అంబేద్కర్ భవన్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి.

అంబేద్కర్ భవన్ లో బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి వేడుకలు. 

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా నస్పూర్ అంబేద్కర్ కాలనీ లోని అంబేద్కర్ భవనం లో బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా మహానీయుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం జిల్లా సీనియర్ నాయకులు కొప్పర్తి రాజం మాట్లాడుతూ కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు బలహీన వర్గాల నేత దేశ స్వతంత్రం కోసం సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా సీనియర్ నాయకులు కోప్పర్తి రాజం, మడుగుల శంకర్,జిలకర రాజం,యువ నాయకులు మడుగుల స్వామి దాస్, మడుగుల మహేష్,కొప్పర్తి చింటూ తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ భవన్ పై అసత్యపు ఆరోపణలు మానుకోండి

పరమశివన్.

తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 08:

దళిత ప్రజలకు ఆశ్రయంగా నిలుస్తున్న శ్రీ చెల్లప్ప మేస్త్రి మెమోరియల్ అంబేద్కర్ భవన్ పై అసత్యపు ఆరోపణలు మానుకోవాలని తిరుపతి అంబేద్కర్ భవన్ చైర్మన్ డాక్టర్ పరమేశ్వరం హెచ్చరించారు. శనివారం తిరుపతి స్థానిక బాలాజీ కాలనీలోని అంబేద్కర్ భవన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం నాడు ఏపీ ఎస్సీ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగిశెట్టి ధర్మయ్య తిరుపతి అంబేద్కర్ భవన్ పై విమర్శలు చేయడం తగదన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకు వెళుతూ అంబేద్కర్ భవన్ ను అభివృద్ధి పదంలో నడిపించేందుకు తామెంతో కృషి చేస్తున్నామన్నారు.అయితే కొందరు దుర్బుద్ధితో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. దళిత యువకులకు దళిత సంఘాలకు తాము ఎంతో ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు.అలాగే నెలలో రెండుసార్లు అంబేద్కర్ ఎలా ప్రజలకు సేవ చేశారు అన్న అంశాలను ప్రజల నిరంతరం తెలియజేస్తూ అందరికీ అండగా ఉంటున్నామని తెలిపారు. ఇకనైనా అసత్యపు ఆరోపణలు మానుకొని అంబేద్కర్ భవన్ అభివృద్ధికి సహకరించాలని లేనిపక్షంలో ప్రజలే వారికి బుద్ధి చెప్తారని అన్నారు.ఈ విలేకరుల సమావేశంలో అంబేద్కర్ భవన్ కార్యదర్శి కె.నాగేశ్వరరావు, సభ్యులు ఇంద్రముని,గోపి,పుష్ప రాజ్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version