బుగులోని జాతర పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జీఎస్సార్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-15T133352.737.wav?_=1

 

బుగులోని జాతర పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

బుధవారం రేగొండ మండలం తిరుమలగిరిలో బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
గండ్ర సత్యనారాయణ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎస్సార్
మాట్లాడుతూ రెండు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మెట్ల వెడల్పు , కోనేరు, మంచినీరు బావి పనులకు మంజూరి ఇవ్వడం జరిగిందని కొత్తపల్లి నుండి బుగులోని జాతరకు రోడ్డు, తిరుమలగిరి నుండీ బుగులోని జాతర వరకు రోడ్డు జగ్గయ్య పేట నుండి బుగులోని జాతర వరకు రోడ్డు నిర్మాణ పనులకు 5.5 కోట్ల రూపాయలతో మంజూరు ఇవ్వడం జరిగిందని ఇట్టి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు గుత్తేదారులకు సూచించారు

అనంతరం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకుని దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసినారు. అనంతరం దేవాలయం నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో బుగులోని జాతర చైర్మన్ గంగుల రమణ రెడ్డి భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుతోజ్ కిష్టయ్య, ఎన్ ఎస్ ఆర్ సంస్థల అధినేత నాయినేని సంపత్ రావు పంచాయతీ రాజ్ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు, ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులు, ఫారెస్ట్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version