కృష్ణవేణి స్కూల్‌లో స్వాతంత్ర్య, కృష్ణాష్టమి వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-11-5.wav?_=1

శ్రీ కృష్ణవేణి హైస్కూల్లో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ముందస్తుగా కృష్ణాష్టమి వేడుకలు

నృత్యాలతో అలరించిన విద్యార్థులు

నస్పూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని శ్రీ కృష్ణవేణి హై స్కూల్ లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రధానోపాధ్యాయులు దేవన్న గౌడ్ ఘనంగా నిర్వహించారు.ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.పాఠశాల విద్యార్థులతో వివిధ రకాల వేషధారణలో విద్యార్థులను అలంకరించి,ఆటపాటలతో చిందులు వేపించారు.అలాగే పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నారు.

Krishnaveni School

చిన్నారులు రాధాకృష్ణ వేషధారణలో నృత్యాలు చేసి అందరినీ ఆహ్లాదపరిచారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ బత్తిని రాకేష్ గౌడ్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కృష్ణవేణి హైస్కూల్‌లో స్వాతంత్ర్యం & కృష్ణాష్టమి వేడుకలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-53-1.wav?_=2

శ్రీ కృష్ణవేణి హైస్కూల్లో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ముందస్తుగా కృష్ణాష్టమి వేడుకలు

నృత్యాలతో అలరించిన విద్యార్థులు

నస్పూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని శ్రీ కృష్ణవేణి హై స్కూల్ లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రధానోపాధ్యాయులు దేవన్న గౌడ్ ఘనంగా నిర్వహించారు.ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.పాఠశాల విద్యార్థులతో వివిధ రకాల వేషధారణలో విద్యార్థులను అలంకరించి,ఆటపాటలతో చిందులు వేపించారు.అలాగే పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నారు.

చిన్నారులు రాధాకృష్ణ వేషధారణలో నృత్యాలు చేసి అందరినీ ఆహ్లాదపరిచారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ బత్తిని రాకేష్ గౌడ్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

పరకాల పట్టణంలో పలుచోట్ల ఘనంగా జెండా పండుగ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-51.wav?_=3

పరకాల పట్టణంలో పలుచోట్ల ఘనంగా జెండా పండుగ

క్యాంపు కార్యాలయంలో జెండా ఎగరావేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఎగరవేసిన అధికారులు

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో అమరధామం యందు ఆగస్టు 15 రోజున 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు రేవూరిప్రకాశ్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా జాతీయ పతాకాన్ని ఎగరావేశారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ఆర్డీఓ కార్యాలయంలో….

పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్డీఓ డాక్టర్.కన్నం.నారాయణ జెండా ఎగరావేయడం జరిగింది.అనంతరం జాతీయ గీతాలాపన చేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్ లో….

79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణలోని పరకాల పోలీస్ వారి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ స్టేషన్ ప్రాంగణం లో జెండా ఎగరవేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రమేష్ బాబు,విఠల్,మహిళపోలీసులు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

CI Krantikumar

ఎమ్మార్వో కార్యాలయంలో…..

పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవం సందర్బంగా ఎమ్మార్వో విజయలక్ష్మి జెండా ఎగరావేయడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ మహనీయులను అనుదినం స్మరించుకోవాలని వారి త్యాగల ఫలమే ఈ రోజని అన్నారు.ఈ కార్యక్రమంలో డీటీ.సుమన్,ఎలక్షన్ డీటీ.సూర్యప్రకాష్,ఎం.ఆర్ఐ అశోక్ రెడ్డి,దామోదర్,ఏఎస్ఓ కుమారస్వామి, ధరణి ఆపరేటర్ రఘుపతి,సీనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్,ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ భద్రయ్య, జూనియర్ అసిస్టెంట్ అర్జున్,రాజు తదితరులు పాల్గొన్నారు.

ఎంపిడిఓ కార్యాలయం లో…….

