ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి ఎమ్మెల్యే మాణిక్ రావు…

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలిసి కొత్తూర్ శివారులో గల నారింజ బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇరిగేషన్ శాఖ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు ముఖ్యంగా వరద నీటి ఉద్రితిని నిరంతరం పర్వేక్షించాలని అధికారులను అదేశంచారు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల లో నివాసముండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండరాదని నీళ్లలో ఉన్న కరెంటు పోల్స్ ను తాకడం మరియు దగ్గర నుండి వెళ్లడం చేయరాదని పొంగి పొర్లే వాగులు వంకలను చూడటానికి వెళ్లకూడదని జలాశయాలు నిండుకుండల మారి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని పొంగిపోరిలే వాగులను దాటడానికి

 

 

ప్రయత్నించకూడదని అన్నారు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు సైతం లెక్క చేయకుండా నియోజవర్గం లో పర్యటిస్తూ వివిధ శాఖల అధికారులను తగిన సూచనలను చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని పలు శాఖల అధికారులను ఆదేశించడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే గారితో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరాసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,పాక్స్ చైర్మన్ మచ్చెందర్ సీనియర్ నాయకులు నామ రవికిరణ్ మాజి పట్టణ అధ్యక్షులు మోహియోద్దీన్ మండల బీసీ సెల్ అధ్యక్షులు అమిత్ కుమార్ ఎస్టీ సెల్ అధ్యక్షులు హిరు రాథోడ్ మాజి సర్పంచ్ లు కరణ్ రాజ్ జగదీష్ శంకర్ కొత్తూర్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమేష్ రెడ్డి నాయకులు శ్రీకాంత్ అరుణ్ పాప్ నాథ్ భీమ్ రావు రాథోడ్ నవీన్ తేజ శశి వర్ధన్ రెడ్డి బి ఆర్ ఎస్వీ నాయకులు ఫయాజ్ గ్రామ నాయకులు యేసు అతీఫ్ రౌఫ్ రాజు శివరాజ్ తదితరులు ఉన్నారు ..

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version