పంచాయతీ ఎన్నికలు..

పంచాయతీ ఎన్నికలు.. BIG UPDATE

TG: పంచాయతీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న అభ్యర్థులు లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉన్న రూల్‌ను రద్దు చేసే ఛాన్సున్నట్లు సమాచారం. పంచాయతీరాజ్ చట్టం-2018 సెక్షన్ 21(3)ని తొలగించే ప్రతిపాదనను క్యాబినెట్ ముందు ఉంచనున్నట్లు చర్చ మొదలైంది. BCలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటే ఈ మార్పు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల సాధనే లక్ష్యంగా పని చేస్తున్నాం..

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల సాధనే లక్ష్యంగా పని చేస్తున్నాం..

*ఏ.పీ. సర్వతో ముఖాభివృద్ధికి కేంద్రం సహకరిస్తున్న తీరు అభినందనీయం..

*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..

చిత్తూరు (ఢిల్లీ)
నేటి ధాత్రి) ఆగస్ట్ 01:

ఆంధ్రప్రదేశ్ హక్కులు, ప్రయోజనాల సాధనే లక్ష్యంగా
ఏపీ కూటమి ఎంపీల బృందం పనిచేస్తుందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ఓ ప్రకటనలో తెలియజేశారురాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఢిల్లీ పార్లమెంటు సమావేశాలు హాజరైన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ…, ఏ.పీ. సర్వతో ముఖాభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం.., శాఖల వారీగా.., అందిస్తున్న తోడ్పాటు అభినందినీయమని ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో కొనియాడారు. ఇదే మోడీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు.., ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో చిత్తూరు పార్లమెంట్ ను ప్రగతి పథం వైపు అడుగులేయించాలన్నదే తన సంకల్పమన్నారు.ఈ నేపథ్యంలోనే లోకసభలో ఏపీ కూటమి ఎంపీల బృందం తమ వాణిని వినిపిస్తోందన్నారు.
ఏరోస్పేస్ ఇండస్ట్రీ,స్పేస్ సిటీ, పోలవరం-బనకచర్ల, హంద్రీనీవాకు సంబంధించిన అంశాలను పార్లమెంటులో లేవనెత్తి. కార్యరూపం దాల్చేవ్విధంగా ప్రయత్నం చేస్తున్నామన్నారు.
అదేవిధంగా రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు వంటి విషయాలను ఎన్డీఏ సర్కార్ ముందుంచి, ఫలితాలను రాబట్టే దిశగా ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు.
అమరావతి అభివృద్ధికి సహకారం. మామిడిరైతుల సమస్యకు పరిష్కారమైన మార్గమైన మ్యాంగో బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్ ను కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, మామిడి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు,వారి కలను సాకారం చేసే దిశగా కృషి చేస్తున్నట్లు చిత్తూరు ఎంపీ వివరించారు.

వివాహ వేడుకలలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నేత..

వివాహ వేడుకలలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నేత

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి పట్టణంలో లో పాత మార్కెట్ యార్డ్ శ్రీ గణపతి దేవాలయం అధ్యక్షులు మారం బాలకృష్ణ కూతురు వివాహ వివాహ వేడుకలకు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నేత నాగబంది యాదగిరి దంతులు పాల్గొన్నారు ఈ మేరకు మారం బాలకృష్ణను శాలువతో ఘనంగా సన్మానం చేశారు నూతన వదువరులను నాగబంది యాదగిరి దంపతులు ఆశీర్వదించారు

ఉదృతమైన చేర్యాల రెవెన్యూ డివిజన్ అంశం.

