మృతుని కుటుంబాన్ని పరామర్శించిన సుంకె రవి శంకర్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-22T130127.741.wav?_=1

 

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన సుంకె రవి శంకర్

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన పాకాల ప్రశాంత్ రెండు రోజుల క్రితం చనిపోయిన విషయం తెలుసుకున్న చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచులు తడగొండ సత్యరాజ్ వర్మ, బక్కశెట్టి నర్సయ్య, నాయకులు నర్సింబాబు, బక్కశెట్టి శ్రీనివాస్, అజయ్, రాజు, ఖాసీం షరీఫ్, త్రినాథ్ వర్మ, పాదం తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-22T125631.338.wav?_=2

 

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో దుబాయ్ లో మరణించిన ఎలగందుల ప్రకాష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన చొప్పదండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్. గత కొద్దిరోజుల క్రితం మరణించిన ప్రకాష్ మృతదేహాన్ని అక్కడి ఎన్నారై సభ్యుల సహకారంతో ఇండియాకు రప్పించి వారికి ఇద్దరు పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారని తెలుసుకొని పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి పిల్లల చదువుల ఫీజులు మాఫీ చేయాలని కోరగా, యాజమాన్యం సానుకూలంగా స్పందించారు. ఈసందర్భంగా కుటుంబ సభ్యులు రవిశంకర్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పూడూరు మల్లేశం, ఎడవల్లి పాపిరెడ్డి, వేల్పుల హరికృష్ణ, దాసరి అరుణ్ కుమార్, సుద్దాల మల్లేశం, రేణికుంట బసంతం రేణిగుంట అశోక్, దాసరి అనిల్, వేల్పుల రవి, రేణికుంట శ్రావణ్, రేణిగుంట రవి, రేణిగుంట ఆనంద్, దాసరి శంకర్, రేణిగుంట హరీష్, లింగంపల్లి రవి, దాసరి శ్రీనివాస్, దాసరి శేఖర్, దాసరి శ్రీనివాస్, దాసరి రవీందర్, పురాణం రమేష్, తదితరులు పాల్గొన్నారు.

పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిన పట్టించుకోరా…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-22T123451.911.wav?_=3

 

 

పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిన పట్టించుకోరా…

ఓపెన్ జిమ్ కు దారేది సార్లూ…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల 17 వ వార్డ్ శ్రీనివాస్ నగర్ ఏరియాలో ఇళ్ల మధ్య ఏపుగా పిచ్చి మొక్కలు పెరగడంతో పిచ్చి మొక్కలలో చెత్తాచెదరం చేరుకొని దోమలకు ఆవాసాలుగా మారి కాలనీవాసులు జ్వరాలు బారిన పడుతున్నారంటూ కాలనీవాసులు వాపోతున్నారు. మొక్కలు ఏపుగా పెరగడంతో విష జ్వరాలకు నిలయంగా మారడంతో రాత్రిపూట బయటకు రావాలంటే భయాందోళనకు గురవుతున్నామన్నారు. పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో విష సర్పాలు సంచరించడంతో పాటు క్రిమి కీటకాలు దోమల బెడద కూడా ఎక్కువైందని వారు ఆరోపిస్తున్నారు. చికెన్ గున్యా, డెంగి ,మలేరియా వంటి వైరల్ జ్వరాలు రాకుండా పిచ్చి మొక్కలను

తొలగించాలని మునిసిపాలిటీ అధికారులను వారు కోరుతున్నారు. ఎస్ఆర్కే పాఠశాల పక్కన గల రోడ్డు సరిగా లేదని, పాఠశాల సమీపంలో లక్షలు వెచ్చించి ఓపెన్ జిమ్ ఐతే ఏర్పాటు చేశారు కానీ ఓపెన్ జిమ్ కు వెళ్ళే దారి మొత్తం పిచ్చి మొక్కలతో నిండుకు పోయిందని ,వ్యాయామం కోసం వెళ్లే వారు సైతం పిచ్చి మొక్కల ను చూసి ఓపెన్ జిమ్ కు వెళ్లలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు. పాలకవర్గం లేకపోవడంతో స్థానిక నాయకులు సైతం కాలనీలోని సమస్యలను పట్టించుకోవడంలేదని ఇప్పటికైనా స్థానిక మునిసిపాలిటీ అధికారులు చొరవ తీసుకొని కాలనీ సమస్యలు తీర్చాలని వారు కోరుతున్నారు.

కళాకారిణి కుటుంబానికి ఆపన్న హస్తం…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-21T181124.663.wav?_=4

 

కళాకారిణి కుటుంబానికి ఆపన్న హస్తం

‘నేటిధాత్రి”,హనుమకొండ.

 

తేదీ: 21/ 10 /2025 మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు బాలసముద్రంలో గల చక్రవర్తి హాస్పిటల్లో తోటి కళాకారిణి పట్టపురి అనిత గారి అమ్మ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతుంది, ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి వరంగల్ జిల్లా సినిమా మరియు టీవీ కళాకారుల సంఘం అధ్యక్షుడు “సదా.రుద్రారపు” వెంటనే స్పందించి తన తోటి కళాకారుల సహాయ సహకారంతో చక్రవర్తి హాస్పిటల్ సందర్శించి తమ వంతు సహాయంగా 5000 రూపాయలను ఇచ్చి పరామర్శించారు,ఇక నుండి కళాకారుల విషయంలో ఈ సంఘం ముందుంటుందని కళాకారులందరూ అభిప్రాయంవ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా యాక్టింగ్ మరియు టీవీ కళాకారుల అసోసియేషన్ మెంబర్స్, అనిల్ కుమార్ సుద్దాల, పాల కుమారస్వామి,ఎరుగొండ లావణ్యగౌడ్,ఎలుకపాటి రాజు తదితరులు పాల్గొన్నారు.

రక్తదానం చేసిన మండల కాంగ్రెస్ నాయకులు…

 

 

రక్తదానం చేసిన మండల కాంగ్రెస్ నాయకులు
* ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం
* ఎస్పీ కార్యాలయ ఆవరణలో రక్తదాన శిబిరం
మహాదేవపూర్ అక్టోబర్ 21 (నేటి ధాత్రి)

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేపూర్ మండలం కాంగ్రెస్ నాయకులు మంగళవారం రోజున ఎస్పీ కార్యాలయ ఆవరణలోని రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. పోలీస్ అమరవీరుల దినోత్సవ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఎస్పీ కిరణ్ కరే, డీఎస్పీ సత్యనారాయణ, సిఐ వెంకటేశ్వర్లు, పవన్ కుమార్ లా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో మండల కాంగ్రెస్ నాయకులు కటకం అశోక్, బుర్రి శివరాజు తో పాటు పలువురు నాయకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ మోతే సాంబయ్య, గ్రామ నాయకులు ఆకుల శ్రీధర్, ఎలకండి శ్రీకాంత్, బుర్రి మహేందర్, కళ్యాణ్, హరీష్ తోపాటు పలువురు నాయకులు, ఎస్పీ కార్యాలయ సిబ్బంది, రక్తదాన శిబిర సిబ్బంది పాల్గొన్నారు.

నారింజ డ్యామ్లో ముగ్గురి ఆత్మహత్యాయత్నం…

 

 

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-21T122537.331.wav?_=5

నారింజ డ్యామ్లో ముగ్గురి ఆత్మహత్యాయత్నం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గంలోని నారింజ ప్రాజెక్టు వద్ద, ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి డ్యామ్లో దూకింది. స్థానికుల సమాచారం మేరకు జహీరాబాద్ రూరల్ పోలీసులు వెంటనే స్పందించి, శివరాజ్, మోహన్ నాయక్ లతో కూడిన బృందం అక్కడికి చేరుకుంది. అమలాపురం నాగరణి, ఆమె పిల్లలు దీపక్ రెడ్డి, అక్షరలతో మాట్లాడి, వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎస్ఐ కాశీనాథ్ వారితో మాట్లాడగా, భర్తతో మనస్పర్ధల కారణంగా ఆమె ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసింది. వారికి తగిన కౌన్సిలింగ్ ఇచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.

