సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శులుగా ఎండి జాఫర్ కృష్ణ ఎన్నిక.

సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శులుగా ఎండి జాఫర్ కృష్ణ ఎన్నిక…

భూపాలపల్లి నేటిధాత్రి:

shine junior college

భూపాలపల్లి సిపిఐ 18వ పట్టణ మహాసభలో భూపాలపల్లి పట్టణ కమిటీ ఎన్నుకున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజకుమార్ తెలిపారు. పట్టణ మహాసభలో భూపాలపల్లి పట్టణ అభివృద్ధి కోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరిగిందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పేద ప్రజల కోసం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తున్న పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని తెలిపారు. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్,ఇందిరమ్మ ఇండ్లు,వృధ్యప్ప, వితంతువు మహిమ పింఛన్లు మంజూరు చేయాలనీ కోరారు. సిపిఐ భూపాలపల్లి పట్టణ నూతన కమిటీని 27మంది తో ఎన్నుకున్నట్లు తెలిపారు.

Urban

పట్టణ కార్యదర్శిగా సోతుకు ప్రవీణ్ కుమార్ సహాయ కార్యదర్శిలుగా ఎండి జాఫర్, పల్లి కృష్ణను నియమించారు.
కార్యవర్గ సభ్యులుగా మోటపలుకుల రమేష్ గురిజపల్లి సుధాకర్ రెడ్డి రాంచంధర్ జి శ్రీనివాస్ క్యాతరాజ్ సతీష్ కోరిమి సుగుణ నేరెళ్ల జోసెఫ్ వేముల శ్రీకాంత్ లతోపాటు కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నట్లు రాజకుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పట్టణ సహాయ కార్యదర్శులు ఎండి జాఫర్ కృష్ణలు మాట్లాడుతు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇందిరా మహిళా శక్తి చీరలతో సిరిసిల్ల ప్రజలకు చేతినిండా ఉపాధి.

ఇందిరా మహిళా శక్తి చీరలతో సిరిసిల్ల ప్రజలకు చేతినిండా ఉపాధి

బతుకమ్మ చీరల బకాయిలు 280 కోట్లు చెల్లించాం

రూ. 50 కోట్లతో యార్న్ బ్యాంకు ఏర్పాటు

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
చేనేత జౌళి, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్

సిరిసిల్ల టౌన్( నేటిధాత్రి ):

shine junior college

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తితో చేతినిండా పని కల్పిస్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. సిరిసిల్లలోని గణేష్ నగర్ లో ఉన్న మామిడాల నారాయణ, కొండ సుభాష్ కు మరమగ్గాల యూనిట్లను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చేనేత జౌళి, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అధికారులతో కలిసి ఈ రోజు చీరల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు కార్మికులతో మాట్లాడారు. వేముల శ్రీనివాస్, మెరుగు శ్రీనివాస్ తదితర కార్మికులతో ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్ మాట్లాడారు. ప్రతి రోజు ఎన్ని మీటర్ల చీర ఉత్పత్తి చేస్తున్నారని? వారానికి ఎంత ఆదాయం వస్తుందని? అడిగి తెలుసుకున్నారు. చీరల ఉత్పత్తిలో ఏమైనా ఇబ్బంది ఎదురవుతున్నాయని ఆరా తీశారు. తమకు ప్రతివారం రూపాయలు 4000 నుంచి 5000 వరకు ఆదాయం వస్తుందని కార్మికులు వారి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి, కార్మికులను ఆదుకునేందుకు చేతినిండా పని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని వివరించారు. ఇందులో భాగంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఇందిరా మహిళ శక్తి కింద చీరల ఉత్పత్తి ఆర్డర్లు అందించామని తెలిపారు.
కార్మికులు, ఆసాములు కోరిన విధంగా ధర నిర్ణయించామని వెల్లడించారు.

ఇందిరా మహిళా శక్తి చీరలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని కార్మికులు, ఆసాములకు దాదాపు 8 నెలల పాటు ఉపాధి లభిస్తుందని తెలిపారు. గతంలోని బతుకమ్మ చీరల బకాయిలు దాదాపు 280 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా దశాబ్దాల కల నెరవేరుస్తూ వేములవాడలో రూపాయలు 50 కోట్లతో యార్న్ బ్యాంకు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అవసరమైన యార్న్ అంతా అక్కడ అందుబాటులో పెడుతున్నామని తెలిపారు. ఇతర ప్రభుత్వ శాఖ ఆర్డర్లు సిరిసిల్లకు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో కార్మికులు ఉపాధి లేక ఇబ్బంది పడేవారు అని ఇప్పుడు చేతినిండా పని ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆర్డర్లను ఆసాములు, కార్మికులు సద్వినియోగం చేసుకొని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. సెస్ పరిధిలోని బ్యాక్ బిల్లింగ్ సమస్య కోర్టు పరిధిలో ఉందని దానిపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇతర మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,
చేనేత జౌళి, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్,కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్,
మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప రెడ్డి, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఏడీ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

మెడికల్ విద్యార్థికి ఆర్థిక సహాయం.

