బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ 11 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు అనంతరం తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినారు పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లాలను నూతన మండలాలను గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసి అలాగే జయశంకర్ సార్ పేరు మీద భూపాలపల్లి జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇప్పుడు కొంతమంది నాయకులు భూపాలపల్లి జిల్లాను తీసేస్తామని అంటున్నారు ఇప్పటికైనా పట్టణ ప్రజలు ఆలోచించాలి భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి భూపాలపల్లి అభివృద్ధికి సహకరించాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయింది భూపాలపల్లి మున్సిపాలిటీకి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాలేదు ఎన్నికలు వచ్చిన సమయాన మంత్రులను తీసుకువచ్చి చిలాపాలకాలు వేసి హడావిడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కావున పట్టణ ప్రజలు ఆలోచించి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకటరాణి సిద్దు మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి మేకల సంపత్ బుర్ర రమేష్ రజిత తిరుపతి రాజు తదితరులు పాల్గొన్నారు
ఝరాసంగం గ్రామానికి చెందిన సొసైటీ కార్యదర్శి నిస్సర్ అహ్మద్ గారి సోదరుని ఒలిమా డిన్నర్ కార్యక్రమంలో పాల్గొని పెళ్లి కుమారుని పూలమాలలతో సన్మానించారు తాజా మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్.ఈ సందర్బంగా నూతన వధువరులకు శుభాకాంక్షలు తెలిపారు.బొగ్గుల జగదీశ్వర్. తో పాటు మండల మాజీ ఎంపీటీసీ సంతోష్ రజిని ప్రియ మాజీ ఎంపీటీసీ విజేందర్ రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ ఏజాస్ బాబా సర్పంచ్ లు వార్డ్ మెంబర్లు నాయకులు పాల్గొన్నారు …
ఎన్నికల్లో నర్సంపేట మున్సిపాలిటీ ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం.
రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం నర్సంపేటకు ఏమిచ్చింది.
మాజీ ఎంపీ,భాజపా రాష్ట్ర నేత,ప్రొఫెసర్ అజ్మీర సీతారాం నాయక్
కుంభకోణాల్లో కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీలు
జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం
నర్సంపేట,నేటిధాత్రి:
రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి నిధులు కేంద్రం నుంచి వచ్చినవే.. ఇప్పటివరకు నర్సంపేటను పాలించిన బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఏమి అభివృద్ధి చేశాయి. త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వండి కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తాం అని మాజీ ఎంపీ,భాజపా రాష్ట్ర నేత,ప్రొఫెసర్ అజ్మీర సీతారాం నాయక్ అన్నారు.మున్సిపల్ ఎన్నికలకు ముందు భాజపా ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు,కార్యకర్తలతో ముందస్తు సన్నగ్ద సమావేశాలు నిర్వహించేందుకుగాను శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి, నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల కన్వీనర్ డాక్టర్ గోగుల రాణా ప్రతాపరెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీర సీతారాం నాయక్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏమి ఇచ్చిందో మరోసారి పట్టణ ప్రజలు తెలుసుకోవాలని కోరారు.నర్సంపేట పరిదిలో ముఖ్యమైన అభివృద్ధి పనులు చేసేవి చాలా ఉన్నాయి.మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపించండి.. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి అభివృద్ధి చేసే బాధ్యత మాది అని సీతారాం నాయక్ హామీ ఇచ్చారు.కాంగ్రెస్,భారాస పార్టీలు అభివృద్ధి చేస్తాయని ఇప్పటికీ నర్సంపేట మోసపోయింది.మరల మోసపోవద్దు అని పేర్కొన్నారు.ప్రస్తుతం నర్సంపేటలో జరిగిన అభివృద్ధి నేను చేసిందే.. కేంద్ర ప్రభుత్వ నిధులతో..చేసిన అభివృద్దే కనబడుతున్నది అని మాజీ ఎంపీ తెలిపారు.ప్రధాని మోడీ ప్రపంచ నాయకునిగా ఆచరిస్తున్నారు.అదే తరహాలో ఎన్నికల్లో మున్సిపాలిటీ ఇస్తే రాబోయే ఎమ్మెల్యే కూడా భాజపాదే అని భాజపా రాష్ట్ర నేత సీతారాం నాయక్ తెలిపారు.మాజీ ఎమ్మెల్యే,మాజీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు,మున్సిపల్ ఎన్నికల జిల్లా కన్వీనర్ కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ
2014 నుండి ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని దశ దిశలను మార్చారు.అదే తరహాలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను చైతన్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు అవగాహన కల్పించి ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు.జరుగబోయే మున్సిపల్ ఎన్నికలల్లో గెలుపు జెండాలను ఎగురవేయడానికి సన్నాహక సమావేశాలు నిర్వస్తున్నామని అన్నారు.ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం అన్ని డివిజన్ లలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి ఎంపికలు ఉంటాయన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ ఏమి అభివృద్ధి చేసినన్నారు.డెబ్బై ఏండ్ల కాంగ్రెస్, పదేండ్ల బిఆర్ఎస్ పార్టీలు ఒకే కుటుంబ పార్టీలు..అవి నిత్యం కుంభకోణాలను నిలయంగా మారుతున్నాయని ఆరోపించారు. గతంలో గిలిచిన 9 ఎంపిలు,9 ఎమ్మెల్యే స్థానాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగబోయే మున్సిపాలిటీలో ఎన్నికలో అధిక మున్సిపాలిటీలను గెలిపించుకోవడమే లక్ష్యం.దీంతో వచ్చే శాసన సభ ఎన్నికల్లో అధిక సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జోష్యం చెప్పారు.కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ,ఎన్నికల జిల్లా కో కన్వీనర్ పుల్లారావు మాట్లాడుతూ నర్సంపేటలో చేసే ప్రతి అభివృద్ధి పథకం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే అని పేర్కొన్నారు. సొమ్మోకరిది సోకోకరిది అనే విధంగా కేంద్ర ప్రభుత్వం నిధులతో రాష్ట్ర ప్రభుత్వ నిధులంటూ కాంగ్రెస్ ప్రభుత్వం,కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.జిల్లా ప్రధాన కార్యదర్శి,నర్సంపేట ఎన్నికల కన్వీనర్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికలల్లో 30 డివిజన్లలో పోటీ చేస్తున్నాం. ప్రజా బలం ఉన్న నాయకున్ని ఎన్నికల బరిలో దింపుతామని పేర్కొన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రధాని మోడీ నర్సంపేట 3000 ఇండ్లు పంపితే ఒక్క డబుల్ బెడ్రూo కూడా ఇవ్వలేదన్నారు.ఆరు గ్యారెంటీలు,420 హామీలతో అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సిసి రోడ్ల పేరుతో కాంట్రాక్టర్ అవతారంలో ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు గమనించి భాజపా నాయకులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే నర్సంపేటకు శ్రీరామ రక్షా అవుతుందని రాణా ప్రతాప్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు,జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్,నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ సీనియర్ నాయకులు కూనమల్ల పృథ్వీరాజ్, బాల్నే జగన్, పంజాల శ్రీ రాం,కుంభం కోమల్ రెడ్డి, జూలూరు మనీష్ గౌడ్,గుడిపూడి రాధాకృష్ణ, కట్ల రామచందర్ రెడ్డి, బానోత్ వీరన్న, మల్యాల సాంబామూర్తి,పొనుగోటి రవీంద్రచారి నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి సూత్రపు సరిత మహిళ నాయకురాలు మార్త సంధ్యారాణి,బీజేపీ పట్టణ నాయకులు ఠాకూర్ విజయ్ సింగ్, కాసుల నాగేంద్రబాబు,రాజ్ కుమార్, మస్ శివ,థౌటం నిశాంత్, చిలువేరు అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కుతున్న రాష్ట్ర ప్రభుత్వం
హరీష్ రావు ని విచారణకు పిలవడం ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలనకు నిదర్శనం
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పై ఫోన్ ట్యాపింగ్ విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష్యపూరితంగా వారిని విచారణకు పిలవడం హేయమైన, ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్యగా పరిగణించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, వాటి నుంచి తప్పించుకునే కుట్రలో భాగంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల గొంతు నొక్కే ప్రయత్నాలు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచే చేస్తున్నారు. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ అనే అస్త్రాన్ని ఉపయోగించి హరీష్ రావు పై కేసులు పెట్టి రాజకీయ కుట్రలకు పాల్పడ్డారు. హరీష్ రావు పై విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ, నిన్న మళ్లీ విచారణకు పిలవడం అనేది పూర్తిగా ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేని అసహనానికి నిదర్శనం. భారత రాష్ట్ర సమితికి ఉన్న అపార ప్రజాదరణను చూసి, మునిసిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకులను ఎదుర్కొనే ధైర్యం లేక, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను వేధింపులకు గురిచేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోంది. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ భయపడదు. ఎంతమందిని విచారణలకు పిలిచినా, ఎంతమంది కార్యకర్తలను వేధించినా, బీఆర్ఎస్ పార్టీ రెట్టింపు ఉత్సాహంతో ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ఈ ప్రభుత్వాన్ని పదవి నుంచి దించే వరకు ప్రజాపక్షంలో పోరాడటం ఖాయం. ఈ క్రమంలో అసెంబ్లీలో పార్టీ ఉపనాయకుడిగా హరీష్ రావు ప్రభుత్వ వైఫల్యాలను, బొగ్గు కుంభకోణంలో వేల కోట్ల రూపాయల అవినీతిని ధైర్యంగా బయటపెడుతున్నందుకే ప్రభుత్వం ఇలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రజావ్యతిరేక చర్యలను ప్రజలు క్షేత్రస్థాయిలో గమనిస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేస్తే ప్రజలు హర్షిస్తారు.లేకపోతే, ఇలాంటి నిరంకుశ చర్యలతో చరిత్రలో తప్పకుండా చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. వారు హెచ్చరించారు
ఆర్కే ఫోర్ గడ్డ ఏరియాను ఓసి ప్రభావిత ప్రాంతంగా గుర్తిస్తాం…
కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
ఆర్కేపి ఉపరితల గని ప్రభావిత ప్రాంతమైన ఆర్కే ఫోర్ గడ్డ ఏరియా ప్రజలకు పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తానని, వార్డులలో ఉన్న సమస్యలను, ప్రజా సమస్యలను సైతం పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పార్టీ నాయకులతో కలిసి మార్నింగ్ వాక్ లో మంత్రి వివేక్ పాల్గొన్నారు.పట్టణంలోని 3,4,17,18,19 వార్డ్ లలో పర్యటించారు.
రానున్న రోజుల్లో రామకృష్ణాపూర్ ఉపరితల గని రెండో దఫా పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలకు పునరావాసం కల్పించాలని మంత్రిని ఆర్కే ఫోర్ గడ్డ ప్రజలు కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. మంత్రి వెంట మార్నింగ్ వాక్ లో పాల్గొన్న మందమర్రి ఏరియా సింగరేణి జిఎం రాధాకృష్ణ, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు లకు ఉపరితల గని బాధితులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని ఆదేశించారు.3,18 వార్డుల్లో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
పలు కాలనీలో బెల్ట్ షాపులతో ఇబ్బందులు పడుతున్నామని మహిళలు తెలపగా వెంటనే బెల్ట్ షాపులను అరికట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. సింగరేణి ప్రాంతంలో నిలిపివేసిన 76 జీవోను అమలు చేసి ఇండ్ల క్రమబద్ధీకరణ చేయాలని వార్డుల్లోనీ ప్రజలు కోరగా , రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడి సింగరేణి భూముల్లో ఉన్న ఇండ్ల స్థలాలకు పట్టాలను ఇచ్చేలా కృషి చేయాలని కోరడంతో మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. మార్నింగ్ వాక్ లో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే పర్యటిస్తున్నానని మునిసిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని అన్నారు. మంత్రి వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జహీరాబాద్ : జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో వారం రోజుల క్రితం నమోదైన ఓ దాడి కేసుకు సంబంధించి నిందితుల రిమండ్ లో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ :రూరల్ పోలీస్ స్టేషన్ లో వారం రోజుల క్రితం నమోదైన ఓ దాడి కేసుకు సంబంధించి నిందితుల రిమండ్ లో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పోలీస్ అధికారులు కల్పించుకొని సత్వరమే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మండలంలోని హుగ్గెల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికల అనంతరం ఓ వర్గం వ్యక్తులు మరో వర్గానికి చెందిన వారిపై దాడి చేసారు. ఈ దాడుల నేపథ్యంలో నిందితుల రిమాండ్ పట్ల ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంజీ. రాములు, గ్రామస్తులు, నిందితులతో కలిసి పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆందోళనకు దిగారు. దీంతో డీఎస్పీ సైదా సీఐ శివలింగం, పట్టణ ఎస్ఐ వినయ్ కుమార్ నిందితులపై చట్టపరమైన చర్యలు తప్పవని సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు.