మా తలరాత రోజు మురికి రోత అంటించుకోవాలి కొంత…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-16T125816.587.wav?_=6

 

మా తలరాత రోజు మురికి రోత అంటించుకోవాలి కొంత

◆:- ప్రతిరోజు ఇంతే కనబడదు పట్టించుకోలేని అధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలో ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర కోట్ల రూపాయలు పెట్టి మురికి కాల్వని నిర్మాణం చేసిన వాటి మీద అధికారుల ప్రత్యేక పర్యవేక్షణ లేక నిర్లక్ష్యంగా వ్యవహరించి వేలాది మంది రాకపోకలు సాగిస్తూ ఆ మురికిని కొంచెం తమపై చిట్లించుకుంటున్న కూడా అధికారులు మాత్రం చూస్తూ వింతగా నిర్లక్ష్యం వహిస్తున్నారు కావలసినంత పారిశుద్ధ్య కార్మికులు కార్మికులు ఉన్నప్పటికిని కొంతమంది దొరవారి దొడ్లకే పరిమితం అవుతున్నారు ప్రతిరోజు పురపాలక సంఘం అధికారులు కార్మికులకు హాజరు తీసుకుంటారు హాజరుకి అందరు వస్తారు కొద్దిసేపటికే కనుమరుగవుతారు అధికారులు ఇండ్లకు చేరుతారు తర్వాత అంతా కార్మికులు దొరల దొడ్లలో పనికి వెళ్తారు చిన్నపిల్లలను ఎత్తుకుంటారు వారి ముడ్లు కడుగుతుంటారు దొరల బట్టలు ఉతుకుతారు ఇల్లు వాకిళ్లు ఊడుస్తారు ఉద్యోగం పురపాలక సంఘం పని దొరలది ఇది జహీరాబాద్ పురపాలక సంఘం కార్మికుల దినచర్య అధికారుల నిర్లక్ష్యంతో ఏ మూల మలుపులో చూసిన విపరీతమైన చెత్త అది అక్కడే మురుగుతున్న పట్టించుకోరు వాటిని ఆసరా చేసుకొని ఊర కుక్కలు పందులు వీధి పశువులు కొండముచ్చులు విపరీతంగా పట్టణానికి వలస వస్తున్నాయి కొన్ని సందర్భాల్లో ప్రజలపై ఎగబడి గాయపరుస్తున్నాయి ఆయన అధికారులకు పట్టింపు ఉండదు వాస్తవానికి ప్రజలకు చైతన్యం చేసే మార్గాలు అనేక ఉన్నప్పటికిని పట్టించుకునే పని లేదు రోజు ఎక్కడపడితే ప్రజలు చేత వేయాలి వేణు వెంటనే పురపాలక సంఘం కార్మికులు వీలైతే

తొలగించాలి లేకపోతే లేదు ఇది పరిస్థితి జహీరాబాద్ పురపాలక సంఘం దినచర్య నాయకులు ఎవరైనా ఏదైనా పని చెప్తే ఏదైనా సంస్కరణలు తీసుకురమ్మని చెప్తే నేరుగా వెళ్లి కార్మికులు ప్రజలతో పలాని నాయకుడు ఇలా చెప్తున్నాడు కొంచెం సక్రమంగా ఉండండి అని నాయకుల పేరు చెప్తారు తప్ప మీరు ఇలా చేయకూడదు ఇది చాలా తప్పు అధికారులు తప్పుపడుతున్నారు మీ పైన చర్యలు ఉంటాయని మాత్రం ఏ అధికారి చెప్పడు అధికారుల పూర్తిస్థాయి నిర్లక్ష్యంతో జహీరాబాద్ పట్టణమంతా మురికి తో మురికి కాలువలు నిండుకుండలాగా తయారై పొంగిపొర్లుతున్నాయి ఏ వీధిలో చూసినా విపరీతమైన దోమలు చిన్న పిల్లలు వృద్ధులు అనేక రకాల వ్యాధులకు గురవుతున్నారు కనీసం ఆరు నెలలకు ఒకసారి అయినా దోమల మందులు పిచికారి చేసేది లేనేలేదు కనీసం దోమలను పారద్రోలడానికి ఫాగింగ్ లాంటి పొగ చేసేది కూడా లేనేలేదు ప్రజలకు వ్యాధులు వస్తేనే మురికితో ముక్కుపూటలమురికితో ముక్కుపూటలు అదిరిపోతేనే అదిరిపోతేనే ఇవన్నీ మాకేం పట్టవు మాకు అడిగే వారెవరున్నారు పాలకవర్గం అయితే లేదు ప్రశ్నించినప్పుడు చూద్దాంలే ఇది జహీరాబాద్ పరిస్థితి

బాబోయ్… కుక్కలు, కోతులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-16T124926.707.wav?_=7

 

