ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-09T111323.941.wav?_=1

 

ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా

◆-: గ్రామ అభివృద్దె తమ ఏకైక ధ్యేయం

◆-: సర్పంచ్ అభ్యర్థి నాగేందర్ పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఈనెల 14న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఝరాసంగం మండల పరిధిలో ని బోరేగావ్ సర్పంచ్ అభ్యర్థిగా నాగేందర్ పటేల్ బరిలో నిలిచారు. సోమవారం గ్రామం లో ఇంటింటా ప్రచారం లో భాగంగా అయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా తాము ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా పనిచేస్తానని అన్నారు.

అంతేకాకుండా గ్రామంలో కొన్ని సంవత్సరాల నుండి కొన్ని వార్డులలో మూరికి కాలువలు సిసి రోడ్లు కనీస వసతులు లేక .ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాడుతున్నారని అన్నారు .ప్రధాన రోడ్డు నుండి బసవేశ్వర స్వామి ఆలయం వరకు తన సొంత నిధులతో రోడ్డు వేయిస్తాను అన్నారు. రోడ్డు సౌకర్యం లేక మనుషులు మరియి పశువుల కు చాలా ఇబ్బందిగా ఉందని గెలిచిన వెంటనే రోడ్డు సౌకర్యం కల్పిస్తాను అన్నారు.

తాము ఈ ఎన్నికల్లో గెలిచిన వెంటనే .కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి సమాన న్యాయం జరిగే విధంగా తాము పని చేస్తామన్నారు. ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ.

ప్రజల సమస్యల ను పరిష్కరించడమే తమ ధ్యేయమని అన్నారు. కావున గ్రామ ప్రజలు ఆశీర్వదించి ఓట్లు వేసి తమను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వార్డు సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version