79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది.ఆంజనేయులు జాతీయ పతాకాన్ని ఎగరావేశారు.అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు ఎల్లంకి బిక్షపతి,కార్యాలయ పర్యవేక్షకులు సిహెచ్ శైలశ్రీ, ఏపిఓ ఇందిర,కార్యాలయ, ఈజీయస్ సిబ్బంది,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

వ్యవసాయ మార్కెట్ లో……

స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ,ఏఐటీయూసీ హమాలి యూనియన్ ఆధ్వర్యంలో సిపిఐ జిల్లాకౌన్సిల్ సభ్యుల లంక దాసరి అశోక్ అధ్యక్షతన 79వ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.అనంతరం హమాలి యూనియన్ నాయకులు మహనీయుల చిత్రపటాలకు పూలతో నివాళులు అర్పించి జెండావిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాగెళ్లి శంకర్,శ్రీపతి రాజయ్య,హమాలీ సీనియర్ ముఠామేస్త్రి బొట్ల భద్రయ్య,కొడపాక ఐలయ్య,కోయిల శంకరయ్య,కోట యాదగిరి,గుట్ట రాజయ్య ల్,దొడ్డే పోచయ్య,కార్మిక నాయకులు పాల్గొన్నారు.

పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జెండా పండుగ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-48-1.wav?_=4

ప్రభుత్వం జూనియర్ కళాశాల లో ఘనంగా జెండా పండుగ

పరకాల నేటిధాత్రి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆగస్టు 15నాడు 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కే.సంపత్ కుమార్ జెండావిష్కరించడం జరిగింది. అనంతరం అయన మాట్లాడుతూ స్వతంత్రం కోసం మనము 1857 నుంచి 1947 వరకు పోరాటం చేసి ఆ పోరాటంలో ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేయడం జరిగిందని తద్వారా మనకు స్వతంత్రం సిద్ధించింది కావున ప్రతి విద్యార్థి తప్పకుండా స్వతంత్ర పోరాట యోధులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈరోజు మనము కళాశాలలో ఉచిత విద్య మరియు ఉచిత హాస్టల్స్ గురుకులాలు స్కాలర్షిప్ సౌకర్యము పొందుతున్నాము విద్యార్థులందరూ దేశ రక్షణ కోసం అందరూ పాటుపడాలని ఉత్తమ పౌరులుగా తయారు కావాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు,విద్యార్థులు కళశాల సిబ్బంది పాల్గొన్నారు.

విస్డం పాఠశాలలో ముందస్తు జన్మాష్టమి సంబరాలు…

విస్డం ఉన్నత పాఠశాలలో ఉల్లాసభరితంగా ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

రాయికల్: ఆగస్టు 14, నేటి ధాత్రి:

పట్టణంలోని విస్డం ఉన్నత పాఠశాలలో ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఉల్లాసభరితంగా నిర్వహించారు. దీనిలో విద్యార్థిని విద్యార్థుల చిన్ని గోపిక కృష్ణ వేషధారణలు అందరికీ చూడముచ్చట గొలిపాయి. ఈ సందర్భంగా ఉట్టి కొట్టే కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. దీనిలో గోపిక కృష్ణులు ఆటపాటలతో ఆనందంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల కరస్పాండెంట్ డా. ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి మాట్లాడుతూ కృష్ణం వందే జగద్గురుం-మహా విష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా అవతరించారని, జీవిత సత్యాలను, కర్మ సిద్ధాంతాన్ని, భక్తి మార్గాన్ని తన భగవద్గీత ద్వారా సమాజానికి అందించిన మహా పురుషుడు శ్రీకృష్ణుడు అని అన్నారు.అటువంటి శ్రీకృష్ణుడు అందించిన గీత సారాన్ని ప్రతి ఒక్కరూ వారి మనసులో నిలుపుకొని వాటి నియమాలను పాటిస్తూ మానవ జీవితాన్ని పునీతం చేసుకోవాలన్నారు. ఈ వేడుకల్లో డైరెక్టర్ ఎద్దండి నివేద రెడ్డి , ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందేలా చర్యలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-42.wav?_=5

బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందేలా చర్యలు

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

సిరిసిల్ల జిల్లా కేంద్రం లోని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నేషనల్ స్కాలర్ షిప్ స్కీమ్ క్రింద వీడియో కార్మికుల పిల్లలకి అందించే ఉపకార వేతనాల పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, కేంద్ర కార్మిక శాఖ ద్వారా బీడీ కార్మికులు, లైమ్ స్టోన్ & డోలో మైట్ ఖనిజాల కార్మికులు, మైకా మైనింగ్ కార్మికులు, ఐరన్ ఓర్ , క్రోమ్ ఓర్ మైనింగ్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా పరిధిలో బీడీ కార్మికుల పిల్లలందరికీ ఉపకార వేతనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. 6 నెలల పాటు బీడీ కార్మికులుగా పని చేసిన వారు, వార్షిక ఆదాయం 1,20,000 లోపు ఉన్న వారు ఈ పథకానికి అర్హులుగా ఉంటారని అన్నారు.
నేషనల్ స్కాలర్ షిప్ క్రింద 1 నుంచి 4వ తరగతి చదివే పిల్లలకు వెయ్యి రూపాయలు, 5 నుంచి 8వ తరగతి చదివే పిల్లలకు 1500, 9 నుంచి 10వ తరగతి చదివే పిల్లలకు 2 వేల రూపాయలు, ఇంటర్ పిల్లలకు 3 వేల రూపాయలు, డిగ్రీ, పిజి డిప్లమా కోర్సుల చదివే పిల్లలకు 6 వేల రూపాయలు, ఐటిఐ పాలిటెక్నిక్ చదివే పిల్లలకు 8 వేల రూపాయలు, ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు చేసే పిల్లలకు 25 వేల రూపాయల ఉపకార వేతనం అందుతుందని అన్నారు.

Collector Sandeep Kumar Jha

 

1 నుంచి 10వ తరగతీ వరకు చదివే విద్యార్థులు ఆగస్టు 31 లోపు,ఇంటర్ పై చదువు చదివి విద్యార్థులు అక్టోబర్ 31 లోపు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. జిల్లాలోని బీడీ కార్మికుల పిల్లలందరూ ప్రీ మెట్రిక్స్ స్కాలర్షిప్ దరఖాస్తులు ఆగస్టు 31 లోపు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అర్హత గల బీడీ కార్మికుల పిల్లలందరూ scholarships.gov.in , జాతీయ స్కాలర్షిప్ కోర్ట్ నందు దరఖాస్తుల సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఉప సంక్షేమ కమిషనర్ సాగర్ ప్రధాన్ సీనియర్ మెడికల్ ఆఫీసర్లు కేంద్ర సంక్షేమ ఆసుపత్రి డా.మహేందేర్, డా.మధుకర్, డా.వెంకటేష్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నజీర్ అహ్మద్ జిల్లా పంచాయతీ అధికారి షరీఫుద్దీన్ అదనాపు డిఆర్డిఏ శ్రీనివాస్ ఎంపీడీవోలు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ.

పోలీసుల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,లో బుధవారం
రోజున చిట్యాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి కోడెపాక రఘుపతి, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్ రఘుపతి సమక్షంలో ఏఎస్ఐ మధుసూదన్ సారధ్యంలో పాఠశాలలోని విద్యార్థులు అందరి చేత మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేపించారు.ఈ సందర్భంగా ఏఎస్ఐ మధుసూదన్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు మానవ మనుగడకు పెనుముప్పు అని మాట్లాడడం జరిగింది. మండల విద్యాధికారి కోడెపాక రఘుపతి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే అభివృద్ధి చెందిన దేశంఅని, మాదకద్రవ్యాలను అందరం కలిసికట్టుగా నిర్మూలించుదామని చెప్పారు.ఈ కార్యక్రమంలో బొమ్మ రాజమౌళి, రామ్ నారాయణ, శ్రీనివాస్, ఉస్మాన్ అలీ, శంకర్, బుర్ర సదయ్య, సరళ దేవి, నీలిమారెడ్డి, విజయలక్ష్మి, మౌనిక, స్వామి పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సూదం సాంబమూర్తి పూర్వ విద్యార్థి గుర్రపుచందర్ తదితరులు పాల్గొన్నారు.

