గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి..

గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నల్లగొండ తిరుపతి గౌడ్

కరీంనగర్, నేటిధాత్రి:

గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంకై ఐక్యంగా పోరాడాలని గౌడ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నల్లగొండ తిరుపతి గౌడ్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈసందర్భంగా తిరుపతి గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలొ పెట్టిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. యాభై ఏళ్లు దాటిన గీత కార్మికులకి పింఛన్ ఇవ్వాలని, 560జీవో ప్రకారం ఐదు ఎకరాల భూమి ఇవ్వాలి, ఎక్స్గ్రేషియా ఐదు లక్షలు ఉన్నదానిని పది లక్షల రూపాయలకు పెంచాలని, గీత కార్మికులకు రెండు వేల పింఛన్ను ఐదు వేలు పెంచాలన్నారు. ప్రతి జిల్లాకు గౌడ భవనం నిర్మిస్తామని నేటికి అమలు చేయలేదని ఆరోపించారు. ప్రతి గ్రామంలో ఈత చెట్టు, తాడిచెట్లు పెట్టి వనాన్ని పెంపొందిస్తామని చెప్పారని హైదరాబాద్ గీత కార్మికుల భవనానికి పూజ చేశారని వెంటనే నిర్మించాలని గీత కార్మికులు అంటే చిన్నచూపు ప్రభుత్వం చూస్తుందని పెండింగ్ లోవున్నా ఎక్స్రిగేసియే బిల్లులు వెంటనే ఇవ్వాలని తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్వహించే వైన్ షాప్ టెండర్లలో ఇరవై ఐదు శాతం గీతా కార్మికులకే కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని రాబోయే టెండర్లలో ఇవ్వాలన్నారు. గీత కార్మికులు చెట్టు మీద నుంచి పడి శాశ్వత వికలాంగుడు అయితే ఇరవై ఐదు వేలు, గాయాల పాలైతే పదిహేనువేల రూపాయలు బీసీ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వం గతంలో ఇచ్చిందని ఇప్పుడు వాటిని ఇవ్వడం లేదని పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలని తిరుపతి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.

గుండెపుడి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి..

గుండెపుడి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి

గుండెపుడి గ్రామంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం మరిపెడ మండల నాయకులు బాణాల రాజన్న, బోడపట్ల రాజశేఖర్ డిమాండ్

మరిపెడ నేటిధాత్రి.

గురువారం మరిపెడ మండలం గుండెపూడి గ్రామంలో నెలకొన్నటువంటి స్థానిక సమస్యలను పరిష్కరించాలని మరిపెడ మండల ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి కి సిపిఎం గుండెపూడి కార్యదర్శి బోడపట్ల రాజశేఖర్ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే దత్తత గ్రామమైన గుండెపుడి గ్రామంలో సమస్యలు నెలకొన్నాయని, వీధిలైట్లు మురికి కాలువలు సరిగ్గా పనిచేయడం లేదని గ్రామంలో మూడు మంచినీటి బావులు ఉన్నా కూడా నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు, ఇటీవల కాలంలో కురిసిన అకాల వర్షాలకు ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిని వాహనదారులు, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతునరాని, మురికి కాలువలో ఉన్న చెత్త పేరుకుపోవడం వల్ల దోమలు పెరిగి విష జ్వరాలు పెరిగి ప్రజల అనారోగ్యానికి గురవుతున్నారని గ్రామంలో తక్షణమే గ్రామ కార్యదర్శిని నియమించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి షేక్ షరీఫ్ బయ్య సురేష్, కందాల రమేష్ ఎల్లయ్య నారాయణ,అలీ శ్రీనివాస్ రెడ్డి గణేష్, సురేషు, రామ్మూర్తి, ఈమన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు

ఓవర్ లోడ్ విద్యుత్ సమస్యను పరిష్కరించిన.

