విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలి…

విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం. కేజీబీవీ. ను. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్. ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మేడం. విద్యాలయంలో ఆరుబయట విద్యార్థులతో కూర్చొని పలు అంశాలపై చర్చించారు. ముందుగా స్టోర్ రూమ్ను సందర్శించి విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలని. కోడిగుడ్లు. కూరగాయలు పరిశీలించారు . ఈ సందర్భంగా విద్యార్థుల్లో పాటు కింద కూర్చొని మెనూ ప్రకారం చికెన్ మటన్ కోడిగుడ్డు ఇస్తున్నారా అని ఆరా తీశారు పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని వివరిస్తూ పర్యావరణ భవిష్యత్తు ప్రణాళికల అంశాలపై చర్చించారు. తద్వారా పాఠశాల విద్యాలయం ఆవరణలో 9వ తరగతి విద్యార్థులకు బయో సైన్స్ లోని. ఫోటో సింథసిస్. పై వివరించారు విద్యార్థులందరూ చదువుపై శ్రద్ధ పెట్టాలని ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు తాము అనుకున్న ఉద్యోగాలు ఉన్నత స్థానాలకు ఎదగాలని ఈ సందర్భంగా విద్యార్థులందరికీ పిలుపునిచ్చారు ఆర్థికంగా కూడా స్థిరపడాలని ఆకాంక్షించారు. అలాగే తల్లిదండ్రులు మీ భవిష్యత్తు పై పెట్టుకున్న ఆశలు నెరవేర్చాలని. విద్యాలయం ఆవరణం నిత్యం పరిశుభ్రంగా ఉండాలని ఏవైనా ఇబ్బందులు ఉన్నాయని ఆరా తీశారు. ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని తద్వారా డి ఈ ఓ.ను. ఇన్చార్జి కలెక్టర్. గరీమాఅగ్రవాల్. ఆదేశించారు ఇట్టి కార్యక్రమంలో. కేజీబీవీ. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

కోరికిశాల కస్తూర్బా పాఠశాలను సందర్శించిన…

కోరికిశాల కస్తూర్బా పాఠశాలను సందర్శించిన ఏఐఎస్ఎఫ్ బృందం

ఎస్ఓ ను తక్షణమే సస్పెండ్ చేయాలి
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోత్కు ప్రవీణ్ కుమార్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగులపల్లి మండల కేంద్రంలోని కొరికిశాల కస్తూర్బా పాఠశాలను ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్తుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఎస్ఓ, వర్కర్ల నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థకు గురై ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు.
గతంలో విద్యార్థులు పలుసార్లు భోజనం బాగాలేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని ఎస్ఓ దృష్టికి తీసుకువచ్చిన ఏం మాత్రం పట్టించుకోకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని తెలిపారు మరలా ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు తక్షణమే బాధ్యత వహించి అన్ని కస్తూర్బా పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టలను ఎమ్మెల్యే, కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు పర్యటించాలని కోరారు.
కస్తూర్బా పాఠశాల విద్యార్థులను అడిగి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది అని అన్నారు. వారి సమస్యలపై పోరాటాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్, జిల్లా అధ్యక్షులు రేణికుంట్ల ప్రవీణ్ దొంతర బోయిన అజయ్ రాజేష్ పవన్ రత్న రమాకాంత్ కన్నురి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version