CPM పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా.

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా

 

భూపాలపల్లి నేటిధాత్రి

 

జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు జె వెంకటేష్ హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పాత ఎర్ర చెరువులో గుడిసెలు నిర్మించుకున్న పేదలందరికి ఇంటి పట్టాలు, ఇంటి నెంబర్లు, కరెంటు సౌకర్యం, మంచి నీటి సౌకర్యం, రోడ్ల సౌకర్యం కల్పించి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలి.

జిల్లా కేంద్రంలోని కారల్ మార్క్స్ కాలని జోహార్ నగర్ రాజీవ్ నగర్ బాంబులగడ్డ, సి.ఆర్.నగర్, శాంతినగర్, రాంనగర్, ఫక్మీర్ గడ్డ వాసులకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని అన్నారు పలిమెల మండలంలోని మండల కేంద్రంతో పాటు కాటారం మండలంలోని గ్రామాలు, ముత్తారం మండలంలోని గ్రామాలు, మండల కేంద్రాలతో పాటు వివాసం ఉంటున్న ఇండ్లకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలి.

ముత్తారం మండలంలోని కనుకునూరు పలిమెల మండలంలోని క్రిషంపాటు పండిన రెవెన్యూ భూములలో గుడిసెలు వేసుకున్న వారికి ఇందిరమ్మ ఇండ్లను కెటాయించాలి దుబ్బపల్లి, గడ్డిగానిపల్లి, కాపురం గ్రామాలను తరలించి ఆర్ & ఆర్ ప్యాకేజి క్రింది ఇండ్లు నిర్మించి
సింగరేణి, జెన్ కో ఆధారిత పరిశ్రముల అయిన బొగ్గు శుద్ధి కర్మగారం, ఎరువుల కర్మగారం, సిమెంట్, కర్మగారాన్ని నెలకొల్పి జిల్లాలో ఉండే యువతకు ఉద్యోగ అవకాశాల కల్పించాలి.

భూపాలపల్లి జిల్లాలో రైల్వేమార్గం ఏర్పాటు చేస్తామని గతపాలకులు ఉప్పల్ నుండి భూపాలపల్లి మీదుగా ఇల్లందు.

వరకు భూ సేకరణ జరిపి సర్వేలు వేసినారు, రైల్వే మార్గం ఉంచడం వలన జిల్లా అభివృద్ది అవుతుంది.

వెంటనే జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలి.

జిల్లాలో వరి తర్వాత పెద్ద పంట అయిన తునికాకు సేకరణ పని గిరిజనులు, గిరిజనేతరులు చేస్తున్నారు.

ఇప్పటి వరకు గత సంవత్సరం తునికాకు బోనస్ అందలేదు వెంటనే పరిశీలించి ఇప్పించాలి.

ఎండలు తీవ్రంగా ఉన్నటువంటి ఈ కాలంలో ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ట్యాంకర్ల ద్వారా మంచి నీటి కొరత ఉన్న ప్రాంతాలలో సరఫరా చేయించాలి.

ఇండ్ల స్థలాలు లేని జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ జే వెంకటేశు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు చెన్నూరి రమేష్,గుర్రం దేవేందర్,వెలిశెట్టి రాజయ్య, ఆత్కూరి శ్రీకాంతు గడప శేఖర్, ఆకుదారి రమేష్,,కుందాం బుధవారం,వి విజయలక్ష్మి, బి క్రాంతి,, సిహెచ్ రవికుమార్, ఎమ్ రాజేందర్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version