గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.జిల్లావ్యవ పరిశీలకుల తనిఖీ…..

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.జిల్లావ్యవ పరిశీలకుల తనిఖీ…..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నాడు జిల్లావ్యయ పరిశీ లకుల ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల వద్ద ఏర్పాటుచేసిన ఎస్ .ఎస్. టి .చెక్పోస్ట్ ను పరిశీలించి. అక్కడ విధులు నిర్వహిస్తున్న వారిని వివరాలు అడిగి తెలుసుకుని సిరిసిల్ల సిద్దిపేట దారి పైన వచ్చి పోయే వాహనాలను చెక్ చేస్తూ ఎన్నికల నియమాలు ప్రకారం ఎటువంటి. మండలంలో ప్రజలను ఎటువంటిప్రబోభాలకు గురికాకుండా చూసుకుంటూ వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఏదైనా తనిఖీల్లో భాగంగా అనుమానం ఉన్నచో సంబంధిత వాహనాల గురించి అందులో ప్రయాణిస్తున్న వారిపై ఏమైనా అనుమానం వస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకుంటూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిఘాపై కఠినంగాతగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ అలాగే. తంగళ్ళపల్లి ఎంపీడీవో కార్యాలయం పరిశీలిస్తూ మండలంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతుందా అనేదానిపై ఎంపీడీవో లక్ష్మి రాజ్యమును రిటర్న్ అధికారులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇట్టి కార్యక్రమంలో. ఎన్నికల జిల్లా వ్యాయ. పరిశీలకులు రాజ్ కుమార్. నోడల్ అధికారి నవీన్. భారతి. ఎంపీడీవో లక్ష్మీనారాయణ. ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

గొప్ప మనసు చాటుకున్న ఆటో డ్రైవర్…

గొప్ప మనసు చాటుకున్న ఆటో డ్రైవర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం
మండలానికి చెందిన ఆటో డ్రైవర్ రాజ్కుమార్ గొప్ప మనసు చాటుకున్నారు. ఆదివారం ఝరాసంగం గ్రామానికి చెందిన సంగమేశ్వర్ దసరా పండుగ సందర్భంగా సరుకులు కొనుగోలు చేయడానికి జహీరాబాద్కు వెళ్లారు. సరుకులు కొనుగోలు చేసి తిరుగు ప్రయాణంలో కొల్లూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రాజ్కుమార్ ఆటోలో ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న సంగమేశ్వర్ తన వద్ద ఉన్న సరుకులు చూసుకుంటే సుమారు రూ. 8 వేల రూపాయలు ఎక్కడో పోయాయని గుర్తించారు. ఇదే సమయంలో ఆటో డ్రైవర్ రాజ్కుమార్ సోమవారం ఉదయం తన ఆటోను పరిశీలిస్తే రూ.8 వేల రూపాయలు లభించాయి. వెంటనే ఆయన ఆ డబ్బును పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అప్పగించారు. పోలీసులు ఆ డబ్బులు ఝరాసంగం గ్రామానికి చెందిన గుర్తించి, ఆయనకు తిరిగి అందజేశారు.
ఎస్సై క్రాంతి కుమార్, గ్రామస్తులు రాజ్కుమార్ ఘనంగా సన్మానించి అభినందించారు.

బాలాజీ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం…

బాలాజీ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట పట్టణంలోని బాలాజీ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఓరియంటేషన్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథిగా హాజరైన ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఈసం నారాయణ మాట్లాడుతూ విద్యార్థినులు చదువుతో పాటు క్రీడా,సాంస్కృతిక రంగాలలోనూ రాణించాలని సూచించారు. ఈ లక్ష్య సాధనకు ఎన్ఎస్ఎస్ ఒక అద్భుతమైన వేదికగా ఉపయోగపడుతుందని తెలిపారు. దేశాభివృద్ధికి ఆటంకాలైన మూఢనమ్మకాలు,నిరక్షరాస్యత,డ్రగ్స్ వంటి దుష్ప్రవర్తనలను సమాజం నుండి పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ మోర్తాల రామరాజు మాట్లాడుతూ నూతన విద్యార్థులు తప్పనిసరిగా ఎన్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ చేసుకుని యూనివర్సిటీ నిర్వహించే వివిధ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని కళాశాలకు పేరు తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్,అధ్యాపకులు రవీందర్, బిక్షపతి,రాజ్‌కుమార్,మధు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా గణేశుని వీడ్కోలు…

ఘనంగా గణేశుని వీడ్కోలు

మహాదేవపూర్ సెప్టెంబర్ 6 (నేటి ధాత్రి)

 

 

గణేష్ ని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహాదేవపూర్ మండల కేంద్రంలో శుక్రవారం రోజున గ్రీన్ వుడ్ హై స్కూల్ లోని వినాయకునికి ఘనంగా వీడ్కోలు తెలిపారు. మండల కేంద్రంలో గణేశుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అంతిమ కార్యక్రమం అయినా నిమర్జన కార్యక్రమాన్ని గ్రీన్ వుడ్ హై స్కూల్ విద్యాసంస్థ ఉదయాన్నే పూజా కార్యక్రమాలను ముగించుకున్న అనంతరం ఆటపాటలతో భక్తి గీతాలతో, కోలాటాలతో అంగరంగ వైభవంగా విద్యార్థులతో ఉపాధ్యాయులతో కలిసి శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఆకుతోట సుధాకర్, ఉపాధ్యాయులు రాజకుమార్ తో పాటు తోటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు, విద్యాపకేతర బృందం పాల్గొన్నారు.

నూతన వదూవరులను ఆశీర్వదించిన మోకుదెబ్బ రమేష్ గౌడ్…

నూతన వదూవరులను ఆశీర్వదించిన మోకుదెబ్బ రమేష్ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

పొలిటికల్ సైన్స్ లెక్చరర్ కానుగుల బాగ్యలక్ష్మి -సుదర్శన్ దంపతులకు చెందిన కూతురు లక్ష్మి వివాహం రాజకుమార్ తో దుగ్గొండి మండలం గిర్నీబావిలోని కనిష్క ఫంక్షన్ హల్ లో జరిగింది. ఈ వివాహనికి గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై నూతన వదూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాతృశ్రీ, ప్రజ్ఞ కాలేజీల అధ్యాపకులు గడ్డం శ్రీనివాస్, నీలారాపు నరేందర్, సుదర్శన్, వెంకటేశ్వర్లు,సంఘాల నాయకులు ఎలకంటి రాజేందర్, మొగిలిచర్ల సందీప్,కందికొండ లవకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version