రేవన సిద్దేశ్వర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల ఈదులపల్లి గ్రామంలో శ్రీ రేవన సిద్దేశ్వర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మొదటి రోజు శ్రీ చండికాంబ అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం. మరియు దుర్గా హోమం నిర్వహించినారు ఆలయ అర్చకులు శ్రీ రేవన సిద్దయ్య స్వామి బసవరాజ్ స్వామి లింగం గౌడ్ దంపతులు పూజలు నిర్వహించినారు.