మెడికల్ విద్యార్థికి ఆర్థిక సహాయం…

కల్వకుర్తి నేటి ధాత్రి:

shine junior college

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లు మండలం నుచ్చుగుట్ట తండాకు చెందిన నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన వర్త్యావత్ యశస్వినికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సహకారంతో చదివి సోమవారం వెలువడిన మెడికల్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 445 ర్యాంకు సాధించింది. ఉత్తమ ఫలితాలు కనబరిచిన గిరిజన పుత్రిక యశస్విని సన్మానించిన ఉప్పల వెంకటేష్ యశస్విని మెడిసిన్ పూర్తి చేయడం కోసం పూర్తిగా ఉప్పల చారిటబుల్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అండగా నిలుస్తానని భరోసా కల్పించారు. గిరిజన తండాల్లో పుట్టి, కన్నా తల్లిదండ్రుల కష్టాలను చూస్తూ పెరిగి నేడు ఉస్మానియా, గాంధీ వంటి మెడికల్ కళాశాలలో సీటును సాధించిన యశస్విని ఎంతోమంది గిరిజన బిడ్డలకు ఆదర్శమని ఉప్పల వెంకటేష్ కొనియాడారు.

భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొన్న.

భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ రాజిరెడ్డి

పరకాల నేటిధాత్రి

 

shine junior college

 

రైతుల సంక్షేమం కోసం రాష్ట ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి కార్యక్రమంలో భాగంగా పరకాల పట్టణంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సన్నచిన్నకారు రైతులను ద్రృష్టిలో ఉంచుకొని,రైతులకు హక్కులు కల్పించాలనే ఉధ్ధేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు నూతన భూ భారతి చట్టం తీసుకు రావడం జరిగిందన్నారు.తరాలుగా సాగు చేసుకుంటూ పట్టాలు లేని రైతులందరికి ప్రజా ప్రభుత్వం సమగ్రంగా సర్వే నిర్వహించి పట్టాలు ఇవ్వబోతుందని,గత ప్రభుత్వ హయంలో రైతులందరికి సబ్సిడిలను ఇవ్వకుండా మోసం చేసిందని,ప్రజా ప్రభుత్వం రైతుల మేలుతో పాటు ప్రతి రైతు శ్రేయస్సు కు కృషి చేస్తుందని ప్రజల కోసం పరితపించే ప్రజా ప్రభుత్వానికి అండగా నిలువాలని కోరారు.ఈ కార్యక్రమంలో పరకాల తహసిల్దార్ విజయలక్ష్మి,రెవెన్యూ సిబ్బంది,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్,కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీనాయకులు,కార్యకర్తలు,స్ధానిక రైతులు తదితరులు పాల్గోన్నారు.

చెన్నాపూర్ లో 33/11 కెవి సబ్ స్టేషన్ ప్రారంభించిన.

చెన్నాపూర్ లో 33/11 కెవి సబ్ స్టేషన్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం బట్టి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

shine junior college

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరి కొత్తపల్లి మండలం చెన్నాపూర్ గ్రామంలో 33/11 కెవి సబ్ స్టేషన్ ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వరంగల్ ఎంపీ కడియం. కావ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, సిఎండి వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తదితరులు పాల్గొన్నారు

టెక్స్టైల్స్ పార్క్ యజమానులతో సమావేశం.

టెక్స్టైల్స్ పార్క్ యజమానులతో సమావేశం…

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

shine junior college

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని టెక్స్టైల్స్ పార్క్ యజమానులతో చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అనంతరం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం మినీ సమావేశ మందిరంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా టెక్స్టైల్స్ పార్క్ యజమానులు తమకు ప్రభుత్వం నుంచి మరిన్ని వస్త్రం ఉత్పత్తి ఆర్డర్లు ముందస్తుగా ఇవ్వాలని, తమ సమస్యలు పరిష్కరించాలని.

park

చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ ను కోరారు. వివిధ శాఖలకు అవసరమైన ఆర్డర్స్ అందజేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం నాణ్యతతో వస్త్రాలు ఉత్పత్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప రెడ్డి, చేనేత జౌళి శాఖ జేడీ ఎన్ వెంకటేశ్వర్ రావు, ఏడీ రాఘవరావు, వివిధ మ్యాక్స్ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు యజమానులు ఆసాములు, టెక్స్టైల్స్ పార్క్ యజమానుల సంఘం అధ్యక్షుడు అన్నల్ దాస్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల్లోపట్టణంలో వింతవ్యాధులతో కుక్కల విహారం.

