ఎన్నికల ప్రచార నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు..

ఎన్నికల ప్రచార నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు

భూపాలపల్లి నేటిధాత్రి

 

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8, 27వార్డు జవహర్ కాలనీ, పైలెట్ కాలనీ కాలనీలల్లో సీపీఐ సీపీఐ(యం) పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల
27వ వార్డు అభ్యర్థి కాంగ్రెస్ సిపిఐ పార్టీలు బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థి ఎర్రం అనుష సతీష్ కుమార్
8వ వార్డు అభ్యర్థి సోతుకు రమ సమ్మయ్య
గెలుపు కొరకు రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్
వార్డుల ఎన్నికల ఇంచార్జీ లతో కలిసి ఎన్నికల ప్రచారంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులల్లో నిర్వహించిన పబ్లిక్ కార్నర్ మీటింగ్ లలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పించింది అలాగే సన్నబియ్యం రైతులకు రుణమాఫీ పేదోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇలా అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ కావున కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి అని వారు అన్నారు 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంను మంత్రి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో
రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజుకుమార్, సీపీఐ(యం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు
పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ నాయకుడు సమ్మయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించండి: ఎమ్మెల్యే గండ్ర

కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించండి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

భూపాలపల్లి నేటిధాత్రి

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 24, 25, 23 వార్డులు టీ – 2 క్వార్టర్స్, కారల్ మార్క్స్ కాలనీ, 6 ఇంక్లైన్ రోడ్డు రాజీవ్ నగర్ కాలనీలల్లో సీపీఐ సీపీఐ(యం) పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు వేముల జ్యోతి – శ్రీకాంత్, పొనకంటి మేఘన – శ్రీనివాస్, శిరుప స్వప్న – అనిల్ ల గెలుపు కొరకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజుకుమార్, సీపీఐ(యం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు, ముఖ్య నాయకులు ఆయా వార్డుల ఎన్నికల ఇంచార్జీ లతో కలిసి ఎన్నికల ప్రచారంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులల్లో నిర్వహించిన పబ్లిక్ కార్నర్ మీటింగ్ లలో ఎమ్మెల్యే మాట్లాడారు. అంతకుముందు 22వ వార్డుకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అంతకుముందు 22వ వార్డు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంను ప్రారంభించారు. 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ముంజాల రవీందర్ గౌడ్ కు చెందిన ఎన్నికల ప్రచార రథాన్ని ఎమ్మెల్యే జీఎస్సార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కాంగ్రెస్ అభివృద్ధే ప్రజల ఓటు: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లు వేస్తారు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రజలు ఓట్లు వేస్తారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని టిటు క్వార్టర్స్ కారల్ మార్క్స్ కాలనీ 26 వార్డు అభ్యర్థి దుర్గం రాదా ఐలయ్య 7వార్డు అభ్యర్థి నూకల భూలక్ష్మి చంద్రమౌళి గెలుపుకై సీపీఐ సీపీఐ(యం) పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కొరకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, వార్డుల ఎన్నికల ఇంచార్జీ లతో కలిసి ఎన్నికల ప్రచారంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులల్లో నిర్వహించిన పబ్లిక్ కార్నర్ మీటింగ్ లో వారు మాట్లాడుతూ…రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ప్రజల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు.
అభివృద్ధి, సంక్షేమం నిరంతరం కొనసాగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. ప్రజల మద్దతుతో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజుకుమార్, సీపీఐ(యం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు, పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version