సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించిన ప్రజా ప్రభుత్వం…

సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించిన ప్రజా ప్రభుత్వం

సీఎం, డిప్యూటీ సీఎం కు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

సోమవారం హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో సింగరేణి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను దసరా పండుగ సందర్భంగా కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ను ప్రకటించింది. లాభాల్లో 34 శాతం కార్మికులకు పంచింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విలేకరుల సమావేశంలో తెలిపారు. కాగా, సింగరేణి లాభం మొత్తం రూ.2360 కోట్లు. అందులో కార్మికుల వాటా మొత్తం రూ. 819 కోట్లు. ఒక్కో కార్మికునికి రూ.1,95,610 ఇవ్వనున్నారు. ఈసారి కాంట్రాక్టు కార్మికులకూ రూ.5,500 చొప్పున బోనస్ను చెల్లించనున్నారు. దీంతో, భూపాలపల్లిలో 5,500 కార్మికులకు ప్రయోజనం కలుగుతుంది. కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇవ్వడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ రావు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లను వేరువేరుగా కలిసి పుష్పగుచ్చం అందించి ధన్యవాదాలు తెలిపారు.

గెలిపిస్తే నెల రోజుల్లో వేతనాలు పెంచుతామన్నారు .. ఏమైంది?

 

గెలిపిస్తే నెల రోజుల్లో వేతనాలు పెంచుతామన్నారు .. ఏమైంది?

సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

ఎన్నికలలో గెలిపిస్తే కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచుతామన్నారని, ఏమైందని సింగరేణి కార్మిక సంఘాల ( జేఏసీ) నాయకులు ప్రశ్నించారు.బుధవారం నాయకులు గట్టు మహేందర్, ఎస్సీ కేఎస్ (సిఐటియు) డివిజన్ కార్యదర్శి మాట్లాడుతూ..సింగరేణిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా,రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 22ను వెంటనే గెజిట్ చేసి కాంట్రాక్టు కార్మికుల వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు.ఈ నెల 22న జెఎసి సంఘాల ఆధ్వర్యంలో ఛలో ప్రజాభవన్ కు కాంట్రాక్టు కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలనే పిలుపులో భాగంగా బుధవారం శ్రీరాంపూర్ ఓసిపిలో కాంట్రాక్టు కార్మికుల అడ్డలో జెఎసి నాయకులు ప్రచారం చేశారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లు, బడాపెట్టుబడిదారుల అనుకూల విధానాలతో కార్మికుల బతుకులు దుర్భరంగా మారుతున్నాయని ఆరోపించారు.చేసే పనులకు అనుగుణంగా కనీస వేతనాలు లేక కుటుంబాలను పోషించుకో లేక సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం గతంలో విడుదల చేసిన 5 జీవోలను (,21,22,23,24,25) గెజిట్ చేయకుండా గత కేసీఆర్ ప్రభుత్వం కాలయాపన చేస్తే, నేడు మమ్మల్ని గెలిపిస్తే నెల రోజుల్లో వేతనాలు పెంచుతామని అధికారంలోకి వచ్చి,సంవత్సర కాలం గడిచిపోయిన నేటికీ కనీస వేతనాల జీవోల గెజిట్ ప్రస్తావన తీయకుండా కార్మికుల నమ్మకాన్ని వమ్ము చేయడం దుర్మార్గం అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం జీవో నెంబర్ 22ను వెంటనే గెజిట్ చేసి కాంట్రాక్టు కార్మికుల వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు.ఈ నెల 22 న ఛలో ప్రజాభవన్ కు పెద్ద ఎత్తున కార్మికులు కదలి రావాలని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బెల్ట్ క్లీనింగ్, రోడ్డు క్లీనింగ్ కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version