జిల్లాలో గ్యాస్, పెట్రోల్ డీజిల్ సమృద్ధిగా నిల్వలు…

జిల్లాలో గ్యాస్, పెట్రోల్ డీజిల్ సమృద్ధిగా నిల్వలు

గ్యాస్, పెట్రోల్, డీజిల్ పై పటిష్ట పర్యవేక్షణ

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లాలో గ్యాస్, పెట్రోల్ డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
తెలిపారు.
శనివారం ఐడిఓసి కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఎస్పి సంకీర్త్ తో కలిసి జిల్లా ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్, పెట్రోల్, డీజిల్ పై పటిష్ట పర్యవేక్షణ కొనసాగాలని ఆదేశించారు. గృహ అవసరాలకు విమియోగించే సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే నిత్యావసర సరుకుల చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని సూచించారు.
జిల్లాలో మొత్తం లక్షా 20 వేల మంది గ్యాస్ వినియోగిస్తున్నారని తెలిపారు. సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, ఆసుపత్రులకు యధావిధిగా గ్యాస్ సరఫరా జరుగుతుందని, ఆయా శాఖల అధికారులు. పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ అత్యవసర సేవలకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలాల్లో డిటీలు, ఎస్ ఐ.లు పర్యవేక్షణ చేస్తున్నారని, వాహనాలు తనిఖీ చేసి కేసులు నమోదు చేయాలని ఆర్టిఓ కు సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు, పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల బుకింగ్ సైకిల్ అమలులో ఉందని, బుకింగ్ క్రమం ప్రకారమే సిలిండర్ సరఫరా జరుగుతోందని తెలిపారు. సిలిండర్ డెలివరీ సమయంలో ఓటిపి విధానం తప్పనిసరిగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల అమాంతం బుకింగ్‌లు పెరగడం వల్ల డిమాండ్ అధికమవుతోందని గుర్తించిన కమిటీ, ప్రజలు అవసరానికి మించి బుకింగ్ చేయకుండా, నిల్వలు చేయకుండా ఉండాలని సూచించారు. పాఠశాలలు, హాస్టళ్లలో ఎల్పీజీ వినియోగంపై వెల్ఫేర్ అధికారి, డీఈఓ పర్యవేక్షణ చేయాలని, వార్డెన్లు, హెడ్‌మాస్టర్లు సరైన వినియోగం చేపట్టాలని ఆదేశించారు. ఎక్కడైనా కొరత ఉంటే వెంటనే తెలియజేయాలని సూచించారు.
జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు కూడా సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. బ్లాక్ మార్కెటింగ్, అనధికార రీఫిల్లింగ్ సెంటర్లు, అక్రమ నిల్వలు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్యాస్, పెట్రోల్, డిజిల్ నిల్వలను ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ, పోలీస్ శాఖతో కట్టుదిట్టమైన అమలు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా వినియోగించడం, మళ్లింపు, నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి మొత్తం 19 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. హోటళ్లు, ధాబాలలో అక్రమంగా వినియోగిస్తున్న సిలిండర్లను స్వాధీనం చేసుకుని, సంబంధితులపై నిత్యావసర వస్తువులు చట్టం 1955 సెక్షన్ 6A కింద కేసులు నమోదు చేశామన్నారు.
కమిటీ కఠినంగా వ్యవహరించాలని నిరంతర తనిఖీలు, అప్రమత్తత ప ద్వారా అక్రమాలను పూర్తిగా అరికట్టాలని సూచించారు. అధికారులు పారదర్శక సరఫరా, సమర్థవంతమైన పర్యవేక్షణ, సమయానుకూల నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.
ఎస్పి సంకీర్త్ మాట్లాడుతూ జిల్లాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ డీలర్లు తో సమావేశం నిర్వహించామని తెలిపారు. ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలు నమ్మి ఆందోళన చెందొద్దని సూచించారు. జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. అసత్య ప్రచారాలపై పర్యవేక్షణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి రద్దీ లేకుండా పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడోన్లు వద్ద పటిష్ట నిఘా.కొనసాగుతున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ డీఈఓ రాజేందర్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, సంక్షేమ శాఖల అధికారులు, హెచ్పీసీఎల్ సేల్స్ ఆఫీసర్ అమర్త్యదాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇంధనం కొరత వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు….