ఉదృతమైన చేర్యాల రెవెన్యూ డివిజన్ అంశం

ఆగస్టు 12 విద్యాసంస్థల బంద్ పిలుపునిచ్చిన జేఏసీ

జేఏసీ చైర్మన్ డా. ఆర్. పరమేశ్వర్

చేర్యాల నేటిదాత్రి

చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకు పోరాటాలు తారాస్థాయికి చేరుకున్నాయి కొమురవెల్లి మద్దూరు దుల్మిట్ట కొమురవెల్లి మండలాలను కలుపుతూ రెవెన్యూ డివిజన్ చేయాలని చాలా సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నారు దీనిలో భాగంగా జేఏసీ బందుకు పిలుపునివ్వడం జరిగినది ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినందున మరింత ఉదృతంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని జేఏసీ భావించింది దానిలో భాగంగా ఈనెల ఆగస్టు 12వ తేదీ విద్యాసంస్థల బందుకు పిలుపునిచ్చారు ఇచ్చే ప్రతీ పిలుపును ప్రజల పిలుపుగా భావించి రెవెన్యూ డివిజన్ సాధన కోసం జరిగే జేఏసీలో ప్రజలు భాగస్వాములు కావాలని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం చేర్యాల మండల కేంద్రంలోని జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల విస్తృత సమావేశానికి ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక, ఆకాంక్షను నెరవేర్చడం చేర్యాలకు పూర్వ వైభవాన్ని సాధించి రానున్న భవిష్యత్తు తరాలకు చేర్యాల ప్రాంతం యొక్క ఔన్నత్యం సామాజిక, రాజకీయ నేపథ్యం పరిపాలన యొక్క గొప్పతనాన్ని రేపటి తరాలకు కళ్లకు కట్టినట్లుగా చూపిస్తూ మనసారా ఆస్వాదించడానికి మాత్రమే ఆగస్టు12న విద్యాసంస్థల బంద్ కు పిలుపునిస్తున్నామని పేర్కొన్నారు. కావున నాలుగు మండలాల పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల బంద్ కు ఉపాధ్యాయులు, యజమాన్యాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిలుపును ప్రజల పిలుపుగా భావించి అందరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు అందె అశోక్, అందె బీరయ్య, బుట్టి సత్యనారాయణ, పిల్లి చంద్రం, కత్తుల భాస్కర్ రెడ్డి, జంగిలి యాదగిరి, పోలోజు వెంకటాద్రి, పొన్నబోయిన మమత, కుడిక్యాల బాలమోహన్, వలబోజు నర్సింహ చారి, పెండ్యాల రాజు, పోనుగోటి శ్రీనివాస్ రెడ్డి, కవ్వం నారాయణ రెడ్డి, గడిపే రవి, కర్రె నర్సిరెడ్డి, పీ. శ్రీనివాస్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

రాష్ట్ర మున్నూరుకాపు సంఘము కార్యనిర్వాహక కార్యదర్శి..

రాష్ట్ర మున్నూరుకాపు సంఘము కార్యనిర్వాహక కార్యదర్శి గా
జంగిలి శ్రీనివాసరావు

గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రానికి చెందిన జంగిలి శ్రీనివాసరావు ను రాష్ట్ర మున్నూరుకాపు సంఘము కార్యనిర్వాహ కార్యదర్శి గా రాష్ట్రా మున్నూరుకాపు సంఘము గౌరవ అధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర(రాజసభ సభ్యులు) రాష్ట్ర అధ్యక్షులు పుట్టాం పురుషోత్తమ్ రావు నియామక పత్రం శ్రీనివాసరావు కు అందించారు పురుషోతమ్ రావు మాట్లాడుతూ సంఘానికి ఎంతో సమయం వెచ్చినించి పాటుపడే వ్వక్తి శ్రీనివాసరావు అని అన్నారు అందరు కులం కోసం కొంత సమయాన్ని కేటాయించాలని కోరారు ఇట్టి కార్యక్రమం లో మాజీ విప్ వినయభాస్కర్ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన…

బిఆర్ఎస్ రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన
మాజీ ఎమ్మెల్యే

మొగులపల్లి నేటి ధాత్రి
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో :27/07/2025 న తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు భూపాలపల్లి నియోజకవర్గానికి విచ్చేస్తున్న సందర్భంగా మొగుళ్ళపల్లి మండలం, ఇస్సిపేట గ్రామ వాస్తవ్యులు మాజీ సర్పంచ్ కీ.శే కొడారి కొమురయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించి, అనంతరం మొగుళ్ళపల్లి లక్ష్మి సాయి గార్డెన్స్ నందు మండల ముఖ్య నాయకులతో కేటీఆర్ పర్యటన ఏర్పాట్లు మరియు కార్యకర్తల సమీకరణ పై సమీక్షా నిర్వహించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి.
వారి వెంట మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

బోరు మంజూరు చేసినందుకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రికి కృతజ్ఞతలు..

బోరు మంజూరు చేసినందుకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రికి కృతజ్ఞతలు

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామంలో అడగగానే బోర్ మంజూరు చేపిచ్చిన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో శాలివాహన సంఘం నాయకులు, తిర్మలాపూర్ గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యులు, రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ కేంద్ర హోంశాఖ సహాయమంత్రికి విన్నవించుకోగానే నిధులు మంజూరు చేశారని, నిధులు మంజూరు చేయడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యం కృషి చేస్తున్నారని, కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని వారు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని,బీజేపీ తోనే కేంద్ర ప్రభుత్వంతోనే అభివృద్ధి జరుగుతున్న విషయాన్ని ప్రజలు గమనించాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, సీనియర్ నాయకులు తడగొండ అశోక్, బూత్ కమిటీ అధ్యక్షులు పెంచాల నరేష్, పాదం సాగర్, పాదం రవి, శాలివాహన సంఘం నాయకులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో చోటా గజదొంగ కేటిఆర్ ..!!

