పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి..

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి..

ఏబీవీపీ రాష్ట్ర నాయకులు బండారి ప్రశాంత్..

రామాయంపేట, సెప్టెంబర్ 11 నేటి ధాత్రి (మెదక్)

 

 

 

రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ₹8,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రామాయంపేట శాఖ డిమాండ్ చేసింది.
స్థానిక బస్టాండ్‌ వద్ద గురువారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న 8300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ విడుదల చేయాలని స్థానిక బస్టాండ్ వద్ద బయట నుంచి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ –
ఫీజు రీయింబర్స్మెంట్ అనేది విద్యార్థుల హక్కు, ప్రభుత్వం ఇచ్చే దానం కాదు. పేద, మధ్యతరగతి విద్యార్థులు ఈ నిధుల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల సమస్యలపై స్పందించకపోగా కేవలం డైవర్షన్ రాజకీయాలతోనే రోజులు గడుపుతున్నారని విమర్శించారు.
అతను హెచ్చరిస్తూ, విద్యార్థుల సమస్యలు, స్కాలర్‌షిప్‌లు తక్షణమే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ విస్తృత స్థాయి ఆందోళనలు, ధర్నాలు చేపడతామని తెలిపారు.
ఈ నిరసనలో నగర కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి అర్జున్, హరిహర, ఆదర్శ్, చందు, మల్లికార్జున్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్.దిలీప్ రావ్…

ఆర్టీఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్.దిలీప్ రావ్

పరకాల నేటిధాత్రి

 

 

 

 

సమాచార హక్కు చట్టం సాధన కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్.దిలీప్ రావ్ నియమితులయ్యారు.ఈ మేరకు మంగళవారం ఆ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్.చంటి ముదిరాజ్,రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి, జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం,ఎన్.దిలీప్ రావ్ కు నియామకపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా దిలీప్ రావ్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి బయటకు తీస్తూ సమాచార హక్కు చట్టం గురించిపౌరులకు,విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపీనాథ్ కట్టెకోల,వేముల పుష్పాలత, రాష్ట్ర కార్యదర్శి గండు వెంకటేశ్వర్లు,రాష్ట్ర సంయుక్త నీలం వెంకట మధు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్,అరుణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు

ఘనంగా కాలోజీ జయంతి వేడుకలు…

ఘనంగా కాలోజీ జయంతి వేడుకలు

కేసముద్రం/ నేటి దాత్రి

 

 

 

కాలోజీ నారాయణరావు జయంతి వేడుకలను మంగళవారం కేసముద్రం మున్సిపాలిటీలోని విలేజ్ లో శ్రీ వివేకవర్ధిని హైస్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిర్రా యాకాంతం గౌడ్ కాలోజీ చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం ప్రసంగిస్తూ కాలోజీ కవిత్వం, ఆయన సాహిత్య స్ఫూర్తి, సమాజంపై చూపిన ప్రభావం గురించి వివరించారు. నా గొడవ పేరుతో సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా స్పందించిన వ్యక్తి కాళోజీ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.

సిరిసిల్ల మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో కాళోజి జయంతి వేడుకలు…

సిరిసిల్ల మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో కాళోజి జయంతి వేడుకలు

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈ రోజు మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో మహతి కళాశాలలో మానేరు రచయితల సంఘం అధ్యక్షులు గెంట్యాల భూమేష్ తెలంగాణ ప్రజాకవి కాళోజి జయంతి సందర్భంగా కళాశాలలోని విద్యార్థులకు తెలంగాణ భాష దినోత్సవం పురస్కరించుకొని కాళోజి జయంతి వేడుకను పురస్కరించుకొని తాను మాట్లాడుతూ తెలంగాణ యాస భాష మన కాళోజీ అని నిజాం, నిరంకుశత్వానికి ఎదురుతిరిగిన కవితల యోధుడని, మా భాష,మన అస్తిత్వం, మన నేల భూమి మన తెలంగాణ పోరాటం అని తెలిపారు.అందులో భాగంగా ఆడెపు లక్ష్మణ్ మాట్లాడుతూ రాబోయే తరాలకు మన భాష మన ఆస్తిత్వం ఎంతో ఉపయోగమని అలాంటి ఈరోజున తెలుగు భాషా దినోత్సవం కాళోజి జయంతి వేడుక మనకెంతో గర్వకారణం అని తెలిపారు.
కవి రచయిత బూర దేవానందం కాళోజి పై కవిత గానం చేశారు. ఈ కార్యక్రమంలో మానేరు రచయితల సంఘం గౌరవ సలహాదారులు, అధ్యక్షులు జర్నలిస్టు టీవీ నారాయణ,చిటికెన కిరణ్ కుమార్, అల్లే రమేష్, కామవరపు శ్రీనివాస్, పోకల సాయికుమార్, ఎండి ఆఫీస్, అధ్యాపకులు వేణు,అంకారపు రవి కవులు,రచయితలు మరియు మహతి కళాశాల విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

