నెక్కొండ వారాంతపు సంత అభివృద్ధి దిశగా కీలక అడుగు పడింది.
సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్
# నెక్కొండ, నేటి ధాత్రి:
నెక్కొండ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సంత ప్రాంగణంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శనివారం సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్ శ్రీకారం చుట్టారు.
సంత ప్రాంగణంలో జంగిల్ క్లియరింగ్, అంతర్గత రహదారుల నిర్మాణం, స్థల సమతలీకరణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ హరిప్రసాద్ మాట్లాడుతు ఏళ్ల తరబడి సమస్యలతో సతమతమవుతున్న సంతను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి, వ్యాపారులకు అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యమన్నారు. మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లావుడియా తిరుమల్, జిల్లా కార్యదర్శి కుసుమ చెన్నకేశవులు, పట్టణ అధ్యక్షుడు ఈదునూరు సాయికృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ కొనిజేటి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఉప సర్పంచ్ సింగం శ్రావణి ప్రశాంత్, గ్రామ కార్యదర్శి దయ్యాల సదానందం, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు హాజరయ్యారు.
సంత అభివృద్ధితో స్థానిక వ్యాపారాలకు ఊతం లభిస్తుందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