రాష్ట్రంలో చోటా గజదొంగ కేటిఆర్ ..!!

#18 నెలల్లో మేము చేసింది ఏంటో తెలంగాణ యావత్ ప్రజానీకానికి తెలుసు…

#చట్టాన్ని నమ్ముకున్నాం కాబట్టే మేము చట్టపరంగా వస్తున్నాం.

#మీరు చేసిన తప్పులకు తప్పకుండా జైలుకు పోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.

#మీ అయ్యా,మీరు కేసుల పేరుతో ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు.

#మేము ఆ భాష మాట్లాడాలంటే నీకంటే ఎక్కువ వస్తాయి.

#బీజేపీ పార్టీకి బీ టీమ్ బి ఆర్ ఎస్ అని అందరికీ తెలసు..

#దోచుకున్న డబ్బులకు సాక్ష్యాధారాలు ముందు ఉన్నాయి.

#మీ హయాంలో జరిగిన ఫోన్ ట్యాంపరింగ్ కేసులో ఆనాటి అధికారులు జైళ్లలో మగ్గుతున్నారు.

మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ,కే ఆర్ నాగరాజు…

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-50.wav?_=1

హన్మకొండ, నేటిధాత్రి:

పదేళ్లలో చేసిన పాపాలకు శిక్షలు అమలు చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న జైళ్లు సరిపోవని,స్థాయిని మరచి మాట్లాడితే ఊరుకునేది లేదని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి,వర్ధన్నపేట శాసన సభ్యులు శ్రీ కే ఆర్ నాగరాజు హెచ్చరించారు.శనివారం రోజున హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు..
చట్టాన్ని నమ్మి వచ్చిన వారిమి కాబట్టే మీ పాపాలకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వేచి చూస్తామని అన్నారు.
పదేళ్లలో ప్రశ్నించడమే పాపంగా 54 కేసులు పెట్టినారు.
మీ తప్పులకు జైలుకు పోయే రోజులు దగ్గర పడుతున్న క్రమంలో ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నావ్.
మీరు చేసిన పాపాలకు,దౌర్జన్యాలకు,దోచుకున్న డబ్బులకు పూర్తి ఆధారాలు ఉన్నాయని త్వరలో ముందుకు వస్తాయి…
కెసిఆర్ హయాంలో పెద్ద పెద్ద రిపోర్టులను సైతం అవహేళన్ చేసిన దాఖలాలు సమాజంలో ఉన్నాయి.
మీ హయాంలో నిర్మించి కాళేశ్వరంలో పనిచేసిన ఇరిగేషన్ అధికారుల ఇండ్లలో సోదాలు చేస్తే వందల కోట్ల విలువైన ఆస్తులు బయటకు వచ్చాయి.
నిరసన తెలిపే స్వేచ్సుకూడా లేకుండా చేసినవ్..
నీ అయ్యా వరంగల్ మూడు రోజులు ప్రగల్భాలు పలికిన మాటలు ప్రజలకు ఇంకా గుర్తున్నాయి.
ప్రజా ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలలో ఉచిత 200 యూనిట్ల విద్యుత్తు లేదా,ఉచిత బస్ లేదా,రైతు రుణమాఫీ లేదా..ఇందిరానగర్ ఇళ్లు లేవా..
అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలను కళ్లుండి చూడలేని కబోదివి నువ్వు కేటిఆర్.
ముఖ్యమంత్రి పై నువ్వు మాట్లాడే భాష నీకంటే మాకు ఎక్కువ వస్తాయి.
మేము భాష మాట్లాడితే బిడ్డా మీరు ఇక్కడ ఉండరు.
ప్రశ్నించే మీడియా వారిని ఇతరులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారు.
మీ అనైతిక నిర్ణయం వలన జిల్లా ముక్కలుగా ఏర్పడటం వలన ఈ రోజు జిల్లాలో ఉన్న మేధావులు జిల్లాలను కలపాలని వార్తల్లో వస్తున్నాయి.
పెద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉచిత విద్యా అందించాలనే సంకల్పంతో హనుమకొండలో ఇంటి గ్రేటెడ్ మోడల్ పాఠశాల ఏర్పాటుకు శ్రీకారం చుడితే ఈ రోజు 33 విద్యార్థి సంఘాలు స్వాగతిస్తుంటే ఒక్క సంఘం వ్యతిరేకిస్తున్నది.
అభివృద్ధి పేరుతో పదేళ్లు మోసం చేసింది బి ఆర్ ఎస్ పార్టీ.
అణగారిని వర్గాల అభివృద్ధి,అభ్యున్నతి కోసం పాటుపడుతున్నది కాంగ్రెస్ అని ఎమ్మెల్యేలు తెలిపారు.

