సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T124735.975.wav?_=1

సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్

ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్

హన్మకొండ, నేటిధాత్రి:

 

వినాయక చవితి పండుగ సందర్భంగా రెండు రోజుల క్రితం
లస్కర్ బజార్ మరియు కుమార్ పల్లి మార్కెట్లలో వస్తువులు తీసుకుంటుండగా కొంతమంది దొంగలు ఫిర్యాదుదారుల దృష్టి మరల్చి వారి జేబులో ఉన్న సెల్ ఫోన్ ని దొంగతనం చేసినారు హనుమకొండ పోలీస్లు అట్టి దొంగతనం చేసిన జార్ఖండ్ కి చెందిన ఐదుగురు దొంగలను పట్టుకొని వారి వద్ద నుండి 1,50,000 విలువగల మూడు సెల్ ఫోన్ లను సీజ్ చేసి రిమాండ్ తరలించడం జరిగినది.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఝార్ఖండ్ కి సంబంధించిన కొందరు దొంగల ముఠా రెండు రోజుల క్రితం హనుమకొండ స్టేషన్ పరిధిలో ఉన్న రద్దీ ప్రాంతాలలో ప్రజల దృష్టి మరల్చి ఒక ప్లాస్టిక్ కవర్ అడ్డుపెట్టి ప్రజల సెల్ ఫోన్లు దొంగతనం చేస్తున్నారు కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు
అట్టి దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన క్రైమ్ పార్టీ సిబ్బంది రావుఫ్ అశోక్ మరియు మహేందర్ లను సీఐ మచ్చ శివకుమార్ అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version