ సదస్సులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రజల నుండి వచ్చిన అభ్యర్థనలను సమయానికి పరిశీలించి, సంబంధిత తహసీల్దార్ కు సిఫారసు చేసి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తు లు నిష్పక్షపాతంగా పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. కేంద్రంలో నమోదు అయిన ఫిర్యాదులు, వాటి పరిష్కార స్థితిని కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సిబ్బందికి సూచనలు చేసి వచ్చిన దరఖాస్తును రిజిస్టర్ లో నమోదులు చేయాలని స్పష్టం చేశారు. కార్యాలయ పని వేళల్లో ప్రజలు సహాయక కేంద్రాన్ని సందర్శించి సలహాలు, సూచనలు పొందాలని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్లు హరిహర, శ్రీనివాస్, ఈడీఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

దశ దిన కర్మలకు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆర్థిక సహాయం.

దశ దిన కర్మలకు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆర్థిక సహాయం

బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ట్రస్ట్ సభ్యులు

మంగపేట నేటిధాత్రి

 

 

 

వాగొడ్డుగూడెం గ్రామపంచాయతీ లోగల నిరుపేద కుటుంబానికి చెందిన బుడుగుల పిచ్చయ్య ఇటీవల అనారోగ్యం తో మృతి చెందాడు. కన్నీరు మున్నీరు అవుతున్న బాధిత కుటుంబాన్ని ట్రస్ట్ సభ్యులు కలిసి పరామర్శించి,25 కేజీ ల బియ్యాన్ని మరియు ఆర్థిక సహాయంని శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగరమేష్ ఆదేశాలమేరకు ట్రస్ట్ సభ్యులు వారి కుటుంబ సభ్యులైన భార్య కాంతమ్మ, కొడుకు రమేష్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొమరం శివాజీ ,ఆలం శ్రీను, గట్టిపల్లి అర్జున్, చౌలం బాబు,గట్టిపల్లి బాలకృష్ణ మరియు గ్రామస్తులు గట్టిపల్లి సమ్మయ్య ,చౌలం నవీన్ ,చౌలం సుధాకర్, కొట్టెం రాము, బుడుగుల కృష్ణ,
పూనెం గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

జికె నామ్ ఎడ్యుకేషనల్.!

జికె నామ్ ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యలో మెడికల్ లీగల్ సహకరం.

ఛైర్మన్ డాక్టర్ సుప్రియా రత్న కుమార్ గౌడిపేరు

నర్సంపేట,నేటిధాత్రి:

 

జికె నామ్ ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యలో మెడికల్, లీగల్ సహకారం అందించబడునని
ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ సుప్రియా రత్న కుమార్ గౌడిపేరు తెలిపారు. నర్సంపేటలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జికె నామ్ ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్
ప్రాజెక్ట్ చైర్మన్ సుప్రియా రత్న కుమార్ గౌడి పేరు మాట్లడుతూ నిరాదరణకు గురైన ప్రజలకు మెడికల్, లీగల్ సర్వీస్ అందించడం కోసం ఈ ట్రస్ట్ ఎర్పాటు చేశామని దీనిని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.ఈ ప్రాజెక్ట్ సమాజంలో సామాజిక వ్యతిరేక కార్యకలాపాలను నిర్మూలించడానికి మరియు వైద్య సేవల ద్వారా ప్రజలకు మద్దతు ఇవ్వడానికి సహాయపడుతుందన్నారు.
ప్రాజెక్ట్ ప్రాన్ పబ్లిక్ రీడ్రెస్సల్ అసోసియేటెడ్ నెట్‌వర్క్ ద్వారా ఉచిత వైద్య సేవలు,చట్టపరమైన అవగాహన శిబిరాలు అలాగే హన్మకోండలోని చక్రవర్తీ నెట్‌వర్క్ హాస్పిటల్ సహకారంతో సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.జికె నామ్ ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సుప్రియా రత్న కుమార్ గౌడిపేరు లండన్,ఎమ్మార్సి,యూఎస్ఏ లోని న్యూజెర్సీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.ఎన్జీఓ 13 రాష్ట్రాల్లో న్యూ ఢిల్లీ లోని ప్రధాన కార్యాలయంతో వివిధ ప్రాజెక్టులతో పనిచేస్తుంది.రి.నం.725,అలాగే తెలంగాణలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సహకారం ద్వారా ఈ ప్రాజెక్టును నిర్వహిస్తోందని పేర్కొన్నారు.

ట్రస్ట్ ఆరోగ్య కార్డుతో లభించే సేవలు:

ఉచిత ఓపిడి కన్సల్టేషన్లు,
డయాగ్నస్టిక్ పరీక్షలపై డిస్కౌంట్లు 50 శాతం,చికిత్స ఖర్చులపై రాయితీలు 50 శాతం,ఉచిత ఆరోగ్య శిబిరాలు మరియు అవగాహన కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు.

సంస్థ ద్వారా అత్యవసర వైద్య సహాయానికి మార్గనిర్దేశం:

డాక్టర్ తారున్ కుమార్ రెడ్డి (క్రిటికల్ కేర్),డాక్టర్ ఏ.వి మోహన్ రెడ్డి (MS జనరల్ సర్జన్)డాక్టర్ ఎ. చంద్రికారెడ్డి (ఎంఎస్ జనరల్ సర్జన్),డాక్టర్ రామకృష్ణ (ఎండి జనరల్ మెడిసిన్),డాక్టర్ పాద్మాజా (క్రిటికల్ కేర్)

మా కార్డు పొందడానికి అర్హులు:

1. వికలాంగులు
2. అనాథలు
3. అన్ని బిపిఎల్ హోల్డర్లు
4. ఒంటరి మహిళలు
5. డెస్టిట్యూట్స్
6. తక్కువ ఆదాయ కుటుంబాలు
7. క్రమమైన ఆరోగ్య సంరక్షణకు నోచుకోలేని వ్యక్తులు

గుర్తింపు మరియు ఆదాయ పత్రాలు (అవసరమైతే)

కార్డుకు ఎలా…ఎలా దరఖాస్తు చేయాలి:

మే 15 వ తేదీ నుండి – ఆగస్టు 15, 2025 మధ్య అన్ని మండలాలలో పంచాయతీ కార్యాలయం మా నమోదు కేంద్రాన్ని సందర్శించండి.
తద్వారా అవసరమైన పత్రాలు (గుర్తింపు కార్డు,ఆదాయ ధ్రువీకరణ మొదలైనవి) తీసుకురావాలి.