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం.. ఇందిరమ్మ పాలన.

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం.. ఇందిరమ్మ పాలన

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

బిఆర్ఎస్ బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

నర్సంపేట,నేటిధాత్రి:

కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం అని.. నేడు రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఇందిరమ్మ పాలన నడుస్తుందని
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.
దుగ్గొండి మండలం గుడ్డేలుగులపల్లి గ్రామం నుంచి బిఆర్ఎస్,బిజెపి పార్టీలకు చెందిన 9 కుటుంబాలు ఆయా పార్టీలకు రాజీనామా చేసి మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే
దొంతి మాధవ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు.ప్రభుత్వం అవలంబిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.తనను నమ్మివచ్చిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని,ప్రజా ప్రభుత్వ ప్రతి సంక్షేమ పథకాన్ని నర్సంపేట నియోజకవర్గంలో అర్హుడైన ప్రతి లబ్ధిదారుడికి అందే వరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హామీ ఇచ్చారు.పార్టీలో చేరిన వారిలో ఏడ్డే బాపూరావు, పేరం రాజు,వేల్పుల అశోక్, వేల్పుల నాగరాజు, వేల్పుల సిద్దు,తౌట్ రెడ్డి రాజిరెడ్డి, కొమాండ్ల రాజేందర్, నల్ల సంజీవ, మంద కుమారస్వామి ఉన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నూరు కిరణ్ రెడ్డి,మండల కోశాధికారి జంగిలి రవి,గుడ్డెలుగులపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు జంగిలి నగేష్,తొర్రూరు నర్సయ్య, జంగిలి రాజు, జంగిలి రమేష్,తొర్రూర్ రవి, తొర్రుర్ రామన్న, గుండెకారి సునీల్, , పిఎసిఎస్ దుగ్గొండి మాజీ డైరెక్టర్ పొగాకు మోహన్ తదితరులు పాల్గొన్నారు.

16న రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి.

ఈనెల 16న రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి.

చిట్యాల, నేటిధాత్రి :

బ్యాండు వాయిద్య కళాకారుల సంఘం ఆధ్వర్యంలో చిట్యాల మండల కేంద్రంలో బ్యాండు సమస్యల కోసం ఈనెల 16న సిటిజన్ ఫంక్షన్ హాల్ లష్కర్ బజార్ హనుమకొండ లో జరుగు రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని గోడ పత్రిక ఆవిష్కరించడం జరిగినది వాయిద్య ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి గుర్తింపు కార్డులు ఇవ్వాలి ప్రమాద బీమా వర్తిoప చేయాలి హెల్త్ కార్డు లిపించి ఉచిత వైద్యం కల్పించాలి ఈ కార్యక్రమంలో పాల్గొన్న
చిట్యాల మండల అధ్యక్షుడు
పర్లపెల్లి రవి కోశాధికారి లద్దునూరి ప్రభు జాయింట్ సెక్రెటరీ భద్రయ్య తదితరులు అంకుశవాలి బోనగిరి రాజు వైనాల మొగిలి సాయబు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

జానకి వర్సెస్‌ స్టేట్ ఆఫ్‌ కేరళ మూవీపై వివాదం.

జానకి వర్సెస్‌ స్టేట్ ఆఫ్‌ కేరళ మూవీపై వివాదం.. సినిమా చూసిన హైకోర్టు జడ్జిలు..

మాలీవుడ్‌లో తీవ్ర వివాదాస్పదమైన జానకీ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ సినిమాను కేరళ హైకోర్టు జడ్జ్‌లు చూశారు. మరి వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు…? అనుపమ పాత్రకు జానకి అని పేరు పెట్టడంపై ఎలా స్పందించారు…? ఈ చిత్రంలో కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించింది. ఇందులో సురేష్ గోపి కీలకపాత్ర పోషించారు.

