Category: Latest news
ప్రభుత్వ బడిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.
ప్రభుత్వ బడిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత
జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రవీందర్ రెడ్డి
కేసముద్రం/ నేటి దాత్రి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలువల యందు
జిల్లా విద్యశాఖ మరియు తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించబడినది.
ఈ కార్యక్రమానికి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా కేసముద్రం అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవ రెడ్డి, మరియు జిల్లా విద్యశాఖ అధికారి డాక్టర్ ఏ రవీందర్ రెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ బడులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు.
ప్రభుత్వ బడులు సామాజిక వారసత్వ సంపదను పెంపొందిస్తాయని, పేర్కొన్నారు.
ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్య అందుతుందని, పైసా ఖర్చు లేకుండా పాఠ్యపుస్తకాలు, యూనిఫార్మ్స్ మరియు నోట్ పుస్తకాలు అందించడం జరుగుతుందని, తెలిపారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులు బోధిస్తున్నారని, అలాంటి ఊరుబడిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వము అందించే ఉచిత పథకాలను ఆదరించిన విధంగానే ప్రభుత్వ బడులను కూడా ఆదరించాలని, ప్రజలందరూ తమ పిల్లలను ఊరి పాఠశాలలోనూ చేర్పించాలని కోరారు. కలువల ప్రాథమిక పాఠశాలలో తమ పిల్లవాణ్ణి చేర్పించిన యుపిఎస్ నరసింహుల గూడెం ఉపాధ్యాయులు ఎస్ కే సయ్యద్ను ఘనంగా సన్మానించడం జరిగింది.అదేవిధంగా కలవల ఉన్నత పాఠశాల పదవ తరగతి టాపర్స్, కే తేజస్విని, వై వెన్నెల మరియు జి శివాని లను కూడా అభినందించారు. గణితంలో వందకు వంద మార్కులు సాధించిన
వై వెన్నెలకు పాఠశాల గణిత ఉపాధ్యాయులు తండా సదానందం వెయ్యి రూపాయల నగదు బహుమతిని అందజేయగా, మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి, 3016 రూపాయలు అందజేశారు. తర్వాత ప్రాథమిక పాఠశాలలో 65 అడ్మిషన్లు చేసిన ప్రధానోపాధ్యాయులు వీరారెడ్డి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేందర్ ను, మిగతా ఉపాధ్యాయులను డిఇఓ రవీందర్ రెడ్డి ,సంజీవరెడ్డి ఘనంగా సత్కరించారు. అనంతరం, బడిబాట ర్యాలీ తీయడం జరిగింది. గ్రామ కూడలిలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు గిద్దె రాం నరసయ్య మరియు బండ వెంకన్నల బృందం ఆటపాట కార్యక్రమాలను నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సెక్టోరియల్ అధికారులు ఆజాద్, అప్పారావు మండల విద్యాధికారి కాలేరు యాదగిరి, ఉపాధ్యాయులు ఏకాంబరం, తండా సదానందం, ఎం యాకాంబరం, ఆర్ బిక్షపతి బాలషౌరెడ్డి , వి రాజేంద్ర చారి, కే రాములు, మార్గం శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ కొప్పుల శంకర్ ,
వి రాము, కే పార్వతి, ఎండి జుబేర్ అలీ,
జి నాగరాజు,ఏ లింగయ్య,.,గోపి ..స్వరూప, శ్రీదేవి, హరికృష్ణ, కృష్ణ, మోహనకృష్ణ సిఆర్పి ఉదయ్, రాధ..నవీన్ మరియు తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు మునికుంట్ల ఐలేష్, ఎం భరత్, పరమేష్, బి .యాద గిరి, డప్పు యుగంధర్, వంగూరి శ్రీనివాసరావు, దేశెట్టి ప్రవీణ్ కుమార్ , అశ్విని, అనిల్, కవిత తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగురాలుకు మూడు చక్రాల సైకిల్ పంపిణీ.
