రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబి ) వెడల్పు పెంపు వినతి పత్రం అందజేసిన…

రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబి ) వెడల్పు పెంపు వినతి పత్రం అందజేసిన

కాప్రా నేటిధాత్రి

 

ఎన్ ఎఫ్ సి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబి ) వెడల్పు పెంపు అవసరం కోసం మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ని సోమవారం శామీర్ పేట లో వారి నివాసంలో కలిసిన వినతి పత్రం అందజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
స్థానిక కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి.
ఈ సందర్భగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఈ వంతెనను సుమారు 45 సంవత్సరాల క్రితం అప్పటి అవసరాలకు అనుగుణంగా నిర్మించారు.
ప్రాంతంలో జనాభా వేగంగా పెరగడం, కొత్త కాలనీలు విస్తరించడంతో ప్రస్తుతం ఈ వంతెన ట్రాఫిక్‌ను మోయలేకపోతోంది. ఇది హబ్సిగూడా నుండి ఈసీఐఎల్‌కు, బోడుప్పల్ నుండి ఈసీఐఎల్‌కు వెళ్లే ప్రధాన మార్గం కావడంతో రోజూ వేలాది మంది ప్రయాణికులు దీనిపై ఆధారపడుతున్నారు.
వంతెన వెడల్పు తక్కువగా ఉండడం వల్ల తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి, స్థానిక ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, చిన్న పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల రోజువారీ జీవితం తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు అవసరం.
ఈ పనుల కోసం ప్రత్యేక రైల్వే అభివృద్ధి ప్రణాళిక (ఎస్ ఆర్ డి పి ) కింద నిధులు ఇప్పటికే విడుదలైనట్లు నా దృష్టికి వచ్చింది.
అందువల్ల, దయచేసి ఈ విషయాన్ని పరిశీలించి ఎన్ ఎఫ్ సి రైల్వే ఓవర్ బ్రిడ్జి వెడల్పు పెంపుకు అనుమతి ఇవ్వగలరని మనవి. దీనివల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులు తగ్గుతాయి అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్..

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్

కాప్రా నేటిధాత్రి

 

 

మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో భాగంగా చర్చ్ నీ సందర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు, క్రైస్తవ సోదర, సోదరీమణులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమా భావాన్ని, సేవాతత్పరతను , క్షమా గుణాన్నీ బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా సుఖసంతోషాలతో క్రిస్మస్ వేడుక జరుపుకోవాలని ఆకాంక్షించారు. యేసు క్రీస్తు దీవెనలు ప్రతి ఒక్కరికీ లభించాలని, అందరూ సంతోషంగా జీవించాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు శ్రీనివాస్ రెడ్డి, గొల్లురీ అంజయ్య , బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు గుమ్మడి జంపాల్ రెడ్డి , పాస్టర్ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

సాకేత్ కాలనీ అభివృద్ధి కి అన్ని విధాలా కృషి చేస్తా…

సాకేత్ కాలనీ అభివృద్ధి కి అన్ని విధాలా కృషి చేస్తా

– ఉప్పల్ ఎమ్మెల్యే బండారి

కాప్రా నేటిరాత్రి

 

 

ఉప్పల్ నియోజకవర్గంలోని
సాకేత్ కాలనీ అభివృద్ధి కి అన్ని విధాలా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు.
బుధ వారం కాప్రా డివిజన్ పరిధిలోని సాకేత్ కాలనీ లో రోడ్డు నీ అలాగే స్టీమ్ వాటర్ డ్రైన్ నీ 44 లక్ష రూపాయల నిధులతో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో
బీఆర్ఎస్ పార్టీ నాయకులు భైరీ నవీన్ గౌడ్, సాకేత్ కాలనీ అధ్యక్షులు జిఎస్‌రావు, జాయింట్‌ సెక్రటరీ రవీందర్‌రావు, కోశాధికారి చంద్రశేఖర్‌, రాజేశ్వర్‌రావు, నిరంజన్‌రావు, జగన్‌నాథరావు, శ్రీనివాసరావు, సాకేత్‌ స్వర్ణ అధ్యక్షులు సురేందర్‌రెడ్డి, కళ్యాణ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version