పట్టణంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పురపాలక కమిషనర్ ఆదేశాలు.

పట్టణంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పురపాలక కమిషనర్ ఆదేశాలు.

కల్వకుర్తి, నేటిధాత్రి:

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణములోని పలు కాలనీలను సందర్శించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన పుర పాలక కమీషనర్ మహెముద్ షేక్ పట్టణంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తున్నందున పలు కాలనీలు వార్డులలో అనగా విద్యానగర్ కాలనీలో,గాంధీనగర్ కాలనీ లో, ఎల్లికల్ రోడ్డు నందు పర్యటించి సిబ్బందికి సూచనలు చేయడం జరిగింది. ఇట్టి విషయంలో పట్టణంలో భారీ వర్షం కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను కోరడం జరిగింది. పట్టణ పరిధిలో తాత్కాలిక నిర్మాణాలు లేదా పాడుబడ్డ భవనాలకు,విద్యుత్ స్తంబాలకు,పరికరాలకు దూరంగా ఉండాలని, కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లలో ఉండకూడదని ప్రజలకు సూచించడం జరిగింది. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే పురపాలక సంఘంఅత్యవసర టీంలకు ఫోన్ ద్వారా సంప్రదించాలని తెలియజేయడం జరిగింది.1. రంగన్న, సానిటరీ ఇన్స్పెక్టర్ 905954909,శివ, EE, 8184893646,3. యం. రాజు, జవాన్, 8341953311,4. B. శ్రీకాంత్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ 9494271888,5. అందరూ పారిశుధ్య జవాన్లుఅదేవిదంగా భారీ వర్షం కురుస్తున్నందున పుర పాలక సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించడం జరిగింది.

మున్సిపాలిటీ వార్డులను శాస్త్రీయంగా విభజించాలి.

మున్సిపాలిటీ వార్డులను శాస్త్రీయంగా విభజించాలి.

కల్వకుర్తి / నేటి ధాత్రి:

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కల్వకుర్తి మున్సిపాలిటీలోని వార్డులను క్రమ పద్ధతిలో శాస్త్రీయంగా విభజన చేయాలని బిజెపి నాయకులు కోరారు.ఆర్ డి ఓ ఆఫీస్ లో జరిగిన ఓటర్ లిస్ట్ అవగాహన సదస్సులో బిజెపి నాయకులు పాల్గొన్నారు. కల్వకుర్తి ఆర్డీవో గా నూతనంగా నియమింపబడిన ఎంపీ జనార్దన్ రెడ్డిని శాలువాతో సత్కరించారు తదనంతరం కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్ లిస్టులో గల పలు సమస్యలను లిఖితపూర్వకంగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ..మున్సిపాలిటీ పరిధిలో వార్డులను విభజించేటప్పుడు అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా విభజన చేయడం గతంలో జరిగింది, వార్డుల విభజన జరిగేటప్పుడు అన్ని పార్టీల సమ్మతి తీసుకోవాలి, బిఎల్వోలు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని వారిపై తగు చర్యలు చేపట్టాలని, తిలక్ నగర్ కాలనీ ప్రజలకు స్థానికంగానే పోలింగ్ బూతు ఏర్పాటు చేయాలని, ఒక ఇంట్లోని ఓట్లు అన్నీ కూడా ఒకే వార్డులో ఉండేలా చూడాలని,18 ఏళ్ళు నిండిన ప్రతి యువతీ యువకులకు వెంటనే ఓటర్ నమోదు కార్యక్రమం చేపట్టాలని,ఇంటి నెంబర్ల ప్రకారం కాకుండా బౌండరీల ప్రకారం వార్డులు ఏర్పాటు చేయాలని, పలు సూచనలు చేశారు పై సూచనలు దృష్టిలో పెట్టుకొని ఓటర్ లిస్టులు తయారు చేయాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని తెలియజేశారు…కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు గన్నోజు బాబిదేవ్,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్,జిల్లా ఉపాధ్యక్షులు బోడ నరసింహ, సీనియర్ నాయకులు, సూర్య కృష్ణ గౌడ్, నీరుకంటి రాఘవేందర్ గౌడ్, నరేడ్ల శేఖర్ రెడ్డి, సురేందర్ గౌడ్, పెద్దారి విజయ్, చందు ముదిరాజ్, పట్టణ ప్రధాన కార్యదర్శి నాప శివ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

కల్వకుర్తి పురపాలక అధికారుల…

కల్వకుర్తి పురపాలక అధికారుల
మోసాలకు అంతు లేదా…!