దివ్యాంగురాలుకు మూడు చక్రాల సైకిల్ పంపిణీ…
భూపాలపల్లి నేటిధాత్రి:
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు విలీన విద్య, బాలిక విద్య కార్యక్రమము భవిత కేంద్రం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కృష్ణ కాలనీలో ప్రధానోపాధ్యాయులు రమ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ సామాజ సమీకరణ సమన్వయకర్త సమ్మిళితవిద్య సమన్వయకర్త సామల రమేష్ భూపాలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ ప్రధానో ఉపాధ్యాయులు లక్ష్మీ ప్రసన్న హాజరై, కార్యక్రమం ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ దివ్యంగులకు విద్యాశాఖ అంధిస్తున్న సేవలను భవిత సెంటర్ గురించి బాలిక విద్యా గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా దివ్యాంగురాలైన అమ్మాయికి మూడు చక్రాల సైకిల్ పంపిణీ చేయడం జరిగింది. దివ్యాంగులైన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా పుస్తకాలు యూనిఫామ్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేయడం జరిగింది. చైల్డ్ లైన్ వారి ద్వారా బాలికల గురించి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల స్వప్న టీచర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్స్ అమ్మ రజిత, కంకల రాజయ్య , మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
భద్రకాళీ వేద పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు.
భద్రకాళీ వేద పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు.
నేటిధాత్రి, వరంగల్.
వరంగల్ మహానగరంలోని చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానమునందలి శ్రీ భద్రకాళీ సాంగవేద ఆగమ సంస్కృత విద్యాలయమునందు వైదిక స్మార్త ఆగమము, తైత్తరీయ కృష్ణయజుర్వేదాధ్యయనంలో ప్రవేశం కొరకు ఆసక్తి గల విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవని దేవస్థాన కార్యనిర్వహణాధికారి/సహాయ కమీషనర్ కె. శేషుభారతి తెలిపారు. మాతృభాషలో చదవగలిగి, రాయగలిగిన విద్యార్థులు 8 నుండి 12 యేళ్ళ మధ్య వయస్సు గలిగి ఉపనయన సంస్కారం, ఉపాకర్మోత్సర్జనములు పూర్తి ఐనవారు సంధ్యావందనం, అగ్నికార్యం, బ్రహ్మయజ్ఞంలు కంఠస్థం అయివుండి స్వయముగా అనుష్ఠానము జరుపుకోగలిగినవారు అలాగే 10 సంస్కృత శబ్ధములు (7 విభక్తులు) కంఠస్థం అయివున్నవారు పాఠశాలలో అధ్యయనము చేయుటకు అర్హులని తెలిపారు. దరఖాస్తు ఫారాలను భద్రకాళి దేవస్థానం, వరంగల్ వారి వేదపాఠశాల యందు తేది: 18-06-2025 నుండి అందుబాటులో ఉంటాయని , విద్యార్థులు పూర్తిచేసిన దరఖాస్తు ఫారాలను 25-06-2025 వరకు వేదపాఠశాల కార్యాలయము నందు అందజేయగలరు అని ఈవో ఒక ప్రకటనలో తెలియచేశారు.
డీఎస్సీ ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలి.
ఫిబ్రవరిలో నియామకమైన 2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలి.
ఐదు నెలలుగా అందని జీతాలు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉద్యోగులు.
2008 డిఎస్సి లో సెలెక్ట్ అయి డీ.ఎడ్ రిజర్వేషన్ తో నియామకం నిలుపుదల.
కోర్టు నాశ్రయించిన బాధితులు, ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి పదిహేను సంవత్సరాల సుదీర్ఘ పోరాటం
కోర్టు అనుకూల తీర్పుతో కాంట్రాక్టు ఉద్యోగం ఇచ్చి తీరని అన్యాయం చేసిన ప్రభుత్వం.
ఐదు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం సమంజసం కాదు
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్.
కేసముద్రం/ నేటి దాత్రి
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో నియామకమైన డీఎస్సీ 2008 కాంట్రాక్టు ఉపాధ్యాయులకు నియామకమైన నెల నుండి నేటి వరకు ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదని, తక్షణమే ప్రభుత్వం వారికి జీతాలు చెల్లించేలాగా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్ చేశారు. కేసముద్రం విలేజ్ ప్రాథమిక పాఠశాలలో భోజన విరామ సమయంలో టి పి టి ఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ సంఘ మండల శాఖ అధ్యక్షులు సురేందర్ మాట్లాడుతూ..