బాబోయ్… కుక్కలు, కోతులు

మనిషి కనిపిస్తే చాలు వెంటాడుతూ దాడులు

ప్రభుత్వ దావాఖానాలో పెరుగుతున్న కేసులు

జంకుతున్న ప్రజలు…. పట్టించుకోని అధికారులు

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయం పేట మండలంలోని పలు గ్రామాల్లో కొంతకాలంగా మండలంలో కుక్కలు ,కోతుల బెడద తీవ్రంగా మారింది ఏ గ్రామంలో చూసినా కుక్కలు కోతుల దాడులు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి మనిషి కనిపిస్తే చాలు వెంటప డుతూ ఉన్నాయి దీంతో బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో కోతుల, కుక్కల బెడద తీవ్రం గా ఉన్న అధికారులు తమ కేమి పట్టనట్లుగా వ్యవహ రిస్తున్నారని విమర్శలు వెలు వెత్తుతున్నాయి. చిన్నారులు మరియు వృద్ధులు కుక్కల కోతుల దాడులకు బలవుతు న్నారు రాత్రి అయితే చాలు చెప్పనక్కర్లేదు వీధులు ప్రధాన రహదారిపై గుంపులు గుంపు లుగా సంచరిస్తూ మనిషి కని పిస్తేచాలు వెంటపడుతున్నా యి ద్విచక్ర వాహనాలను వదలడంలేదు మండలము మరియు పలు గ్రామాల్లోని ప్రజలు 300నుంచి 350 మంది దాకా ఆస్పత్రులు పాలయ్యా రు దీంతో రాత్రి వేళల్లో బయ టకు వెళ్లాలంటే ప్రజలు భయ పడుతున్నారు ఇప్పటికైన అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ధాన్యం అక్రమాలకు పాల్ప డిన మరో ఇద్దరు అరెస్టు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-16T124134.174.wav?_=8

 

ధాన్యం అక్రమాలకు పాల్ప డిన మరో ఇద్దరు అరెస్టు

శాయంపేట నేటిధాత్రి:

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రం నేరేడుపల్లి గ్రామంలో గత రబీ సీజన్లో ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహించిన ధాన్యం కొను గోలు కేంద్రాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సివిల్ సప్లై అధికారులు విచారణలో తేల్చారు నేపథ్యంలో అధికా రుల ఫిర్యాదు మేరకు శాయం పేట పోలీస్ స్టేషన్ లో 21 మందిపై కేసు నమోదు కాగా ఇటీవల ఇద్దరినీ అరెస్ట్ చేశారు ఈ అక్రమాలకు ప్రధాన సూత్ర దారులైన ఒకటైన బండ లలిత ప్రధాన సూతదారి బెజ్జంకి శ్రీనివాస్ బంధువు వడ్లూరి రాజేందర్ బుధవారం పోలీసు లు అరెస్టు చేసి రిమాండ్ తర లించారు మిగతావారు పరారీ లో ఉన్నారని మిగతా వారిని గాలిస్తున్నామని సీఐ రంజిత్ రావుఎస్సై పరమేష్ తెలిపారు.

అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇవ్వలేదని మహిళ ఆత్మహత్య….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-16T123410.071.wav?_=9

 

అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇవ్వలేదని మహిళ ఆత్మహత్య

◆:- మహిళ ప్రాణం తీసిన అప్పు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ టౌన్, అప్పుగా తీసుకున్న వ్యక్తి డబ్బులను తిరిగి ఇవ్వననడంతో అప్పు ఇచ్చిన మహిళా ఆత్మహత్య చేసుకున్న సంఘటన జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని అల్లిపూర్ లో చోటు చేసుకుంది. జహీరాబాద్ పట్టణ ఎస్త్ర వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం షేరి నగర్ అల్లీపూర్ లో నివాసం ఉంటున్న కొత్త గొల్ల స్వప్న(34) గుర్జువా డకు చెందిన శంకర్ అనే వ్యక్తికి రూ.4 లక్షలు అప్పుగా ఇచ్చింది. కొద్ది రోజుల తర్వాత స్వప్న శంకర్ ను డబ్బులు అడగగా ఇవ్వనని ఖరాకండిగా చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోయినట్లు తెలిపారు. స్వప్న భర్త రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ వినయ్కుమార్ తెలిపారు.

జహీరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-15T115915.636.wav?_=10

 

జహీరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు… !

