ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించిన జడ్పీ సీఈవో.
నడికూడ,నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా జడ్పీ సీఈవో రవి నడికూడ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇల్లును పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో జీ.విమల మాట్లాడుతూ మండల పరిషత్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకున్నదని వర్షాలు కురవడంతో పైకప్పు పెచ్చులు వూడి పడుతుండటంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారని సీఈఓ కు వివరించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.