డీఎస్సీ 2008లో సెలెక్ట్ అయి,నియామకం పొందే సమయంలో డి.ఎడ్ వారికి 30% రిజర్వేషన్ ఇవ్వాలన్న నిర్ణయంతో ఈ నియామకం ఆగిపోయిందని, ఈ విషయమై ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ప్రభుత్వం వీరికి ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. విధి లేని పరిస్థితుల్లో వీళ్ళు కోర్టు ను ఆశ్రయించి, ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి 15 సంవత్సరాలుగా పోరాటం చేశారని వివరించారు. చివరకు వీరికి అనుకూలంగా కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో వీరిని రెగ్యులర్ ఉపాధ్యాయులుగా కాకుండా కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా నియమించి వారికీ తీరని అన్యాయం చేశారని ఆయన వాపోయారు. ఈ పదిహేను సంవత్సరాలు వారు ఎంతో మనోవేదనకు గురయ్యారని, శారీరకంగా ఆర్థికంగా వారు ఎంతో నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో వీరికి కాంట్రాక్టు ఉద్యోగాన్ని అంటగట్టిన ప్రభుత్వం నియామకమైన ఫిబ్రవరి నెల నుండి నేటి వరకు సుమారు ఐదు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదని, ఎందుకీ వివక్ష అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వీరంతా ఐదు నెలలుగా తమ విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారని, కానీ జీతాలు రాక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకు పోయారని అన్నారు.
ప్రభుత్వం వీరికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని హితువు పలికారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి జీతాలు ఇవ్వడానికి అవసరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని సురేందర్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల శాఖ కార్యదర్శి వీసం నర్సయ్య, ఉపాధ్యాయులు అప్పాల నాగరాజులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీటీసీ ఆత్మహత్య ప్రయత్నం.
మాజీ ఎంపీటీసీ ఆత్మహత్య ప్రయత్నం…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
అంకుసాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి కుంటయ్య ఈరోజు ఆత్మ హత్యాయత్నంచేసుకోవడం జరిగింది. వెంటనే స్థానికులు గమనించి కుంటయ్యనుసిరిసిల్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తద్వారా మెరుగైనవైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు దీనిపై తెలిసిన సమాచారం ప్రకారం. తనకు సంబంధించినపది లక్షల భూమిని సదరు కృష్ణారెడ్డి
నా ప్లాట్ ని కబ్జా చేశారని పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని తిరిగి తనపై కేసులు నమోదు చేశారని బాధితుడూ ఆరోపించాడు దీంతో నా చావుకి కారణం గంగా కృష్ణారెడ్డి అని 10 లక్షల విలువైన భూమిని కబ్జ చేశాడు అంటూ కుంటయ్య స్టేటస్ పెట్టాడు స్టేటస్ చూసిన కుటుంబ సభ్యులు హుటాహుటిన.పోలీసులకు సమాచారం అందించడంతో దీంతో సంబంధిత పోలీసులు లొకేషన్ ట్రేస్ చేసి ఘటన స్థలానికి చేరుకొని పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న కుంటయ్యను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు స్థలంకి సంబంధించి పైసలు అడగడానికి వెళితే ఇవ్వడానికి నిరాకరించడంతో. కొన్ని రోజులుగా డబ్బుల పంచాయతీ నడుస్తుందని దీనిపై గతంలో కూడా పోలీస్ స్టేషన్లో పలు సందర్భాల్లో పలువురు మధ్యలో ఫిర్యాదు చేయడం జరిగిందని దీనికి సంబంధించి పోలీసులు కూడా పట్టించుకోకపోవడంతో. మనస్థాపం చెంది. ఈరోజు ఉదయం ఆత్మహత్యానికి పాల్పడినట్లు తెలియడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రులకి. తరలించారు అని సమాచారం. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది. గత సంబంధిత పోలీసు అధికారులు దీనిపై పూర్తి సమాచారం కోసం దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా నిజా నిజాలు తెలియాల్సి ఉన్నది. ఆత్మహత్య చేసుకునేదాకా. అవసరం ఏమొచ్చింది అని పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తున్నట్టు సమాచారం. మిగతా సమాచారం కోసం ఏమి జరిగింది అనే కోణాలపై ఆలోచించిన విషయం ఆసన్నమైనది. ముందుగా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుంటయ్య ఆరోగ్యం బాగుపడి బయటకు వస్తేనే పలు విషయాలపై నిజా నిజాలు బయటకు వస్తాయని ఆలోచన దీనిపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
నాన్నకు ప్రేమతో చిరు సత్కారం.
నాన్నకు ప్రేమతో చిరు సత్కారం
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
పితృదినోత్సవ సందర్భంగా భవానీ సాహితీ వేదిక కరీంనగర్ డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో వెలువడిన నాన్నకు ప్రేమతో కవితాసంపుటి పుస్తకపరిచయ సభ కరీంనగర్ లో వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో జరిగినది. ఈ సందర్భంగా తెలుగు కవి, సాహితీ విమర్శకుడు
డాక్టర్ మోత్కుల నారాయణ గౌడ్ నాన్నపై కవితను చదివి సభికులను ఆహ్లాదపరిచారు. ఈ సందర్భంగా వారి నాన్నగారైన మోతుకుల పోచయ్య గౌడ్ ని సాహితీ వేదిక నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఇది పితృ దినోత్సవ0 సందర్భంగా కొడుకు తండ్రికి చేసిన సన్మానంగా ఆ సభలో ఉన్న తెలుగు సాహితీవేత్తలు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ ,దాస్యం సేనానధిపతి, ముఖ్య అతిథి ఎన్. వి రఘువీర్ ప్రతాప్, విశిష్ట అతిథి బుస్స శ్రీనివాస్, సమీక్షకులు కథకులు కూర చిదంబరం, విశ్రాంత ఉపాధ్యాయ సంఘ నాయకులు నరహరి లక్ష్మారెడ్డి, టి. కిషన్ తదితర సాహితీవేత్తలు పాల్గొని సభను విజయవంతం చేశారు.
మృతునికుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత.
మృతునికుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన బంట్రోజు లక్ష్మీపతి గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి బియ్యం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి పరామర్శించి నా వంతు సహాయంగా 50 కేజీల బియ్యాన్ని అందచేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారుఈ o దుకుగాను వారి కుటుంబ సభ్యులు బియ్యం అందజేసినందుకు గాను వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల ఎఎంసి వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహ గౌడ్. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి. కృష్ణారెడ్డి. తిరుపతి. మనోజ్
శ్రీనివాస్ గౌడ్. నర్సింలు తదితరులు పాల్గొన్నారు
సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శులుగా ఎండి జాఫర్ కృష్ణ ఎన్నిక.
సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శులుగా ఎండి జాఫర్ కృష్ణ ఎన్నిక…
భూపాలపల్లి నేటిధాత్రి:
భూపాలపల్లి సిపిఐ 18వ పట్టణ మహాసభలో భూపాలపల్లి పట్టణ కమిటీ ఎన్నుకున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజకుమార్ తెలిపారు. పట్టణ మహాసభలో భూపాలపల్లి పట్టణ అభివృద్ధి కోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరిగిందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పేద ప్రజల కోసం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తున్న పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని తెలిపారు. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్,ఇందిరమ్మ ఇండ్లు,వృధ్యప్ప, వితంతువు మహిమ పింఛన్లు మంజూరు చేయాలనీ కోరారు. సిపిఐ భూపాలపల్లి పట్టణ నూతన కమిటీని 27మంది తో ఎన్నుకున్నట్లు తెలిపారు.
పట్టణ కార్యదర్శిగా సోతుకు ప్రవీణ్ కుమార్ సహాయ కార్యదర్శిలుగా ఎండి జాఫర్, పల్లి కృష్ణను నియమించారు.
కార్యవర్గ సభ్యులుగా మోటపలుకుల రమేష్ గురిజపల్లి సుధాకర్ రెడ్డి రాంచంధర్ జి శ్రీనివాస్ క్యాతరాజ్ సతీష్ కోరిమి సుగుణ నేరెళ్ల జోసెఫ్ వేముల శ్రీకాంత్ లతోపాటు కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నట్లు రాజకుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పట్టణ సహాయ కార్యదర్శులు ఎండి జాఫర్ కృష్ణలు మాట్లాడుతు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఇందిరా మహిళా శక్తి చీరలతో సిరిసిల్ల ప్రజలకు చేతినిండా ఉపాధి.
