సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T124735.975.wav?_=1

సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్

ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్

హన్మకొండ, నేటిధాత్రి:

 

వినాయక చవితి పండుగ సందర్భంగా రెండు రోజుల క్రితం
లస్కర్ బజార్ మరియు కుమార్ పల్లి మార్కెట్లలో వస్తువులు తీసుకుంటుండగా కొంతమంది దొంగలు ఫిర్యాదుదారుల దృష్టి మరల్చి వారి జేబులో ఉన్న సెల్ ఫోన్ ని దొంగతనం చేసినారు హనుమకొండ పోలీస్లు అట్టి దొంగతనం చేసిన జార్ఖండ్ కి చెందిన ఐదుగురు దొంగలను పట్టుకొని వారి వద్ద నుండి 1,50,000 విలువగల మూడు సెల్ ఫోన్ లను సీజ్ చేసి రిమాండ్ తరలించడం జరిగినది.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఝార్ఖండ్ కి సంబంధించిన కొందరు దొంగల ముఠా రెండు రోజుల క్రితం హనుమకొండ స్టేషన్ పరిధిలో ఉన్న రద్దీ ప్రాంతాలలో ప్రజల దృష్టి మరల్చి ఒక ప్లాస్టిక్ కవర్ అడ్డుపెట్టి ప్రజల సెల్ ఫోన్లు దొంగతనం చేస్తున్నారు కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు
అట్టి దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన క్రైమ్ పార్టీ సిబ్బంది రావుఫ్ అశోక్ మరియు మహేందర్ లను సీఐ మచ్చ శివకుమార్ అభినందించారు.

కుక్కలు రోడ్లపై హల్ చల్…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T124529.503.wav?_=2

కుక్కలు రోడ్లపై హల్ చల్

గొర్రెల మందల తలపిస్తున్న కుక్కల మంద

అధికారులు స్పందించాలంటూ ఉన్న ప్రజలు

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో కేసముద్రం విలేజ్ లో
కుక్కలు వీధి వీధులలో సైరవిహారం చేస్తూ సందు సందులలో గుంపులు గుంపులుగా కలియ తిరుగుతూ దాడి చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి, చిన్నపిల్లలను ఇస్తారు చింపినట్టుగా చిన్నారులను చితిమేసిన సంఘటనలు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి, అదేవిధంగా రోడ్లపై గ్రామంలో వీధుల వెంట వందల సంఖ్యలో గొర్రెల మందల లాగా విహారం చేస్తూ వచ్చిపోయే వాహనముల వెంట పడుతూ వాహనదారులు కుక్కల దాడిని తప్పించుకునే క్రమంలో భయాందోళనతో బైకులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. అదే క్రమంలో మరణాలు సంభవించే అవకాశం లేకపోలేదు, కానీ అధికారులు చోద్యం చూసినట్టు చూస్తూ అనేక ప్రమాదాలు జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నారు తప్ప కుక్కల బెడద నుంచి ప్రజలను రక్షించే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం విడ్డూరం.తక్షణమే అధికారులు స్పందించి కుక్కల యొక్క దాడులనుంచి ప్రజలు గురికాకముందే కుక్కలను గ్రామాల నుండి నివారించే చర్యలు చేపట్టాలని లేకపోతే రాబోయే రోజుల్లో కుక్కల సంఖ్య పెరిగి చిన్న పిల్లలు మరియు పెద్దలు కూడా వీధుల్లోకి రావాలంటే రాలేని పరిస్థితి నెలకొంటుందని వెంటనే కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కేసముద్రం ప్రజలు కోరుకుంటున్నారు.

అటకెక్కిన పారిశుధ్యం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T124114.280.wav?_=3

 

అటకెక్కిన పారిశుధ్యం
* పట్టించుకోని పంచాయతీ అధికారి

మహాదేవపూర్ ఆగస్టు 29 (నేటి దాత్రి)

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య పనులు అటకెక్కాయని శుక్రవారం రోజున గ్రామ ప్రజలు వాపోయారు. గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లవాడలో రోడ్డుకు ఇరుప్రక్కల మురుగునీటి కాలువలు లేక రోడ్డుపై మురుగునీరు నిలిచి ఇండ్లలోకి వస్తున్నాయని వాపోయారు. గ్రామ ప్రజలు, వ్యవసాయదారులు రాకపోకలు నిర్వహిస్తున్నారు పొరపాటున ఎవరైనా కాలుజారి కింద పడితే మునిగే ప్రమాదం ఉందనీ ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారి చొరవ తీసుకొని మురుగునీటి వ్యవస్థను మెరుపరిచి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుచున్నారు. 

వనపర్తి లో వినాయక పూజ చేసిన మాజీ మంత్రి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T123747.767.wav?_=4

వినాయక మండపాలలో పూజలో మాజీ మంత్రి

వనపర్తి నేటిదాత్రి .
భక్తుల ఆహ్వానం మేరకు వనపర్తి లో వినాయక మండపాలు సందర్శించి విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారని జిల్లా బీ ఆర్ ఎస్ మీడియా సెల్ ఇంచార్జి నంది మల్ల అశోక్ ఒక ప్రకటన లో తెలిపారు హనుమాన్ టేకిడి,గ్రీన్ పార్క్ఎన్.టి.ఆర్ కాలనీల వినాయక మండ పాల నిర్వాహకులు మాజి మంత్రి ని ఆహ్వానించారని అశోక్ తెలిపారుమాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విఘ్నాలు తొలగించి వనపర్తి జిల్లా ప్రజలకు విజయాలు జరగాలని వినాయకుడిని పూజించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ గట్టు యాదవ్ మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాజీ మార్కేట్ కమిటి చైర్మన్,పలస రమేష్ గౌడ్ మీదీయ ఇంచార్జి నందిమల్ల అశోక్,మాజీ కౌన్సిలర్లు బండారు కృష 33 వ వార్డు ఉంగ్లం తిరుమల్ నాయుడు ప్రేమ్ నాథ్ రెడ్డ్ చిట్యాల రాము సూర్యవంశంముగిరి గ్రీన్ పార్క్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వ హుకులు రాజేష్ కుమార్ రాజేందర్ ఎలిశెట్టి వెంకటేష్ ప్రేమ్ నాథ్ రెడ్డ్ వంశీకృష్ణ రాహుల్ విజయాచారి ఎన్.టి.ఆర్ కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రాజశేఖర్ సాయినాథ్ రాకేష్ జమునా రాణి శారద విజయ విజయ లక్ష్మీ పరిమళ భక్తులు పాల్గొన్నారని అశోక్ తెలిపారు

