7వ డివిజన్‌లో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు..

7వ డివిజన్‌లో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు..

#ఎమ్మెల్యే నాయిని సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం..

హన్మకొండ, నేటిధాత్రి:

 

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 7వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. బీజేపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తోట పవన్ ఆధ్వర్యంలో సుమారు 30 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. రానున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో 7వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఎల్పుల మల్లికార్జున్ (మల్లి), గోపగోని సాయి గౌడ్, వై శ్రీనివాస్, పుల్యాల వంశీ, కుందూరు ప్రశాంత్, ఉదయ్ గౌడ్, సర్వర్, తరుణ్, రాకేష్, భాను తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అత్యవసరమైన ప్రతి పనిని పూర్తి చేస్తున్నాం..

అత్యవసరమైన ప్రతి పనిని పూర్తి చేస్తున్నాం..

#రెండేళ్లలో కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ధి పనులు..

#58 డివిజన్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే..

#57 వ డివిజన్ గోకుల నగర్ ప్రాంతంలో కమిషనర్ తో కలిసి పరిశీలన …

హన్మకొండ, నేటిధాత్రి:

 

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ ఈ రోజు 58 వ డివిజన్ పరిధిలోని స్నేహ నగర్ లో అంతర్గత రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసారు.గడిచిన కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగరంలో అత్యవసర ప్రాంతాలకు గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలు,నివారణ చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే నాయిని పేర్కొన్నారు. ఏబీసీ లుగా పనులను గుర్తించి ఒక్కటిగా చేస్తున్నామని తెలిపారు.వర్షాలలో సైతం నగరంలో ఒకటి రెండు ప్రాంతాలలో తప్ప ఎటువంటి ఇబ్బందులు లేవని ప్రతి కార్యక్రమంలో ప్రజల సహకారం వలనే సాధ్యమైందని అన్నారు.
నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆదేశించారు.ఈ మేరకు 57 వ డివిజన్ గోకుల్ నగర్ ప్రాంతంలో నగర కమిషనర్ శ్రీమతి చాహత్ బాజ్ పాయ్ తో కలసి ప్రాంతాలను పరిశీలించారు.వరద ప్రవాహానికి అడ్డుగా ఉండే ప్రాంతాలకు గుర్తించి పరిష్కార మార్గాలను చూడాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు,అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version