ఇందిరా మహిళా శక్తి చీరలతో సిరిసిల్ల ప్రజలకు చేతినిండా ఉపాధి
బతుకమ్మ చీరల బకాయిలు 280 కోట్లు చెల్లించాం
రూ. 50 కోట్లతో యార్న్ బ్యాంకు ఏర్పాటు
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
చేనేత జౌళి, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్
సిరిసిల్ల టౌన్( నేటిధాత్రి ):
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తితో చేతినిండా పని కల్పిస్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. సిరిసిల్లలోని గణేష్ నగర్ లో ఉన్న మామిడాల నారాయణ, కొండ సుభాష్ కు మరమగ్గాల యూనిట్లను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చేనేత జౌళి, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అధికారులతో కలిసి ఈ రోజు చీరల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు కార్మికులతో మాట్లాడారు. వేముల శ్రీనివాస్, మెరుగు శ్రీనివాస్ తదితర కార్మికులతో ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్ మాట్లాడారు. ప్రతి రోజు ఎన్ని మీటర్ల చీర ఉత్పత్తి చేస్తున్నారని? వారానికి ఎంత ఆదాయం వస్తుందని? అడిగి తెలుసుకున్నారు. చీరల ఉత్పత్తిలో ఏమైనా ఇబ్బంది ఎదురవుతున్నాయని ఆరా తీశారు. తమకు ప్రతివారం రూపాయలు 4000 నుంచి 5000 వరకు ఆదాయం వస్తుందని కార్మికులు వారి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి, కార్మికులను ఆదుకునేందుకు చేతినిండా పని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని వివరించారు. ఇందులో భాగంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఇందిరా మహిళ శక్తి కింద చీరల ఉత్పత్తి ఆర్డర్లు అందించామని తెలిపారు.
కార్మికులు, ఆసాములు కోరిన విధంగా ధర నిర్ణయించామని వెల్లడించారు.
ఇందిరా మహిళా శక్తి చీరలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని కార్మికులు, ఆసాములకు దాదాపు 8 నెలల పాటు ఉపాధి లభిస్తుందని తెలిపారు. గతంలోని బతుకమ్మ చీరల బకాయిలు దాదాపు 280 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా దశాబ్దాల కల నెరవేరుస్తూ వేములవాడలో రూపాయలు 50 కోట్లతో యార్న్ బ్యాంకు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అవసరమైన యార్న్ అంతా అక్కడ అందుబాటులో పెడుతున్నామని తెలిపారు. ఇతర ప్రభుత్వ శాఖ ఆర్డర్లు సిరిసిల్లకు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో కార్మికులు ఉపాధి లేక ఇబ్బంది పడేవారు అని ఇప్పుడు చేతినిండా పని ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆర్డర్లను ఆసాములు, కార్మికులు సద్వినియోగం చేసుకొని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. సెస్ పరిధిలోని బ్యాక్ బిల్లింగ్ సమస్య కోర్టు పరిధిలో ఉందని దానిపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇతర మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,
చేనేత జౌళి, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్,కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్,
మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప రెడ్డి, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఏడీ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ విద్యార్థికి ఆర్థిక సహాయం.
మెడికల్ విద్యార్థికి ఆర్థిక సహాయం…
కల్వకుర్తి నేటి ధాత్రి:
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లు మండలం నుచ్చుగుట్ట తండాకు చెందిన నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన వర్త్యావత్ యశస్వినికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సహకారంతో చదివి సోమవారం వెలువడిన మెడికల్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 445 ర్యాంకు సాధించింది. ఉత్తమ ఫలితాలు కనబరిచిన గిరిజన పుత్రిక యశస్విని సన్మానించిన ఉప్పల వెంకటేష్ యశస్విని మెడిసిన్ పూర్తి చేయడం కోసం పూర్తిగా ఉప్పల చారిటబుల్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అండగా నిలుస్తానని భరోసా కల్పించారు. గిరిజన తండాల్లో పుట్టి, కన్నా తల్లిదండ్రుల కష్టాలను చూస్తూ పెరిగి నేడు ఉస్మానియా, గాంధీ వంటి మెడికల్ కళాశాలలో సీటును సాధించిన యశస్విని ఎంతోమంది గిరిజన బిడ్డలకు ఆదర్శమని ఉప్పల వెంకటేష్ కొనియాడారు.
భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొన్న.
భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ రాజిరెడ్డి
పరకాల నేటిధాత్రి
రైతుల సంక్షేమం కోసం రాష్ట ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి కార్యక్రమంలో భాగంగా పరకాల పట్టణంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సన్నచిన్నకారు రైతులను ద్రృష్టిలో ఉంచుకొని,రైతులకు హక్కులు కల్పించాలనే ఉధ్ధేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు నూతన భూ భారతి చట్టం తీసుకు రావడం జరిగిందన్నారు.తరాలుగా సాగు చేసుకుంటూ పట్టాలు లేని రైతులందరికి ప్రజా ప్రభుత్వం సమగ్రంగా సర్వే నిర్వహించి పట్టాలు ఇవ్వబోతుందని,గత ప్రభుత్వ హయంలో రైతులందరికి సబ్సిడిలను ఇవ్వకుండా మోసం చేసిందని,ప్రజా ప్రభుత్వం రైతుల మేలుతో పాటు ప్రతి రైతు శ్రేయస్సు కు కృషి చేస్తుందని ప్రజల కోసం పరితపించే ప్రజా ప్రభుత్వానికి అండగా నిలువాలని కోరారు.ఈ కార్యక్రమంలో పరకాల తహసిల్దార్ విజయలక్ష్మి,రెవెన్యూ సిబ్బంది,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్,కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీనాయకులు,కార్యకర్తలు,స్ధానిక రైతులు తదితరులు పాల్గోన్నారు.
చెన్నాపూర్ లో 33/11 కెవి సబ్ స్టేషన్ ప్రారంభించిన.
చెన్నాపూర్ లో 33/11 కెవి సబ్ స్టేషన్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం బట్టి
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరి కొత్తపల్లి మండలం చెన్నాపూర్ గ్రామంలో 33/11 కెవి సబ్ స్టేషన్ ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వరంగల్ ఎంపీ కడియం. కావ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, సిఎండి వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తదితరులు పాల్గొన్నారు
టెక్స్టైల్స్ పార్క్ యజమానులతో సమావేశం.
టెక్స్టైల్స్ పార్క్ యజమానులతో సమావేశం…
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని టెక్స్టైల్స్ పార్క్ యజమానులతో చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అనంతరం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం మినీ సమావేశ మందిరంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా టెక్స్టైల్స్ పార్క్ యజమానులు తమకు ప్రభుత్వం నుంచి మరిన్ని వస్త్రం ఉత్పత్తి ఆర్డర్లు ముందస్తుగా ఇవ్వాలని, తమ సమస్యలు పరిష్కరించాలని.
చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ ను కోరారు. వివిధ శాఖలకు అవసరమైన ఆర్డర్స్ అందజేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం నాణ్యతతో వస్త్రాలు ఉత్పత్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప రెడ్డి, చేనేత జౌళి శాఖ జేడీ ఎన్ వెంకటేశ్వర్ రావు, ఏడీ రాఘవరావు, వివిధ మ్యాక్స్ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు యజమానులు ఆసాములు, టెక్స్టైల్స్ పార్క్ యజమానుల సంఘం అధ్యక్షుడు అన్నల్ దాస్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లోపట్టణంలో వింతవ్యాధులతో కుక్కల విహారం.
గ్రామాల్లో పట్టణంలో వింతవ్యాధులతో కుక్కల విహారం…
తమకు సోకుతాయేమో అని భయందోళనలో ప్రజలు
పరకాల నేటిధాత్రి:
పట్టణ,మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కలకు ఫంగస్ వచ్చి, వింత రోగాలు,చర్మ వ్యాధులతో విచ్చలవిడిగా వీదులల్లో తిరుగుతున్నాయి.కుక్కులకు అంతుచిక్కని వింతరోగాలతో శరీరాలపైన వెంట్రుకలు ఊడిపోయి,చర్మం పగుళ్ళు ఏర్పడి రక్తాలు కారుతు చర్మ వ్యాధులతో ఇటు పట్టణంతో పాటు గ్రామాలలో సంచరిస్తున్నాయి.చాలా వరకు కుక్కలు చర్మం తోలు ఊడిపోయి భయంకరంగా కొన్ని సినిమాలల్లో చూపించిన విధంగా గ్రామాల్లో దర్శనమిస్తున్నాయి.కుక్కలకు ఏదో వైరస్ సోకి అది వ్యాధిగా మారి ప్రజలకు సోకుతుందేమోనని గ్రామాల మరియు పట్టణాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.చదువు నిమిత్తం పాఠశాలకు,కళాశాలకు వెళ్లే పిల్లలను కరిచి గాయపరిచే ప్రమాదం ఉందని అధికారులు చొరవ తీసుకోని వింత వ్యాధులతో బాధపడుతున్న కుక్కల బారి నుండి తమ ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
జహీరాబాద్ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.
