సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవం..

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవం

కేసముద్రం/ నేటి ధాత్రి

 

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వివేకవర్ధిని హై స్కూల్లో శనివారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ యాకాంతం గౌడ్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళా విద్యకు పునాది వేసిన మహనీయురాలని పేర్కొన్నారు. మహిళలకు విద్య లేకుండా సమాజ అభివృద్ధి సాధ్యం కాదన్న ఆలోచనతో ఆమె చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శమని తెలిపారు.

మహిళలు విద్య, ఆత్మవిశ్వాసం, ధైర్యంతో ముందుకు సాగాలని, ప్రతి విద్యార్థిని సావిత్రిబాయి పూలే ఆశయాలను ఆచరణలో పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని సావిత్రిబాయి పూలే సేవలను స్మరించుకున్నారు.

చదువు కోసం పోరాడిన అక్షర జ్యోతి…

చదువు కోసం పోరాడిన అక్షర జ్యోతి…

దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే

ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

శనివారం కేసముద్రం మండలంలోని కల్వల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదటగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మధ్య యుగపు చీకటి రోజులలో సమాజం అందాకారంలో బంధించబడి పరిస్థితులు ఉన్న రోజులవి అన్నారు. మూడవిశ్వాసాలతో, సాంఘిక దురాచారాలతో వెలుగొందితూ.. స్త్రీలకు చదువుకునే అవకాశం లేక, స్త్రీలు అనగదొక్కబడుతున్న కాలంలో… భర్త జ్యోతిబాపూలే సహకారంతో చదువుకొని భారత దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా పేరు గాయించిందని పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే 1848లో పూణేలో మొదటి బాలిక పాఠశాలలను స్థాపించింది. స్త్రీ విద్యకు పునాది వేయడం జరిగింది. పుస్తకం పట్టిన చేతులు భవిష్యత్తును మార్చగలరని, అందాకారాన్ని చీల్చన విద్యా దీపం అని కొనియాడారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థి నీలంతా బాగా చదువుకొని సమాజ సేవలో నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులైన కే పార్వతి, రాధాదేవిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం బి సత్యనారాయణ, తండ సదానందం, వేముల నాగేందర్, రాగి బిక్షపతి, మహంకాళి యాకాంబరం, వి రాజేంద్ర చారి, బి బాలాషోరెడ్డి, కే రాములు, ఎం శ్రీనివాస్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్ ఏ కొప్పుల శంకర్, కె పార్వతి, ఎండి జుబేర్ అలీ, ఓడపల్లి రాము, జి నాగరాజు, ఏ లింగయ్య, ఎస్ సునీల్, ఎస్ రాధాదేవి మరియు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సావిత్రి బాయి పూలె జయంతి.

ఘనంగా సావిత్రి బాయి పూలె జయంతి.

చందుర్తి, నేటిధాత్రి:

 

 

 

ఈరోజు భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, మహానీయ సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని PM SHRI MPPS చందుర్తి పాఠశాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాలలో సేవలందిస్తున్న ఉపాధ్యాయినిలైన
వేముల సుజాత, జ్యోతి, స్వప్న, హేమలత ను ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని వేముల సుజాత మాట్లాడుతూ,

“సావిత్రిబాయి పూలే మహిళా విద్యకు మార్గదర్శకురాలు. ఆమె చేసిన పోరాటాలు, సేవలు నేటి ఉపాధ్యాయులకు స్ఫూర్తిదాయకం. బాలికల విద్యను మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది”
అని పేర్కొన్నారు.

ఆమె మహిళా సాధికారత, సమానత్వం, విలువలతో కూడిన విద్య ప్రాముఖ్యతను వివరించారు. సావిత్రిబాయి పూలే జీవితం విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాచకొండ ప్రసాద్, గుఱ్ఱం బాలకిషన్, కొత్తూరి శ్రీధర్, రాకం రవి, మరియు కాపిల్ల నరేష్ లు పాల్గొని, సన్మానం పొందిన ఉపాధ్యాయినిలను అభినందించారు. అలాగే సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా, విజయవంతంగా ముగిసింది.

విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలి…

విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం. కేజీబీవీ. ను. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్. ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మేడం. విద్యాలయంలో ఆరుబయట విద్యార్థులతో కూర్చొని పలు అంశాలపై చర్చించారు. ముందుగా స్టోర్ రూమ్ను సందర్శించి విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలని. కోడిగుడ్లు. కూరగాయలు పరిశీలించారు . ఈ సందర్భంగా విద్యార్థుల్లో పాటు కింద కూర్చొని మెనూ ప్రకారం చికెన్ మటన్ కోడిగుడ్డు ఇస్తున్నారా అని ఆరా తీశారు పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని వివరిస్తూ పర్యావరణ భవిష్యత్తు ప్రణాళికల అంశాలపై చర్చించారు. తద్వారా పాఠశాల విద్యాలయం ఆవరణలో 9వ తరగతి విద్యార్థులకు బయో సైన్స్ లోని. ఫోటో సింథసిస్. పై వివరించారు విద్యార్థులందరూ చదువుపై శ్రద్ధ పెట్టాలని ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు తాము అనుకున్న ఉద్యోగాలు ఉన్నత స్థానాలకు ఎదగాలని ఈ సందర్భంగా విద్యార్థులందరికీ పిలుపునిచ్చారు ఆర్థికంగా కూడా స్థిరపడాలని ఆకాంక్షించారు. అలాగే తల్లిదండ్రులు మీ భవిష్యత్తు పై పెట్టుకున్న ఆశలు నెరవేర్చాలని. విద్యాలయం ఆవరణం నిత్యం పరిశుభ్రంగా ఉండాలని ఏవైనా ఇబ్బందులు ఉన్నాయని ఆరా తీశారు. ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని తద్వారా డి ఈ ఓ.ను. ఇన్చార్జి కలెక్టర్. గరీమాఅగ్రవాల్. ఆదేశించారు ఇట్టి కార్యక్రమంలో. కేజీబీవీ. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version