తండ్రి జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలలో టై,బెల్ట్,ఐడి కార్డు పంపిణీ

తండ్రి జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలలో టై,బెల్ట్,ఐడి కార్డు పంపిణీ

మాజీ సర్పంచ్ నామాల సత్యవతి తిరుపతి

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలం రామారావు పేట గ్రామపంచాయతీలోని ప్రభుత్వ పాఠశాలలో నామాల వెంకన్న 13వ వర్ధంతి సందర్భంగా టై,బెల్ట్స్,ఐడెంటి కార్డ్స్,విద్యార్థిని,విద్యార్థులకు వారి కుటుంబ సభ్యులు అందించారు.నామాల వెంకన్న కుమారులైన నమాల సత్యవతి తిరుపతి,జ్యోతి రవి,మాధురి శ్రీనివాస్ విద్యార్థిని,విద్యార్థులకు టై, బెల్ట్,ఐడికార్డ్స్ వారి నాన్న జ్ఞాపకార్థం విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు సంతోష్ ఆధ్వర్యంలో బుధవారం అందజేశారు.ఈ సందర్భంగా నామాల తిరుపతి మాట్లాడుతూ..మన ప్రభుత్వ పాఠశాలను మనమే అభివృద్ధి చేసుకోవాలని విద్యార్థిని,విద్యార్థులను ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు దీటుగా తయారుచేసి పోటీ పరీక్షల్లో ప్రైవేటు పాఠశాల విద్యార్థులపై నెగ్గే విధంగా తయారు చేయాలని అన్నారు.మా వంతుగా ప్రభుత్వ పాఠశాలకు ఏ అవసరమొచ్చిన సహాయం చేయడానికి ముందుంటామని తెలిపారు.అలాగే పాఠశాల ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు నామాల సత్యవతి తిరుపతి ని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం లో ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు,అంగన్వాడీ టీచర్ విజయ,యూత్ సభ్యులు శ్రీకాంత్, రాజకుమార్,శ్యామ్ కుమార్, శ్రీకర్,తదితరులు పాల్గొన్నారు.

పఠనానికి గ్రేస్ మార్కులు – కేరళలో కొత్త నిర్ణయం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-29-3.wav?_=6

కేరళ ప్రభుత్వం విద్యార్థుల్లో పఠన అలవాటును ప్రోత్సహించడానికి కొత్త నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పఠన సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనే విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వనుంది.

రాష్ట్ర సాధారణ విద్యాశాఖ మంత్రి వి.శివాంకుట్టి ఫేస్‌బుక్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు.
1వ తరగతి నుండి 4వ తరగతి వరకు ప్రతి వారం ఒక పీరియడ్‌ను పుస్తక పఠనం మరియు అనుబంధ కార్యక్రమాలకు కేటాయిస్తారు. 5వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థులు పత్రికలు చదవడం మరియు అప్పగించబడిన కార్యకలాపాల్లో పాల్గొనడం జరుగుతుంది.
అంతేకాక, పాఠశాల కళోత్సవాల్లో పఠన సంబంధిత విభాగాన్ని చేర్చే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.

అల్ఫోర్స్ పాఠశాలలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-08T131837.321.wav?_=7

అల్ఫోర్స్ పాఠశాలలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం, ముందస్తు రక్షాబంధన్ వేడుకలు

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని అల్ఫోర్స్ పాఠశాలలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రత వేడుకలు, పూజలు ఘనంగా నిర్వహించిన అనంతరం ఉపాధ్యాయినిలు అందరూ వాయనం ఇచ్చుకున్నారు. తదనంతరం రాఖీ పౌర్ణమి సందర్భంగా ముందస్తు రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు నరేందర్ రెడ్డికి రాఖీలు కట్టడం జరిగినది. ఈకార్యక్రమంలో పాఠశాల చైర్మన్, డాక్టర్ వి.నరేందర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

రాష్ట్రస్థాయిలో పోటీలలో మహాదేవపూర్ బాలికల పాఠశాల విద్యార్థులు..