పల్లె రోడ్డుకు మోక్షం ఎప్పుడో…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-09T135606.391.wav?_=1

 

పల్లె రోడ్డుకు మోక్షం ఎప్పుడో!

అద్వాన్నదారి,, ఎన్నాళ్ళు అవస్థలు

నేరేడుపల్లి గ్రామంలో రోడ్డు పరిస్థితి..

యేండ్ల తరబడి రోడ్డు మార్గం లేని వాడ

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

శాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామంలో మీసాల ఆయిలయ్య ఇంటి దగ్గర నుండి హనుమాన్ టెంపుల్ వెళ్ళే రోడ్డు అధ్వాన్నంగా తయారయ్యింది.

 

 

 

 

పల్లె ప్రజలు నిత్యం తమ అవసరాలకు మండల కేంద్రానికి రాకపోకలు సాగించే గ్రామీణ రోడ్లు పూర్తిగా ధ్వంసం గుంతల మయంగా మారడం వారికి ఇబ్బందులు తప్పడం లేదు ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే మట్టిరోడ్డే దిక్కు! అది కూడా గుంతల మయంగా మారడంతో నడక నరకయాతంగా మారుతుంది ప్రతిరోజు పాఠశాల, కళాశా లకు వెళ్లే విద్యార్థులతో పాటు వివిధ పనులకు నిమిత్తం వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామస్తు లు పలుమార్లు బీటీ రోడ్డు వెయ్యాలని గత ఎమ్మెల్యేతో పాటు ప్రస్తుత ఎమ్మెల్యే అధికా రుల దృష్టికి తీసుకెళ్లిన ఫలి తంలేకపోయింది . ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి అధికారులు నాయకులు రాజకీయాలకు అతీతంగా స్థానిక నాయకులు చొరవ తీసుకుని రోడ్డు మార్గం సుగమం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

పాఠశాలల పెండింగ్ ఫీజులు విడుదల చేయాలి- పిడిఎస్యు

పాఠశాలల పెండింగ్ ఫీజులు విడుదల చేయాలి- పిడిఎస్యు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

బెస్ట్ అవైలబుల్ పాఠశాలల పెండింగ్ ఫీజులు బకాయిలను విడుదల చేయాలని మంచిర్యాల కలెక్టర్ కి పిడిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా పి డి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.శ్రీకాంత్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల ద్వారా బెస్ట్ అవైలబుల్ స్కూల్ అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు గత మూడు సంవత్సరాల నుండి అరకొర నిధులు విడుదల చేయడంతో ఆర్థికంగా,సామాజికంగా వెనుకబడిన విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాల నుండి అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ పాఠశాలల నిర్వాహకులు కూడా బడ్జెట్ రాక విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేసే పరిస్థితి నెలకొంటుంది.అంతేకాకుండా బడ్జెట్ రాక విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది.కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీనిపై స్పందించి పెండింగ్ లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ బకాయిలు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని పిడిఎస్యు విద్యార్థి సంఘం తరఫున ప్రభుత్వంలో డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు పి.సికిందర్,కే.కార్తీక్ పాల్గొన్నారు.

హీరాబాద్: 12 వరకు ఓపెన్ స్కూల్ అడ్మిషన్ గడువు పెంపు

హీరాబాద్: 12 వరకు ఓపెన్ స్కూల్ అడ్మిషన్ గడువు పెంపు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి సోమవారం తెలిపిన వివరాల ప్రకారం, ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ అడ్మిషన్ల దరఖాస్తు గడువును ఈనెల 12వ తేదీ వరకు పెంచారు. అడ్మిషన్ ఫీజును మీసేవ కేంద్రాల్లో మాత్రమే చెల్లించాలని, నేరుగా అధ్యయన కేంద్రాల్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గడువు పెంపును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఘనంగా గణేశుని వీడ్కోలు…

ఘనంగా గణేశుని వీడ్కోలు

మహాదేవపూర్ సెప్టెంబర్ 6 (నేటి ధాత్రి)

 

 

గణేష్ ని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహాదేవపూర్ మండల కేంద్రంలో శుక్రవారం రోజున గ్రీన్ వుడ్ హై స్కూల్ లోని వినాయకునికి ఘనంగా వీడ్కోలు తెలిపారు. మండల కేంద్రంలో గణేశుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అంతిమ కార్యక్రమం అయినా నిమర్జన కార్యక్రమాన్ని గ్రీన్ వుడ్ హై స్కూల్ విద్యాసంస్థ ఉదయాన్నే పూజా కార్యక్రమాలను ముగించుకున్న అనంతరం ఆటపాటలతో భక్తి గీతాలతో, కోలాటాలతో అంగరంగ వైభవంగా విద్యార్థులతో ఉపాధ్యాయులతో కలిసి శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఆకుతోట సుధాకర్, ఉపాధ్యాయులు రాజకుమార్ తో పాటు తోటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు, విద్యాపకేతర బృందం పాల్గొన్నారు.

సిరిసిల్ల జూనియర్ కళాశాలపై ఆకస్మిక తనిఖీ..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T170637.807.wav?_=2

 

ప్రభుత్వం జూనియర్ కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీనివాస్

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు ఇంటర్మీడియట్ విద్యాధికారి (co-ed) శ్రీనివాస్ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేపట్టడం జరిగినది. ఇందులో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల గదుల పరిశీలన మరియు సైన్స్ ల్యాబ్లు, విద్యార్థుల మేధాశక్తి గురించి, పాఠ్యాంశాల గురించి, మరియు విద్యార్థుల హాజరుశాతం పెంచాలని,అధ్యాపకులను ఉద్దేశిస్తూ మారుతున్న టెక్నాలజీ నేర్చుకొని విద్యార్థులకు విద్యాబోధన చేయాలని వారు కోరారు.ఎంసెట్ జేఈఈ ఎంట్రన్స్ లకు సంబంధించిన తరగతులను “ఫిజిక్స్ వాలా” నిర్వహిస్తున్నారని వాటి లో పాఠాలు విని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.. ఈ సంవత్సరం కళాశాలలో ఉత్తమ ఫలితాలు తీసుకురావాలని అధ్యాపకులను, విద్యార్థులను కోరారు.

 

 

అలాగే పరిశీలన చేసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. అంతేకాకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు కష్టపడితేనే విజయం తప్పనిసరి తమ వెంట ఉంటుందని సూచనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ కె. విజయ రఘునందన్, తెలుగు అధ్యాపకులు వివేకానంద, మరియు తదితర అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

బిట్స్ పాఠశాలలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవం

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-1-2.wav?_=3

బిట్స్ పాఠశాలలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవం

హాజరైన బిట్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్.రాజేంద్రప్రసాద్ రెడ్డి

పరకాల నేటిధాత్రి

పట్టణంలోని బిట్స్ పాఠశాలలో ప్రిన్సిపల్ పిండి యుగేందర్ ఆధ్వర్యంలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బిట్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని డాక్టర్.సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేశారు.ఈ సందర్బంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క జీవిత సూత్రాలను అనుసరించినటువంటి పద్ధతులను అలాగే ఉత్తమ ఉపాధ్యాయులకు ఉండవలసినటువంటి లక్షణాలను తెలియజేశారు. తరువాత విద్యార్థులు వివిధ నృత్యాలతో,పాటలతో,ఉపన్యాసాలతో చూపర్లను అలరించారు.తర్వాత విద్యార్థులు ఉపాధ్యాయులను పుష్ప మాలా అలంకృతులతో సన్మానం చేశారు.తదానంతరం బిట్స్ పాఠశాల ప్రిన్సిపల్ యుగేందర్ గారు మాట్లాడుతూ సమాజ నిర్మాణానికి కావలసినటువంటి ఉపాధ్యాయుల ఆవశ్యకతను మరియు విద్యార్థిదశ నుండి పెంపొందించుకోవాల్సినటువంటి లక్షణాలను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు

https://netidhatri.com/wp-content/uploads/2025/09/teacher.wav?_=4

ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు

మహాదేవపూర్ (నేటి ధాత్రి)