సినిమా స్టోరీ సంగతేమోగానీ అంతకుమించిన ట్విస్టులు నడుస్తున్నాయి బయట. మిగతా భాషలకు రోల్‌మోడల్‌గా ఉండే మాలీవుడ్‌ సిన్మాలకు కూడా విచిత్రమైన చిక్కులు ఎదురవుతున్నాయి. అలాంటి వివాదంలోనే చిక్కుకుంది జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమా. సిన్మాలో అనుపమ పరమేశ్వరన్ పోషించిన పాత్ర పేరు జానకి కావడంపై గతకొన్ని రోజులుగా తీవ్ర వివాదం నడుస్తోంది. చిత్ర సెన్సార్ బోర్డు ఈ పేరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జానకి పేరుని హిందూ పురాణాల్లో సీతాదేవికి పర్యాయపదంగా పరిగణిస్తారు. అలాంటి పవిత్రమైన పేరుని అత్యాచార బాధితురాలి పాత్రకు పెట్టడం సమంజసం కాదంటోంది సెన్సార్ బోర్డు.

అయితే జానకి అనేది కేవలం ఒక పాత్రకు పెట్టిన పేరు మాత్రమే. ఇందులో ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం లేదంటున్నారు ప్రొడ్యూసర్‌. పేరు మార్చడం సాధ్యం కాదంటూ సర్టిఫికెట్‌ కోసం సెన్సార్ బోర్డుకు మళ్ళీ అప్పీల్ చేసుకున్నారు. మరోవైపు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ సినిమాకి సెన్సార్‌ జాప్యంపై కేరళ హైకోర్టు సెన్సార్‌ బోర్డును ప్రశ్నించింది. అదే పేరుతో గతంలో పలు పాత్రలు, సినిమాలు వచ్చినప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడెందుకొచ్చిందని న్యాయస్థానం క్వశ్చన్‌ చేసింది. అంతేకాదు… శనివారం జడ్జీలతో పాటు పలువురు లాయర్లు సైతం సినిమాను చూశారు. దీంతో చిత్ర యూనిట్‌తో పాటు ప్రజల్లోనూ ఉత్కంఠ పెరిగింది. సినిమా చూసిన వాళ్లు ఎలాంటి తీర్పునిస్తారు…? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సెన్సార్ బోర్డు ఆవిర్భావం.. 20వ శతాబ్దం ప్రారంభంలో సినిమా ప్రపంచంలో ప్రజాదరణ పొందింది. అనేక చోట్ల సినిమాల బహిరంగ ప్రదర్శనల సమయంలో సమస్యలు తలెత్తిన తర్వాత, బ్రిటిష్ ప్రభుత్వం 1909లో ప్రపంచంలోనే మొట్టమొదటి సినిమా చట్టాన్ని ప్రవేశపెట్టింది. మొదటి చట్టం బహిరంగ ప్రదర్శనలకు లైసెన్స్‌లు అందించడం. అయితే, స్థానిక ప్రభుత్వాలు ఆ సమయంలో తమను విమర్శించే చిత్రాలకు లైసెన్స్‌లను నిరాకరించడానికి ఈ చట్టాన్ని ఉపయోగించాయి.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటున్న.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటున్న మహాదేవపూర్ బాలికల పాఠశాల విద్యార్థిని
మహాదేవపూర్ జులై 5( నేటి ధాత్రి)
మహాదేవపూర్ మండల కేంద్రంలో జడ్పీ హెచ్ ఎస్ బాలికల పాఠశాల నుండి మాడిగ అక్షిత ఎనిమిదవ తరగతి విద్యార్థిని ఇటీవల భూపాలపల్లిలో అథ్లెటిక్ అసోసియేషన్ వారు నిర్వహించినటువంటి జిల్లా స్థాయి సెలక్షన్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిజవహర్ లాల్ నెహ్రూ స్టేడియం హనుమకొండ లో జరగబోయే సబ్ జూనియర్ అండర్ 14 ట్రై అత్లాన్ విభాగంలో పాల్గొంటుందని,ఆ పాఠశాలపిడి గురుసింగ పూర్ణిమ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న MEO ప్రకాష్ బాబు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.సరిత మాట్లాడుతూ విద్యార్థిని అభినందిస్తూ రాష్ట్రస్థాయిలో రాణించాలనిఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోపాఠశాల ఉపాధ్యాయలు మడక మధు,సుధారాణి,సరితా దేవి,హోలీ పాషా, శ్రీనివాస్,వసుదప్రియ,వీరేశం,సమ్మయ్య,లీలారాణి,రజిత,సాహెదా బేగం,ప్రసూన, దీపిక,ఆంజనేయులు, అజ్మత్ పాషా లు విద్యార్థినిఅభినందించారు

ఘనపూర్ లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్.

