భారీ వర్షానికి పలువురు ఇండ్లలోకి నీరు…

భారీ వర్షానికి పలువురు ఇండ్లలోకి నీరు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలోని గుడివాడ ప్రాంతంలో నిన్న కురిసిన అతి భారీ వర్షాలకు పలువురి ఇండ్లలోకి వర్షపు నీరు వచ్చిందని తెలుసుకొని ఆ ప్రాంతాన్ని సందర్శించిన భారతీయ జనతా పార్టీ బృందానికి పక్కనే ఉన్న కాలువ లో పిచ్చి మొక్కలు చెత్తాచెదారం పేరుకుపోవడంతో నీరు ముందుకు వెళ్లకుండా కాలనీలోకి రావడం జరిగిందని గమనించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఫోన్లో సంప్రదించడం జరిగింది వెంటనే స్పందించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఇ ఏఈ ప్రాంతాన్ని సందర్శించి త్వరలోనే తగు చర్యలు తీసుకొని మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో రైతులు సిరిగనేని బాబురావు మోటపోతుల చందర్ గౌడ్ బీజేవైఎం కళాశాల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్, బిజెపి బూత్ అధ్యక్షులు పెండ్యాల శ్రీకాంత్ కాలనీవాసులు ఉన్నారు

ఇండ్లలోకి వర్షం నీరు చేరిన మాచునూర్ గ్రామం…

ఇండ్లలోకి వర్షం నీరు వచ్చింది అని మాచునూర్ లో రాస్తా

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మాచునూర్ గ్రామంలో వర్షపు నీరు ఇండ్లలోకి వచ్చిందని నిరసన తెలియజేసిన గ్రామ ప్రజలు ఇటీవల నాలుగు రోజులుగా వర్షపు కొరవడంతో ఇండ్లలోకి నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన చెందారు రాత్రి వేళలో వర్షపు నీరు ఇండ్లలోకి రావడంతో చిన్నపిల్లలు నిద్రాహారాలు మాని ఇబ్బందులతో బిక్కుబిక్కుమంటు జీవనం సాగిస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version