రాష్ట్రస్థాయిలో పోటీలలో మహాదేవపూర్ బాలికల పాఠశాల విద్యార్థులు *

మహాదేవపూర్ ఆగస్టు2 (నేటి ధాత్రి )

మహదేవపూర్ మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్ బాలికల పాఠశాల నుండి మాడిగ అక్షిత ఎనిమిదవ తరగతి,పందుల గణేష్ ఎనిమిదవ తరగతి, 11 తెలంగాణ స్టేట్ జూనియర్ అండ్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ జేఎన్ఎస్ స్టేడియం హనుమకొండలో ఈనెల మూడు, నాలుగవ తేదీలలో జరుగుతున్న అథ్లెటిక్ ట్రయట్లాన్ విభాగంలో పాల్గొంటున్నారని ఆ పాఠశాల పిడి గురుసింగ పూర్ణిమ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి. సరిత మాట్లాడుతూ మా విద్యార్థులు జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మెడల్స్ సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్రస్థాయిలో పాల్గొని మన పాఠశాలకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు.

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర.

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర.

చదువుకోడానికి స్టడీ రూమ్ లేదు.
సరియైన ఆటస్థలం ఏర్పాటు చేయాలి.

మాజీ ఎమ్మెల్యే గండ్ర.

చిట్యాల. నేటి ధాత్రి :

చిట్యాల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరియు ప్రభుత్వ మోడల్ బాల, బాలికల విద్యాలయాలను సందర్శించి విద్యార్థుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గారు మరియు వరంగల్ జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ భూపాలపల్లి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గంట జ్యోతి మరియు మండల బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ…

ఇటీవల గురుకులాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ సంఘటనల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ కేటీఆర్ ఆదేశాల మేరకు చిట్యాల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను మరియు ప్రభుత్వం మోడల్ పాఠశాలలను సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా కస్తూర్బా గాంధీ విద్యార్థినిలు మాకు ఒక ప్లే గ్రౌండ్ కావాలని, అదేవిధంగా మోడల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థినులు మా యొక్క హాస్టల్ పరిసరాలు మొత్తం పిచ్చి మొక్కలతో అపరిశుభ్రంగా ఉన్నాయని వాటిని వెంటనే తొలగించాలని కోరడం జరిగింది.
అదేవిధంగా టాయిలెట్స్ అయిదు రోజులకి ఒకసారి క్లీన్ చేయడంతో చాలా దుర్వాసన వెదజలుతున్నాయని, అదే విధంగా మాకు చదువుకోవడానికి స్టడీ రూమ్, ఆడుకోవడానికి ఆటస్థలం, కరెంట్ సరిగ్గా రావడం లేదని మాకు సరైన కరెంట్, చుట్టుప్రక్కల ఆపరిశుభ్రంగా ఉండటంతో దోమలు ఎక్కువగా వస్తున్నాయి అని అందుకు మెస్ డోర్స్ ఏర్పాటు చేయాలని, అదే విధంగా నీటి సమస్య అధికంగా ఉన్నది కారణంగా మిషన్ భగీరథ ద్వారా నీటిని అందించాలని, వారికీ హాట్ వాటర్ కొరకు సోలార్ గ్రీజర్ మరియు సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలని కోరారు.
అదే విధంగా ఇప్పటి వరకు కోస్మోటిక్ బిల్లు రాలేదని వాటిని కూడా త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరారు. వారి వెంట మాజీ జెడ్పిటిసి గొర్రె సాగర్ మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలలో విద్యార్థులకు సైకిళ్ళ పంపిణీ….

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలలో విద్యార్థులకు సైకిళ్ళ పంపిణీ….

