90 లక్షలతో సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.
చిట్యాల, నేటిదాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని చిట్యాల మండలం కేంద్రములో శనివారం రోజున 90 ల క్షలతో సిసి రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని అందులో భాగంగానే చిట్యాల లోని వెంకట్రావుపల్లి మోడల్ స్కూల్ దగ్గర 20 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణానికి అలాగే చిట్యాల బస్టాండ్ నుండి చలివాగు స్మశాన వాటిక వరకు సిసి రోడ్ నిర్మాణానికి 70 లక్షలతో శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు , ఈ కార్యక్రమం లో ఎంపీడీవో జయశ్రీ, పంచాయితీ రాజ్ అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి కిష్టయ్య,jజిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మధు వంశీకృష్ణ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అల్లకొండ కుమార్, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు గంగధరి రవీందర్, మాజీ ఎంపిటిసి లు కట్కూరి పద్మ నరేందర్, గుర్రం తిరుపతి, కాంగ్రెస్ నాయకులు బుర్రలక్ష్మణ్ గౌడ్, చిలుముల రాజమౌళి గుర్రపు నరసయ్య, మార్కండేయ, అల్లంరాజు అల్లంరాజు శనిగరపు మొగిలి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