ఘనపూర్ లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు

వనపర్తి నేటిధాత్రి

 

 

 

 

ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ ఆధ్వర్యంలో బస్టాండ్ దగ్గర రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి జరుపుకున్నారు ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణీ చేయడం చేశారు
ఈ వేడుకలలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్
జిల్లా వికలాంగుల కమిటీ అధ్యక్షుడు గంజాయి రమేష్ జిల్లా డాక్టర్ సెల్ జిల్లా అధ్యక్షులు నరేందర్ గౌడ్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఎం దేవన్న యాదవ్ మున్నూరు జయకర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దేవుజా నాయక్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు కే బాల్ రెడ్డి, చిట్యాల లింగస్వామి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు

స్పోర్ట్స్ స్కూల్స్ రాష్ట్రస్థాయి క్రీడలకు ఇద్దరు బాలికల ఎంపిక.

స్పోర్ట్స్ స్కూల్స్ రాష్ట్రస్థాయి క్రీడలకు ఇద్దరు బాలికల ఎంపిక

మహాదేవపూర్ జూన్ 28( నేటి ధాత్రి )

 

స్పోర్ట్స్ స్కూల్స్ ప్రవేశం కోసం మహాదేవపూర్ మండలం కుదురుపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలు రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొనేందుకు ఎంపికైనట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంపత్ తెలిపారు కుదురుపల్లి కి చెందిన విద్యార్థినిలు జిముడ రహస్య గోగుల అనుష్క ఎంపికయ్యారు జులై ఒకటిన నుండి హైదరాబాద్ హంకి పేటలొ స్పోర్ట్స్ స్కూల్ పోటీలో పాల్గొంటారని ఆయన తెలిపారు మారుమూల గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ పోటీలో పాల్గొనేందుకు ఎంపిక కావడం పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు సతీష్, సంధ్య గ్రామస్తులు తదితరులు అభినందించారు

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ను గెలిపించండి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు నేటిధాత్రి:

భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ వెంకట్రావుపల్లి శక్తి కేంద్రం ఇంఛార్జి బద్ధం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మీపూర్ గ్రామంలో వికసిత భారత్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ లు హాజరై మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్రమోదీ బీజేపీ ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విఫలం అయిందని, రెండున్నర సంవత్సరాలు పూర్తి కాకముందే కాంగ్రెస్ పాలనను ప్రజలు చీకొడుతున్నారన్నారు. తెలంగాణలో త్వరలో జరుగబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. తెలంగాణ వచ్చే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమేనని వారు జోస్యం చెప్పారు. బీజేపీ పాలనలో ప్రజలు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, బూత్ కమిటీ అధ్యక్షులు గుర్రం శ్రీనివాస్ గౌడ్, దైవల తిరుపతి గౌడ్, మడికంటి శేఖర్, యువ మోర్చా మండల అధికార ప్రతినిధి వంచ మనోజ్, మల్లయ్య, గోపు అనంత రెడ్డి, నాయకులు, ప్రజలు, తదితరులు హాజరయ్యారు.

రాష్ట్ర బి సి పొలిటికకల్ జె ఏ సి చైర్మన్ రాచాల కా రుపై రాళ్లతో దాడి.

రాష్ట్ర బి సి పొలిటికకల్ జె ఏ సి చైర్మన్ రాచాల కా రుపై రాళ్లతో దాడి

జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన రాచాల

వనపర్తి నెటిదాత్రి :

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నానని. అది నచ్చని వారు ఇలాంటి దాడులకు దిగుతున్నారని వారికి భయపడబోనని.ప్రజల సమస్యలపై పోరాటాన్ని ఆపేది లేదని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ స్పష్టం చేశారు
గురువారం రాత్రి 12 గంటల సమయంలో తన స్వగ్రామమైన వడ్డెవాటకు వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన కారుపై రాళ్లతో దాడి చేశారని, కారు డ్రైవర్ చాకచక్యంతో కారు ముందుకు వేగంగా పోనివ్వడంతో తృటిలో తనకు ప్రాణాపాయం తప్పిందన్నారు డాడీ సంఘటన పై శుక్రవారం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ను కలిసి ఫిర్యాదు చేశామని రాచాల యూగంద ర్ గౌడ్ తెలిపారు
దాడి చేసిన వారు ఎవరైనా సరే వారిని వదిలిపెట్టొద్దని చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ ని కోరారు.