మా సంస్థ లక్ష్యం:

ఆర్థిక సమస్యల కారణంగా ఎవ్వరూ మౌలిక ఆరోగ్య సేవలకు, మరియు చట్టపరమైన సేవలు దూరంగా ఉండకూడదు అనే నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం.మనమంతా కలిసి ఆరోగ్యవంతమైన, చట్టపరమైన సమానత్వమున్న సమాజాన్ని నిర్మించుకుందాం.
మరిన్ని వివరాల కోసం: సంప్రదించండి.
: 7207024416/9581226703
ఇమెయిల్: gktrustnaam@gmail.com
వెబ్‌సైట్: www.gktrustnaam.org

విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్.!

విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు నరేష్ గౌడ్..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక సహాయం ఇటీవల విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తమ ప్రతిభకనబరిచిన విద్యార్థులకు సన్మానం చేసి ఆర్థిక సహాయాన్ని అందించారు. జహీరాబాద్ నియోజకవర్గ రంజోల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని 600 మార్కులకు గాను 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థినిలు వినాయక,ఎం. భవాని, ఫర్హిన్ లకు యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ శాలువాలతో సన్మానం చేసి రూ. 5 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. ప్రభుత్వం పాఠశాలలో చదువుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించడం హర్షించదగ్గ విషయం అన్నారు. భవిష్యత్తులో కూడా ఉన్నత చదువులు చదివి, ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. గ్రామస్తులంతా పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వైజ్య నాథ్, రవీందర్ రెడ్డి, బాబు, మాజీ ఎంపిటిసి ఖలీల్, నాయకులు చంద్రన్న, గుండారెడ్డి, రాజు, మల్లేష్, రవి, శశి, షబ్బీర్, మస్తాన్, సర్దార్, ఎల్లారెడ్డి, మల్లారెడ్డి, దత్తు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నానో సింగ్ రాథోడ్, ఉపాధ్యాయులు నరసింహారెడ్డి, నిజాముద్దీన్, సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక చేయూత..

ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక చేయూత..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ పట్టణం లోని సింగరేణి ఏరియా హాస్పిటల్ సమీపంలో నివాసం ఉండే అరికపురం రాజేశ్వరి అనే నిరుపేద మహిళ ఇటీవల అనారోగ్య రీత్యా మరణించింది.దశదినకర్మ సైతం చేయలేని దిన స్థితిలో ఉన్న కుటుంబానికి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు వారి కుటుంబాన్ని పరామర్శించి పదివేల ఆర్థిక సహాయం అందించారు. ఈకార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సట్ల మహేందర్,కోశాధికారి తూముల సురేష్ , ఉపాధ్యక్షుడు బొద్దుల సతీష్ సభ్యులు జెట్టి శ్రీనివాస్, జె సతీష్, మోటం తిరుపతి , కొండ కుమార్ తదితరులు పాల్గొన్నారు

*-స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం *

*-స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం *
మొగుళ్ళ పల్లి: నేటి ధాత్రి

 

సొంత రక్తసంబంధీకులే వివిధ కారణాలతో విడిపోయి..గొడవలు పడి..మానవత్వ విలువలను మంటగలుపుతున్న తరుణంలో..తోటి స్నేహితుడి తండ్రి మరణం పట్ల స్పందించి..ఆర్థిక సహాయాన్ని అందించి..తోటి స్నేహితులు మానవత్వాన్ని చాటుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి నవీన్ తండ్రి కుమ్మరి సమ్మయ్య ఇటీవల మృతి చెందాడు. కాగా 2012-2013 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన కుమ్మరి నవీన్ స్నేహితులు జన్నే రాజ్ కుమార్, ఇల్లందుల విజయ్ కుమార్, బొచ్చు ప్రకాష్, నాగన బోయిన రాకేష్ యాదవ్, వైనాల అజయ్, బొచ్చు రాజు, తంగళ్ళపల్లి హరీష్, జన్నే రేష్మ, కట్ల మమత, వనపర్తి రుతీష, చల్ల మమత, పోతరాజు జ్యోతి, పసరగొండ శ్రీలత, గాదే రమ్య, చేపూరి రజిత, వైనాల శిరీషలు విరాళాలుగా వేసుకుని 5000 రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందించారు.

మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం.!

మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన మాజీ కౌన్సిలర్ బండారు కృష్ణ
వనపర్తి నేటిదాత్రి

 

వనపర్తి పట్టణంలో 15వ వార్డులో భాస్కర్ సతీమణి శ్రీమతి శారద ఇటీవల మృతి చెందారు .ఈ విషయం తెలియడంతో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బండారు కృష్ణ మృతురాల కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు బండారు కృష్ణ వెంట మున్నూరు సురేందర్ అభిషేక్ డాక్టర్ దానియల్ వినయ్ కుమార్ మహేష్ భరత్ కుమార్ ఇంతియాజ్ మృతురాలి కుటుంబానికి సంతాపం తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version