గ్రామాల్లో పట్టణంలో వింతవ్యాధులతో కుక్కల విహారం…

తమకు సోకుతాయేమో అని భయందోళనలో ప్రజలు

పరకాల నేటిధాత్రి:

 

shine junior college

పట్టణ,మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కలకు ఫంగస్ వచ్చి, వింత రోగాలు,చర్మ వ్యాధులతో విచ్చలవిడిగా వీదులల్లో తిరుగుతున్నాయి.కుక్కులకు అంతుచిక్కని వింతరోగాలతో శరీరాలపైన వెంట్రుకలు ఊడిపోయి,చర్మం పగుళ్ళు ఏర్పడి రక్తాలు కారుతు చర్మ వ్యాధులతో ఇటు పట్టణంతో పాటు గ్రామాలలో సంచరిస్తున్నాయి.చాలా వరకు కుక్కలు చర్మం తోలు ఊడిపోయి భయంకరంగా కొన్ని సినిమాలల్లో చూపించిన విధంగా గ్రామాల్లో దర్శనమిస్తున్నాయి.కుక్కలకు ఏదో వైరస్ సోకి అది వ్యాధిగా మారి ప్రజలకు సోకుతుందేమోనని గ్రామాల మరియు పట్టణాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.చదువు నిమిత్తం పాఠశాలకు,కళాశాలకు వెళ్లే పిల్లలను కరిచి గాయపరిచే ప్రమాదం ఉందని అధికారులు చొరవ తీసుకోని వింత వ్యాధులతో బాధపడుతున్న కుక్కల బారి నుండి తమ ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

జహీరాబాద్ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.

జహీరాబాద్ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

shine junior college

జహీరాబాద్ పట్టణంలో నివాసం ఉండే వెంకటరమణ (19) అనే ఆర్ ఎల్ ఆర్ కళాశాల విద్యార్థి, ఇంటర్మీడియట్ లో ఒక సబ్జెక్ట్ లో ఫేయిల్ అయినందుకు మనస్థాపం చెంది తమ నివాసంలో సోమవారం మధ్యాహ్నం ఉరివేసుకుని, ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని కేసు దర్యాప్తు చేస్తున్న జహీరాబాద్ పట్టణ ఎస్ఐ కె. వినయ్ కుమార్ సోమవారం సాయంత్రం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు.

నేనే ఆమెను చంపేశా నేరాన్ని అంగీకరించిన.

నేనే ఆమెను చంపేశా.. నేరాన్ని అంగీకరించిన హర్యానా మోడల్ బాయ్‌ఫ్రెండ్

 

 

shine junior college

 

హర్యానాలో మోడల్ హత్య కేసు మిస్టరీ వీడింది.

 

తానే ఈ హత్య చేసినట్టు ఆమె బాయ్‌ఫ్రెండ్ పోలీసుల ముందు అంగీకరించాడు.

 

ఇంటర్నెట్ డెస్క్:

హర్యానా మోడల్ షీతల్ హత్య కేసు మిస్టరీ వీడింది.

షీతల్‌ను తానే హత్య చేశానని ఆమె బాయ్‌ఫ్రెండ్ సునీల్ చౌదరి నేరాన్ని అంగీకరించాడు.

 

షీతల్‌కు అప్పటికే పెళ్లి అయ్యింది. ఐదు నెలల బిడ్డ కూడా ఉంది.

 

సునీల్ కూడా వివాహితుడు, ఇద్దరు పిల్లల తండ్రి.

 

ఈ నేపథ్యంలో సంచలనంగా మారిన హత్యోదంతాన్ని పోలీసులు ఛేదించారు.

కేసు పూర్తి వివరాల్లోకి వెళితే, జూన్ 14న షీతల్ ఓ ఆల్బమ్ ఫొటో షూట్ కోసం పానిపట్‌లోని ఓ గ్రామానికి వెళ్లారు.

రాత్రి 10.30 సమయంలో సునీల్ ముందస్తు సమాచారం ఏదీ లేకుండా అక్కడకు వెళ్లాడు.
అతడి కారులో కూర్చుని ఇద్దరూ కొంత సేపు మాట్లాడుకున్నారు.
మద్యం సేవించారు. అనంతరం వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఈ నేపథ్యంలో షీతల్ తన సోదరి నేహకు ఫోన్ చేసిన సునీల్ తనపై చేయి చేసుకున్న విషయాన్ని చెప్పింది.
ఈలోపు కాల్ కట్ అయిపోయింది. నేహ మళ్లీ ప్రయత్నించినా షీతల్‌ ఫోన్ స్విచాఫ్ అని వచ్చింది.

