ఎన్నికల ప్రచార నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు
భూపాలపల్లి నేటిధాత్రి
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8, 27వార్డు జవహర్ కాలనీ, పైలెట్ కాలనీ కాలనీలల్లో సీపీఐ సీపీఐ(యం) పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల
27వ వార్డు అభ్యర్థి కాంగ్రెస్ సిపిఐ పార్టీలు బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థి ఎర్రం అనుష సతీష్ కుమార్
8వ వార్డు అభ్యర్థి సోతుకు రమ సమ్మయ్య
గెలుపు కొరకు రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్
వార్డుల ఎన్నికల ఇంచార్జీ లతో కలిసి ఎన్నికల ప్రచారంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులల్లో నిర్వహించిన పబ్లిక్ కార్నర్ మీటింగ్ లలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పించింది అలాగే సన్నబియ్యం రైతులకు రుణమాఫీ పేదోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇలా అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ కావున కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి అని వారు అన్నారు 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంను మంత్రి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో
రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజుకుమార్, సీపీఐ(యం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు
పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ నాయకుడు సమ్మయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
