సునిల్ కుమార్ గౌడ్ కుటుంబానికి రూ.లక్ష ఆర్ధిక సహాయం
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మండలం నాగుర్లపల్లి గ్రామానికి చెందిన మచ్చిక సునిల్ కుమార్ గౌడ్ గత నెల 26 న గుండెపోటుతో మరణించారు.తను పని చేసిన సిద్దార్థ డిగ్రీ కళాశాలకు చెందిన తోటి అధ్యాపకులు మేరుగు శ్రీధర్ గౌడ్,ఏ.ఓ పరమేష్ ఆధ్వర్యంలో ,10 వ తరగతి స్నేహితులు కలిసి లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం మంగళవారం అతని కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో గౌడ జన పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి మచ్చిక రాజు గౌడ్,గుంటి అశోక్,ప్రభాకర్ రెడ్డి, కోమాండ్ల రఘు, బండారి శ్రీనివాస్, సహాదేవ్, దండెం రవీందర్, రాజు కుమార్,వాళ్ళల రమేష్, అనిల్,మచ్చిక లక్ష్మణ్ గౌడ్, సమ్మయ్య గౌడ్, ఊడ్గుల సాంబయ్య గౌడ్, గంధం చంద్రమౌళి గౌడ్, కక్కెర్ల అశోక్ గౌడ్,గాదెగోని లింగయ్య గౌడ్, ఆనంద్ గౌడ్, గండు రమేష్ గౌడ్, సుదీర్ గౌడ్, రవితేజ గౌడ్,సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