◆:- ట్రాఫిక్ నియంత్రించే నాథుడే కరువు

◆:- ప్రతి రోజు పట్టణంలో ట్రాఫిక్ జామ్

◆:- ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు అంత ఇంతా కాదు ప్రతి రోజు ట్రాఫిక్ అంతరాయంతో జహీరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ అప్పడప్పుడు పని చేస్తుంటాయని స్థానిక ప్రజలు చెప్పుకొస్తున్నారు. ఇష్టానుసారంగా వాహనాలను జహీరాబాద్ పట్టణంలో నడపడం వల్లనే ట్రాఫిక్ జామ్ అవుతుందని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కాని లేదా ట్రాఫిక్ పోలీసులు అయినా వాహనదారులకు అవగాహన కల్పించిన దాఖలాలు ఇప్పటి వరకు కనిపించకపోవడం విడ్డూరంగా ఉంది. ట్రాఫిక్ సమస్యలపై పట్టించుకోకపోవడంపై జహీరాబాద్ వాసులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని స్థానిక ప్రజలతో పాటు వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

భూ తగాదాలో వ్యక్తిపై దాడి… తీవ్ర గాయాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-15T110750.919.wav?_=11

 

 

భూ తగాదాలో వ్యక్తిపై దాడి… తీవ్ర గాయాలు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామానికి చెందిన చందాసంధ్య మరియు చంద ప్రశాంత్ గత నాలుగు సంవత్స రాల నుండి ఇంటి స్థలం విష యంలో గొడవలు జరుగు తున్నాయి ఈ విషయంలో పెద్ద మనుషుల్లో పంచాయతీ చేసుకొని వారు చెప్పిన విధంగా విన్న కూడా వారు మాపై తరచూ గొడవలు పడుతూ మమ్మల్ని ఎప్పటి కైనా చంపేస్తామని బెదిరిస్తు న్నారు.ఇదే క్రమంలో నా భర్త సుధాకర్ ను మరియు నన్ను చంపాలని ఉద్దేశంతో వారు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం చందా ప్రశాంత్ అతని తల్లి చంద విజయ అతని అక్క ఆకుతోట జ్యోతి అతని భావ ఆకుతోట పూర్ణచందర్ అతని మేనమామ చింతపట్ల రాజు కిట్టు మా ఇంటికి వచ్చి గొడ్డలి, రాడు, కర్రలు పట్టుకొని వచ్చి నా భర్త మా ఇంటి ముందు ఉండగా చంపుతా అంటూ ఒక్కసారిగా నా భర్త పై దాడి చేశారు. వెంటనే నా భర్త అరువగా బయటకు వచ్చి నేను చూసేసరికి చందా ప్రశాం త్ గొడ్డలితో నా భర్త తలపై గొడ్డలి కాటు, ఆకుతోట జ్యోతి ఇనుపరాడుతో మిగతావారు కర్రలతో కొట్టడం జరిగింది వెంటనే నేను నా భర్తను కొట్ట వద్దని అడ్డు వెళ్లాగా వారు నన్ను చేతులతో కొట్టారు.ఇట్టి గొడవను చూసిన నేను చుట్టు పక్కల వారైనా నరసయ్య, కోటయ్య, సత్యనారాయణ వచ్చి కొట్ట వద్దని ఆపబోతే వారిని అడ్డువస్తే చంపుతా మంటూ బెదిరించి వెళ్లిపో యారు వాళ్లు గాయపరచగా నా భర్తకు తలకు నాలుగు ఐదు చోట్ల రక్త గాయాలైనాయి మరియు కుడికాలు బలంగా గాయంతో అయినవి చుట్టుప క్కల వారి సహాయంతో నేను 108 లో చికిత్స కోసం వరంగ ల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్ళి నాని అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం శ్రీనివా స్ ఆసుపత్రి తీసుకుని వెళ్లాను ప్రస్తుతం నా భర్త చికిత్స పొందుతూ ప్రాణాపాయస్థితి లో ఉన్నందున చట్టరీత్య చర్యలు తీసుకోవాలని కోరారు