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండల కేంద్రం లోని బాలుర జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం రోజున సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి లో బాగంగా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల లో భాగంగా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులను పూల మాలలు మరియు శాలువాలతో సత్కరించి ఉపాధ్యాయుల గొప్పతనాన్ని కొనియాడారు. భారత దేశపు రెండవ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం మొత్తంలో ఉపాధ్యాయుడిగా చేసిన సేవలే అత్యంత తృప్తినిచ్చాయని తన జీవిత చరిత్రలో రాసుకున్న సందర్భాన్ని ఉపాధ్యాయులు గుర్తు చేసుకున్నారు. ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేది ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన రోజని ప్రధానోపాధ్యాయులు అనిల్ కుమార్ అన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుల గురించి కవితలు, పాటలు వినిపించి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రాజయ్య, దేవేందర్ రెడ్డి, రమేష్, లచ్చయ్య, అనిల్ కుమార్, సమ్మయ్య,షాజహా, అనిత, కవిత, కిరణ్ కుమార్, కోటేశ్వర్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు విద్యార్థులు పాల్గొన్నారు.

జిల్లా ఉత్తమ హిందీ ఉపాధ్యాయుడిగా ఎంపికైన గోలి రాధాకృష్ణ…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T150357.474-2.wav?_=5

జిల్లా ఉత్తమ హిందీ ఉపాధ్యాయుడిగా ఎంపికైన గోలి రాధాకృష్ణ

సిరిసిల్ల టౌన్: ( నేదిధాత్రి)

 

సిరిసిల్ల సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రభుత్వ హిందీ ఉపాధ్యాయులు గోలి రాధాకృష్ణ, రాజన్న సిరిసిల్ల జిల్లా 2025- 26 సంవత్సరానికి గాను హిందీ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు కు ఎంపికైన సందర్భంగా సిరిసిల్ల ప్రజలు మరియు ప్రభుత్వ హిందీ ఉపాధ్యాయులు గోలి రాధాకృష్ణను అభినందించడం జరిగినది. గోలి రాధాకృష్ణ మాట్లాడుతూ ఇంత మంచి అవార్డు ఎంపికైనందున ద్వారా జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు గాని మరియు ప్రభుత్వానికి గాని మరియు సిరిసిల్ల జిల్లా పాఠశాల విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు మరియు తోటి ఉపాధ్యాయులు,నాయకులు,అభినందించారు.

జహీరాబాద్లో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T111859.014.wav?_=6

 

జహీరాబాద్లో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సైబర్ జాగృతి దివస్ సందర్భంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని స్రవంతి జూనియర్ కాలేజీలో పట్టణ సీఐ శివలింగం ఆధ్వర్యంలో బుధవారం సైబర్ నేరాలపై అవగాహన సదస్సు జరిగింది. 150 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీఐ, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది సైబర్ నేరాల గురించి, ఆన్లైన్ మోసాల గురించి, తాగి వాహనాలు నడిపితే తీసుకునే చర్యల గురించి, ట్రిపుల్ రైడింగ్ వల్ల కలిగే నష్టాల గురించి, షీ టీమ్స్ గురించి, OTPల వల్ల కలిగే నష్టాల గురించి విద్యార్థులకు వివరించారు.