సాతారం సర్పంచ్ ఉప సర్పంచ్ లను సన్మానించిన బిఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు మెట్ పల్లి డిసెంబర్ 30 నేటి ధాత్రి
మెట్పల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసిన మల్లాపూర్ మండలం సాతరం గ్రామ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కిషన్ గౌడ్ ఉప సర్పంచ్ జగన్ విద్యాసాగర్ రావు నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్లను శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు గ్రామ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసి పనిచేద్దామని తెలిపారు.
వేం నరేందర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాజకుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా వారిని బంజారా హిల్స్ లో మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నేతకాని మహర్ కుల సంఘం రాష్ట్ర యూత్ అధ్యక్షుడు గజ్జె రాజకుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని ఉన్నంతమైన పదవులు చేపట్టాలని అలాగే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానని వారు అన్నారు
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధికి చందుపట్ల కీర్తి రెడ్డి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం జిల్లా అధ్యక్షుడు ఏడు నూతల నిశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో వార్డ్ మెంబర్లను శాలువా కప్పి సన్మానించిన చందుపట్ల కీర్తి రెడ్డి బిజెపిజిల్లా పార్టీ ఆఫీసులో స్థానిక సంస్థ లో బస్వ రాజుపల్లి గ్రామం నుండి ఒకటవ వార్డ్ నెంబర్ గా కుక్కముడి రమేష్ మైలారం గ్రామము నుండి ఐదవ వార్డ్ నెంబర్ గా బండి ఉపేందర్ గెలుపొందిన సందర్భంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జన్నె మొగిలి రాష్ట్రకార్యవర్గ సభ్యుడుపాపన్న బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
భూపాలపల్లి పట్టణ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
ఈ రోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ అర్బన్ ప్రెసిడెంట్ కటకం జనార్దన్ అధ్యక్షతన నిర్వహించిన భూపాలపల్లి పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా 3వ వార్డు మాజీ కౌన్సిలర్ పిల్లలమర్రి శారద నారాయణ సేవాలాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్యా రాజు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో రానున్న మున్సిపాలిటీ ఎన్నికలే ప్రధాన అజెండాగా, ప్రతి వార్డు స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల ఆశలను ప్రభుత్వం నిరాశపరుస్తోందని, హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ముఖ్యంగా సింగరేణి కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వారి హక్కులను కాపాడడంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమావేశం ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపుతూ, రానున్న ఎన్నికల్లో భూపాలపల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలనే సంకల్పాన్ని కార్యకర్తలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కట్టకం జనార్ధన్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ భూపాలపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకటరాణి సిద్దు వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులను ఘన విజయం సాధించిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి హాజరై అభ్యర్థులను సన్మానం చేయడం జరిగింది అనంతరం కీర్తి రెడ్డి మాట్లాడుతూ ప్రజలు బీజేపీపై పెట్టిన నమ్మకమే ఈ విజయానికి నిదర్శనమని, ఇది పార్టీ కార్యకర్తల కష్టానికి లభించిన ఫలితమని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధే దేశ అభివృద్ధికి పునాది అని, స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రజల సమస్యలను నేరుగా గుర్తించి పరిష్కరించే కీలక పాత్ర పోషిస్తారని ఆమె తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసి, పారదర్శకంగా అమలు చేయడంలో మీరు ముందుండాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తే రాబోయే రోజుల్లో బీజేపీని మరింత బలోపేతం చేయగలమని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విజయం ఆరంభమే తప్ప అంతిమం కాదని, గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడమే లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా విజయం సాధించిన ప్రతి ఒక్కరికి కీర్తి రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవలో నిబద్ధతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపన్న చదువు రామచంద్రారెడ్డి కన్నం యుగదీశ్వర్ పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు జన్నే మొగిలి రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్ రాయరాకుల మొగిలి రాష్ట్ర నాయకులు బట్టు రవి జిల్లా ప్రధాన కార్యదర్శిలు దొంగల రాజేందర్ పెండ్యాల రాజు తాడికొండ రవి కిరణ్ వివిధ మోర్చ అధ్యక్షులు జిల్లా నాయకులు వివిధ మండలాధ్యక్షుడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