జహీరాబాద్ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలో నివాసం ఉండే వెంకటరమణ (19) అనే ఆర్ ఎల్ ఆర్ కళాశాల విద్యార్థి, ఇంటర్మీడియట్ లో ఒక సబ్జెక్ట్ లో ఫేయిల్ అయినందుకు మనస్థాపం చెంది తమ నివాసంలో సోమవారం మధ్యాహ్నం ఉరివేసుకుని, ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని కేసు దర్యాప్తు చేస్తున్న జహీరాబాద్ పట్టణ ఎస్ఐ కె. వినయ్ కుమార్ సోమవారం సాయంత్రం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు.
నేనే ఆమెను చంపేశా నేరాన్ని అంగీకరించిన.
నేనే ఆమెను చంపేశా.. నేరాన్ని అంగీకరించిన హర్యానా మోడల్ బాయ్ఫ్రెండ్
హర్యానాలో మోడల్ హత్య కేసు మిస్టరీ వీడింది.
తానే ఈ హత్య చేసినట్టు ఆమె బాయ్ఫ్రెండ్ పోలీసుల ముందు అంగీకరించాడు.
ఇంటర్నెట్ డెస్క్:
హర్యానా మోడల్ షీతల్ హత్య కేసు మిస్టరీ వీడింది.
షీతల్ను తానే హత్య చేశానని ఆమె బాయ్ఫ్రెండ్ సునీల్ చౌదరి నేరాన్ని అంగీకరించాడు.
షీతల్కు అప్పటికే పెళ్లి అయ్యింది. ఐదు నెలల బిడ్డ కూడా ఉంది.
సునీల్ కూడా వివాహితుడు, ఇద్దరు పిల్లల తండ్రి.
ఈ నేపథ్యంలో సంచలనంగా మారిన హత్యోదంతాన్ని పోలీసులు ఛేదించారు.
కేసు పూర్తి వివరాల్లోకి వెళితే, జూన్ 14న షీతల్ ఓ ఆల్బమ్ ఫొటో షూట్ కోసం పానిపట్లోని ఓ గ్రామానికి వెళ్లారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, షీతల్, సునీల్ మధ్య ఆరేళ్లుగా పరిచయం ఉంది.
సునీల్ హోటల్లో షీతల్ కొంతకాలం పనిచేసింది.
అయితే, తనను పెళ్లి చేసుకోవాలంటూ సునీల్ షీతల్ను కోరాడు.
అతడికి అప్పటికే పెళ్లయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉండటంతో ఆమె అతడి ప్రతిపాదనను తిరస్కరించింది.
ఇక హర్యానా మ్యూజిక్ రంగంలో కొనసాగుతున్న షీతల్కు కూడా పెళ్లి అయ్యింది.
ఆమెకు ఐదు నెలల వయసున్న బిడ్డ కూడా ఉంది.
ఈ నేపథ్యంలో ఈ హత్యోదంతం స్థానికంగా పెను కలకలానికి దారితీసింది.
ట్రంప్ ఫ్యామిలీ నుంచి మార్కెట్లోకి కొత్త మొబైల్ కంపెనీ .
ట్రంప్ ఫ్యామిలీ నుంచి మార్కెట్లోకి కొత్త మొబైల్ కంపెనీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ టెక్నాలజీ ప్రపంచంలో మరో ముందడుగు వేసింది. కొత్తగా ట్రంప్ T1 గోల్డ్ కలర్ స్మార్ట్ఫోన్ను (Trump Smartphone Launch) మార్కెట్లోకి లాంచ్ చేసి అనేక సేవలను అందిస్తామని తెలిపింది.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి (Donald Trump) అనేక వ్యాపారాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఫ్యామిలీ ట్రంప్ మొబైల్ అనే కొత్త మొబైల్ ఫోన్ (Trump Smartphone Launch) సేవలను ప్రారంభించింది. ఈ సేవల్లో భాగంగా T1 అనే గోల్డ్ కలర్ స్మార్ట్ఫోన్ను విడుదల చేయనున్నారు. ఇది అమెరికాలో తయారైనట్లు ప్రకటించారు. అయితే, ఈ ఫోన్ నిజంగా అమెరికాలో తయారైందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సేవలో భాగంగా నెలవారీ ప్లాన్ను $47.45 ధరతో అందిస్తున్నారు.