ప్రజల పక్షాన పోరాడిది కమ్యూనిస్టులే…

ప్రజల పక్షాన పోరాడిది కమ్యూనిస్టులే

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సీట్లు గెలిపించుకోవాలి

సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక సుమారు రెండు సంవత్సరాలు గడుస్తుందని, ఎన్నికలు జరగక గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుందని వెంటనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొరిమి రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు పదవి కాలం పూర్తయి సుమారు రెండు సంవత్సరాలు గడుస్తుందని దీంతో అభివృద్ధి ఆగిపోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కుల గణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించడంతో రిజర్వేషన్లు 50 శాతం మించారాదని హైకోర్టు స్టే విధించడంతో ప్రస్తుతం ఎన్నికలు వాయిదా పడ్డాయ న్నారు. దేశంలో 65శాంతం బీసీలు ఉన్నారని ప్రభుత్వం దానికి 42 శాతం రిజర్వేషన్ కేటాయించడంతో కోర్టు జోక్యం చేసుకొని రిజర్వేషన్లు 50 శాతం మించరాదని నిబంధనలు ఉన్నాయని దీంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ఆగిపోయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని లేదంటే కాంగ్రెస్ కు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. 42 శాతం రిజర్వేషన్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లడం అనేది కాలయాపన తప్ప మరేం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు లేక గ్రామాలు, మున్సిపాలిటీల కాల పరిధి ముగిసి సుమారు రెండు సంవత్సరాలు అవుతుందని, రాష్ట్రానికి రావలసిన నిధులు రాక అభివృద్ధి స్తబ్దతగా మారిందన్నారు. బీసీ రిజర్వేషన్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. కమ్యూనిస్టు పార్టీగా స్థానిక సంస్థ ఎన్నికల్లో జిల్లాలో రేగొండ, చిట్యాల, మొగుళ్లపల్లి, భూపాలపల్లి మండలాల్లో పోటీ చేయడం జరుగుతుందని ఎంపీటీసీ జెడ్పిటిసి సర్పంచులు అధిక స్థానాలు గెలుచుకునే విధంగా మా ప్రయత్నం ఉంటుందన్నారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడేది కమ్యూనిస్టులేనని పోరాటాలు నిర్వహించే పార్టీలను ప్రజలు ఆదరించాలని ఈ సందర్భంగా రాజ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్,క్యాతరాజ్ సతీష్,కోరిమీ సుగుణ,గంగసరపు శ్రీనివాస్ ,నేరెళ్ల జోసెఫ్ ,గోలి లావణ్య ,మహేశ్,పీక రవికాంత్ తదితరులు పాల్గొన్నారు

 రెచ్చిపోయిన కానిస్టేబుల్ దంపతులు.. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు…

 రెచ్చిపోయిన కానిస్టేబుల్ దంపతులు.. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

 

రహదారిపై క్రికెట్ ఆడితే.. తన ఇంట్లోని పిల్లలకు బంతి తగులుతుందంటూ ఒక మహిళ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కానిస్టేబుల్ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేసి.. దాడి చేశారు.ఇంటి ముందు క్రికెట్ ఆడితే.. బంతి పిల్లలకు తగులుతుందంటూ మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుల్ దంపతులు.. ఆ మహిళలపై దాడి చేశారు. దీంతో బాధితురాళ్లు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. అనంతపురంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా హరినాథ్ విధులు నిర్వహిస్తున్నారు. అతడి భార్య పేరు హారిక. వీరి పిల్లలు.. రహదారిపై క్రికెట్ ఆడేందుకు యత్నించారు.

ఆ క్రమంలో ఇంటి ముందు క్రికెట్ ఆడితే.. తమ ఇంట్లో పిల్లలకు బంతి తగులుతుందంటూ ఆ ప్రాంతంలో నివసిస్తున్న నిర్మల, కల్యాణి అనే మహిళలు అభ్యంతరం చెప్పారు. ఈ విషయాన్ని ఆ పిల్లలు.. తమ తల్లిదండ్రులు హరినాథ్ దంపతులకు తెలిపారు. దీంతో ఆగ్రహించిన వారు.. కల్యాణిపై దాడి చేశారు. దీంతో ఆమె అనంతపురం నగరంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఈ విషయం తెలుసుకున్న హరినాథ్ భార్య హరిక ఆగ్రహంతో ఊగిపోయింది. ఇంట్లో ఉన్న కళ్యాణిని బయటకు లాక్కొచ్చి ఆమెపై హరిక దాడి చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. తనపై మరోసారి దాడి చేశారంటూ కల్యాణి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. అందులో భాగంగా పోలీస్ స్టేషన్ వద్దకు వారు పురుగుల మందు డబ్బాతో సహా చేరుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.