సీరత్‌ఉన్‌నబీ సభ – మహిళల ఉత్సాహభరిత పాల్గొనిక…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T130359.342-1.wav?_=7

జహీరాబాద్‌లో సీరత్‌ఉన్‌నబీ సభ – మహిళల ఉత్సాహభరిత పాల్గొనిక

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్,రబీ ఉల్ అవ్వల్ నెల సందర్బంగా జమాత్ ఇస్లామీ హింద్ సౌత్ ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో శాంతినగర్ ఇస్లామిక్ సెంటర్‌లో సీరత్‌ఉన్‌నబీ సభ జరిగింది.సభకు అధ్యక్షత వహించిన జమాత్ ఇస్లామీ హింద్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాజిదా బేగం మాట్లాడుతూ ప్రవక్త మహ్మద్ ముస్తఫా జననం మానవాళికి వరమని, అజ్ఞానాంధకారాన్ని తొలగించి కరుణ, ప్రేమ, న్యాయం ప్రసాదించారని పేర్కొన్నారు.

Seerat-un-Nabi Sabha Held in Jahirabad

ప్రత్యేక అతిథి సుమయ్య లతీఫీ అసిస్టెంట్ సెక్రటరీ, ఉమెన్స్ వింగ్, తెలంగాణ మాట్లాడుతూ సీరత్ బోధనలు కేవలం రబీ ఉల్ అవ్వల్‌లోనే కాక, జీవితాంతం ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.హాజరా బేగం, సయ్యదా మేహనాజ్, ఫహ్మీదా మఖ్మూర్, హాఫిజా సఫూరా సిద్దీఖా వేర్వేరు అంశాలపై ప్రసంగించారు.

Seerat-un-Nabi Sabha Held in Jahirabad

హాఫిజా ఉమ్తుల్ ముబీన్ ఖురాన్ తిలావత్ చేశారు. జీఐఓ అధ్యక్షురాలు హుజైఫా అఫ్నాన్ నాత్ పఠించగా, సీఐఓ విద్యార్థినులు సున్నత్ పై నాటిక ప్రదర్శించారు.పిల్లల కోసం సీరత్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మహిళలు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సిరిసిల్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T135104.883.wav?_=8

 

సిరిసిల్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ

– ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

 

– విద్యాలయం పరిసరాలు పరిశుభ్రం చేయించాలని ఆదేశాలు

– రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల, సెప్టెంబర్ – 01(నేటి ధాత్రి):

 

 

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం సిద్ధం చేసే గదికి వెళ్లారు. ఆహార పదార్థాలు సిద్ధం చేస్తుండగా, పరిశీలించారు. అనంతరం 6 నుంచి 10 తరగతి గదుల్లోని విద్యార్థుల ను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు.

విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు బోధిస్తుండగా, పరిశీలించారు. 10 వ తరగతి విద్యార్థులకు ఫిజిక్స్ పాఠాలు బోదించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాలు నిత్యం చదివించాలని, రాయించాలని సాధన చేయించాలని సూచించారు. విద్యాలయం ఆవరణ నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ఆవరణ అంతా మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించాలని సూచించారు.

మండల కేంద్రంలో క్రీడా దినోత్సవం వేడుకలు …

మండల కేంద్రంలో క్రీడా దినోత్సవం వేడుకలు 
మహాదేవపూర్ఆగష్టు30 (నేటి ధాత్రి )

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో శనివారం రోజున క్రీడా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ క్రీడ దినోత్సవ వేడుకలలో భాగంగా మహాదేవపూర్ మండల కేంద్రంలో విద్యార్థులతో క్రీడ ఉపాధ్యాయుని పూర్ణిమ తోటి ఉపాధ్యాయులతో కలిసి క్రీడా స్ఫూర్తినీ నింపేలా పాటలతో, నినాదాలతో ర్యాలీ నిర్వహించిన అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోటరాజబాపు, పిఎసిఎస్ చైర్మన్ చల్లా తిరుపతి రెడ్డి ఎంఈఓ ప్రకాష్ సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్రీడలలో విద్యార్థులు ముందంజలో ఉంటూ జాతీయస్థాయిలో క్రీడ పోటీలలో విజేతలుగా నిలిచి భవిష్యత్ తరాలకు క్రీడలపై స్ఫూర్తిని అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు అనిల్,ఎస్సై పవన్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