తంగళ్ళపల్లి నేటి దాత్రి…

తంగళ్ళపల్లి మండలం పలు గ్రామాల్లో. మొదట పది గంటల 30 నిమిషాలకు నేరెళ్ల.గ్రామంలో. తరువాత 12 గంటలకు సమయానికి జిల్లెల్ల. గ్రామంలో. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మండపల్లి లో . గ్రామంలోఈరోజు బండి సంజయ్ అన్న పుట్టినరోజు సందర్భంగా మోడీ కానుక ద్వారా తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల్లో సైకిళ్ల పంపిణీ ప్రోగ్రామ్ జరిగింది.. ఇందులో నేరెళ్ల జిల్లెల్ల మండపల్లి గ్రామాలలో సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇట్టి కార్యక్రమానికి బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డి బోయిని గోపి హాజరై మాట్లాడుతూ ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన బండి సంజయ్ ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకుంటూ అంచలంచలుగా.ఎదుగుతూ కేంద్ర మంత్రిగా హోదాగా.పనిచేస్తూ పదవ తరగతి విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేయాలని కృతనిశ్చయం.మోడీ గారి ఆశయాలతో ముందుకు వచ్చి ప్రతి గ్రామంలో తన పార్లమెంట్ నియోజకవర్గంలో తను ఉన్నన్నిరోజులు ప్రతి సంవత్సరం పిల్లలందరికీ సైకిల్ పంపిణీ చేయడం జరుగుతుందని అందులో భాగంగా సైకిలు కొనుగోలు చేయడం ఎంత తల్లిదండ్రులకు తెలుసునని దాని గురించిఈరోజు విద్యార్థిని విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేయడం జరిగిందని అటువంటిది కొందరి నాయకులు తమలబ్దికోసం పోరారడం.తప్ప ప్రజల బాగోబాగులు ఎప్పుడు పట్టించుకునే పాపాన పోలేదని అందులో భాగంగా ఎప్పుడు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఎదుటివారిని కించపరిచే విధంగా మాట్లాడదు తప్ప చేసే మంచి పనులు గుర్తుచేయరని ఇకనుండి అయినా విద్యార్థుల పట్ల ఆలోచన విధానం మార్చుకోవాలని అలాగే ప్రతి సంవత్సరం వారికి సంబంధించి పుస్తకాలు గానీ పెన్సిల్ గాని బాటిల్స్ గాని మోడీ సహకారంతో కేంద్ర మంత్రి సహకారంతో అందించడానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఉన్నన్నిరోజులు ప్రతి సంవత్సరం పంపిణీ.చేస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమము మండల బీజేవైఎం అధ్యక్షులు రాజిరెడ్డి.మండల బిజెపి అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు ఇట్టి కార్యక్రమానికి బిజెపి నాయకులు కార్యకర్తలు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

వివరాలు ఆన్లైన్లో నమోదు…….

‘వివరాలు ఆన్లైన్లో నమోదు’

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-01T110159.340.wav?_=8

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేసిన యూనిఫామ్, టెస్ట్ బుక్స్ వివరాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సూచించారు. చాలా మంది ప్రధానోపాధ్యాయులు ఈ వివరాలను నమోదు చేయలేదని పేర్కొన్నారు. మండల విద్యాధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని వీటిని నమోదు చేయించాలని ఆయన కోరారు.

బాలాజీ టెక్నోస్కూల్ లో – విద్యార్థుల మాక్ ఎలక్షన్స్…

బాలాజీ టెక్నోస్కూల్ లో – విద్యార్థుల మాక్ ఎలక్షన్స్

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మండలంలోని లక్నేపల్లిలో గల బాలాజీ టెక్నో స్కూల్లో విద్యార్థులలో ఓటింగ్ పై అవగాహన కల్పించేందుకు మాక్ ఓటింగ్ నిర్వహించారు.ఓటింగ్ లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ .రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత బలమైన ప్రజాస్వామ్య దేశాలలో భారతదేశం ఒకటి అని పేర్కొన్నారు.ప్రజాస్వామ్య దేశాలలో రహస్య బాలెట్ ద్వారా తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం ఎంతో శ్రేయస్కరమని అన్నారు.భవిష్యత్తులో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా బలమైన నాయకుడిని ఎన్నుకోవాలని అప్పుడే సుస్థిరపాలన అందుతుందని విద్యార్థులకు అవగాహన కల్పించారు. బిట్స్ సెక్రటరీ డాక్టర్ జి .రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.ఈ కార్యక్రమానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా చాగంటి క్రాంతి కుమార్ పోలింగ్ ఆఫీసర్ గా ఎం.డి రియాజుద్దీన్ పోలింగ్ సిబ్బంది గా ఉపాధ్యాయులు ఆర్లయ్య , అనిల్ , శంకర్ బాబు , సంగీత, సతీష్, కవిత పాల్గొన్నారు. ఎన్.సి.సి క్యాడేట్లు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా విధులు నిర్వహించారు.అనంతరం తెలంగాణ వన మహోత్సవం 2025 కార్యక్రమం లో భాగంగా బాలాజీ టెక్నో స్కూల్ లో బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ .రాజేంద్రప్రసాద్ రెడ్డి మొక్కలు నాటారు.

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోపించాలని

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోపించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

మహాదేవపూర్ జులై 30(నేటి ధాత్రి )

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మ మహాదేవపూర్ కాళేశ్వరం గ్రామంలో మంగళవారం రోజున కాళేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాళేశ్వరం గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు నాగుల తులసి, కోల శాన్వి, గంట హరిచందన, రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాలకు ఎంపికైన సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ శాలువాతో సన్మానించారు జూలై 1న హైదరాబాదు లో హంకి పేట క్రీడా పాఠశాలలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు మన జిల్లా నుండి విద్యార్థులు ఎంపిక కావడంపట్ల ఆయనవిద్యార్థులను అభినందించారు

చట్టాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు..

బూచినెల్లి మైనారిటీ బాలికల వసతి గృహంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-29T123033.308.wav?_=9

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొగుడంపల్లి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో బూచినెల్లి మైనారిటీ బాలికల వసతి గృహంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సును సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జి. కవిత దేవి నిర్వహించి విద్యార్థులకు సాధారణ అంశాలపై అవగాహన కల్పించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతీ విద్యార్ధినులు చక్కగా చదువుకోవాలని, చదువుతోపాటు సాధారణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. విద్యార్థులు నిత్యజీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదురుకాకుండా ఉండడానికి, ఒకవేళ సమస్యలు ఎదురైతే వాటిని అధిగమించడానికి చట్టాలు తొడ్పాడుతాయని సూచించారు. కార్యక్రమంలో బాలకార్మిక నిర్మూలన చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం, జువైనైల్ జస్టిస్ యాక్ట్, సైబర్ క్రైమ్స్, ఉచిత న్యాయసేవా సహాయంపై విద్యార్థులకు తెలియజేసారు. విద్యార్థులందరూ చట్టాలను గౌరవిస్తూ, అవసరమైతే తోటివారికి తెలియజెప్పాలని సూచించారు. మీ చుట్టు బాల్య వివాహా బాధితులు, బాల కార్మికులు ఎక్కడైనా ఉన్నట్లు గుర్తిస్తే స్థానిక తహసీల్దార్ లేదా స్థానిక పోలీస్ అధికారికి సమాచారం ఇవ్వాలని కోరారు,

విద్యార్థులలో గ్రంథాలయ పఠనంపై అసక్తిని పెంచే శిక్షణ..

