జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఉద్యోగులు…

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఉద్యోగులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్లో సెలెక్ట్ అయిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉద్యోగులు.
ప్రతి సంవత్సరం జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే క్రీడా పోటీలలో భూపాలపల్లి జిల్లాకు చెందిన ఉద్యోగు లు జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సిహెచ్ రఘు తెలిపారు.

 

 

ఖో ఖో క్రీడా లో సి హెచ్ ఆనంద్, ఫిజికల్ డైరెక్టర్ టేకుమాట్ల, కబడ్డీ క్రీడకు గాన సిహెచ్ సరస్వతి ఫిజికల్ డైరెక్టర్ జెడ్ పి హెచ్ ఎస్ తాడిచర్ల, వాలీబాల్ క్రీడకు గాని కే జ్యోతి ఫిజికల్ డైరెక్టర్, జెడ్ పి హెచ్ ఎస్, మహా ముత్తారం, కే మమత ఫిజికల్ డైరెక్టర్, జెడ్ పి హెచ్ ఎస్, పెద్దాపూర్, పాపికొండలు జి విజయలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్, జి పూర్ణిమ ,ఫిజికల్ డైరెక్టర్, జడ్.పి.హెచ్.ఎస్, మహాదేవపూర్ గర్ల్స్, కే మమత ఫిజికల్ డైరెక్టర్ జెడ్ పి హెచ్ ఎస్ పెద్దాపూర్, అథ్లెటిక్స్ క్రీడకి గాను సిహెచ్ సరస్వతి ఫిజికల్ డైరెక్టర్, హెచ్ రమేష్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అజామ్ నగర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, చెస్ క్రీడకి గాను బీ.కొమలత, ఎస్ జి టి, ఎం పి పి ఎస్ కేశవాపూర్, స్పందన ,ఎస్ జి టి, ఎంపీపీ ఎస్ ఎల్కేశ్వరం.
జాతీయస్థాయి క్రీడలకు ఎంపికైన ఉద్యోగులకు క్రీడా శాఖ తరుపున అభినందనలు, జాతీయ స్థాయి లో జిల్లా కి క్రీడా లలో మంచి పేరు తేవాలి అని ఆకాక్షించారు.
సి హెచ్ రఘు, తెలిపారు

సమయపాలని పాటించని ఉద్యోగులపై కలెక్టర్ కొరడా..

సమయపాలని పాటించని ఉద్యోగులపై కలెక్టర్ కొరడా..

కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల కార్యాలయాలు ఆకస్మిక తనికిలు…

ఎన్.ఐసి కార్యాలయ పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్..

కలెక్టర్ తనిఖీలతో అధికారులు,సిబ్బంది హడల్…

హాజరు పట్టికల పరిశీలించి సమయానికి రాని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిఆర్ఓ ను ఆదేశించిన కలెక్టర్..

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..

రామాయంపేట ఆగస్టు 30 నేటి ధాత్రి (మెదక్)

 

 

ఉద్యోగులందరూ బాధ్యతగా పనిచేసినప్పుడే శాఖల పనితీరు మెరుగుపడి ప్రజలకు ఉత్తమ సేవలో అందించినవారు అవుతామని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.
శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖలు కార్యాలయాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు రెవిన్యూ కార్యాలయంతో పాటు
అవుట్వాడ్ ఇన్వార్డ్ సెక్షన్, ఖజానా శాఖ కార్యాలయం, ఎన్.ఐసి కార్యాలయం తనిఖీ హాజరు పట్టికని పరిశీలించి 11:30 అవుతున్న కొంతమంది సిబ్బంది విధులకు రాలేదని ఈ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఎన్.ఐసి కార్యాలయ పనితీరు
బాగోలేదని అధికారి విధుల్లో ఉండాల్సిన ఉద్యోగి కలెక్టర్కు సమాచారం ఇవ్వకుండా సెలవు పై వెళ్ళటం పై అసహనం వ్యక్తం చేశారు
మెమో జారీ చేయాలని డిఆర్ఓ ఆదేశించారు. ఖజానా శాఖ కార్యాలయం తనిఖీ చేస్తూ పెన్షన్ మంజూరులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు , ఖజానా శాఖ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు.సిబ్బంది హాజరు పట్టిక పరిశీలిస్తూ సమయపాలన పాటించని ఉద్యోగులపై
మెమో లు జారీ చేయాలన్నారు.

 

సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ తమ కర్తవ్య బాధ్యత లను
చిత్త శుద్ధితో నిర్వహించాలని , ఉదయం 10:30 కల్లా కార్యాలయాలకు చేరుకుని క్రమశిక్షణగా విధులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో బాధ్యతారాహిత్యం తగదు అన్నారు
వివిధ శాఖల అధికారుల ఉన్నతాధికారుల ఆదేశాలు బేకాతర చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ భుజంగరావు, ఏవో యూనస్, కలెక్టరేట్ కార్యాలయ అకౌంటెంట్ పరమేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version