సిపిఐ పైలాన్ ఓపెనింగ్ కార్యక్రమానికి వేలాదిగా తరలి రావాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శతజయంతి వేడుకలు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు.స్థానిక రావి నారాయణరెడ్డి భవన్ లో జిల్లా నాయకులతో కలిసి సిపిఐ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది.అనంతరం వారు మాట్లాడుతూ భారత దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం ఆనాడు 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో మొట్టమొదటిసారిగా కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందన్నారు. నాటినుండి నేటి వరకు 100 సంవత్సర చరిత్రలో అనేక ఉద్యమాలు చేసి ప్రజల మన్నన పొందుతున్న ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని కొనియాడారు. సంపూర్ణ స్వాతంత్రం కావాలని వందలాది కమ్యూనిస్టులను ప్రాణ త్యాగం చేసిన చరిత్ర ఉందని తెలిపారు. తెలంగాణ రైతంగ సాయుధ పోరాటంలో నాలుగువేల మంది కమ్యూనిస్టుల అమరుల త్యాగాలతో నిజాం దోరాలను తరిమిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉందని అన్నారు. శత జయంతి ఉత్సవాలన పురస్కరించుకొని భూపాలపల్లి పట్టణ కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద పైలాన్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని ఈనెల 28వ తేదీన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ పైలాన్ ఓపెనింగ్ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరవుతున్నారని కావున జిల్లా కేంద్రంలో ఉన్న పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు, కళాకారులు మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని రాజ్ కుమార్ కోరారు. భూపాలపల్లి పట్టణ కేంద్రంలో భగత్ సింగ్ కాలనీలో సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్, కారల్ మార్క్స్ కాలనీ 25వ వార్డు శాఖలో ఖ్యాతరాజ్ సతీష్, సుభాష్ కాలనీ 29వ వార్డులో కొర్మి సుగుణ, 24వ వార్డులో వేముల శ్రీకాంత్, ఆర్టీసీ బస్టాండ్ వద్ద నేరెళ్ల జోసెఫ్,కృష్ణ కాలనీలో పీక రవికాంత్ లు సిపిఐ పతాక ఆవిష్కరణలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గురుజపల్లి సుధాకర్ రెడ్డి, గనగల జోగేష్, గడ్డం సింహాద్రి, గోలి లావణ్య, మట్టి కృష్ణ, గంప రాజు, ఎండి అస్లాం, కుమ్మరి రమేష్ చారి,పల్లెల రజిత, పెద్దమాముల సంధ్య, పోతుగంటి స్వప్న, వాసం రజిత, మట్టి నాగమణి, సుభద్ర తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ, కొత్తపల్లిగోరి, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్ళపల్లి గణపురం మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 469 మంది కల్యాణలక్ష్మి షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.4,69,54,404 విలువైన చెక్కులను రేగొండ రైతువేదిక, చిట్యాల రైతువేదిక గణపురం జీపీ కార్యాలయ ప్రాంగాణంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పేద, మధ్య తరగతి కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలు నిరుపేద కుటుంబాలకు వరంగా మారాయని అన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందుతుందన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయని, ముఖ్యంగా మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడు అంకుశాపురం గ్రామ సర్పంచ్ తోట సునీత వినయ్ సాగర్. గట్టయ్య తదితరులు పాల్గొన్నారు
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో పలువురు సర్పంచులు పార్టీలో చేరారు. చల్మెడ కామన్ నుండి బైక్ ర్యాలీగా మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశానికి మైనంపల్లి హనుమంతరావు కార్యకర్తలతో బైక్ ర్యాలీగా హాజరయ్యారు.
అనంతరం నందగోకుల్ పాతూరి భాను ప్రసాద్ రెడ్డి, తిప్పనగుల్ల సర్పంచు మంజుల, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాతూరి బాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హనుమంతరావు కండువా కప్పి వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచులు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం హర్షణీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని నూతన సర్పంచులకు ఆయన పిలుపునిచ్చారు.