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

పని చేయని వారికి నెలనెలా జీతాలు… అధికంగా తైబజారు వసూళ్లు…
కల్వకుర్తి పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో పనిచేయని వ్యక్తులకు నెల నెల జీతాలు ఎలా…? అరెకంటి మహేశ్వరి ఆమె అచ్చంపేట వాస్తవ్యురాలు, ఆమె పురపాలక విధుల్లోకి చేరకుండానే కల్వకుర్తి పురపాలక కార్యాలయం ద్వారా ఆమె అకౌంట్లో నెల నెల రూ. 15,600లు గత 8 నెలలుగా ఆమెకు జీతం చెల్లిస్తున్నారు. ఆరెకంటి మహేశ్వరి గారు అదనపు కలెక్టర్ దేవ సహాయం (LBs) కార్యాలయ పరిధిలోని క్వాటర్స్ లో వంట మనిషిగా (అవుట్సోర్సింగ్) పనిచేస్తుంది. అలాంటిది ఆమెకు కల్వకుర్తి పురపాలక సంఘ అధికారుల వారు నేరుగా ఆమె అకౌంట్లో నెల నెల జీతం వేయడం విడ్డూరమని పట్టణవాసులు విడ్డూరంగా చర్చించుకుంటున్నారు.

 

 

ఇటీవలే పట్టణంలోని సామాజిక కార్యకర్త ఈ విషయాన్ని ప్రశ్నించగా, పురపాలక కమిషనర్ వారు అతనిని భయబ్రాంతులకు గురి చేయడమే కాకుండా, వారి యొక్క తాత్కాలిక కట్టడమైన చిన్న రేకుల షెడ్డును కూల్చి వేస్తానని దానికి పర్మిషన్ లేదని, వారికి నోటీసులు ఇవ్వకుండా వారి చిన్న రేకుల షెడ్డు గోడకు నోటిసు అతికించారు. తాత్కాలిక కట్టడాలకు పరిమిషన్లు అవసరం లేదని పురపాలక చట్టం 1965 & 2019 చెబుతుంది. ఆ విషయాలు కూడా తెలియని వారు పురపాలక కమిషనర్ గా పనిచేయడం వృతికే సిగ్గుచేటు అని పలువురు గుసగుసలాడుతున్నారు. అంతేకాకుండా చిరు వ్యాపారులు తైబజార్ పేరిట అధికంగా వసూలు చేస్తున్నారని అధికారులకు ఎంత విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని పట్టణ ప్రజలు విచారణ వ్యక్తం చేస్తున్నారు. పది రూపాయలు వసూలు చేయవలసిన వ్యాపారానికి 40 రూపాయలు తైబజార్ వసూలు చేయడం. అలాగే 30 రూపాయలు తైబజారు వసూలు చేయవలసిన టిఫిన్ సెంటర్లకు వంద రూపాయలు తైబజార్ వసూలు చేస్తున్నారు. పుర అధికారులకు ప్రజలు ఎన్నో మార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదు. ఈ తైబజార్ కాంట్రాక్టర్లపై చర్య తీసుకోవడం లేదని అధిక వసూలులో పురపాలక కమిషనర్ యొక్క పాత్ర ఎంతైనా ఉందని, అందుకే పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. ప్రతిరోజు వసూలు చేసిన డబ్బులను అవుట్సోర్సింగ్ లేక పర్మినెంట్ ఉద్యోగులు మేనేజర్ గారికి లెక్క కట్టి జమ చేయాలి, అలా జమ చేయకుండా రెండు నెలలు తన సొంత ఆసరాలకు వాడుకున్నందుకు దేవర్ల శ్రీనివాసును అప్పటి ఇప్పటి మేనేజర్ అయిన ఫాని రాజాకుమారి నూరీ గారు అతనిని సస్పెండ్ చేయించి, ఒక ఇంక్రిమెంట్ కట్ చేసి కొల్లాపూర్ కు ట్రాన్స్ఫర్ చేయించినారు. 68 లక్షల ఒక సంవత్సరం పాటు వాడుకొని అరకొర జమ చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో మేనేజర్ ఫణి రాజకుమారి నూరి గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని పట్టణ ప్రజలు వాపోతున్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version