దోపిడిలేని సమాజ నిర్మాణమే కమ్యూనిస్టుల లక్ష్యం.

దోపిడిలేని సమాజ నిర్మాణమే కమ్యూనిస్టుల లక్ష్యం.

సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

దోపిడిలేని సమాజ నిర్మాణమే కమ్యూనిస్టుల లక్ష్యమని సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి అన్నారు. నర్సంపేట మాదన్నపేట రోడ్ సిపిఐ కాలనీ వద్ద ఉన్న కామ్రేడ్ పంజాల చంద్రమౌళి 8 వ వర్ధంతి సందర్భంగా స్తూపం ఏర్పాటు చేశారు.కాగా స్థూపం వద్ద అరుణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం మేకల రవి మాట్లాడారు.
అనేక సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీలో పనిచేసి పేదప్రజల పక్షాన పోరాటాలు నిర్వహించి

దున్నేవాడికి భూమి కావాలని నిలువ నీడలేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కావాలని అనేక భూ పోరాటాలు చేసి భూములను సాధించిన చరిత్ర కలిగిన పంజాల చంద్రమౌళిది అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్ సభకు అధ్యక్షత వహించగా సిపిఐ వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శిలు ఎస్కే బాష్మియా పనస ప్రసాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు లక్ష్మణ్ అక్క పెళ్లి రమేష్ తోట చంద్రకళ జిల్లా నాయకులు కందిక చెన్నకేశవులు గడ్డం యాకయ్య మియాపురం గోవర్ధన్ పాలక కవిత భానోతు వీరు నాయక్ చింతకింది కుమారస్వామి అయిత యాకయ్య గడ్డం నాగరాజు అక్బర్ ఇల్లందులసాంబయ్య యాదగిరి సతీష్ మమతా శైలజ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version