సింగరేణి పాఠశాలలో నూతన బస్సులను ప్రారంభించిన జిఎం…

సింగరేణి పాఠశాలలో నూతన బస్సులను ప్రారంభించిన జిఎం

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

శనివారం రోజున స్థానిక కృష్ణ కాలనీలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైనారు నూతనంగా పాఠశాలకు నియమింపబడిన 2 బస్సులను ప్రారంభించారు. జిఎం మాట్లాడుతూ ఈ స్కూలు బస్సులు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం, త్వరగా సేవలలోకి బస్సులలో తీసుకురావడం జరిగిందని, విద్యార్థులకు ఇది ఎంతో సౌకర్యవంతంగా, ఉపయోగకరంగా ఉంటుందని వారి విలువైన సమయమును కోల్పోకుండా ఈ బస్సుల ద్వారా త్వరగా పాఠశాలకు చేరుకోవచ్చునని, అలాగే విద్యార్థులు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా, సురక్షితంగా పాఠశాలకు ఈ బస్సుల ద్వారా చేరుకోవచ్చని విద్యార్థులకు తెలియజేశారు, అదేవిధంగా సింగరేణి పాఠశాల విద్యార్థులు పదవ తరగతిలో గత సంవత్సరం మంచి ర్యాంకులను కైవసం చేసుకున్నారని, నూటికి నూరు శాతం ఉత్తీర్ణులు అయ్యారని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 10వ తరగతి విద్యార్థులు జిల్లా స్థాయి ర్యాంకులను తీసుకువచ్చి పాఠశాలకు సింగరేణి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆయన విద్యార్థులకు సూచించారు, ఈ కార్యక్రమంలో, ఏరియా పర్సనల్ మేనేజర్, (పాఠశాల కరస్పాండెంట్) కావూరి మారుతి, పాఠశాల ప్రిన్సిపల్, ఝాన్సీ రాణి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

జాతీయ క్రీడా దినోత్సవం…

జాతీయ క్రీడా దినోత్సవం…

క్రీడాకారులు ధ్యాన్ చంద్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి

మహబూబాబాద్ డి.ఎస్.పి తిరుపతిరావు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

శుక్రవారం కేసముద్రం మున్సిపాలిటీ స్థానిక జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల నుండి ఉప్పరపల్లి క్రాస్ రోడ్ వరకు కేసముద్రం మండల సీనియర్ హాకీ మరియు బాస్కెట్బాల్ క్రీడాకారులు మరియు హై స్కూల్ విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో మేజర్ ధ్యాన్ చంద్ జన్మదిన పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవం వన్ కె రన్ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ కొమ్ము రాజేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబాద్ డిఎస్పి తిరుపతిరావు మరియు కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి హాజరై జెండా ఊపి రన్ ప్రారంభించారు.
అనంతరం క్రీడాకారులతో ఉత్సాహంగా రన్ లో ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు పరిగెత్తారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథి మహబూబాద్ డిఎస్పి తిరుపతిరావు మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఆగస్టు 29/ 2012 నుండి ఈ క్రీడా దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తున్నారని క్రీడాకారులు ధ్యాన్ చంద్ స్ఫూర్తిగా తీసుకొని దేశానికి మంచి పేరు తేవాలన్నారు.
గంట సంజీవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు మరియు క్రీడాకారులకు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్రంలో ముఖ్యమంత్రి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, క్రీడ పాఠశాలలను ఏర్పాటు, అచ్యునుత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు నగదు పురస్కారాలతో సత్కరిస్తున్నారని తెలిపారు.కాబట్టి క్రీడాకారులు గ్రామీణ స్థాయి నుంచి పట్టుదలతో ఆడి ఉన్న శిఖరాలు చేరుకొని మన గ్రామానికి రాష్ట్రానికి దేశానికి పేరు తేవాలని ఆకాంక్షించారు.
అనంతరం వేం ట్రస్టు ద్వారా జాతీయస్థాయిలో రాణించిన కేసముద్రం చెందిన 10 మంది క్రీడాకారులకు హాకీ మరియు బాస్కెట్బాల్ క్రీడాకారులకు సన్మానం చేయడం జరిగింది, దానితోపాటు 25 వేల విలువైన క్రీడా సామాగ్రి బాస్కెట్బాల్స్ హాకీ స్టిక్స్ బ్యాడ్మింటన్ రాకెట్స్ వాలీబాల్స్ టెన్నికోల్ రింగ్స్ మొదలగునవి వేం ట్రస్ట్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిఐ సర్వయ్య, ఎస్సై మురళీధర్ రాజ్, స్థానిక నాయకులు రావుల మురళి,అల్లం నాగేశ్వరరావు, బండారు వెంకన్న, బండారు దయాకర్,సతీష్, కదిర సురేందర్, స్థానిక హెచ్ఎం బి రాజు, ఎంఈఓ కాలేరు యాదగిరి, పాలిటెక్నిక్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ నరసయ్య, ఫిజికల్ డైరెక్టర్ కొప్పుల శంకర్, దామల్ల విజయ్ చందర్ తో పాటు మండల క్రీడాకారులు మరియు ప్రజా ప్రతినిధులు దాదాపు 200 మంది పాల్గొన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలుగుభాష దినోత్సవం…

