ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హుగ్గెల్లి మధు జన్మదిన వేడుకలు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హుగ్గెల్లి మధు జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో బి ఆర్ ఎస్ యువ నాయకులు హుగ్గెల్లి మధు గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,పాక్స్ చైర్మన్ మచ్చెందర్,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,
ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్, ఝరసంఘం పట్టణ అధ్యక్షులు ఏ బాబా,యువ నాయకులు మూర్తుజా,సత్యం ముదిరాజ్ ,డా. నాగరాజ్,పర్వేజ్ పటేల్, ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

హుగ్గెల్లిలో బసవేశ్వర విగ్రహాన్ని ప్రారంభించిన సీఎం.

హుగ్గెల్లిలో బసవేశ్వర విగ్రహాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

◆ పూర్ణకుంభంతో స్వాగతం పలికిన పండితులు
వేదమంత్రాల నడుమ బసవేశ్వరుడి విగ్రహం ప్రారంభం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లిలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి హెలికాప్టర్ లో జహీరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి కి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఐజీ సత్యనారాయణ, ఎంపీ సురేష్ షెట్కర్, ఎంపీ కాంటెస్టేడ్ క్యాండిడేట్ నీలం మధు తదితరులు హెలిపాడ్ వద్ద స్వాగతం పలికారు. హుగ్గెల్లిలో బసవేశ్వరుడి విగ్రహం వద్ద వేద పండితులు, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, ఎస్పీ పరితోష్ పంకజ్ లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
బసవేశ్వరుడి విగ్రహ ప్రారంభోత్సవం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విశ్వగురు బసవేశ్వరుని స్పూర్తి, ఆలోచన విధానంతో బసవేశ్వరుని దీవెనలతో కాంగ్రెస్ ప్రభుత్వం జన గణనలో కుల గణన చేసి చూపెట్టిందని తెలియజేశారు. భారత జోడో యాత్రలో రాహుల్ గాంధీ అడుగడుగున మహాత్మా జ్యోతి రావు పూలే, మహాత్మా గాంధీ, బసవేశ్వరుడు స్ఫూర్తితో
సామాజిక న్యాయాన్ని ప్రజలందరికీ అందజేయాలని ఆయన ఆక్షించారని ఆయన సూచనలతోనే తెలంగాణలో కుల గణన చేసి చూపించామన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ , జిల్లా ఇంచార్జీ మంత్రి కొండా సురేఖ, ఎంపీ సురేష్ షట్కర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, జిల్లా లింగాయత్ సమాజా నాయకులు గురువులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హుగ్గెల్లి బస్తీ దవఖానకు పదిహేను వేలు ఆర్థిక సహాయం.

హుగ్గెల్లి బస్తీ దవఖానకు పదిహేను వేలు ఆర్థిక సహాయం

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్:బస్తీ దవఖానలో చిన్న చిన్న మరమ్మత్తుల కోసం సీనియర్ జర్నలిస్ట్ షకిల్ అహ్మద్ రూ. 15,000 నగదు అందజేశారు. ఈ మొత్తాన్ని ఏఎన్ఎం బి. రేణుక కు అందించారు, దవఖానకు రంగులు వేయించడం, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడం కోసం ఉపయోగించుకోవాలని సూచించారు.ఆరోగ్య సేవలు మెరుగుపరిచే లక్ష్యంతో తాను సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరెవరైనా ఆర్థిక సహాయం అవసరమైతే తనను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version