గణపురం మండలం లో యాసంగి పంటకు ఘనప సముద్రం చెరువు నుంచి నీటిని ఐబి అధికారులతో కలిసి భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శుక్రవారం గనప సముద్రం నుండి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా యాసంగి పంట సాగు చేసుకునేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అని చర్యలు తీసుకుంటుందన్నారు చెరువును రిజర్వాయర్ చేసి రైతులకు తాగు నీరు సాగునీరు అందించుతామన్నారు జిల్లాలో 1.26.000 ఎకరాల్లో రైతులు వారి పంటలు సాగుకు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూపాలపల్లి వ్యవసాయ శాఖ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్ గణపురం మండల వైస్ చైర్మన్ వీడిదినేని అశోక్ అధికారులు ఎమ్మార్వో సత్యనారాయణ స్వామి ఎంపీడీవో ఎల్ భాస్కర్ ఐబి అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
జైపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ రామగిరి రామన్న తన గ్రామ నాయకులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీధర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా గ్రామంలోని శాంతి భద్రతలు, ప్రజల సమస్యలు,రానున్న రోజుల్లో గ్రామాభివృద్ధికి పోలీస్ శాఖ సహకారం వంటి అంశాల పై సుదీర్ఘంగా చర్చించారు.గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడం యువతను సరైన దారిలో నడిపించడం మత్తు పదార్థాల నియంత్రణ అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సర్పంచ్ రామన్న,ఎస్సై దృష్టికి తీసుకెళ్లారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ వారు గ్రామపంచాయతీ సమన్వయంతో పని చేయాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తామని శాంతి భద్రతల పరిరక్షణలో గ్రామ ప్రజలు కూడా భాగస్వాములుగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచులు పడాల మల్లా గౌడ్,రాజా గౌడ్,రిక్కుల అంజిరెడ్డి,మద్దుల మల్లారెడ్డి,మద్దుల మనోహర్ రెడ్డి, ప్రభాకర్ చారి దుస్స భాస్కర్, బొప్ప రమేష్,పాలమాకుల రాజేందర్ రెడ్డి,రిక్కుల శేఖర్ రెడ్డి,నరెడ్
భారతదేశ సంపదను దోచుకునే పెట్టుబడిదారుల, కార్పోరేట్ శక్తుల ఆగడాలకు ఎప్పటికప్పుడు కళ్ళెం వేసింది కమ్యూనిస్టులేనని, సమాజంలో జీవిస్తున్న వారందరి కోసం అంతరాలు లేని సమ సమాజ నిర్మాణం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం వందేళ్లుగా నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోంది భారత కమ్యూనిస్టు పార్టీయే నని సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు. భారతదేశంలో సిపిఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా శుక్రవారం కరీంనగర్ లోని సిపిఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద ఏర్పాటుచేసిన సిపిఐ జెండాను పంజాల శ్రీనివాస్ ఎగురవేశారు, సిపిఐ శ్రేణులంతా కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈసందర్భంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ సోవియట్ రష్యా విప్లవ విజయం స్ఫూర్తితో భారత దేశ స్వాతంత్ర్యానికి పూర్వమే 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో సిపిఐ ఆవిర్భవించిందని, అంతరాలు లేని సమాజ నిర్మాణం వర్గ దోపిడీకి వ్యతిరేకంగా సిపిఐ పనిచేస్తుందన్నారు. బ్రిటిష్ పాలనలో మగ్గుతున్న భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలని స్వాతంత్ర్య మహోద్యమంలో సిపిఐ పార్టీ పాల్గొన్నదని, వేలాది మంది కమ్యూనిస్టుల ప్రాణ త్యాగాలు కూడా జరిగాయని, స్వాతంత్ర్యం తీసుకురావడంలో సిపిఐ పాత్ర కీలకమైందన్నారు. స్వాతంత్ర్య అనంతరం దేశంలో కార్మిక కర్షక పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం సంక్షేమం కోసం వారి హక్కులను పరిరక్షించేందుకు ఎన్నో పోరాటాలు నిర్వహించిందని, దేశంలో ఆనాడు ఉన్న పరిస్థితుల్లో రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయికరణ, పద్దెనిమిది ఏండ్లు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు చట్టం,భూ హక్కు చట్టం,అటవీ హక్కుల చట్టం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం లాంటి అనేక ప్రజా ఉపయోగకరమైన చట్టాలు తీసుకువచ్చిన ఘనత సిపిఐ దేనన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న నిజాం నవాబ్ పరిపాలనకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి మగ్దూo మొహిద్దిన్ లు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని, ఆమహత్తర పోరాటములంగా నిజాం నవాబు భారత దేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేశాడని, ఆపోరాటంలో నాలుగు వేల ఐదు వందల మంది వీరమరణం పొందారని, పదిలక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచిన ఘనత సిపిఐకే దక్కిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను, రైతుల చట్టాలను మారుస్తూ చివరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికుల పొట్టను కొట్టే విధంగా పరిపాలన కొనసాగిస్తుందని, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను కాలవస్తుందని, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ, దేశ సంపదను పెట్టుబడిదారులకు అప్పనంగా అప్పజెప్తూ వనరులన్నింటినీ కొల్లగొడుతుందని, బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, వామపక్ష అభ్యుదయవాదులు మరిన్ని పోరాటాలను ఉదృతం చేయాలని అందుకు సిపిఐ శ్రేణులు సిద్ధం కావాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సభ్యులు న్యాలపట్ల రాజు, పైడిపల్లి రాజు, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, బామండ్లపెల్లి యుగేందర్, బూడిద సదాశివ, బోనగిరి మహేందర్,కొట్టే అంజలి, శాఖ కార్యదర్శులు ఎలిశెట్టి భారతి, గామినేని సత్యం,టి.రామారావు,చెంచల మురళి, కసిబోజుల సంతోష్ చారి, మాడిశెట్టి అరవింద్, బాకం అంజయ్య, తోడేటి శ్రీనివాస్, నగునూరి రమేష్, మామిడిపల్లి హేమంత్ కుమార్,సందీప్ రెడ్డి, సాంబయ్య, వెంకట్రాములు, సంపత్, తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ శాసన పరిధిలోని ఝారసంఘం మండలం జీర్లపల్లి గ్రామంలో గురువారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలోని చర్చి వద్ద నూతన సర్పంచ్ అమరేశ్వరి శివమణి కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరీ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి, ఉపసర్పంచ్ రాజశేఖర్, గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు మోహన్ రెడ్డి, మాణిక్ రెడ్డి, పాస్టర్ తదితరులు పాల్గొన్నారు.
వీణవంక మండల కేంద్రంలో శుక్రవారం సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏర్పాటు చేసి పార్టీ జెండాను మండల కార్యదర్శి రాంగోపాల్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… దేశంలో 100 సంవత్సరాలుగా కార్మికుల, రైతుల, విద్యార్థి, యువజనుల పక్షాన మహాతరమైన పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించడం చరిత్ర సిపిఐ కి ఉందని హైదరాబాద్ సంస్థానంలో రాచరిక పాలన అంతముందించి ప్రజాస్వామ్య పరిపాలనకు నడుం బిగించిన సిపిఐ పార్టీ అశేష త్యాగాలను చేసింది ఉరికొయాలను ముద్దాడింది. ప్రపంచం గర్వించే విధంగా చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచే విధంగా రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపింది దున్నేవాడికి భూమి కావాలని ప్రభుత్వం ప్రజలందరికీ కనీస అవసరాలు అయిన కూడు, గూడు ,గుడ్డ ఏర్పాటు చేయాలనే కార్యక్రమ ఎజెండా నీ ప్రభుత్వాల ముందు పెట్టీ వాటిని సాధించడంలో క్రియాశీలకమైన పాత్ర సిపిఐ పార్టీ పోషించింది. రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తామని, భవిష్యత్ భారతదేశ రాజకీయాలకు ఎర్రజెండానే ప్రత్యామ్నాయమని, రానున్న రోజుల్లో మండలంలో గ్రామ గ్రామాన సిపిఐ విస్తరిస్తామని ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రత్నాకర్, బుర్ర సతీష్, బాలగోని చిరంజీవి తాటి కంటి ప్రకాష్ ,పూదరి వినయ్ తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.