వెంకటాపూర్ గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం
ముఖ్య అతిధిగా హాజరైన మార్కెట్ చైర్మన్ రాజిరెడ్డి
పరకాల నేటిధాత్రి
మండలంలో వెంకటాపురం గ్రామం లో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతుల అవగాహన కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ తక్కువ యూరియా వాడకం,సాగుఖర్చును తగ్గించుట,అవసరం మేరకు రసాయనాలు వినియోగం,రైతు సోదరులకు రసీదులను భద్రపరుచుకోవడం,పంట మార్పిడి వలన కలిగే ప్రయోజనాలు,చెట్లను పెంచడం,సాగునీటిని ఆదా చేయడం వలన కలిగే ప్రయోజనాలు రైతులకు గ్రామంలోని వివిధ పంటలలో సస్యరక్షణ చర్యల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్,వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ బి. రాజు,డాక్టర్ కే.స్వాతి, వ్యవసాయ విస్తరణాధికారులు కాటంరాజు,వ్యవసాయ కళాశాల వరంగల్ విద్యార్థులు, వెంకటాపూర్ గ్రామ రైతులు పాల్గొన్నారు.