CPM అధ్యర్యములో 18 వ వార్డుల్లో ప్రజల సమస్యలపై సర్వే.

CPM

సీ పి ఏం అధ్యర్యములో 18 వ వార్డుల్లో ప్రజల సమస్యలపై సర్వే

వనపర్తి నేటిదాత్రి :

 

సిపిఎం వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 18వ వార్డులో ఇంటింటి సర్వే నిర్వహించార.

సర్వేలో ప్రధానంగా వాటర్ పైప్ లైన్ వేసి కంకర వేయినందున ఒక మహిళకు కిందపడి కాలు కు గాయాలు వార్డులో చేసిన పైప్ లైన్లు మొత్తం తేలుకొని ఉన్నాయి.

వాటిని వెంటనే మూయాలి.

వాటిని పైన సిమెంటు కంకర వేసి రోడ్డు సైజులో వచ్చేయాలని సీపీ ఏం నాయకులు డిమాండ్ చేశారు వార్డులో విద్యుత్తు లో వోల్టేజి సమస్య ఉన్నది.

వెంటనే లో వోల్టేజీ సమస్యను పరిష్కారం చేయాలి.

హనుమంతు ఇంటి పక్కల ఉన్న విద్యుత్ పోల్ ఇంటి స్థలంలో ఉన్నది.

రోడ్డుపైకి వేయాలి.

విద్యుత్ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.

వార్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది.

భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేయాలి .

అర్హులందరికీ ఇళ్లస్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి. చాలామందికి పెన్షన్స్ లేవు.

పింఛన్లు ఇవ్వాలి.

కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి.

ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం .

కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పేరుతో ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని అనడం తప్ప ఒక్క రూపాయి మంజూరు చేయడం లేదు.

వెంటనే ప్రతి ఇంటి నిర్మాణానికి 10 లక్షలు కేంద్ర ప్రభుత్వం, 5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.

దళిత వాడకుస్మశాన వాటిక లేదు .

వెంటనే దళిత వాడకు స్మశాన స్థలం కేటాయించాలి.

ఈ కార్యక్రమంలో సిపిఎం వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సిపిఎం వనపర్తి పట్టణ కార్యదర్శి ఏం పరమేశ్వర చారి, 18 వ వార్డు శాఖ కార్యదర్శి గంధం మదన్, సిపిఎం 18 వ వార్డు నాయకులు డి. బాలరాజు ,ఎం. మన్యం, రత్నయ్య, బాల పీరు, రవి హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!