చిన్నారుల చోట గణేష్ నిమజ్జనం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T123222.024-1.wav?_=5

 

చిన్నారుల చోట గణేష్ నిమజ్జనం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ శాసన పరిధిలోని ఝరాసంగం మండలం జీర్ణపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం బీసీ కాలనీలోని చిన్నారులు ఘనంగా చోట గణేష్ నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా వారు ప్రసాదాలు పంచుతూ,నిమజ్జనం చేసి, చూపరులను ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమం గ్రామంలోని ప్రజలందరినీ ఆనందపరిచింది అందరూ చూసి ఆనందించారు.

అధికారుల నిర్లక్ష్యంతో జలమయం అయిన రోడ్లు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T122912.268.wav?_=6

అధికారుల నిర్లక్ష్యం/ జలమయం అయిన నివాస ప్రాంతాలు రోడ్లు — ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం

◆:- విచ్చల విడిగా వ్యర్థాలను వదులుతున్న అల్లనా

◆:- దుర్గంధం వాసన వదిలిన అల్లనా

◆:- చెరువులను తలపిస్తున్న వెంచర్లు,రోడ్లు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జాహిరాబాద్ నియోజకవరగంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం తిరిగి పరిశీలించడం జరిగింది ,బారి వర్షాలకు రోడ్లు,వెంచర్ లు అన్ని జలమయం అయ్యాయి వాగులు వంకలు బోర్లి పోతున్నాయి ప్రతిసారి వర్షాలు కురుస్తున్న సమయంలో ఇదే అదనుగా భావించి అల్లనా పశువదశాల వ్యర్థాలను నాళాలో ప్రవహిస్తున్న నీటిలో వదులుతున్నాడు దింతో చుట్టూ ప్రక్కల దుర్గంధంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు ప్రజలు అనారోగ్యానికి గురి అయ్యే అవకాశాలున్నాయి అల్లనా వ్యర్టాలను వదులుతున్న ప్రదేశాన్ని స్వయంగా పరిశీలించడం జరిగింది

Negligence Leads to Flooded Roads

ఈ వ్యర్థాలు మొత్తం నారింజలో కలిసి నారింజ నీరు మొత్తం కలుషితమవుతున్నది ఈ విషయమై గత జూన్ మాసంలో పొల్యూస్యన్ కంట్రోల్ బోర్డ్ అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసిన నాటి నుండి నేటి వరకు చర్యలు తీసుకున్నది లేదు,అధికారులు అల్లనా యాజమాన్యంతో కుమ్ముక్కై ఏ చర్యలు తీసుకోవడం లేదు,మరియు నాళాలు కాలువలు మళ్లించి,చిన్నవిగా చేసి అధికార పార్టీ నాయకులు వ్యాపారులు అక్రమంగా వెంచర్ లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ అక్రమ వెంచర్ ల లో మొత్తం నీరు నిలబడి చేరువులను తలపిస్తున్నాయి గతంలోనే అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది వారు స్పందిస్తే ఇలా జరిగేదికాదు ప్లాట్లు కొనే వారు క్షుణ్ణంగా పరిశీలించి కొనుగోలు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి దీనికి కారణం ఇరిగేషన్ అధికారుల అసమర్థతే, మరియు

Negligence Leads to Flooded Roads

ఈ బారి వర్షాలకు రోడ్లపై బారి లోతుగా నీరు నిలబడి అల్గోల్,మరియు రాయిపల్లి డి గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి,నారింజ పూర్తిగా నిండుకొని గేట్లు చేడిపోయి సరిగ్గా తెరుచుకోనందున నీరు వెనక భాగాన నిలబడి పంటపొలాల్లో నీరు నిలబడి పంట నష్టం జరుగుతున్నది గేట్లపై నుండి నిరంత వృధాగా కర్ణాటకకు తరలిపోతున్నది అధికారులు,ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉంటే నీటిని కపడుకోనేవారం,ఇప్పటి కైనా అధికారులు,ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్,శికారి గోపాల్,చల్లా శ్రీనివాస్ రెడ్డి,సి.యం. విష్ణువర్ధన్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు,

గణనాథుడి కృపా కటాక్షాలు ప్రజలపై సంపూర్ణంగా ఉండాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T122433.283.wav?_=7

 

గణనాథుడి కృపా కటాక్షాలు ప్రజలపై సంపూర్ణంగా ఉండాలి

◆:- ఎమ్మెల్యే మాణిక్ రావు

◆:- డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలోని అతిది హోటల్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గణనాధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు విఘ్నాలను తొలగించే దైవం ఆ వినాయకుడి ఆశీస్సులు ప్రజలపై సంతోషంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ గుండప్పా జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ సీనియర్ నాయకులు నారాయణ నర్సింహ గౌడ్ సురేష్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

వరద బాధిత కుటుంబానికి ఆర్ఐ సాయం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T122050.539-1.wav?_=8

వరద బాధిత కుటుంబానికి ఆర్ఐ సాయం

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T122050.539.wav?_=9

ఈ విషయాన్ని తెలుసుకున్న న్యాల్కల్ తహశీల్దార్ ప్రభు ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్యామ్ రావు బాధిత కుటుంబాన్ని పరిశీలించారు. వారిని తాత్కాలికంగా గ్రామ పంచాయతీ కార్యాలయానికి తరలించారు. అంతేకాకుండా, ఆహారం, కొంత నగదు సహాయం అందజేసి ఆదుకున్నారు

కోహిర్ లో గణనాథుడికి 82 ఏళ్ల చరిత్ర…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T121848.393.wav?_=10

 

కోహిర్ లో గణనాథుడికి 82 ఏళ్ల చరిత్ర

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

గత రెండు రోజుల నవరాత్రుల సందర్భంగా కోహిర్ గ్రామంలోని 4వ వార్డులో 82 సంవత్సరాల చరిత్ర కలిగిన సార్వజనిక వినాయకుడి విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. గత ఐదేళ్లుగా స్వచ్ఛమైన మట్టితో తయారుచేసిన విగ్రహం పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండటం గ్రామ ప్రజలకు ఆనందాన్నిచ్చింది. పిల్లల ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో 9 రోజుల నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి.

