ప్రెస్ క్లబ్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీడీవో
గంగాధర నేటిధాత్రి :
గంగాధర మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ పనులను ఎంపీడీవో దమ్మని రాము, ఎంపీఓ గౌరీ రమేష్ మంగళవారం పరిశీలించారు. మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ నిర్మాణ పనులు పూర్తయితే ప్రెస్ మీట్ లు పెట్టడానికి అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారంతో భవన నిర్మాణ పనులు చేస్తున్నట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జారతి రాజిరెడ్డి తెలిపారు. ప్రెస్ క్లబ్ నిర్మాణానికి ప్రత్యేక చొరవ చూపుతున్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాజిరెడ్డి, సభ్యులను ఎంపీడీవో, ఎంపీ ఓ అభినందించారు. ఇక్కడ పంచాయతీ కార్యదర్శి జిల్లెల్ల లచ్చయ్య తదితరులు ఉన్నారు.