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలుగుభాష దినోత్సవం

గిడుగు రామ్మూర్తి భాషసేవలు మరువలేనివి

కళాశాల ప్రిన్సిపాల్ బేతి.సంతోష్ కుమార్

పరకాల నేటిధాత్రి

 

ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరకాలలో గిడుగు.రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు.అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్.బేతి సంతోష్ కుమార్ గిడుగు వేంకట రామ్మార్తి చిత్రపటానికి పూల వేసి ఘన నివాళి అర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రామ్మూర్తి పంతులు తెలుగు వ్యావహారిక భాషా కోసం చేసిన సేవలు మరువలేనివని అలాగే సవర భాషను నేర్చుకుని ఆ భాషకు వ్యాకరణం కనిపెట్టి సవరలకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేసిన గిడుగు పిడుగులాంటివారని కొనియాడారు.తెలుగు విభాగాధిపతి అశోక్ మోరె మాట్లాడుతూ తెలుగు అజంత భాష అని అనగా అచ్చులతో అంతమయ్చే భాష కాబట్టి సంగీతానికి అనువుగా ఉంటుందని తెలుగుభాషకు, ఇటరీ భీషకు దగ్గరి సంబంధం ఉండే పరిక తెలుగును ” ఈ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్” అ అంటారని అన్నారు.తెలుగు అధ్యాపకులు రణ ఈశ్వరయ్య ప్రసంగిస్తూ మాతృభాషలో విద్యాబోధన ద్వారా విద్యార్థుల మానసిక వికాసం జరిగి సృజనాత్మకత పెంపొందుతుందని,పరభాషలు నేర్చుకున్నప్పటికీ మాతృభాషను మరువకూడదన్నారు.ఈ కార్యక్రమంలో ఐక్యూఏసి కో ఆర్డినేటర్ డాక్టర్.రామక్రిష్ణ ఆద్యాపకులు డా.ఆడెపు రమేష్,బి.మహేందకరావు, డా.ఎ.శ్రీనావార్రెడ్డి,డా.ఎలిశాల అశోక్,డా.భీంరావు,డా.కె. జగదీష్ బాబు,యం సమ్మయ్య,డా.టి.కాల్పన,డా.జి.పావని,రాజశ్రీ,డా.జి.స్వప్న, డాక్టర్.సంజయ్,సతీష్,సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం…

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ మండలంలోని ఇందారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా హాకీ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు.అలాగే మండల విద్యాధికారి బి.శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై మేజర్ ధ్యాన్ చంద్ జీవితాన్ని విద్యార్థులకు పరిచయం చేసారు.మన జాతీయ క్రీడైన హాకీ లో ఆయన అత్యున్నత స్థాయి క్రీడాకారుడుగా ఎదిగిన తీరును వివరించారు.క్రీడలు మానసిక,శారీరక ఉల్లాసం తో పాటు ఐక్యతను చాటుతాయని వివరించారు. విద్యార్థులు చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు. పాఠశాల స్థాయి నుంచి నచ్చిన క్రీడలో మెలుకువలు నేర్చుకోవాలని విద్యార్థులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో పి.డి. ఎన్.పద్మ, ఉపాధ్యాయులు కె.రమాదేవి, కె.రమేష్ బాబు,ఏం. విజయలక్ష్మి,ఎం.సత్తిరెడ్డి,డి. సహదేవ్,జి.సంధ్యారాణి,పి. మంజుల,గోపగాని రవీందర్, కె.కనకయ్య,శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version