రైతులకు ఎరువులు సకాలంలో అందించాలి – సిపిఐ డిమాండ్…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T115608.465-1.wav?_=11

చర్ల రైతులకు ఎరువులు సకాలంలో అందించాలి
సిపిఐ రైతు సంఘం డిమాండ్

నేటిధాత్రి చర్ల

చర్ల మండలంలో వరి పత్తి మిర్చి మొక్కజొన్న ఆకు కూరలు కూరగాయలు ఇతర పంటలు సాగుచేసుకుంటున్న రైతులకు ఎరువులు సకాలంలో సరిపడా సరఫరా చేయకపోవడం వల్ల రైతులు నష్టాల బారిన పడే పరిస్థితులు ఏర్పడ్డాయి అప్పులు చేసి సాగు ప్రారంభించిన రైతులకు ఎరువులు అందించకపోవడంలో దిగుబడి సన్నగిల్లి భారీ స్థాయిలో నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడుతుందని. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు ఆండ్రు వామనరావు అన్నారు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సరిపడా 10 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 5. 32లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసి చేతులు దులుపుకుంది దీంతో రాష్ట్రంలో ఎరువుల కొరత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారని తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మండల రైతంగానికి సరిపడా డిమాండ్ కనుగుణంగా ఎరువులను సకాలంలో సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు అవినీతి పైరవీలు దళారి వ్యవస్థలను అదుపుచేసి ప్రతి రైతుకు ఎరువుల అందించాలని అదేవిధంగా పూర్తి సబ్సిడీతో పురుగుల మందులు వ్యవసాయ పరికరాలు అందించాలని ఏఐకేఎస్ అనుబంధ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా మండల తాసిల్దార్ కార్యాలయ వద్ద వినతి పత్రాలు అందిస్తున్నామని ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడ్డగర్ల తాతాజీ తెలిపారు అనంతరం వివిధ డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని చర్ల మండల తాసిల్దార్ శ్రీనివాస్ కు అందించారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి నూప పోతయ్య సహాయ కార్యదర్శులు కోటి ముత్యాలరావు చల్లా లక్ష్మీనారాయణ కోడిరెక్కల రాజారావు నరసింహారావు మహేష్ రమణ రామారావు సత్యనారాయణ వీరబాబు నాగేశ్వరావు తేజ వెంకటేశ్వరరావు బాబురావు గోపాలకృష్ణ వసంతు తదితరులు పాల్గొన్నారు

విద్యార్థి శస్త్రచికిత్సకు నీలి ప్రకాష్ ఆర్థిక సహాయం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-100-1.wav?_=12

చిన్నారి వైద్యానికి 10200 ఆర్థిక సహాయం అందించిన డాక్టర్ లయన్ నీలి ప్రకాష్

నేటిదాత్రి చర్ల

మీకోసం మేమున్నాం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు నీలి ప్రసాద్ ఆధ్వర్యంలో అనారోగ్యానికి గురైన విద్యార్థి బొడ్డు యశ్వంత్ కు అండగా పదివేల రెండు రూపాయలు ఆర్థిక సహాయం అందించారు పాత చర్ల నివాసితులు డోల కృష్ణయ్య మనవడైన ఎనిమిదవ తరగతి చదువుతున్న బొడ్డు యశ్వంత్ అనే ఈ విద్యార్థికి అనుకోని పరిస్థితుల్లో ఈ విద్యార్థికి కడుపునొప్పి రావడంతో భద్రాచలం ఆసుపత్రికి తీసుకువెళ్లగా అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలని చెప్పడంతో అప్పులు చేసి ఆ కుటుంబం సర్జరీ చేయించారు హాస్పిటల్ బిల్లు కట్టలేని పరిస్థితులో మీకోసం మేమున్నాం సంస్థను ఆశ్రయించగా సంస్థ చైర్మన్ నీలి ప్రకాష్ పలువురు దాతల సహాయంతో పదివేల రెండు వందల రూపాయలు ఆర్థిక సహాయం చైర్మన్ నీలి ప్రకాష్ చేతులు మీదుగా మరియు కట్ట అమ్మాజీ చేతుల మీదుగా కుటుంబానికి అందించారు ఈ సందర్భంగా చైర్మన్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న పేద ప్రజలకు భరోసాగా ఉండేందుకు మా సంస్థ ఎప్పుడు అండగా ఉంటుందని ఇప్పటివరకు ఇలా సుమారు 1000 సేవా కార్యక్రమాలు పూర్తి చేయడంలో సంస్థ సభ్యులు మరియు దాతల సహకారం మరువలేనిదని అన్నారు ఈ కార్యక్రమంలో దొడ్డ ప్రభుదాస్ కవ్వాల రాము దొడ్డి సూరిబాబు సోల్లంగి నాగేశ్వరరావు గాదె రాజు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

కరంజ ప్రాజెక్ట్ని తలపిస్తున్న నిమ్జ్ రహదారి పరిసర పంట పొలాలు..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T114958.973.wav?_=13

కరంజ ప్రాజెక్ట్ని తలపిస్తున్న నిమ్జ్ రహదారి పరిసర పంట పొలాలు

◆:- పంట పొలాల్లో వరద నీటితో లబోదిబోమంటున్న పరిసర రైతులు

◆:- రోడ్డు నిర్మాణంలో ప్రణాళిక రహితంగా – నిర్మాణం చేపట్టడంతో రైతులకు తీవ్ర నష్టం

◆:- ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని రైతుల వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానిఫెకచరింగ్ జోన్ నిర్మాణంలో భాగంగా జహీరాబాద్ మండల పరిధిలోని ఉగ్గేల్లి గ్రామ శివారు నుంచి బర్దిపూర్ గ్రామ శివారు వరకు 100 ఫీట్ల రోడ్డు నిర్మించిన విషయం తెలిసిందే. రోడ్డు నిర్మాణంలో సంబంధిత అధికారులు ప్రణాళిక రహితంగా నిర్మాణం చేపట్టడం, భారీ వర్షాలు కురిస్తే వరద నీరు పోవడానికి ఎలాంటి మార్గాలు చూపెట్టకపోవడంతో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్డుకి ఇరువైపుల వరదనీరు నిలిచిపోవడంతో పంటలు నీట మునిగి రైతులు పెద్దమొత్తంలో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.

 

 

నిమ్జ్ రోడ్డు నిర్మాణం కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం మూలంగా రైతులు పెద్దఎత్తున నష్టపోతున్నట్టు రైతులు వాపోయారు. నిర్మాణ పనుల్లో ప్రణాళిక రహితంగా వ్యవహరించిన అధికారులు, గుత్తేదార్లపై చర్యలు తీసుకొని వర్షాలు కురిస్తే పొలాల్లో నీరు నిలిచిపోకుండా వరద నీటిని వాగులు, వంకలకు కనేక్టింగ్ ఇవ్వాలని కోరుతున్నారు. గత మూడు రోజులగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నిలిచిపోయిన వరద నీటి వల్ల పంట పొలాలు కర్ణాటక రాష్ట్రంలోని కరంజ ప్రాజెక్టును తలపిస్తుందని రైతులు, కూలీలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు.

సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ హైదరాబాద్‌లో…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-99-1.wav?_=14

సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి,పార్లమెంట్ మాజీ సభ్యులు కామ్రేడ్ సంస్మరణ సభ

జహీరాబాద్ నేటి ధాత్రి:

సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ మాజీ సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ 2025 ఆగస్టు 30వ తేదీన హైదరాబాద్లోని, రవీంద్రభారతి యందు ఉదయం 11.00 గంటలకు జరగనున్నది. ఈ సంస్మరణ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ‘. డి.రాజా, సిపిఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, కామ్రేడ్ సయ్యద్ అజీజ్ పాషా ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు.ఈ సంస్మరణ సభకు ప్రతి జిల్లా నుంచి 50 మందికి తక్కువ కాకుండా కోట ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మన సంగారెడ్డి జిల్లాకు 50 మంది కోట ఇవ్వడం జరిగింది ఆగస్టు 30వ తేదీన ఉదయం 11.00 గంటలకు హైదరాబాద్ లోని రవీంద్రభారతికి సకాలంలో హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సంస్మరణ సభలో పాల్గొనే వారందరూ పురుషులు ఎర్ర చొక్కాలు, స్త్రీలు ఎర్ర చీరలను ధరించి రావాల్సిందిగా కోరుతున్నామన్నారు,

అయితే మీరు, లేకుంటే మేము!

`మనమిద్దరమే వుందాం!

`జాతీయ స్థాయిలో రెండు పార్టీల వైఖరి!

`కాంగ్రెస్‌, బిజేపిలు అనుసరిస్తున్న విధానం!

`మూడో పార్టీ పురుడుపోసుకుంటే ఇద్దరం మునుగుతాం.

`సఖ్యతైనా, సంవాదమైనా మన మధ్యే వుండాలి.

`మూడో పార్టీ దూరకుండా సందర్భాన్ని బట్టి సహకరించుకోవాలి.

`రాజకీయంగా బద్ద శత్రుత్వమే పైకి కనిపించాలి.

`అమెరికాలో వున్నట్లు రెండే రాజకీయ పార్టీలుండాలి.

`మూడో పార్టీ రాకుండా అక్కడ రెండు పార్టీలు చేసే రాజకీయం మనమే చేయాలి.

`జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చకు బలం చేకూరుతున్నట్లే రాజకీయాలున్నాయి.

`ఆప్‌ను అణచివేయడంలో ఇదే పంధా అనుసరించారు!

`బీఆర్‌ఎస్‌ లాంటి పార్టీ డిల్లీ వైపు చూడకముందే చిదిమేశారు!

`తృణమూల్‌ను బెంగాల్‌ దాటకుండా చూసుకుంటున్నార్‌.

`జేడియూను పొత్తులో బీహార్‌ దాటకుండా చేశారు.

`తెలుగు దేశాన్ని తెలంగాణ నుంచి తరిమేసేలా వ్యూహం రచించారు.

`టీఆర్‌ఎస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌ అనగానే అదును చూసి ఒత్తేశారు.

`కేసీఆర్‌ ను కోలుకోకుండా చేశారు.

`ఏదో ఒక కూటమిలో వుంటే తప్ప ఏ తలనొప్పి వుండదు.

`కాంగ్రెస్‌ ను కాదని ఆప్‌ ఆగమైంది.

`ఎవరినీ నమ్మక బిఆర్‌ఎస్‌ ఎటుగాకుండా వుంది.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

రాజకీయాలలో ఆధిపత్యం కనిపించినా అంతర్గతంగా వుండే అవగాహనలు చాలా వుంటాయి. వాటి ఆధారంగానే రాజకీయాలు కొనసాగుతుంటాయి. పైకి మాత్రమే బద్ద శతృత్వం కనిపిస్తుంది. స్నేహ హస్తాలు పైకి బహిర్గతం కాకుండా జాగ్రత్త పడుతుంటాయి. పార్టీల మధ్య ఒప్పందాలు లోతుగా అర్థం చేసుకుంటే తప్ప కనిపించవు. కాకపోతే తాము ఎల్లకాలం అధికారంలో వుండాలన్న లక్ష్యంతో పని చేస్తుంటాయి. గెలుపోటములు ప్రజల నిర్ణయానికి వదిలేస్తుంటాయి. నిజం చెప్పాలంటే రాజకీయ పార్టీలు చేసే ప్రచారం మీద ప్రజలు ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటారనేది ఒక అపోహ మాత్రమే. ఏ తరం ఆలోచనలు ఎలా వుంటాయన్నది ఏ రాజకీయ పార్టీ అంచనా వేయలేదు. ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు ఏ పార్టీ అయినా కొట్టుకుపోక తప్పదు. గెలిచామనే సంబరం రాజకీయ పార్టీలకు ఆ క్షణమే వుంటుంది. గెలిచినా ఐదేళ్లలో ప్రజా ఉద్యమాలు రావొచ్చు. ఉపద్రవాలు దరి చేరొచ్చు. రాజకీయ పార్టీలలో చీలికలు రావొచ్చు. నాయకులు విడిపోవచ్చు. సొంత పార్టీలలోనే ఆధిపత్య రాజకీయాలు పెరిగిపోవచ్చు. ఇందుకు బిజేపి మినహాయింపు కాకపోవచ్చు. ప్రజాస్వామ్యంలో పాలించే రాజకీయ పార్టీలలో ఎల్ల కాలం ఒక్కరే పరిపాలిండాన్ని సొంత నాయకులు కూడా అంగీకరించరు. ఇప్పటికే మూడు సార్లు ప్రధానిగా పనిన నరేంద్ర మోడీని నాలుగో సారి కూడా సొంత పార్టీ అంగీకరించే పరిస్థితి రాకపోవచ్చు. ఎందుకంటే బిజేపిలో కూడా ఎంతో సమర్థవంతమైన నాయకులున్నారు. వాళ్లలో క. మోడీ తప్ప మరో నాయకుడు లేడనే భావన బలపడితే బిజేపికి భవిష్యత్తులో తీరని నష్టం ఎదురుకావొచ్చు. పైగా ఎప్పుడూ మోడీనే అంటే పార్టీలో తిరుగుబాటు మొదలుకావొచ్చు. ఇప్పటికే ఆర్‌ఎస్‌ఎస్‌ 75 సంవత్సరాల వయసు అంశాన్ని పదే పదే తెరమీదకు తెస్తోంది. రాజకీయాలలో ఎప్పుడూ ఏదో ఒకటి జరగొచ్చు. ఎప్పటికీ ఒకే రకమైన రాజకీయం సాగకపోవచ్చు. వ్యక్తి స్వామ్యరాజకీయానికి బిజేపిలో చోటు లేదు. అయినా ప్రధాని మోడీకి ఇప్పటి వరకు ఎదురులేదు. భవిష్యత్తులో కూడా వుంటుందని అనుకోలేం..తర్వాత రోజులలో ప్రజలు మార్పు కోరుకోలేరని చెప్పలేం..అందుకే జాతీయ రాజకీయాలలో కొన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. జాతీయ స్థాయిలో మూడో రాజకీయ వ్యవస్థ చేరకుండా, రానివ్వకుండా అయితే మీరు, లేకుంటే మేము! అనే అంతర్లీన ఒప్పందానికి కాంగ్రెస్‌, బిజేపిలు వచ్చాయా? అంటే అవుననే విషయాలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై రాజకీయ విశ్లేషక మేధావి వర్గాలలో చర్చలకు దారి తీస్తున్నాయి. దేశంలో ఒకప్పుడు జాతీయ స్థాయిలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చక్రం తిప్పుతూ వుండేవి. ఇప్పుడు ఆ పార్టీలు మనుగడ కోసం ఆరాటపడుతున్నాయి. పోరాటం చేసే శక్తి చాలని వ్యవస్థలుగా మిగిలిపోయాయి. అయితే జాతీయ స్థాయిలో ఎదగాలని, దేశ వ్యాప్తంగా రాజకీయంగా బలపడాలని కొన్ని పార్టీలు చూస్తున్నాయి. అందులో ప్రధానంగా ఆప్‌, తృణమూల్‌ వున్నాయి. బిఆర్‌ఎస్‌ ఆ పని చేయాలనుకొని ఓడిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే చతికిలపడిపోయింది. ఇప్పుడు మనుగడ కోసం పోరాటం చేసే స్థితిలో వుంది. ఒకప్పుడు బిఎస్పీ పార్టీ జాతీయ స్థాయిలో మరో ప్రత్యామ్నాయం అవుతుందని అంచనా వేశారు. కానీ బిఆర్‌ఎస్‌ లాగానే సొంత రాష్ట్రంలో ఓడిపోయింది. ఇప్పుడు కనుమరుగయ్యే తరుణానికి, పుంజుకోవాలన్న ఆరాటానికి మధ్య ఊగిసలాడుతోంది. సమాజ్‌ వాదీ ఉత్తర భారతంలోనే విస్తరించాలని చూసినా కుదరలేదు. కాకపోతే పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌ లో బలంగానే వుంది. ప్రజలు బిజేపిని కాదనుకుంటే గెలిచే పార్టీగా ఉత్తర ప్రదేశ్‌ లో క్యూలో వుంది. ఇలా జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనుకున్న పార్టీలు ప్రాంతీయ భావనలతో బతుకులీడుస్తున్నాయి. కానీ ఇంతలో ఆప్‌ వచ్చేసి ఎక్కడ బిజేపి, కాంగ్రెస్‌ లను చీపురుతో ఊడ్చేస్తుందో అనే భయం పట్టుకుంది. అందుకే ఇక ఎట్టిపరిస్థితులలోనూ మనమిద్దరమే వుందాం! అన్న ఆలోచనలలో రెండు పార్టీలున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో రెండు పార్టీల వైఖరిలో ఇలాంటి అవగాహన అనేది ఏర్పడినా, పెరిగినా ప్రాంతీయ పార్టీలకు ఉరే మిగులుతుందని చెప్పడంలో సందేహం లేదు. అంతే కాకుండా ఈ రెండు పార్టీల కూటమిలో ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక జాతీయ పార్టీ వైపు నిలిస్తే తప్ప పార్టీలు భవిష్యత్తులో బతికే ఛాన్స్‌ లేదు. ఈ రెండు కూటములలో కాకుండా మూడో వ్యవస్థ ఏది ఏర్పడకుండా కట్టుదిట్టమైన రాజకీయంతో రెండు పార్టీలు ముందుకు సాగుతున్నాయి. అంతే కాకుండా మూడో పార్టీ పురుడుపోసుకుంటే ఇద్దరం మునుగుతాం అనే ఆలోచనలు రెండు పార్టీలు చేస్తున్నాయి. రాజకీయంగా పరిణామాలైనా సరే సఖ్యతైనా, సంవాదమైనా మన మధ్యే వుండాలి. ఏ మాత్రం ఏమరపాటుగా వున్నా మూడో ప్రత్యామ్నాయం ఏర్పాటయ్యే అవకాశం వుంది. అది మూడో ఫ్రంట్‌ రూపంలో ఉపద్రవం ముంచుకురావొచ్చు. ఎన్నికల సమయాలలో ఏదైనా జరగొచ్చు. ఏది జరిగినా రెండు జాతీయ పార్టీలకు నష్టదాయకమే అవుతుంది. మూడో పార్టీగాని, మూడో ఫ్రంట్‌ దూరకుండా సందర్భాన్ని బట్టి సహకరించుకోవాలి. ముఖ్యంగా మూడో ఫ్రంట్‌ ఏర్పాటు కాకుండా, ప్రాంతీయ పార్టీలను తమ అదుపాజ్ఞలో వుంచుకోవాలి. సహజంగా రాష్ట్రాల ఎన్నికలు అనగానే ప్రాంతీయ పార్టీలు వున్న చోట ఆ పార్టీల వైపే ప్రజలు ఎక్కువగా ఆలోచిస్తారు. స్థానిక సమస్యల మీద వాళ్లకు అవగాహన తో పాటు కమిట్‌ మెంట్‌ వుంటుంది. దానికి తోడు ఏదో ఒక సెంటిమెంట్‌ కూడా వుంటుంది. వాటి నుంచి ప్రజలు బయటకు రావడానికి ఇష్టపడరు. అలా దాదాపు అన్ని రాష్ట్రాలలో ఇలాంటిది ఏదో సెంటిమెంట్‌ వుంటుంది. మహారాష్ట్ర లో మరాఠ, తమిళనాడులో పెరియార్‌, ఆంద్రప్రదేశ్‌ లో తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలంగాణ లో ప్రాంత అస్థిత్వ సెంటిమెంట్‌ బలమైన పాత్రను పోషిస్తుంటాయి. ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా రాజకీయాలు చేయడం ఎంతో అవసరమని గుర్తించినట్లున్నారు. అయితే కాంగ్రెస్‌, బిజేపిపు రాజకీయంగా బద్ద శత్రుత్వమే పైకి కనిపించేలా రాజకీయం చేస్తుంటాయి. మన దేశ రాజ్యాంగ మాత్రుక కొంత అమెరికా రాజ్యాంగ లక్షణాలను పోలివుంటుంది. కానీ మన దేశంలో బహు పార్టీల రాజకీయం సాగుతోంది. దీనిని ఎలాగో కట్టడి చేయలేం. రాజ్యాంగ పరంగా సాధ్యమయ్యే పని అసలే కాదు. అందువల్ల రెండు జాతీయ పార్టీల అంతర్గత అవగాహన ఒక్కటే సరైన మార్గం. అమెరికాలో వున్నట్లు రెండే రాజకీయ పార్టీలుండాలి. మూడో పార్టీ రాకుండా అక్కడ రెండు పార్టీలు చేసే రాజకీయం మనమే చేయాలి. ఇలాంటి అవగాహన రెండు జాతీయ పార్టీలలో బలంగా వుంది. ఈ విషయమై జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చకు బలం చేకూరుతున్నట్లే రాజకీయాలున్నాయి. తొలుత డిల్లీలో ఆప్‌ పార్టీని రెండు పార్టీలు పెద్దగా పట్టించుకోలేదు. కేజ్రివాల్‌ ఏకు మేకౌతున్నాడని తెలుసుకోవడానికి రెండు పార్టీలకు పార్టీలకు పెద్దగా సమయం పట్టలేదు. చాలా త్వరగానే కోలుకున్నాయి. నిజాయితీకి మారు పేరుగా రాజకీయాలలో వచ్చిన కేజ్రివాల్‌ను అవినీతి పరుడనే ముద్ర వేసి ప్రజలను నమ్మించగలిగారు. డిల్లీలో ఆప్‌ను ఓడిరచారు. కేజ్రివాల్‌ దూకుడుకు కళ్లెం వేశారు. ఆప్‌ను అణచివేయడంలో ఇదే పంధా అనుసరించారు! తెలంగాణలో పురుడుపోసుకున్న బిఆర్‌ఎస్‌ లాంటి పార్టీ డిల్లీ వైపు చూడకముందే చిదిమేశారు! దీదీ తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమత బెనర్జీకి ప్రధానమంత్రి కావాలని బలంగా వుంది. ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తీరింది. పార్టీని విస్తరించాలనుకున్నది. కుదరలేదు. తృణమూల్‌ను బెంగాల్‌ దాటకుండా చూసుకుంటున్నార్‌. ప్రధానమంత్రి కావాలని బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ కు వుంది. 2014లోనే తాను కావాలనుకున్నాడు. తన అవసరం ఏ కూటమికి వున్నా ప్రధాని పోస్ట్‌ కోసం ఎసరుపెట్టుకొని కూర్చున్నారు. ఎన్నికల తర్వాత ఎన్డీయేకు మద్దతు పలికి, సిఎంగా తన ఆశలు అక్కడికే పరిమితం చేసుకున్నాడు. తోక జాడిరచే ధైర్యం చేయలేని స్థితిలో బిజేపిలో ఒదిగిపోయాడు. జేడియూను పొత్తులో బీహార్‌ దాటకుండా చేశారు. తెలుగు దేశాన్ని తెలంగాణ నుంచి తరిమేసేలా వ్యూహం రచించారు. పరోక్షంగా అప్పుడు కేసిఆర్‌ కు మద్దతు తెలిపారు. ఎప్పుడైతే కేసిఆర్‌ టిఆర్‌ఎస్‌ పార్టీ బిఆర్‌ఎస్‌ అనగానే అదును చూసి ఇక్కడ ఒత్తేశారు. కవిత రూపంలో బిఆర్‌ఎస్‌ ను ఇరుకున పడేశారు. రాజకీయంగా ఇబ్బందుల పాలు చేశారు. దేశంలో ఏ నాయకుడు ఎదిరించనంతగా కేసిఆర్‌ బిజేపిని, మోడీని తూర్పార పట్టారు. బిజేపికి శత్రువయ్యారు. అలాగని కాంగ్రెస్‌ కు మిత్రుడు కాలేని రాజకీయాలు ఎదుర్కొన్నాడు. మొదటికే మోసం వచ్చేలా బిజేపి చేసిన రాజకీయంలో కేసిఆర్‌ చిక్కుకున్నారు. బిఆర్‌ఎస్‌ అనకపోతే ఇప్పుడు అధికారంలోనే వుండే వారు. కవిత రాజకీయ జీవితం ఇలా మలుపు తిరిగి వుండేది కాదు. అలా కేసిఆర్‌ ను కోలుకోకుండా చేశారు. ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక కూటమిలో వుంటే తప్ప ఏ తలనొప్పి వుండదు. అనే దశకు దేశ రాజకీయాలను తెచ్చారు. కాంగ్రెస్‌ ను కాదని ఆప్‌ ఆగమైంది. ఎవరినీ నమ్మక బిఆర్‌ఎస్‌ ఎటుగాకుండా వుంది. భవిష్యత్తు ఎలా వుంటుందనేది ఇంత కన్నా క్లారిటీ ఏమి వుండదు.

సిరిసిల్లలోని మానేరు జల ప్రవాహానికి బతుకమ్మ ఘాట్ మునక…

సిరిసిల్లలోని మానేరు జల ప్రవాహానికి బతుకమ్మ ఘాట్ మునక

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని మానేరు వాగు ఉదృత ప్రవాహానికి బతుకమ్మ ఘాట్ వరద ప్రవాహానికి మునిగిపోయింది. గత మూడు నాలుగు రోజుల నుండి భారీ వర్షానికి వస్తున్న వరదల వల్ల, పట్టణంలోని ఎగువ మానేరు జలాశయం నుండి నీరు ఉదృతంగా కిందికి ప్రవహిస్తున్న సందర్భంగా సిరిసిల్లలోని మానేరు జల కళ ఉట్టి పడినట్లు సిరిసిల్ల పట్టణవాసులు, మరియు పరిసర గ్రామాల నివాసులు మానేరు వాగు నీటిని సందర్శించడానికి, తండోపతండాలు గా వస్తున్నారు.

ఘనంగా వి హెచ్ పిఎస్ 18వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

ఘనంగా వి హెచ్ పిఎస్ 18వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మడి పెళ్లి శ్యాంబాబు మాదిగ జిల్లా ఇన్చార్జి

అంబాల చంద్రమౌళి మాదిగ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా ఇన్చార్జి

భూపాలపల్లి నేటిధాత్రి

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ ప్రచారంలో వికలాంగులకు చేయూత పెన్షన్ దారులకు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ పెంచాలి లేకుంటే ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోవాలని ఎమ్మార్పీఎస్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జ్ మడిపల్లి శ్యాంబాబు మాదిగ ఎమ్మార్పీ ఎస్ ఎంఎస్పి రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మాచర్ల వంశీకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో విహెచ్పిఎస్ 18వ ఆవిర్భావ దినోత్సవం వంశీకృష్ణ గౌడ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇంచార్జ్ మడిపల్లి శ్యాంబాబు మాదిగ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి రాష్ట్ర నాయకులు అంబాల చంద్రమౌళి మాదిగ లు జెండా ఆవిష్కరణ చేసి అనంతరం మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎలక్షన్ ప్రచారంలో వికలాంగులు చేయూత పెన్షన్ దారులతో మాట్లాడుతూ ఈ నెల పెన్షన్ తీసుకుంటే మీకు వికలాంగులకు 4016 లు చేయూత పెన్షన్ దారులకు 2016 లు వస్తున్నాయి కానీ నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి మాకు అధికారం ఇస్తే వచ్చే నెల నుంచి వికలాంగులకు 4016 లు ఉన్న పెన్షన్ 6000 చేయూత పెన్షన్ దారులకు 4000 ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి నేటికీ 20 నెలలు గడుస్తున్న కానీ పెన్షన్ పెంచకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి కూటమి ప్రభుత్వం వికలాంగులకు 6000 భరోసా పెన్షన్ దారులకు 4000 ఇస్తుందని మరియు మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తి మేరకు కండరాల క్షీణత ఉన్న వికలాంగులకు 15000 రూపాయలు ఇస్తుందని తెలిపారు. లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో పెన్షన్ పెంచి ఇస్తుంటే మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో పెన్షన్ పెంచకుండా ఎమ్మెల్యేల జీతాలు మాత్రమే పెంచుకుంటూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ దారులను మోసం చేస్తోందని అన్నారు. భూపాలపల్లి జిల్లాలో ఉన్న వికలాంగులు చేయూత పెన్షన్ దారులు మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో పెన్షన్ పెంచడం కోసం జరుగుతున్న పోరాటంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని మరియు సెప్టెంబర్ 9న పరేడ్ గ్రౌండ్ హైదరాబాదులో జరుగు వికలాంగుల చేయుట పెన్షన్ దారుల మహా గర్జనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో
ఎమ్మెస్పీ సీనియర్ నాయకులు
నోముల శ్రీనివాస్ మాదిగ
ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దోర్నాల రాజేందర్ మాదిగ అంతడుపుల సురేష్ మాదిగ యువసేన జిల్లా అధ్యక్షులు మంద తిరుపతి మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు మిరపట్టి అశోక్ మాదిగ జిల్లా నాయకులు మంద కిరణ్ మాదిగ ఎమ్మార్పీఎస్ టౌన్ అధ్యక్షులు దోర్నాల భరత్ మాదిగ ఎమ్మార్పీఎస్ టౌన్ ప్రధాన కార్యదర్శి ఒంటెరి రాజేష్ మాదిగ ఎంఎస్పి టౌన్ ప్రధాన కార్యదర్శి మంచినీళ్ల వైకుంఠం మాదిగ ఒంటెరి సమ్మయ్య మాదిగ దోర్నాల నరేష్ మాదిగ ఒంటేరు నాగరాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

“వర్ధన్నపేటలో ఓటర్ ముసాయిదా కార్యక్రమం”

ముసాయిదా ఓటర్ జాబితా కార్యక్రమము పాల్గొన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య

వర్దన్నపేట (నేటిధాత్రి )

 

వర్ధన్నపేట నియోజక వర్గం, వర్ధన్నపేట మండలంలోని కట్రీ యాల గ్రామములో, పంచాయతీ కార్యాలయా లో ముసాయిదా ఓటర్ జాబితా కార్యక్రమము నిర్వహించడం జరిగింది.గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆహ్వానం మేరకు, వర్ధన్నపేట శాసన సభ్యులు కేఆర్ నాగరాజు సూచనల మేరకు వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య హాజరై ఓటర్ ముసాయిదా కార్యక్రమంలో పాల్గొని,ఓటర్ ముసాయిదా ను, పంచాయతీ కార్యదర్శి తో కలిసి ప్రదర్శించడం జరిగింది.
ఈ సందర్బంగా ఏఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య మాట్లాడుతూ…

 

వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ లిస్టును క్షుణ్ణంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, బూతు కమిటీలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు,ఈ నెల 30 వ, తేదీలోప ల పరిశీలించాలని ఎమ్మెల్యే నాగరాజు గారి ఆదేశాల మేరకు పిలుపు నిస్తున్నాం.
ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారి సతీష్ గౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గుజ్జ రవీందర్ రెడ్డి,ఎండి అక్బర్,నాంపెల్లి రవీందర్,తీగల సునీత గౌడ్,యూత్ కాంగ్రెస్ నాయకులు ఎలికట్టే చిన్న రాజు లు పాల్గొన్నారు.

బిజెపి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్…

బిజెపి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్

బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలోని భూలక్ష్మి వద్ద బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ఊర నవీన్ రావ్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహిచి దారి వెంట ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది
అలాగే నిన్న విపరీతంగా కురిసిన భారీ వర్షానికి గణపురం మండల కేంద్రంలోని గుడివాడ ప్రాంతాల్లో చాలా ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుకోవడం జరిగింది ఇది కేవలం ఊర కాలువను శుభ్రం చేయకుండా చెత్తాచెదారం పిచ్చి మొక్కలు పేరుకోవడం వల్ల వచ్చిన వరద నీరు కిందకు పోకపోవడం వలన ఇళ్లలోకి చొరబడడం జరిగింది అది తెలుసుకున్న బిజెపి పార్టీ బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో ఫోన్లో మాట్లాడి సమస్యను మళ్ళీ పునరావృతం కాకుండా త్వరితగతిన పరిష్కరించాలని కోరడం జరిగింది లేనిపక్షంలో నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగిందిఈ కార్యక్రమంలో బీజేవైఎం కలాశాలాల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి చెలుమల్ల ప్రవీణ్ కుమార్, బిజెపి మండల ఉపాధ్యక్షులు మధాసు మొగిలి, డాకురి కృష్ణ రెడ్డి,బిజెపి జిల్లా నాయకులు,దుగ్గుషెట్టి.పూర్ణ చందర్ , మండల మహిళా నాయకురాలు బొల్లం అరుణ,బిజెపి మండల నాయకులు మంధల రాజు తదితరులు పాల్గొన్నారు.

క్రీడా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయగలరు…

క్రీడా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయగలరు

క్రీడల జిల్లా అధికారి రఘు

భూపాలపల్లి నేటిధాత్రి

 

జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు 2025 ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా యువజన క్రీడల శాఖ రఘు ఆద్వర్యంలో ఈ నెల 29న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నీ మీటింగ్ హల్ నందు ఉదయం 11.30 గంటలకి నిర్వహించబడును.
జిల్లాలో నీ క్రీడా సంఘాల సభ్యులు, క్రీడా కారులు, అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు

భారీ వర్షానికి పలువురు ఇండ్లలోకి నీరు…

భారీ వర్షానికి పలువురు ఇండ్లలోకి నీరు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలోని గుడివాడ ప్రాంతంలో నిన్న కురిసిన అతి భారీ వర్షాలకు పలువురి ఇండ్లలోకి వర్షపు నీరు వచ్చిందని తెలుసుకొని ఆ ప్రాంతాన్ని సందర్శించిన భారతీయ జనతా పార్టీ బృందానికి పక్కనే ఉన్న కాలువ లో పిచ్చి మొక్కలు చెత్తాచెదారం పేరుకుపోవడంతో నీరు ముందుకు వెళ్లకుండా కాలనీలోకి రావడం జరిగిందని గమనించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఫోన్లో సంప్రదించడం జరిగింది వెంటనే స్పందించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఇ ఏఈ ప్రాంతాన్ని సందర్శించి త్వరలోనే తగు చర్యలు తీసుకొని మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో రైతులు సిరిగనేని బాబురావు మోటపోతుల చందర్ గౌడ్ బీజేవైఎం కళాశాల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్, బిజెపి బూత్ అధ్యక్షులు పెండ్యాల శ్రీకాంత్ కాలనీవాసులు ఉన్నారు

error: Content is protected !!
Exit mobile version