కాంగ్రెస్–కమ్యూనిస్టు అభ్యర్థులకు భారీ విజయం కావాలి

బాల్య వివాహాలపై అవగాహన సదస్సు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మొగుళ్లపల్లి మండలంలోని మొగుళ్లపల్లి, ముల్కలపల్లి జాతరలో, జిల్లా కలెక్టర్ జిల్లా సంక్షేమ అధికారి మల్లేశ్వరి ఆదేశాల మేరకు జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మొగుళ్లపల్లి ఎంపీడీవో పోస్టర్ ఆవిష్కరించారు. మిషన్ కోఆర్డినేటర్ క్రిష్ణ మాట్లాడుతూ, బాల్య వివాహాలు బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. జెండర్ స్పెషలిస్ట్ శ్రీమతి అనూష బాలికల రక్షణ, విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
ప్రజలతో బాల్య వివాహ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేయించడంతో పాటు, బేటీ బచావో – బేటీ పడావో” కార్యక్రమం కింద అవగాహన పంప్లేట్లను పంపిణీ చేశారు. జాతరలో సుమారు 5,000 మందికి పైగా ప్రజలకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో మహిళా సాధికారత, పోలీస్, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

కాంగ్రెస్–కమ్యూనిస్టు అభ్యర్థులకు భారీ విజయం కావాలి

కాంగ్రెస్ సిపిఐ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలి.

సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు పొత్తులో భాగంగా బలపరిచిన నలుగురు అభ్యర్థులతో పాటు 30 వార్డుల కౌన్సిలర్ అభ్యర్ధులను అధిక మెజార్టీతో గెలిపించాలని సిపీఐ జిల్లా కార్యదర్శి కొలిమి రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్ర వారం మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ ముగిసిన సందర్భంగా స్థానిక కొమురయ్య భవన్లో మీడియాతో మాట్లాడారు.. కమ్యూనిస్టులు కాంగ్రెస్ అధికార పార్టీతో పొత్తుపెట్టు కోవడం జరిగిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మున్సిపల్ అభివృద్దిని కోరి ఉమ్మడి కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టు కోవడం జరిగిందని స్పష్టం చేశారు. నాలుగు వార్డులలో పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థులతో పాటు పొత్తు దర్మాన్ని పాటిస్తు 30 వార్డులలో అధిక కౌన్సిలర్ అభ్యర్ధులను గెలిపించుకొని మున్సివల్ చైర్మన్ వడవిని కాంగ్రెస్, కమ్యూనిస్టులు కైవసం చేసుకునే విధంగా ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని రాజ్ కుమార్ తెలిపారు.

సిపిఐ నుండి నామినేషన్ వేసిన కౌన్సిలర్ అభ్యర్థులు వీరే :

భూపాలపల్లి మున్సిపాలిటీలోని 30 వార్డులకు 2వ సాధారణ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది.ఈ మున్సిపల్ ఎన్నికలో ఉమ్మడి కమ్యూనిస్టులకు కాంగ్రెస్ పొత్తు కుదిరి సిపిఐకి 5,7,24,28 నాలుగు వార్డులు, సిపిఎంకి 27 ఒక్క వార్డును కేటాయించారు.అందు భాగంగా సిపిఐ నుండి 5వ వార్డులో గంగ సరం శ్రీనివాన్, 7వ వార్డులో నూకల భూలక్ష్మీచంద్రమౌళి, 24 వార్డు వేముల జ్యోతి శ్రీకాంత్,28 వార్డు సౌత్కు ప్రవీణ్ కుమార్ లు శుక్ర వారం నాలుగు వార్డుల్లో నామినేషన్ వేశారు. అట్లాగే 27 వార్డు సీపీఎం నుండి ఎర్రం అనూష సతీష్ కుమార్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.వీరుపార్టీకోసం, ప్రజాసమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది.గత మున్సిపల్ ఎన్నికల్లో రెండు వార్డులు సిపిఐ గెలుచుకోగా, ఈ సారీ మున్సిపల్ ఎన్నికల్లో 4 వార్డులు ఖచ్చితంగా సిపిఐ గెలుచుకునే అవకాశం ఉందని వారు ధీమా వ్యక్తం చేశారు

ఆదానీ, అంబానీలకు లాభం చేయడం కోసమే బొగ్గు బ్లాకుల వేలం..

