మండలంలో ఘనంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు…

మండలంలో ఘనంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు
* నివాళులర్పించిన బిజెపి జిల్లా కౌన్సిల్ నెంబర్

మహాదేవపూర్ సెప్టెంబర్ 25 (నేటి ధాత్రి)

మహాదేవపూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ అధ్యర్యంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ నెంబర్ ఆకుల శ్రీధర్ అధ్యక్షతన గురువారం రోజున శ్రీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్బంగా బస్ స్టాండ్ ఆవరణలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులూ అర్పించారు. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మాజీ అధ్యక్షులుగా, భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రo సిద్ధాంతకర్త అని, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 1916 సెప్టెంబర్ 25 న ఉత్తరప్రదేశ్ లోని మధుర దగ్గర ‘నగ్ల’ చంద్రబాన్ అనే గ్రామంలో జన్మించారని, మొదట కొద్దీ మంది స్వయం సేవకులలో ఒకరిగా చేరి ప్రాదేశీక సహా ప్రచారక్ స్థాయికి ఏదిగారని, భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రం సిద్ధాంతానికి పునాదిగా చెప్పబడే ఏకత్మాత మానవతా వాదం, శంకరాచార్య జీవిత చరిత్ర వంటి పుస్తకాలు రచించారాని, ఏకాత్మ మానవవాదం ప్రవచించి సమాజంలో అట్టడుగునా వున్నా వ్యక్తికి ప్రభుత్వ పథకాల్లో తొలి ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ విధానాన్ని రూపొందించిన శ్రీ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్బంగా ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులని వారు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ బీజేపీ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్, మండల ప్రధాన కార్యదర్శి బల్ల శ్రావణ్ కుమార్, బీజేపీ నాయకులు దాడిగేలా వెంకటేష్, శంకర్, శ్రవణ్, మహేష్, రాకేష్, హరీష్, పాల్గొన్నారు,

బాలాజీ టెక్నోస్కూల్ లో జాతీయ అంతరిక్ష దినోత్సవం…

బాలాజీ టెక్నోస్కూల్ లో జాతీయ అంతరిక్ష దినోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట మండలం లక్నేపల్లిలోని బాలాజీ టెక్నో స్కూల్ లో 2.వ జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకున్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పి. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ చంద్రయాన్- 3 పూర్తయ్యి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా దేశం తన రెండవ జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు.
ఆర్యభట్ట నుండి గగన్ యాన్ వరకు ప్రాచీన జ్ఞానం నుండి అనంత అవకాశాల వరకు అనే ఇతివృత్తంతో జరుపుకునే అంతరిక్ష రంగంలో భారత్ తిరుగులేని విజయాలతో అమెరికా, చైనా, రష్యా, జపాన్ వంటి దేశాలకు సాధ్యంకాని విధంగా అనేక విజయాలను నమోదు చేసిందన్నారు.చంద్రయాన్ 1,2,3 ప్రయోగాలే కాకుండా చంద్రయాన్ – 4 ప్రయోగానికి సన్నద్ధం అవుతుందని, 2035 నాటికి సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉందని గుర్తుకుచేశారు. భారత్ చంద్రునిపై 2023 ఆగస్టు 23 న చంద్రుని దక్షిణ ధ్రువప్రాంతాన్ని చేరుకున్న మొదటి దేశంగా అవతరించిందని తెలిపారు.విద్యార్థులు, యువత సైన్సును కేవలం ఒక కెరీర్ గా చూడకుండా ఉండాలని, అంతరిక్ష పరిశోధన,సాంకేతికలు,దేశ నాయకత్వం పట్ల జాతీయ గౌరవాన్ని ప్రేరేపించి హద్దులు లేని ప్రయాణాన్ని చూడాలని విద్యార్థులను సూచించారు.ఎన్సిసి పదవ బెటాలియన్ సూచనల మేరకు సోషల్ సర్వీస్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ లో భాగంగా థర్డ్ ఆఫీసర్ ఎం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో కూడా జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించగా విద్యార్థులు అంతరిక్షం సంబంధించిన చార్టులు ప్రదర్శించి క్విజ్ పోటీలలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె. రమేష్, విజయ్, గౌతమ్, పూర్ణిమ, రాజ్ కుమార్, రమ్య, కృష్ణవేణి, హేమలత, నరసింహారెడ్డి, అనిత, విశాల,తదితరులు పాల్గొన్నారు.