ఓవర్ లోడ్ విద్యుత్ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

రాజినెల్లి గ్రామ రైతులు ఓవర్ లోడ్ విద్యుత్ సమస్యను ఎదుర్కొంటున్న విషయాన్ని మండల పార్టీ అధ్యక్షుడు నర్సింలు యాదవ్ మండల బీఆర్ఎస్ నాయకులు మ్యాతరి ఆనంద్ దృష్టికి తీసుకెళ్లడంతో వారు ఇదే విషయమై శాసనసభ్యులు కొనింటి మణిక్ రావు గారి దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణమే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరనికి చర్యలు తీసుకోవాలని అదేశించడంతో బుధవారం నాడు నూతన ట్రాన్స్ ఫార్మర్ బిగించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సాయన్న, ఈశ్వరప్ప పాటిల్, నర్సింలు, మధుకర్ ఫాస్టర్, మొహమ్మద్ వహబ్, మొహమ్మద్ ఫయాజ్, మొహమ్మద్ ముస్తఫా, లైన్ మెన్ మొహమ్మద్ ఇలియజ్, లడ్డు, ఎవన్, గ్రామ పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి.

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

#ఏ బి ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో వరంగల్ విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ కి వినతి పత్రం.

హన్మకొండ నేటిధాత్రి:

అనంతరం ఏ బి ఎస్ ఎఫ్ బోట్ల నరేష్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలని విద్యాశాఖ అధికారి కోరారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న మంచినీటి సమస్య, మరుగుదొడ్ల మరమ్మతు మరియు, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న మధ్యాహ్న భోజనం మెనూ అమలు చేసే విధంగా అధికారులు నిరంతరం పర్యవేక్షించి విద్యార్థులకు నాణ్యతమైన భోజనం అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలతో పాటు కస్తూర్బా గురుకుల పాఠశాలలో అదనపు సెక్షన్లు ఏర్పాటు చేయాల్సిందిగా వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి కోరునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రమోద్ బన్నీ తదితరులు పాల్గొన్నారు.

శాయంపేట మండల సమస్య తీరేది ఎన్నాడో!

శాయంపేట మండల సమస్య తీరేది ఎన్నాడో!

ఆర్టీసీ బస్సు రాదు.. అవస్థలు తీరవు

ప్రభుత్వం స్పందించి బస్సు సౌకర్యాన్ని కల్పించాలి

శాయంపేట నేటిధాత్రి:

 

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండలానికి బస్సు సౌకర్యం లేకపోవడం వలన ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు చాలామంది విద్యార్థులు మహిళలు ఉద్యోగాలు కూలీల ఇతర అవసరాల నిమిత్తం ప్రయాణం చేస్తే ప్రజలు బస్సు సౌకర్యం లేక అవస్థలు అనుభవిస్తున్నారు ముఖ్యంగా విద్యార్థులు మహిళలు ఇతర ముఖ్యమైన పనులకు వెళ్లాలంటే మండల కేంద్రం నుండి జిల్లాకు పోవడానికి 30 కిలోమీటర్ల దూరానికి పోవుట గూర్చి ఆటోలు ఇతర ప్రైవేట్ వాహనాల ప్రయాణం భారంగా మారింది.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వర్తించని మండలం

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది.మండల కేంద్రానికి బస్సు సౌకర్యం లేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఆడబిడ్డల కళ నెరవేర్చిన ప్రభుత్వం వెంటనే బస్సు సర్వీస్ లను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

బస్సులు నడిపితేనే ప్రయాణం సులువు

శాయంపేట మండల కేంద్రం నుంచి హన్మకొండకు వెళ్లా లంటే ఆటోలో ప్రయాణిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు, ఇతర పనులకు వెళ్లే ప్రజలు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం కల్పిస్తుంది బస్సులు నడిపితేనే ఆర్థిక భారం తగ్గుతుందని ప్రజలు కోరడమైనది.

మారుమూల గ్రామాలకు లేని బస్సు సర్వీసులు

శాయంపేట మండలంలోని మారుమూల గ్రామాలకు లేని బస్సు సర్వీసులు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ప్రజలు 8,000 మంది నివసిస్తారు. 24 గ్రామ పంచాయతీలోని ప్రజలు సుమారుగా 30 వేల మందికి పైగా ఉంటారు జిల్లా నుండి మండలానికి బస్సు సౌకర్యం లేక ప్రజలు అవస్థల పాలవు తున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి వెంటనే పాత బస్సు సర్వీసులను పునరుద్ధరించాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version