BC Political.

ఎన్ని దాడులు చేసినా అదిరేది లేదు, బెదిరేది లేద.నిప్రజల కోసం ప్రాణ త్యాగానికైనా తాను సిద్ధమని రాచాల స్పష్టం చేశారు.
రాచాల వెంట బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు పాండురంగ యాదవ్, వివి గౌడ్, నరసింహ యాదవ్, స్వప్న, దేవర శివ, అంజన్న యాదవ్, మహేందర్ నాయుడు, అరవింద చారి, బత్తుల జితేందర్, ధర్మేంద్ర సాగర్, అస్కని రమేష్, నాగరాజు, చెలిమిల్ల రామన్ గౌడ్, బీసీ కుల సంఘాల జెఎసి నాయకులు రాములు యాదవ్, సత్యం యాదవ్, వెంకటన్న గౌడ్, నజీర్, తిరుపతన్న గౌడ్, కొత్త గంగాధర్ తదితరులు ఉన్నారు

సివిల్ ఇంజనీరింగ్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్.

సివిల్ ఇంజనీరింగ్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్.

చిట్యాల, నేటిధాత్రి ;

 

 

 

 

 

చిట్యాల మండల కేంద్రంలోని కాకతీయ హైస్కూల్లోటిజి సెట్ పాలిటెక్నిక్ 2025 ఎంట్రన్స్ టెస్ట్ లో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మరియు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ స్టేట్ 9వ ర్యాంక్ సాధించి జేఎన్టీయూ హైదరాబాదులో సివిల్ ఇంజనీరింగ్ లో సీటు సంపాదించిన మా పాఠశాల పూర్వ విద్యార్థి గోల్కొండ నిఖిల్ కౌశిక్ ను పాఠశాల అధ్యాపక బృందం శాలువతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ రాజ్ మహమ్మద్ మాట్లాడుతూ చిన్నప్పటినుండి నిఖిల్ కౌశిక్ చదువులో చురుకుగా ఉండేవాడు కష్టపడి చదవడం వల్ల ఈరోజు తల్లిదండ్రులకు పాఠశాలకు మా మండలానికి పేరు తీసుకొచ్చి హైదరాబాదులోని జేఎన్టీయూలో సివిల్ ఇంజనీరింగ్ లో సీటు పొందినందుకు సంతోషిస్తూ ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది ఇంకా మా పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు దేశ విదేశాలలో సాఫ్ట్వేర్లుగా ప్రభుత్వ ఉద్యోగులుగా సేవ చేస్తూ సమాజానికి పాఠశాలకు తల్లిదండ్రులకు పేరు తెస్తున్నందుకు చాలా గర్వంగా సంతోషంగా ఉన్నదని తెలియజేశారు ఈ విధంగా విద్యార్థులు కష్టపడి చదివి నిఖిల్ కౌశిక్ ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు ఈ సమావేశంలో విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎం గిరిధర్ రెడ్డి.

నూతన రాష్ట్ర మంత్రిని సన్మానించిన

రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎం గిరిధర్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్,సచివాలయంలో బుధవారం కార్మిక, ఉపాధి, శిక్షణ కర్మాగారాలు, గనులు భూగర్భ శాస్త్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు గడ్డం.వివేక్ వేంకట స్వామి ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్‌రెడ్డి , జడ్చర్ల శాసనసభ్యులు అనిరుధ్‌రెడ్డి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్.

తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (TGSP)
ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణి*

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

shine junior college

తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం పరిధిలోని సర్ధాపూర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 17వ బెటాలియన్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (TGSP) ఆధ్వర్యంలో ఉచితంగా విద్యా సామగ్రి, వాటర్ ప్యూరిఫైయర్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం బెట్టాలియన్ కమాండెంట్ ఎం.ఐ. సురేష్.
ఆధ్వర్యంలో బుధవారం సర్ధాపూర్ ప్రభుత్వ పాఠశాలలో జరిగినది. పోలీస్ కానిస్టేబుల్ అయినా ఇటువంటి రామ్- అంజలి దంపతుల కుమార్తె లక్ష్మి వర్ణిక పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు పంపిణి చేశారు.అనంతరం బేటాలియన్ పోలీసు సిబ్బంది పిల్లలకు నోట్ పుస్తకాలు, ఎగ్జామ్ ప్యాడ్‌లు, వాటర్ బాటిల్, ఇతర స్టేషనరీ వస్తువులు పంపిణీ చేశారు, అదే విధంగా బెట్టాలియన్ పోలీస్ క్రికెట్ టీం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో
వాటర్ ప్యూరిఫైయర్ అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమాండెంట్ ఎం.ఐ. సురేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ఈ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కూడా తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. మొదటి విడతలో భాగంగా.