జూన్ 15న పోలీసులకు సునీల్ కారు పానిపట్‌లోని ఓ కాలవలో లభించింది.
ఈలోపు ఆసుపత్రికి చేరుకున్న సునీల్ తన కారు కాలవలో పడిపోయిందని తెలిపాడు.
షీతల్ కారుతో పాటు నీట మునిగిపోయిందన్నాడు. తాను మాత్రం తప్పించుకోగలిగానని చెప్పాడు.
ఆ మరుసటి రోజు షీతల్ మృతదేహం లభించింది.
ఆమె గొంతుపై గాయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
ఆమె ఒంటిపై ఉన్న టాటూల ఆధారంగా మృతదేహాన్ని గుర్తించారు.
ఈ క్రమంలో విచారణ ప్రారంభించిన పోలీసులు సునీల్‌ను ప్రశ్నించగా అతడు తను చేసిన నేరాన్ని అంగీకరించాడు.
ఇక పోలీసులు షీతల్ మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, షీతల్, సునీల్ మధ్య ఆరేళ్లుగా పరిచయం ఉంది.

 

సునీల్ హోటల్‌లో షీతల్ కొంతకాలం పనిచేసింది.

అయితే, తనను పెళ్లి చేసుకోవాలంటూ సునీల్ షీతల్‌ను కోరాడు.

 

అతడికి అప్పటికే పెళ్లయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉండటంతో ఆమె అతడి ప్రతిపాదనను తిరస్కరించింది.

 

ఇక హర్యానా మ్యూజిక్ రంగంలో కొనసాగుతున్న షీతల్‌‌కు కూడా పెళ్లి అయ్యింది.

 

ఆమెకు ఐదు నెలల వయసున్న బిడ్డ కూడా ఉంది.

 

ఈ నేపథ్యంలో ఈ హత్యోదంతం స్థానికంగా పెను కలకలానికి దారితీసింది.

ట్రంప్ ఫ్యామిలీ నుంచి మార్కెట్లోకి కొత్త మొబైల్ కంపెనీ .

ట్రంప్ ఫ్యామిలీ నుంచి మార్కెట్లోకి కొత్త మొబైల్ కంపెనీ

 

shine junior college

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ టెక్నాలజీ ప్రపంచంలో మరో ముందడుగు వేసింది. కొత్తగా ట్రంప్ T1 గోల్డ్ కలర్ స్మార్ట్‌ఫోన్‎ను (Trump Smartphone Launch) మార్కెట్లోకి లాంచ్ చేసి అనేక సేవలను అందిస్తామని తెలిపింది.

 

 

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‎కి (Donald Trump) అనేక వ్యాపారాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఫ్యామిలీ ట్రంప్ మొబైల్ అనే కొత్త మొబైల్ ఫోన్ (Trump Smartphone Launch) సేవలను ప్రారంభించింది. ఈ సేవల్లో భాగంగా T1 అనే గోల్డ్ కలర్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నారు. ఇది అమెరికాలో తయారైనట్లు ప్రకటించారు. అయితే, ఈ ఫోన్ నిజంగా అమెరికాలో తయారైందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సేవలో భాగంగా నెలవారీ ప్లాన్‌ను $47.45 ధరతో అందిస్తున్నారు.

 

Trump Smartphone Launch

ట్రంప్ మొబైల్ సేవా వివరాలు

ది 47 మొబైల్ ప్లాన్‎లో అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అనలిమిటెడ్ కాల్స్, టెక్స్ట్ మెసేజ్‌లు, డేటా, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, టెలీహెల్త్ సేవలు, 100కి పైగా దేశాలకు ఉచిత అంతర్జాతీయ కాల్స్ వంటివి కలవు. ఈ సేవలు వినియోగదారులకు సమగ్రమైన ప్యాకేజీని అందించేలా రూపొందించబడ్డాయి. కానీ దీని వెనుక ఉన్న వ్యాపార వ్యూహం చర్చనీయాంశంగా మారింది.

 

 

దీని ధర ఎంత..

టీ1 ఫోన్ విషయానికొస్తే, ఈ స్మార్ట్‌ఫోన్ ధర $499గా (రూ. 42,929.72) నిర్ణయించబడింది. ఇందులో 6.8 అంగుళాల స్క్రీన్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, అమెరికన్ ఫ్లాగ్ డిజైన్, ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్‌ను అమెరికాలో తయారు చేసినట్లు ప్రకటించినప్పటికీ, దీని తయారీ ప్రక్రియపై సందేహాలు ఉన్నాయి. ఫోన్ భాగాలు లేదా అసెంబ్లీ ప్రక్రియ ఇతర దేశాల నుంచి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

వ్యాపార వ్యూహం

ట్రంప్ మొబైల్ సేవలు AT&T, Verizon, T Mobile వంటివి అమెరికా ప్రధాన టెలికాం క్యారియర్ల భాగస్వామ్యంతో పనిచేస్తుంది. ఈ భాగస్వామ్యాలు సేవను విస్తృత వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఉపయోగపడతాయి. అయితే, ట్రంప్ కుటుంబం అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో ఇలాంటి వ్యాపార ఒప్పందాలు చేయడం నైతిక సందేహాలను రేకెత్తిస్తోంది. అధికారంలో ఉన్న వ్యక్తులు తమ పదవిని వ్యాపార లాభాల కోసం ఉపయోగించుకోవడం సముచితమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 

సందేహాలు

అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి లేదా ఆయన కుటుంబం వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొనడం, ప్రభుత్వ విధానాలను వ్యక్తిగత లాభాల కోసం ప్రభావితం చేసే అవకాశం ఉందనే ఆందోళనలు ఉన్నాయి. దీంతో ట్రంప్ మొబైల్ సేవల ఒప్పందాలు ప్రజల విశ్వాసాన్ని నష్టపరిచే అవకాశం ఉందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాపారం ద్వారా ట్రంప్ కుటుంబం ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. కానీ ఇది ప్రజా విశ్వాసం, పారదర్శకతపై ప్రభావం చూపించనుంది. ఇప్పటికే ట్రంప్ ఫ్యామిలీకి రియల్ ఎస్టేట్ సహా అనేక వ్యాపారాలు ఉన్నాయి.

మా అమ్మ, బిడ్డలు ఏడుస్తున్నా పట్టించుకోలేదు.

మా అమ్మ, బిడ్డలు ఏడుస్తున్నా పట్టించుకోలేదు..

శిరీష ఆవేదన

 

shine junior college

 

 

అప్పు తీరుస్తామని చెప్పినా వదల్లేదని బాధితురాలు శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. కన్నప్ప కుటుంబ సభ్యులు.. తనను తీవ్రంగా కొట్టడంతో చెయ్యికి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని శిరీష తెలిపారు.

 

చిత్తూరు, జూన్ 17: అప్పు కట్టలేదని మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన సంచలనం సృష్టించింది.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కూడా సీరియస్‌ అయ్యాయి.
తాజాగా ఈ దారుణ ఘటనపై బాధితురాలు శిరీష స్పందిస్తూ.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పు తీర్చలేదని మహిళ అని చూడకుండా నడిరోడ్డుపై తాడుతో చెట్టుకు కట్టేశారంటూ శిరీష కన్నీరు పెట్టుకున్నారు.
తనకు ఇద్దరు ఆడ బిడ్డలు, ఒక మగ బిడ్డ ఉన్నారని తెలిపారు.
‘బెంగళూరు నుంచి నారాయణపురంలో నా బిడ్డ టీసీ కోసం గ్రామానికి వచ్చాను.
 టీసీ తీసుకుని పాఠశాల నుంచి బయటకు నడుచుకుంటూ వస్తుండగా అప్పు ఇచ్చిన కన్నప్ప కుటుంబ సభ్యులు ఎదురుపడి రూ.80,000 ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కఠినంగా వ్యవహరించారు’ అని తెలిపారు.
పాఠశాల వద్ద నుంచి తనను లాక్కుని వచ్చి చెట్టుకు తాడుతో కట్టేశారన్నారు.
అప్పు తీరుస్తామని చెప్పినా వదల్లేదన్నారు. కన్నప్ప కుటుంబ సభ్యులు.. 
తనను తీవ్రంగా కొట్టారని ఆవేదన చెందారు.
కన్నప్ప కుటుంబ సభ్యుల దాడిలో తన చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు.
తన కళ్ళ ఎదుటే బిడ్డలు అమ్మా అంటూ ఏడుస్తున్నా పక్కకు లాగి పారేశారని కన్నీటి పర్యంతమయ్యారు.


దాదాపు గంటసేపు చెట్టుకు కట్టేసి ఇష్టానుసారంగా మాట్లాడారన్నారు.

‘మా అమ్మ, నా ముగ్గురు బిడ్డలు ఏడుస్తున్నా వారు పట్టించుకోలేదు’ అని తెలిపారు.
ఎవరో ఒక పెద్దాయన బుల్లెట్‌పై వచ్చి మహిళను అలా చేయకూడదని చెప్పినా వినలేదన్నారు.
కొంత మంది సహాయంతో కట్లు విప్పుకొని వచ్చేసినట్లు చెప్పారు.
ఈ వీడియో ఎవరు తీశారో తనకు తెలియదని..
మొత్తం వైరల్ అయిందన్నారు.
తన కట్లు విప్పేసిన తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశానని బాధితురాలు శిరీష చెప్పుకొచ్చారు.
కాగా.. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది.
అప్పు కట్టాలంటూ శిరీష అనే మహిళను గ్రామానికి చెందిన మునికన్నప్ప, అతడి కుటుంబసభ్యులు చెట్టుకు కట్టేయడంతో పాటు దాడి చేశారు.
ఈ ఘటనను కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
మరోవైపు ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు.
మహిళను చెట్టుకు కట్టేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి పునరావృత్తం కాకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

అండర్సన్‌ టెండూల్కర్‌ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదా.

అండర్సన్‌ టెండూల్కర్‌ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదా…

shine junior college

అహ్మదాబాద్‌ విమాన దుర్ఘటన నేపథ్యంలో అండర్సన్‌-టెండూల్కర్‌ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదాపడింది. గతంలో. లండన్‌: అహ్మదాబాద్‌ విమాన దుర్ఘటన నేపథ్యంలో అండర్సన్‌-టెండూల్కర్‌ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదాపడింది. గతంలో ఇంగ్లండ్‌-భారత్‌ మధ్య సిరీ్‌సను పటౌడీ ట్రోఫీగా వ్యవహరించేవారు. అయితే, ఇంగ్లండ్‌ బోర్డు ఆ పేరు మార్చి ఆధునిక దిగ్గజాలు అండర్సన్‌-టెండూల్కర్‌ పేరున ట్రోఫీని తీసుకురావాలనే నిర్ణయం తీసుకొంది. సిరీస్‌ ఆరంభమయ్యే ముందే ట్రోఫీ ఆవిష్కరణ జరుగుతుందని బీసీసీఐ తెలిపింది.

తండ్రిపై కుమార్తె రోకలి బండతో దాడి .

తండ్రిపై కుమార్తె రోకలి బండతో దాడి 

 

shine junior college

వ్యసనాలకు బానిసైన తండ్రి పుల్లెపు నర్సయ్య (54)తో కుమార్తె వర్షిత గొడవ పడింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ పెరిగి పెద్దదయింది. దీంతో ఆవేశంలో కుమార్తె కన్న తండ్రిపై రోకలి బండతో దాడి చేసి కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.

 

 

Nizamabad: రక్త సంబంధాలు రోజు రోజుకు కనుమరుగైపోతున్నాయి. ఆస్తులు, ఇంట్లో గొడవలు ఇలా రకరకాల కారణాలతో (Family Dispute) ఆయా కుటుంబసభ్యులు రక్తసంబంధాలనే మరిచిపోతున్నారు. దాడులు చేసుకుంటూ హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా కన్నతండ్రిని కుమార్తె రోకలి బండతో కొట్టి చంపిన (Daughter kills father) విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లా (Nizamabad Dist), నవీపేట్ మండలం, ధర్మారం గ్రామంలో చోటుచేసుకుంది.

 

 

వ్యసనాలకు బానిసైన తండ్రి పుల్లెపు నర్సయ్య (54)తో కుమార్తె వర్షిత గొడవ పడింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ పెరిగి పెద్దదయింది. దీంతో ఆవేశంలో కుమార్తె కన్న తండ్రిపై రోకలి బండతో దాడి చేసి కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న నవీపేట్ ఎస్‌ఐ వినయ్ గ్రామానికి చేరుకొని ఈ సంఘటనపై విచారణ చేపట్టారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

మరోవైపు హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వ్యక్తి దుర్మరణం చెందాడు. డీమార్ట్ వద్ద వ్యక్తి నడిచి వెళుతుండగా అతి వేగంగా వచ్చిన వాహనం వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న కాచిగూడ సీఐ జోష్న మృతుడి వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కొడైకెనాల్‌ ‘గుణా’ గుహ వద్ద నోట్ల వర్షం కురిపించిన వానరం .

కొడైకెనాల్‌ ‘గుణా’ గుహ వద్ద నోట్ల వర్షం కురిపించిన వానరం

 

shine junior college

ప్రముఖ పర్యాటక ప్రాంతం కొడైకెనాల్‌ ‘గుణా’ గుహ వద్ద చెట్టుపై కూర్చుని ఓ వానరం ఐదువందల కరెన్సీ నోట్ల కట్ట పట్టుకుని ఒక్కో నోటు విసిరేసిన సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తీవ్రంగా వైరల్‌ అవుతోంది.

 

చెన్నై: ప్రముఖ పర్యాటక ప్రాంతం కొడైకెనాల్‌(Kodaikanal) ‘గుణా’ గుహ వద్ద చెట్టుపై కూర్చుని ఓ వానరం ఐదువందల కరెన్సీ నోట్ల కట్ట పట్టుకుని ఒక్కో నోటు విసిరేసిన సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తీవ్రంగా వైరల్‌ అవుతోంది. కొద్ది రోజుల క్రితం గుణా గుహను సందర్శించేందుకు వచ్చిన కర్ణాటకు చెందిన పర్యాటకుడి సంచిని ఓ వానరం లాక్కెళ్లింది. కాసేపయ్యాక ఆ వానరం ఓ చెట్టెక్కి సంచిలో ఉన్న రూ.500 నోట్ల కట్ట పట్టుకుని ఒక్కో నోటు కిందకు వేసింది.

దీనితో ఆ కర్ణాటక పర్యాటకుడు కింద పడిన నోట్లను ఏరుకోగా తక్కిన ప్రయాణికులు కూడా నోట్లను సేకరించి ఆయనకు అందజేశారు. అయితే ఆ వానరం విసిరేసిన నోట్లలో కొన్ని గుణా గుహలో పడ్డాయి. ఆ నోట్లను తీయడం కష్టమని తెలుసుకుని, కర్ణాటక(Karnataka) పర్యాటకుడు ఆ వానరం విసిరేసిన నోట్లన్నింటిని ఏరుకుని బయలుదేరాడు. ప్రస్తుతం ఆ వానరం చెట్టుపై నుంచి ఐదు వందల రూపాయల నోట్లను ఒక్కొక్కటిగా విసిరేస్తున్న వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

కెనడియన్‌ గ్రాండ్‌ ప్రీ విజేత జార్జ్‌.

కెనడియన్‌ గ్రాండ్‌ ప్రీ విజేత జార్జ్‌

 

 

shine junior college

 

 

ఫార్ములావన్‌ స్టార్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌కు కెనడియన్‌ గ్రాండ్‌ ప్రీలో చుక్కెదురైంది. ఫైనల్‌ రేసులో వెర్‌స్టాపెన్‌కు షాకిస్తూ…

మాంట్రియల్‌: ఫార్ములావన్‌ స్టార్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌కు కెనడియన్‌ గ్రాండ్‌ ప్రీలో చుక్కెదురైంది. ఫైనల్‌ రేసులో వెర్‌స్టాపెన్‌కు షాకిస్తూ.. మెర్సిడెస్‌ డ్రైవర్‌ జార్జ్‌ రస్సెల్‌ చాంపియన్‌గా నిలిచాడు. మ్యాక్స్‌ రెండోస్థానానికి పరిమితమవగా.. మెర్సిడె్‌సకే చెందిన కిమి ఆంటోనెలి మూడోస్థానంతో పోడియం ఫినిష్‌ చేశాడు. బ్రిటన్‌కు చెందిన 27 ఏళ్ల జార్జ్‌కిది ఎఫ్‌-1 కెరీర్‌లో నాలుగో విజయం.

పూరి మూవీలో సంయుక్త

పూరి మూవీలో సంయుక్త

 

 

shine junior college

పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న సినిమాలో విజయ్ సేతుపతి, టబు, దునియా విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడీ సినిమాలోకి తాజాగా సంయుక్త వచ్చి చేరింది.

 

 

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) తో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఛార్మి (Charmy) నిర్మాణ భాగస్వామిగా ఉంటున్న ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులే అయ్యింది. ఇందులో ఓ ప్రధాన పాత్రకు టబును తీసుకున్నట్టు చిత్ర బృందం గతంలోనే ప్రకటించింది. ఇప్పుడీ సినిమాలో మరో కీలక పాత్ర కోసం సంయుక్త మీనన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది.

 

పూరి, విజయ్ సేతుపతి కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీకి ‘బెగ్గర్’ అనే పేరు ఖరారు చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో ‘బెగ్గర్’ అనే పేరును కోలీవుడ్ వర్గాలు అంగీకరించవు కాబట్టి దాని బదులు ‘బిక్షాందేహి’ అనే టైటిల్ పెడితే మరింత బెటర్ గా ఉంటుందనే సలహా వచ్చిందట. చిత్రం ఏమంటే… తమిళులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లీష్ టైటిల్ ను అయినా యాక్సెప్ట్ చేస్తారు కానీ సంస్కృత పదాన్ని తమ సినిమాకు పేరుగా ఎందుకు ఒప్పుకుంటారు? అని కొందరంటున్నారు. ఏతావాతా ఈ సినిమా టైటిల్ పై ఇంకా అనిశ్చిత పరిస్థితి నెలకొని ఉంది.

 

ఇదిలా ఉంటే… సంయుక్త మీనన్ తెలుగులో బాలకృష్ణ సరసన ‘అఖండ -2’ లో నటిస్తోంది. అలానే తన ప్రెజెంటర్ గా, దర్శకుడు యోగి తెరకెక్కిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీలోనూ ఆమె నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. యంగ్ హీరో నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘స్వయంభూ’లోనూ సంయుక్త నాయికగా చేస్తోంది. ఇక పూరి జగన్నాథ్‌ స్వీయ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో తీయబోతున్న సినిమాలో ‘దునియా’ విజయ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే పూరి తనయుడు ఆకాశ్ కూడా ఓ కీ-రోల్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో అశ్విన్‌

బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో అశ్విన్‌

 

shine junior college

భారత మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ ఆర్‌.అశ్విన్‌ మరో వివాదంలో చిక్కుకున్నాడు. గతవారం మహిళా అంపైర్‌తో గొడవకు దిగిన అతను తాజాగా…

 

కోయంబత్తూరు: భారత మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ ఆర్‌.అశ్విన్‌ మరో వివాదంలో చిక్కుకున్నాడు. గతవారం మహిళా అంపైర్‌తో గొడవకు దిగిన అతను తాజాగా బంతి స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నించాడంటూ మధురై పాంథర్స్‌ జట్టు ఫిర్యాదు చేసింది. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ (టీఎన్‌పీఎల్‌)లో అశ్విన్‌ దుండిగల్‌ డ్రాగన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈనెల 14న ఇరుజట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ‘డ్రాగన్స్‌ జట్టు ఆటగాళ్లు రసాయనాల్లో ముంచిన టవళ్లతో బంతిని పదేపదే తుడిచారు. తద్వారా బంతి బరువును పెంచాలని చూశారు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు ఇందుకు తగిన ఆధారాలను చూపడంలో మధుర జట్టు విఫలమైందని టీఎన్‌పీఎల్‌ ప్రకటించింది.

డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్‌కు ఘన స్వాగతం.

డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్‌కు ఘన స్వాగతం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

shine junior college

 

 

ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రజతోత్సవంలో భాగంగా అమెరికాలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా నుండి తిరిగి స్వదేశానికి విచ్చేసిన సందర్భంగా, సంగారెడ్డి జిల్లా ఝ రా సంగం మండలం మెదపల్లి బీ ఆర్ఎస్ సీనియర్ నేత పరమేశ్వర్ పాటిల్ ఝరాసంగం మండల బీఆర్ఎస్ పార్టీ యువనాయకులు ఎస్.కె. షోయల్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మాజీ ఎంపీపీ విజయకుమార్, ఝరాసంగం మండల బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు మాణికప్రభు పాటిల్, యువ నాయకులు నవీన్ పాటిల్ శివకుమార్, సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ యువజన సంయుక్త కార్యదర్శి పోలీస్ ప్రవీణ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

నేడు జట్టుతో చేరనున్న గంభీర్‌

నేడు జట్టుతో చేరనున్న గంభీర్‌

 

 

shine junior college
భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ గౌతం గంభీర్‌ మంగళవారం జట్టుతో చేరనున్నాడు. తల్లి సీమా గంభీర్‌ గుండెపోటుకు గురైనందున…

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ గౌతం గంభీర్‌ మంగళవారం జట్టుతో చేరనున్నాడు. తల్లి సీమా గంభీర్‌ గుండెపోటుకు గురైనందున అతడు ఈనెల 12న స్వదేశానికి వచ్చాడు. గౌతీ తల్లి ఐసీయూలో చికిత్స పొందుతున్నప్పటికీ..ఆమె ఆరోగ్యం మెరుగైందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం కెంట్‌లో ఉన్న భారత జట్టు శుక్రవారం నుంచి ఇంగ్లండ్‌తో జరిగే తొలి టెస్టు కోసం మంగళవారం హెడింగ్లీకి బయల్దేరి వెళ్లనుంది.

ఆర్చరీలో తెలుగమ్మాయి రెండు ప్రపంచ రికార్డులు.

ఆర్చరీలో తెలుగమ్మాయి రెండు ప్రపంచ రికార్డులు

 

shine junior college

 

సింగపూర్‌లో జరుగుతున్న ఆసియాకప్‌ స్టేజ్‌ 2 అండర్‌-21 ఆర్చరీ ర్యాంకింగ్‌ రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి బుద్ధె షణ్ముఖి నాగసాయి…

విజయవాడ స్పోర్ట్స్‌: సింగపూర్‌లో జరుగుతున్న ఆసియాకప్‌ స్టేజ్‌ 2 అండర్‌-21 ఆర్చరీ ర్యాంకింగ్‌ రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి బుద్ధె షణ్ముఖి నాగసాయి రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. 50 మీటర్ల కాంపౌండ్‌ మహిళల టీమ్‌ ఈవెంట్‌లో షణ్ముఖి, తేజల్‌ సాల్వే, తనిష్కలతో కూడిన భారత జట్టు 2101 పాయింట్లు స్కోరుచేసి వరల్డ్‌ రికార్డు సాధించింది. ఈ క్రమంలో 2076 పాయింట్ల రికార్డును అధిగమించింది. ఇక మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో షణ్ముఖి, కుషాల్‌ దలాల్‌ ద్వయం 1420 పాయింట్లు స్కోరు చేసి గత వరల్డ్‌ రికార్డు (1419)ను అధిగమించింది.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version