హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా చూడండి
– బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
సిరిసిల్ల (నేటి ధాత్రి):
వేములవాడ ఆలయంలో అభివృద్ధి పనుల్లో భాగంగా కోటిలింగాలను అక్కడి నుండి మార్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆలయ ప్రాంగణంలో ఇతర మతస్తుల నిర్మాణాలు కూడా ఉన్నవి వాటిని జరపకుండా కోటిలింగాలను మాత్రమే జరపాలని ప్రయత్నం చేస్తున్నారని దీనివలన హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ (విటిఏ.డి.ఏ) వైస్ చైర్మన్ కి మంగళవారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కనుక ముందుగా దర్గాను తొలగించిన తర్వాత ఏ కార్యక్రమమైన చేపట్టాలని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరపున జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బండ మల్లేశం, సంతోష్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజు రెడ్డి, జిల్లా కార్యదర్శి గొప్పడి సురేందర్రావు, జిల్లా మీడియా కన్వీనర్ కాసుగంటి రాజు రావు, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, వివిధ మండలాల అధ్యక్షులు వేణుగోపాలరావు, కోడె రమేష్, మిర్యాల్కార్ బాలాజీ, రాపెల్లి శ్రీధర్, బురుగుపల్లి పరమేష్, సౌల క్రాంతి, బిజెపి సీనియర్ నాయకులు గజ బింకర్ చందు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