ఆదానీ, అంబానీలకు లాభం చేయడం కోసమే బొగ్గు బ్లాకుల వేలం

మణుగూరు పికె ఓసి2 ని వేలం వేస్తే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం

ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

కోల్ ఇండియా వ్యాప్తంగా 41బొగ్గు బ్లాకులను కేంద్రం ప్రభుత్వం వేలం వేయడాన్ని ఒప్పుకునేదే లేదని, మణుగూరు పికె ఒసి2 డిప్ సైట్ ని వేలం వేస్తే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పోరాటం తప్పదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజ్ కుమార్ మాట్లాడుతూ.. లాభాల్లో ఉన్న మణుగూరు పికె ఓసి2 ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ సంస్థలైన ఆదా అని, ఏఎంఆర్ జెన్కో, మేఘ కృష్ణారెడ్డి, ప్రభుత్వ రంగ సంస్థలైన జెన్కో కంపెనీలకు వేలం వేయడానికి ఏడు కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని తెలిపారు. పీకే ఓ సీ2ను సింగరేణి దక్కించుకోకుంటే మణుగూరులో సింగరేణి మనుగడకే ప్రమాదం పొంచి ఉందన్నారు. అందులో ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్కో వేలంలో పాల్గొనడాన్ని ఏఐటీయూసీ తీవ్రంగా ఖండిస్తుందని, వెంటనే జెన్కో సంస్థ వేలం నుండి విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మణుగూరు పీకే ఓసి 2 ఓసి బ్లాక్ లలో సుమారు 60 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని, 167 హెక్టార్లలో బొగ్గు ఉందని, కంపెనీకి ఆదాయాన్ని తెచ్చి దాన్ని ప్రైవేట్ కంపెనీలకు వేలం వేయడం దుర్మార్గమని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఆదాని, అంబానీలకు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తుందని, వారికి లాభం చేకూర్చడం కోసమే ఈ బొగ్గు బ్లాగులను వేలం వేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మణుగూరు పీకే ఓసి2 ని వేలం వేయడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ కమిటీగా ఏర్పడి అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తే చూస్తూ ఊరుకోలేని సింగరేణి రక్షణ కోసం విశాఖ స్టీల్ ఉద్యమంలాగా రాబోయే రోజుల్లో కార్మిక సంఘాల ఉద్యమిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, కాంట్రాక్ట్ కార్మికుల ఇంచార్జ్ నూకల చంద్రమౌళి, స్థానిక నాయకులు నల్ల సత్తి కుమారస్వామి బాబురావు, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మె తప్పదు..

కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మె తప్పదు

ఎఐటియుసి జనరల్ సెక్రెటరీ కొరిమి రాజ్ కుమార్

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

సింగరేణి వ్యాప్తంగా కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే ఎఐటియుసి యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలు,సమ్మె కార్యక్రమాలు తప్పవని ఆ యూనియన్ జనరల్ సెక్రెటరీ కొరిమి రాజ్ కుమార్ అన్నారు. సోమవారం శ్రీరాంపూర్-నస్పూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.గుర్తింపు కార్మిక సంఘం (ఎఐటియుసి) కార్మికుల సమస్యల పరిష్కారం,సంక్షేమం కోసం ఇచ్చిన డిమాండ్లను యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.మెడికల్ బోర్డు కు సంబంధించి అప్లికేషన్ పెట్టుకుని తొమ్మిది నెలలు గడుస్తున్న ఇప్పటికి మెడికల్ బోర్డు పై స్పష్టత లేకపోవడం శోచనీయమన్నారు.మెడికల్ బోర్డు ఎప్పుడు పెడతారో తెలుపాలని డిమాండ్ చేశారు. మెడికల్ బోర్డు పూర్తి చేసుకొని డిపెండెంట్ ఉద్యోగాల కింద సుమారు 375 మంది 5,6 నెలల నుండి విటిసి ఆర్డర్ల కోసం ఎదురుచూస్తున్నారని, వారిని ఎందుకు అపుతున్నారో స్పష్టత లేదని వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.సంస్థ అభివృద్ధి కోసం పాటుపడే కార్మికుల సొంతింటి పథకంపై ఎన్నిసార్లు మాట్లాడిన ఆ అంశంపై పురోగతి లేదని ఆరోపించారు.కోలిండియాలో మాదిరి అలవెన్స్ లపై టాక్సును సింగరేణి యాజమాన్యమే భరించాలని డిమాండ్ చేసినప్పటికీ ఆ అంశంపై స్పందనలేదని అన్నారు.వెంకటేష్ ఖని( వికె) కోల్ వైన్స్,ఇల్లందు జేకే ఎక్స్టెన్షన్ ఓపెన్ కాస్ట్ లో పూర్తిగా బొగ్గు,ఓబి తీసే పనులను ప్రైవేటు వాళ్ళకే ఇచ్చారని ఆరోపించారు. ఒకవైపు యాజమాన్యం ఎక్సెస్ మ్యాన్ పవర్ ఉందంటూనే కాంట్రాక్ట్ పద్ధతులను ప్రోత్సహిస్తుందని విమర్శించారు.డిస్మిస్ కార్మికులకు ఒకసారి అవకాశం ఇవ్వాలని ఎఐటియుసి ఆధ్వర్యంలో యూనియన్ దృష్టికి తీసుకెళ్లిన సరైన నిర్ణయం తీసుకోవడం లేదని విమర్శించారు.అలాగే ఎంతోమంది కార్మికులు ఆవేదన చెందుతున్న మారుపేర్ల సమస్య పరిష్కారం కోసం గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఒక ఫైల్ కూడా ముందుకు వెళ్లడం లేదని ఆరోపించారు.సుమారు 7000 మంది అభ్యర్థులు క్లారికల్ కొరకు రెండు,మూడు సంవత్సరాల క్రితం దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ వారికి ఎగ్జామ్స్ పెట్టడం లేదని అన్నారు.అదే కాకుండా స్పష్టత లేకుండా 150 మాస్టర్ల ను కార్మికులను సంప్రదించకుండా తెరమీదికి తీసుకువచ్చారని,ఇచ్చేకాడ ఇవ్వకుండా,కట్ చేసే కాడ మాత్రం యాజమాన్యం ముందుంటుందని విమర్శించారు.కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యక్ష ఉద్యమాలలో పాల్గొంటామని ఈ మేరకు ఈనెల 6వ తేదీన సింగరేణి వ్యాప్తంగా ధర్నాలు చేపడుతూ అన్ని గనులు డిపార్ట్మెంట్లలో మెమోరాండాలు అందజేస్తామని,8వ తేదీన జిఎం కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలు అనంతరం నిరాహార దీక్షలను చేపడతామని,కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే జనవరిలో సమ్మె తప్పదని యాజమాన్యాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఉప ప్రధాన కార్యదర్శి ముష్కే సమ్మయ్య, వైస్ ప్రెసిడెంట్ కొట్టే కిషన్ రావు,సహాయ కార్యదర్శి చంద్రమోహన్,మైనింగ్ స్టాఫ్ నాయకులు రాజేశ్వర్ రావు, బాలకృష్ణ,రాజశేఖర్, శ్రీనివాస్, నాయకులు,మోతే లచ్చన్న, గజ్జి రమేష్,నరసయ్య,రాజ్ కుమార్,శ్రీనివాస్ పాల్గొన్నారు.