విద్యార్థులలో గ్రంథాలయ పఠనంపై అసక్తిని పెంచే శిక్షణ

మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలంలోని కేసముద్రం విలేజ్ ఉన్నత పాఠశాలలో 25 జూలై మరియు 26 జూలై తేదీలలో జడ్పీహెచ్ఎస్ కేసముద్రం విలేజ్ కాంప్లెక్స్ మరియు జడ్పీహెచ్ఎస్ కేసముద్రం స్టేషన్ కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులకు పాఠశాల గ్రంధాలయాలను ఏర్పాటు చేయడం మరియు గ్రంథాలయాల నిర్వహణ, పాఠశాలలో గ్రంథాలయ పఠన కార్యక్రమాలను నిర్వహించడం, విద్యార్థులలో పఠనంపై ఆసక్తిని కలిగించడం మొదలగు అంశాలపై శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల విద్యాశాఖాధికారి కాలేరు యాదగిరి, మరియు ఇనుగుర్తి మండల విద్యాశాఖాధికారి జంగా రూపారాణి, జడ్పీహెచ్ఎస్ కేసముద్రం విలేజ్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చీకటి వెంకట్రాంనర్సయ్య, జెడ్ పి హెచ్ ఎస్ కేసముద్రం స్టేషన్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బందెల రాజు, ఆర్పీలుగా ఎం సురేష్ నాయుడు, వి భాస్కరరావు, రాజ్ కుమార్, సి.ఆర్.పి.లు సుల్తానా, స్వాతి, సరిత, నాగవాణి పాల్గొన్నారు,

ఢిల్లీ యూనివర్సిటీలోకి గ్రామీణ విద్యార్థి ఎంపిక.

ఢిల్లీ యూనివర్సిటీలోకి గ్రామీణ విద్యార్థి ఎంపిక,

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T124034.400.wav?_=10

ఝరాసంగం మండల కమాల్పల్లికి చెందిన బి.నరేశ్ సీయూసెట్-2025లో ఉత్తీర్ణత సాధించి ఢిల్లీ యూనివర్సిటీలో ప్రవేశం పొందాడు. ప్రత్యేక కోచింగ్ లేకుండా కేవలం ఇంటి వద్దనే చదువుకొని ఈ విజయాన్ని సాధించాడు. ప్రాథమిక విద్యను ఝరాసంగం ప్రభుత్వ పాఠశాల, ఇంటర్ను కొండాపూర్ గురుకులంలో పూర్తి చేశాడు. నరేశ్ను గ్రామస్థులు, ఉపాధ్యా యులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.

విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు ప్రయోగశాల..

విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు ప్రయోగశాల

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

మామునూర్ పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో సంకల్ప్ ల్యాబ్ ను ప్రారంభించిన కలెక్టర్

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు ప్రయోగశాల ఏర్పాటు చేసినట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.
విద్యార్థులు వారి విద్య విధానాలను అలవర్చుకొని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.
శుక్రవారం మామునూర్ పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో పీఎం శ్రీ నిధి ద్వారా 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కృత్తిమ మేధో ఆధునిక సాంకేతిక నైపుణ్యాభివృద్ధి ( సంకల్ప్) ల్యాబ్ ను కలెక్టర్ ప్రారంభించారు.

Collector Dr. Satya Sarada

విద్యాలయానికి ముఖ్య అతిథిగా చేరుకున్న కలెక్టర్ డాక్టర్ సత్య శారదను ప్రిన్సిపల్ పూర్ణిమ,ఎన్సిసి స్కౌట్ గైడ్ విద్యార్థులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిని అందించేందుకు ప్రత్యేకమైన ప్రయోగశాలను పీఎం శ్రీ పాఠశాలల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ల్యాబ్ లో విద్యార్థులు రోబోటిక్స్ ఐ ఓ టి, బేసిక్ ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రెన్యువల్ ఎనర్జీ సిస్టం వంటి అంశాలను ప్రయోగాత్మకంగా నేర్చుకోవాలని అన్నారు.కలెక్టర్ విద్యార్థులతో స్వయంగా సంభాషించి ఇష్టపూర్వకంగా చదివి భావిభారత పౌరులు కావాలని కోరారు.విద్యార్థులను ఉత్తేజ పరుస్తూ భయాన్ని సంకోచతత్వాన్ని వీడాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.
అనంతరం ఏక్ పేడ్ మాకే నామ్ లో భాగంగా విద్యాలయ ప్రాంగణంలో కలెక్టర్ మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తో పాటు సురేష్ రామలింగయ్య ఉపాధ్యాయులు,విద్యార్థులు
తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version