ఎన్ సిసి విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు

ఎన్ సిసి విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు*

బాలాజీ టెక్నో స్కూల్ లో ఎన్.సి.సి. విద్యార్థుల ఎంపిక

నర్సంపేట,నేటిధాత్రి:

ఎన్.సి.సి విద్యార్థులకు క్రమశిక్షణ, దేశభక్తి అలవడుతుందనీ, అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కూడా ఉంటాయని బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ అన్నారు.నర్సంపేట మండలంలోని లక్నేపల్లి శివారులోని బాలాజీ టెక్నో స్కూల్ లో గురువారం జరిగిన 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను ఎన్.సి‌.సి సెలక్షన్స్ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమానికి ఎన్ సిసి టెన్త్ బటాలియన్ ఆఫీసర్స్ హవల్దార్ విజయ్, దీపక్ లు మరియు బాలాజీ టెక్నో స్కూల్ ఎన్ సిసి థర్డ్ఆఫీసర్ ఎం.డి. రియాజుద్దీన్ ఆధ్వర్యంలో బాలాజీ టెక్నో స్కూల్ విద్యార్థులకు సెలక్షన్స్ నిర్వహించారు. 185 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో నుండి 49 మంది విద్యార్థులను ఎన్.సి.సి. అధికారులు అర్హులుగా ఎంపిక చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు భవానీ చంద్, పార్వతి, వినోద్,ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ప్రకృతి వైపరీత్యాలవల్ల జరిగే ప్రమాదాలపై ఎన్సీసీ స్టూడెంట్స్ కు అవగాహన

మొగుళ్ళపల్లి ఫిబ్రవరి 8 నేటి ధాత్రి

మండలంలోని జెడ్ పి హెచ్ ఎస్ మొట్లపల్లి పాఠశాలలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వారిచే మొగుల్లపల్లి, మొట్లపల్లిలో. ఎన్.సి.సి. విద్యార్థులకు ,విపత్తులు,వాటి నివారణ చర్యలు అవగాహన కార్యక్రమం జరిగింది. మండల విద్యాశాఖ అధికారి. లింగాల కుమారస్వామి, పాల్గొని మాట్లాడుతూ మానవ తప్పిదాలు లేదా ప్రకృతి,వైపరీత్యాల వల్ల జరిగే ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, వరదలు, సునామిలు, భూకంపాలు, వచ్చినపుడు ఏ విధంగా అప్రమత్తం కావాలో ఎన్.సి.సి విద్యార్థులుగా,మీరు ఏ విధoగా నివారించాలో, ప్రయోగాలు చేసి ఎన్.డి.ఆర్.ఎఫ్.బృందం విద్యార్థులకు విపత్తుల నివారణ చర్యలను గురించి ఆచరణాత్మకంగా చూపించి విద్యార్థులకు కళ్లకు కట్టినట్టుగా చూపించడమే కాకుండా విద్యార్థులు కూడా ఆచరింప చేయడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి సి హెచ్ రఘు, మొగుల్లపల్లి ఎన్ సీసీ అధికారి
జి రాజయ్య, ఎన్డీఆర్ఎఫ్. అధికారి సుశాంత్ కుమార్, ఎన్టీఆర్ఎఫ్ బృందం, సీనియర్ ఉపాధ్యాయులు నరసింహ స్వామి, సంపత్ కుమార్ , వీరయ్య, రవీందర్, ఉమారాణి, గ్లోరీ రాణి, శకుంతల, శోభారాణి, కవిత, సందీప్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version