ప్రజల పక్షాన పోరాడిది కమ్యూనిస్టులే…

ప్రజల పక్షాన పోరాడిది కమ్యూనిస్టులే

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సీట్లు గెలిపించుకోవాలి

సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక సుమారు రెండు సంవత్సరాలు గడుస్తుందని, ఎన్నికలు జరగక గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుందని వెంటనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొరిమి రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు పదవి కాలం పూర్తయి సుమారు రెండు సంవత్సరాలు గడుస్తుందని దీంతో అభివృద్ధి ఆగిపోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కుల గణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించడంతో రిజర్వేషన్లు 50 శాతం మించారాదని హైకోర్టు స్టే విధించడంతో ప్రస్తుతం ఎన్నికలు వాయిదా పడ్డాయ న్నారు. దేశంలో 65శాంతం బీసీలు ఉన్నారని ప్రభుత్వం దానికి 42 శాతం రిజర్వేషన్ కేటాయించడంతో కోర్టు జోక్యం చేసుకొని రిజర్వేషన్లు 50 శాతం మించరాదని నిబంధనలు ఉన్నాయని దీంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ఆగిపోయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని లేదంటే కాంగ్రెస్ కు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. 42 శాతం రిజర్వేషన్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లడం అనేది కాలయాపన తప్ప మరేం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు లేక గ్రామాలు, మున్సిపాలిటీల కాల పరిధి ముగిసి సుమారు రెండు సంవత్సరాలు అవుతుందని, రాష్ట్రానికి రావలసిన నిధులు రాక అభివృద్ధి స్తబ్దతగా మారిందన్నారు. బీసీ రిజర్వేషన్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. కమ్యూనిస్టు పార్టీగా స్థానిక సంస్థ ఎన్నికల్లో జిల్లాలో రేగొండ, చిట్యాల, మొగుళ్లపల్లి, భూపాలపల్లి మండలాల్లో పోటీ చేయడం జరుగుతుందని ఎంపీటీసీ జెడ్పిటిసి సర్పంచులు అధిక స్థానాలు గెలుచుకునే విధంగా మా ప్రయత్నం ఉంటుందన్నారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడేది కమ్యూనిస్టులేనని పోరాటాలు నిర్వహించే పార్టీలను ప్రజలు ఆదరించాలని ఈ సందర్భంగా రాజ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్,క్యాతరాజ్ సతీష్,కోరిమీ సుగుణ,గంగసరపు శ్రీనివాస్ ,నేరెళ్ల జోసెఫ్ ,గోలి లావణ్య ,మహేశ్,పీక రవికాంత్ తదితరులు పాల్గొన్నారు

సిపిఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి.

సిపిఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి..

సిపిఐ 5వ జిల్లా మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

ఈ నెల 13,14 న నిర్వహించే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 5వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవన్ లో సిపిఐ నాయకులతో కలిసి మహాసభల గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు హాజరు కానున్నట్లు తెలిపారు.

 

 

 

ఈ మహాసభలకు 150 మంది డెలిగేట్స్ తో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా మహాసభలను ఈ నెల జులై 13, 14 న రేగొండ ఎస్ ఎల్ ఎన్ గార్డెన్ లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

 

మహాసభలో జిల్లా సమగ్ర అభివృద్ధికై చర్చించి భవిష్యత్ కార్యక్రమం రూపొందించుకోవడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా భూపాలపల్లికి బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయాలని, జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం జిల్లా సమగ్ర అభివృద్ధిని ప్రతిబింబించే విధంగా మహాసభలలో చర్చించడం జరుగుతుందన్నారు.

 

 

 

అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించాలని కోరారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున చర్చ జరిపి తీర్మానాలు ప్రవేశపెట్టి ఆందోళన పోరాటాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. జిల్లా మహాసభలను ప్రజలు, మేధావులు, కార్మికులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని రాజ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు మాతాంగి రామచందర్, గురుజేపల్లి సుధాకర్ రెడ్డి, సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొరిమి సుగుణ, క్యాతరాజ్ సతీష్, నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్, గోలి లావణ్య, పెద్దమాముల సంధ్య, పొన్నగంటి లావణ్య, రమేష్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version