సర్ధాపూర్ ప్రభుత్వ పాఠశాలను ఆదర్శంగా ఎంచుకొని, పాఠశాలకు పెయింటింగ్ వేయడం, మెరుగైన విద్యకు తోడ్పడటం, మంచి తాగునీటిని అందించడం వంటి పనులకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. పోలీస్ క్రికెట్ టీమ్ నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడానికి, వారి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి మంచి తాగునీరు అందించడానికి కృషి చేస్తుందని కమాండెంట్ అన్నారు. ఈ గ్రామానికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తమ వంతు సాయం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ జే. రాందాస్, పాఠశాల ఎం.ఈ.ఓ దూస రఘుపతి,
ఏఏపీసీ చైర్మన్ లక్ష్మి, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ బి. స్వాతి, పోలీస్ ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, 17వ బెటాలియన్ పోలీస్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్‌ను విస్మరించారు.

రాష్ట్రంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్‌ను విస్మరించారు

తెలంగాణ విద్యా క్యాలెండర్‌లో జాతీయ విద్యా దినోత్సవాన్ని మర్చిపోయారు, ప్రభుత్వం వెంటనే సమీక్షించాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

2025-26 విద్యా సంవత్సరానికి పాఠశాల విద్యా శాఖ 1 నుండి 10 తరగతుల విద్యా క్యాలెండర్‌ను విడుదల చేసింది. తెలంగాణ వ్యవస్థాపక దినోత్సవం, క్రీడా దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవం, హిందీ దివస్, బాలల దినోత్సవం, జాతీయ గణిత దినోత్సవం, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, జాతీయ సైన్స్ దినోత్సవం వంటి అనేక ముఖ్యమైన కార్యక్రమాలు ఈ క్యాలెండర్‌లో చేర్చబడ్డాయి, అయితే స్వాతంత్ర్య సమరయోధుడు మరియు దేశ తొలి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా జరుపుకునే జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకునే నవంబర్ 11ని రాష్ట్ర విద్యా క్యాలెండర్‌లో చేర్చకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వ ఈ నిర్ణయం గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు మరియు దేశ తొలి విద్యా మంత్రి సేవలకు అన్యాయం. గత సంవత్సరం కూడా జాతీయ విద్యా దినోత్సవాన్ని విస్మరించారు, ప్రభుత్వం ఈ విషయంలో విద్యా శాఖకు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ఉపాధ్యాయ సంస్థల ప్రాతినిధ్యంపై ఈ వేడుకను నామమాత్రంగా జరుపుకున్నారు, కానీ ప్రభుత్వం దీనికి ఎటువంటి నిధులను విడుదల చేయలేదు. రాష్ట్రాన్ని బిజెపి కాదు, కాంగ్రెస్ పాలిస్తోంది, మరియు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కూడా మరియు
స్వాతంత్ర్యం తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆయన మొదటి కేంద్ర విద్యా మంత్రి కూడా. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ప్రకటన జారీ చేస్తూ, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు మరియు ఇతర వాగ్దానాలను కలిగి ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గిఫ్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కీమ్‌ను ప్రకటించింది. అటువంటి గొప్ప నాయకుడి పేరు మీద ఉన్న జాతీయ విద్యా దినోత్సవాన్ని విస్మరించడం దురదృష్టకరం. ప్రభుత్వం వెంటనే జారీ చేసిన విద్యా క్యాలెండర్‌ను సమీక్షించి, ఈ క్యాలెండర్‌లో జాతీయ విద్యా దినోత్సవాన్ని చేర్చి, రాష్ట్రంలో విద్యా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్ర్య సమరయోధులు మరియు దేశ నిర్మాణం మరియు తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన వివిధ వ్యక్తుల పేర్లతో వివిధ పథకాలను ప్రకటిస్తున్నారు, విశ్వవిద్యాలయాలకు వారి పేర్లు పెడుతున్నారు, పెద్ద అవార్డులను ప్రకటిస్తున్నారు లేదా వారి జ్ఞాపకార్థం పెద్ద స్మారక చిహ్నాలను నిర్మిస్తున్నారు, కానీ దేశ మొదటి విద్యా మంత్రి జన్మదినాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోకుండా నిర్లక్ష్యం చేయడం ముస్లింలలో ఆందోళన మరియు ఆందోళనను కలిగిస్తోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version