ట్రాక్టర్ ప్రమాద మృతులను చూసి దిగ్భ్రాంతి చెందిన జువ్వాడి కృష్ణారావు

మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రి ని సందర్శించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు మహిళ కూలీల శవాలను చూసి దిగ్బ్రాంతి
మల్లాపూర్ ఫిబ్రవరి 4 నేటి ధాత్రి

 

మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదానికి గురై మరణించిన మహిళ వ్యవసాయ కూలీల శవాలను మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించారు ఆసుపత్రి లో శవాలను చూసిన జువ్వాడి కృష్ణారావు దిగ్భ్రాంతి కి గురయ్యారు నిన్న జరిగిన ప్రమాదంలో నలుగురుమహిళా వ్యవసాయ కూలీలు మరణించడం అత్యంత బాధాకరమని మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చూస్తామని ఈ సందర్భంగా కృష్ణారావు అన్నారు కృష్ణ రావు వెంట మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుండ్ర శ్రీనివాసరెడ్డి మాజీ జడ్పిటిసి సభ్యుడు జల పతిరెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు వార్ద సురేష్ మాజీ ఎంపిటిసి సభ్యులు మరిపెళ్లి మల్లయ్య మాట్ల సోమయ్య తదితరులు ఉన్నారు.

పదవ తరగతి బ్యాచ్ సహకారంతో దహణ సంస్కరణల కు సహాయం..

పదవ తరగతి బ్యాచ్ సహకారంతో దహణ సంస్కరణల కు సహాయం
మల్లాపూర్ ఫిబ్రవరి 2 నేటి ధాత్రి

మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామనికి చెందిన కదుర్కపు గంగరాజం గత ఇరవై ఎళ్ల క్రితం ఉపాది నిమిత్తం కోండగట్టు దేవస్థాన దగ్గర పని చేసుకుంటు జివనం కోనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో గత సంవత్సరంలో అనారోగ్యంతో గంగరాజం మరణించగ, బార్య,వారి కూమారుడు గణేష్ సిరికోండ లొ వారి బందువుల దగ్గర కూలి పని చేసుకుంటు జీవనం కోనసాగిస్తున్నారు.
అయితే కోద్ది రోజులుగ అనారోగ్యంతో బాధపడుతున్న గణేష్ ఆకష్మత్తుగా కళ్లు తిరిగి కింద పడగ నిన్న రాత్రి కోరుట్ల సివిల్ హస్పిటల్ జాయిన్ చేయ్యగ అప్పటికి మరణించడం జరిగింది అని తెలిపారు .
ఎవరు ముందుకు రాని పరిస్థితుల్లో
వారి తల్లి దిక్కుతోచని స్థిలో ఉండగా గణేష్ ఎస్సెస్సి 2008-09‌ బ్యాచ్ కి చెందిన దండుగుల అంజిరాజ్, చిగురు నాగరాజ్,‌మట్ట దిలిప్,‌లింగంపల్లి‌ జలంధర్, ఎస్ కె సాజిద్, రాజోజి రాకేష్,‌గుడురు వివెక్,లింగంపెల్లి లక్ణ్మణ్ దగ్గర ఉండి దహాన సంస్కరణలు దగ్గర ఉండి పూర్తి చేసి వారికి దాతల సహాకరంతో ఆర్థిక సహాయం చేయ్యడం జరిగింది.

గ్రామంలో మిషన్ భగీరథ నీటి కొరకు ముందడుగు వేసిన సర్పంచ్..

గ్రామంలో మిషన్ భగీరథ నీటి కొరకు ముందడుగు వేసిన సర్పంచ్

మల్లాపూర్ నేటి ధాత్రి

 

గుండంపల్లి గ్రామంలో మిషన్ భగీరథ నీరు గ్రామంలో ఏ ఒక్క ఇంటికి రావడం లేదు అని సర్పంచ్ దప్పుల పద్మ నరసయ్య ఎంపీడీవో కి సోమవారం విన్నవించగా మంగళవారం మిషన్ భగీరథ గ్రిడ్ ఎఇ జ్ఞానేశ్వర్, ఆర్డబ్ల్యూఎస్ ఎఇ మహేష్ గ్రామానికి విచ్చేసి నీరు రాకపోవడానికి గల సమస్యలను తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా సమస్యను పూర్తి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నారాయణరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పుష్పలత నరసయ్య,ఉప సర్పంచ్ గంగాధర్, సిరికొండ గంగారెడ్డి, మురళి, ముత్యాలు, రెబల్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version