ట్రంప్ మొబైల్ సేవా వివరాలు
ది 47 మొబైల్ ప్లాన్లో అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అనలిమిటెడ్ కాల్స్, టెక్స్ట్ మెసేజ్లు, డేటా, రోడ్సైడ్ అసిస్టెన్స్, టెలీహెల్త్ సేవలు, 100కి పైగా దేశాలకు ఉచిత అంతర్జాతీయ కాల్స్ వంటివి కలవు. ఈ సేవలు వినియోగదారులకు సమగ్రమైన ప్యాకేజీని అందించేలా రూపొందించబడ్డాయి. కానీ దీని వెనుక ఉన్న వ్యాపార వ్యూహం చర్చనీయాంశంగా మారింది.
దీని ధర ఎంత..
టీ1 ఫోన్ విషయానికొస్తే, ఈ స్మార్ట్ఫోన్ ధర $499గా (రూ. 42,929.72) నిర్ణయించబడింది. ఇందులో 6.8 అంగుళాల స్క్రీన్, ఫింగర్ప్రింట్ సెన్సార్, అమెరికన్ ఫ్లాగ్ డిజైన్, ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ను అమెరికాలో తయారు చేసినట్లు ప్రకటించినప్పటికీ, దీని తయారీ ప్రక్రియపై సందేహాలు ఉన్నాయి. ఫోన్ భాగాలు లేదా అసెంబ్లీ ప్రక్రియ ఇతర దేశాల నుంచి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వ్యాపార వ్యూహం
ట్రంప్ మొబైల్ సేవలు AT&T, Verizon, T Mobile వంటివి అమెరికా ప్రధాన టెలికాం క్యారియర్ల భాగస్వామ్యంతో పనిచేస్తుంది. ఈ భాగస్వామ్యాలు సేవను విస్తృత వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఉపయోగపడతాయి. అయితే, ట్రంప్ కుటుంబం అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో ఇలాంటి వ్యాపార ఒప్పందాలు చేయడం నైతిక సందేహాలను రేకెత్తిస్తోంది. అధికారంలో ఉన్న వ్యక్తులు తమ పదవిని వ్యాపార లాభాల కోసం ఉపయోగించుకోవడం సముచితమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సందేహాలు
అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి లేదా ఆయన కుటుంబం వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొనడం, ప్రభుత్వ విధానాలను వ్యక్తిగత లాభాల కోసం ప్రభావితం చేసే అవకాశం ఉందనే ఆందోళనలు ఉన్నాయి. దీంతో ట్రంప్ మొబైల్ సేవల ఒప్పందాలు ప్రజల విశ్వాసాన్ని నష్టపరిచే అవకాశం ఉందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాపారం ద్వారా ట్రంప్ కుటుంబం ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. కానీ ఇది ప్రజా విశ్వాసం, పారదర్శకతపై ప్రభావం చూపించనుంది. ఇప్పటికే ట్రంప్ ఫ్యామిలీకి రియల్ ఎస్టేట్ సహా అనేక వ్యాపారాలు ఉన్నాయి.
మా అమ్మ, బిడ్డలు ఏడుస్తున్నా పట్టించుకోలేదు.
మా అమ్మ, బిడ్డలు ఏడుస్తున్నా పట్టించుకోలేదు..
శిరీష ఆవేదన
అప్పు తీరుస్తామని చెప్పినా వదల్లేదని బాధితురాలు శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. కన్నప్ప కుటుంబ సభ్యులు.. తనను తీవ్రంగా కొట్టడంతో చెయ్యికి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని శిరీష తెలిపారు.
దాదాపు గంటసేపు చెట్టుకు కట్టేసి ఇష్టానుసారంగా మాట్లాడారన్నారు.
కాగా.. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది.
అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదా.
అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదా…
అహ్మదాబాద్ విమాన దుర్ఘటన నేపథ్యంలో అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదాపడింది. గతంలో. లండన్: అహ్మదాబాద్ విమాన దుర్ఘటన నేపథ్యంలో అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదాపడింది. గతంలో ఇంగ్లండ్-భారత్ మధ్య సిరీ్సను పటౌడీ ట్రోఫీగా వ్యవహరించేవారు. అయితే, ఇంగ్లండ్ బోర్డు ఆ పేరు మార్చి ఆధునిక దిగ్గజాలు అండర్సన్-టెండూల్కర్ పేరున ట్రోఫీని తీసుకురావాలనే నిర్ణయం తీసుకొంది. సిరీస్ ఆరంభమయ్యే ముందే ట్రోఫీ ఆవిష్కరణ జరుగుతుందని బీసీసీఐ తెలిపింది.