ఇంధనం కొరత వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

◆”-: రాజేందర్ రెడ్డి చరాక్ పల్లి ఎస్సై

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మార్చ్ 26: పెట్రోల్, డీజిల్ కొరత వదంతుల్లో వాస్తవం లేదని, ఇంధన సరఫరాపై వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజేందర్ రెడ్డి చరాక్ పల్లి ఎస్సై ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు జిల్లాలో ఇంధన (పెట్రోల్, డీజిల్) కొరత ఉందంటూ సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మి ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్దకు చేరుకుని బారులు తీరవద్దని సూచించారు. ఇలాంటి చర్యల వల్ల అనవసరమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తడమే కాకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఎస్సై పేర్కొన్నారు.

డీజిల్ ఆధాజేసిన డ్రైవర్లను అభినంధించిన.

డీజిల్ ఆధాజేసిన డ్రైవర్లను అభినంధించిన ఆర్టీసీ డిఎం

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపోలో ఇందనం పొదుపు చేసి బెస్ట్ కేఎంపిఎల్ అవార్డు పొందిన డ్రైవర్లు అశోక్ రెడ్డి, పీవి రావ్ లను, బెస్ట్ ఈపీకే తీసుకువచ్చిన కండక్టర్ యాదగిరి లను డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ శాలువాతో సన్మానం చేసి నగదు ప్రోత్సాహక బహుమతి అందజేసి ప్రశంశించారు. ఈ కార్యక్రమంలో డిపో ట్రాఫిక్ సూపర్ వైజర్ నారాయణ, ఆఫీస్ స్టాఫ్ శ్రీనివాస్, ఏఎంఎఫ్ దత్తం, ఎస్డిఐ వెంకటేశ్వర్లు,రవీందర్ మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.

గ్యాస్,పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా.!

గ్యాస్,పెట్రోల్,డీజిల్ ధరలకు నిరసనగా సి.పి.ఎం ఆధ్వర్యంలో ధర్నా

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని న్యూ బస్టాండ్ సమీపాన తెలంగాణ తల్లి చౌక్ లో పెంచిన వంటగ్యాస్,పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే ఉపశమరించుకోవాలని సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ తో నిరసన తెలిపడం జరిగినది.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ముషం రమేష్ సీపీఎం పార్టీ సిరిసిల్ల పట్టణ కార్యదర్శి అన్నల్ దాస్ గణేష్ లు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా వంట గ్యాస్ డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం
వంట గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెంచడం దారుణమని విమర్శించారు దీనివల్ల ఉజ్వల పథకం లబ్ధిదారులు సాధారణ వినియోగదారుల తోపాటు మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై కూడా పెద్ద భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం పెంచిన సిలిండర్ ధరను ఉపశమరించుకోవాలని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.
నిత్యవసర సరుకుల ధరలపై నియంత్రణ చేస్తామని చెప్పిన బిజెపి ప్రభుత్వం అన్ని రకాల సరుకులు వస్తువుల ధరలను విపరీతంగా పెంచిందని
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెంచారు. 2014 బిజెపి అధికారంలోకి రాకముందు గ్యాస్ సిలిండర్ 450 రూపాయలు ఉండేదని కానీ ఇప్పుడు బిజెపి వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలకి గ్యాస్ సిలిండర్ పెంచడం చాలా దారుణమైన విషయం,ప్రజలు పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఏగమంటి ఎల్లారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, గురిజాల శ్రీధర్, సిపిఎం నాయకులు నక్క దేవదాస్, సిరిమల్ల సత్యం బెజుగం సురేష్, గుండు రమేష్, గోవిందు లక్ష్మణ్
తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version