సులబ్ కాంప్లెక్ నిర్మాణం కొరకు MPDO గారికి వినతి పత్రం అంద చేసిన బీజేపీ నాయకులు *
తాండూరు ( మంచిర్యాల ) నేటి ధాత్రి:
కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని శనివారం సంత సమీపంలో సులబ్ కాంప్లెక్ కి అనుమతి చ్చింది.నిధులు కూడా మంజూరు అయినవి.నిర్మాణం కోసం ముగ్గు పోసి అక్కడికే వదిలేశారని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు దుడపాక భరత్ కుమార్ మండిపడ్డారు. గత కొన్ని సంవత్సరాలుగా శనివారం సంతకు వచ్చె చుట్టూ పక్కల మండలాల ప్రజలు, పలు గ్రామాల ప్రజలు కూరగాయలు అమ్మే వారికి చాలా ఇబ్బంది కరంగా ఉందని వాటిని వెంటనే నిర్మించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని భారతీయ జనతా పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాము. సులబ్ కాంప్లెక్ నిర్మాణం ఆలస్య విషయంలో స్థానిక ప్రజాప్రతినిధుల హస్తం ఉందని ప్రజలు బావిస్తున్నారు. ప్రజల అవసరాలు గుర్తించి వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అలాగే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా చూడాలని భారతీయ జనతా పార్టీ తరుపున అధికారులను కోరడం జరిగింది.. ఈ కార్యక్రమంలో తాండూర్ మండల ప్రధాన కార్యదర్శులు మామిడి విఘ్నేష్, పుట్ట కుమార్, ఉప అధ్యక్షులు రేవెల్లి శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ సభ్యులు రామగౌని మహీధర్ గౌడ్, ఎక్స్ వార్డ్ మెంబర్ బీజేపీ సీనియర్ నాయకులు ఉప్పుట్ల దుర్గాచరణ్, బిజెవైఎం మండల ప్రధాన కార్యదర్శి అరికెల శంకర్, 126 బూత్ అధ్యక్షులు సలాది శ్రీకాంత్ , యువమోర్చా కార్యకర్త రెవెల్లి లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు….