రైతులకు ఎరువులు సకాలంలో అందించాలి – సిపిఐ డిమాండ్…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T115608.465-1.wav?_=1

చర్ల రైతులకు ఎరువులు సకాలంలో అందించాలి
సిపిఐ రైతు సంఘం డిమాండ్

నేటిధాత్రి చర్ల

చర్ల మండలంలో వరి పత్తి మిర్చి మొక్కజొన్న ఆకు కూరలు కూరగాయలు ఇతర పంటలు సాగుచేసుకుంటున్న రైతులకు ఎరువులు సకాలంలో సరిపడా సరఫరా చేయకపోవడం వల్ల రైతులు నష్టాల బారిన పడే పరిస్థితులు ఏర్పడ్డాయి అప్పులు చేసి సాగు ప్రారంభించిన రైతులకు ఎరువులు అందించకపోవడంలో దిగుబడి సన్నగిల్లి భారీ స్థాయిలో నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడుతుందని. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు ఆండ్రు వామనరావు అన్నారు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సరిపడా 10 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 5. 32లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసి చేతులు దులుపుకుంది దీంతో రాష్ట్రంలో ఎరువుల కొరత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారని తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మండల రైతంగానికి సరిపడా డిమాండ్ కనుగుణంగా ఎరువులను సకాలంలో సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు అవినీతి పైరవీలు దళారి వ్యవస్థలను అదుపుచేసి ప్రతి రైతుకు ఎరువుల అందించాలని అదేవిధంగా పూర్తి సబ్సిడీతో పురుగుల మందులు వ్యవసాయ పరికరాలు అందించాలని ఏఐకేఎస్ అనుబంధ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా మండల తాసిల్దార్ కార్యాలయ వద్ద వినతి పత్రాలు అందిస్తున్నామని ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడ్డగర్ల తాతాజీ తెలిపారు అనంతరం వివిధ డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని చర్ల మండల తాసిల్దార్ శ్రీనివాస్ కు అందించారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి నూప పోతయ్య సహాయ కార్యదర్శులు కోటి ముత్యాలరావు చల్లా లక్ష్మీనారాయణ కోడిరెక్కల రాజారావు నరసింహారావు మహేష్ రమణ రామారావు సత్యనారాయణ వీరబాబు నాగేశ్వరావు తేజ వెంకటేశ్వరరావు బాబురావు గోపాలకృష్ణ వసంతు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version