దాంతో ఏఆర్ కానిస్టేబుల్ హరినాథ్, అతడి భార్య హరికపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాటిని పోలీసులు పరిశీలిస్తున్నారు.

అతి త్వరలోనే నిధి సమర్పణ ప్రారంభం…

అతి త్వరలోనే నిధి సమర్పణ ప్రారంభం

– శ్రీ శివ భక్తమార్కండేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణం కోసం

– శ్రీ మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి కన్వీనర్ మోర శ్రీనివాస్

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

సిరిసిల్ల పద్మశాలి కులబంధువులకు, హిందూ బంధువులకు సిరిసిల్ల మార్కండేయ వీధిలో అత్యంత పురాతనమైన విశిష్టమైన శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయము పునర్నిర్మాణం కై
శ్రీ మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి ఒక కార్యచరణను ప్రారంభించింది.
దీనిలో భాగంగా ఈ రోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గత రెండు నెలల నుండే పద్మశాలి కుల బంధువులతో, హిందు బంధువులతో సమాజంలోని అందరిని కలుపుకుని పోయే విధంగా దేవాలయాల ఆధారంగా 22 సమావేశాలను శాంతి నగర్ నుండి భూపతినగర్ వరకు, చంద్రంపేట నుండి సాయినగర్ వరకు నిర్వహించి అభిప్రాయాలను సేకరించిందని అన్నారు.
దేవాలయ పునర్నిర్మాణం హిందూ సంఘటనా శక్తికి, ఆత్మ గౌరవానికి, సమరసతకు చిహ్నంగా శ్రీ లలితా పరమేశ్వరీ లక్ష్మీనారాయణ సహిత శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మా ణములో సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు అందరినీ భాగస్వామ్యం చేయాలని భావించి అందుకు నిధి సమర్పణ కార్యాచరణను ప్రారంభించి తెలియజేపింది వారి అభిప్రాయాలను సేకరించిందనీ అన్నారు.
ఈ సమావేశం ద్వారా ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా అతి త్వరలోనే దేవాలయ నిధి సమర్పణ కార్యాచరణను ప్రారంభం చేస్తున్నామని అది కూడా వారం పది రోజులలో ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము అన్నారు.

ఇటీవల అయోధ్య లో భవ్యమైన దిన్యమైన అయోధ్య రామమందిర నిర్మాణముకై జరిపిన నిధి సమర్పణ కార్య విధానమే స్ఫూర్తిగా తీసుకుని సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు అందరం దేవుడి ముందర సమానమే అనే భావనతో ప్రయత్నం చేసి సిరిసిల్ల లో దివ్యమైన భవ్యమైన
శ్రీ మార్కండేయ ఆలయాన్ని పునర్నిర్మాణం చేద్దామని ఇది మనందరి సంఘటితశక్తికి, స్వాభిమానా ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉంటుందని తెలిపారు.

ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా తను మన ధనాన్ని భగవంతునికి దేవాలయానికి సమర్పించి భగవంతుని కృపకు పాత్రులు కాగలరని
శ్రీ మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి తెలిపింద
త్వరలోనే నిధి సమర్పణ ప్రారంభం తేదీని మీకు మీడియా ద్వారా తెలియపరుస్తామని అన్నారు.

దేవాలయానికి “ఇచ్చే ఒక ఇటుక కానీ, ఒక రూపాయి కానీ సమర్పణ చేస్తే తర తరాలకు పుణ్యం లభిస్తుంది . కావున ప్రతి ఒక్కరూ సమర్పణకి తను మన ధన ని సమర్పించి భాగస్వాములై భగవంతుని కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నామనీ అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో మెరుగు సత్యనారాయణ,మాదాస శ్రీనివాస్, నాగుల శ్రీనివాస్, కోడం రవి, గుంటుక పురుషోత్తం, చిమ్మని ప్రకాష్, గాజుల సదానందం, గుడ్ల విష్ణు, జిందం రవి, ఎనగంటి నరేష్, తదితరులు పాల్గొన్నారు.

చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న పెద్దింటి ప్రభాకర్…

చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న పెద్దింటి ప్రభాకర్

తాండూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కొత్తపల్లి గ్రామంలో పెద్దింటి ప్రభాకర్(64)అనే వ్యక్తి చెరువులో పడి మృతి చెందినట్లు తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. వారు సేకరించిన వివరణ ప్రకారం మృతుడు అతిగా మద్యం తాగడానికి అలవాటు పడడంతో కుటుంబ సభ్యులు అతన్ని మందలించారని తెలిపారు. దీంతో మనస్థాపానికి గురైన ప్రభాకర్ గురువారం ఊరి చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతిచెందిన వ్యక్తి భార్య రాజేశ్వర్ తో పాటు ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె ఉన్నారని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.

నారాయణకు రాయితీ హెల్త్ కార్డు అందించిన మెట్‌పల్లి ప్రెస్ క్లబ్…

సీనియర్ జర్నలిస్టు నారాయణకు మెట్ పల్లి లోని కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి బిల్లులో రాయితీ కలిగిన హెల్త్ కార్డు అందించిన
మెట్ పల్లి ప్రెస్ క్లబ్( ఐజేయు) సభ్యులు

 

మెట్ పల్లి అక్టోబర్ 9 నేటి దాత్రి
కోరుట్లలోని 6 వార్డు ఎకిన్ పూర్ చెందిన సీనియర్ జర్నలిస్టు గోరు మంతుల నారాయణకు. మెట్ పల్లి లోని కార్పొరేటర్ స్థాయి ఆసుపత్రిలో. బిల్లులో రాయితీ కలిగిన హెల్త్ కార్డును. గురువారంటీయూడబ్ల్యూజే( ఐజేయు) మెట్ పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా.అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్, మహమ్మద్ అజీమ్ ల ఆధ్వర్యంలో అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. నారాయణకు గత నెలలో ఆర్థిక సాయం అందించినట్లు. ఇప్పుడు ఆయనకు పట్టణంలోని ఓ కార్పొరేట్ స్థాయి ఆసుపత్రికి చెందిన బిల్లులో రాయితీగల హెల్త్ కార్డును అందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మహమ్మద్ అప్రోజ్, సహాయ కార్యదర్శి పింజారి శివ, ఈసీ మెంబర్ కుర్ర రాజేందర్ లు తదితరులున్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన – మాజీ జెడ్పిటిసి…

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన – మాజీ జెడ్పిటిసి

మహాదేవపూర్ అక్టోబర్ 9 (నేటి ధాత్రి)

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా బెగులూర్ గ్రామపంచాయతీ పరిధిలోని బాధిత కుటుంబాన్ని గురువారం రోజున మాజీ జెడ్పిటిసి గుడాల అరుణ శ్రీనివాస్ పరామర్శించారు. మండలంలోని బెగులూర్ గ్రామానికి చెందిన కొయ్యల మహేష్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని బాధిత కుటుంబాన్నీ పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అన్నివిధాల కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని బాధిత కుటుంబానికి బరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

ఉమాకాంత్ పాటిల్‌ను పరామర్శించిన వై. నరోత్తం

ఉమాకాంత్ పాటిల్ ను పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

కొద్దీ రోజుల క్రితం ప్రమాద వశాత్తు కాలుకు గాయమై ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకొంటున్న మాజీ సీడీసీ చెర్మన్ ఉమాకాంత్ పాటిల్ ను ఈ రోజు హైదరాబాద్ లోని వారి నివాసంలో కలిసి పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం, పరామర్శించిన వారిలో యం.శ్రీనివాస్, యూ. మాణేన్న,టి.రాములు,టి.విఠల్,యం.శివన్న,యం.సంగ్రామ్,బి.అశోక్,కె.శ్రీశైలం,తదితరులు ఉన్నారు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి.

రాయికల్ అక్టోబర్ 6, నేటి ధాత్రి:

 

రామాజీపేట గ్రామానికిమాజీ మంత్రి జీవన్ రెడ్డి చొరువతో రామాజీపేట గ్రామానికి చెందిన ఆరెల్లి గాయత్రి కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్,20,000 ,గ్రామ కాంగ్రెస్ నాయకులు అందిచడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు గుజ్జులా మోహన్ రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ హరీష్ రావు,నాయకులు రాజేశ్వర్ రావు,నారాయణ,రాములు, సుధీర్ రెడ్డి,రాజు,తిరుపతి, గౌతమ్,జల తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version