నేడు భవన నిర్మాణ కార్మికుల జిల్లా నాలుగో సభలు.

నేడు భవన నిర్మాణ కార్మికుల జిల్లా నాలుగో సభలు

వనపర్తి నేటిధాత్రి ;

 

 

భవ నానిర్మాణ కార్మికుల సంఘం వనపర్తి జిల్లా నాలుగో మహాసభలు జయప్రదం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డి కురుమయ్య భవన నిర్మాణ కార్మికుల ను ఒక ప్రకటన లో కోరారు శనివారం నాడు వనపర్తి లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఐటియు జిల్లా కార్యాలయంలో మహాసభలు జరుగుతాయని ఈ కార్యక్రమంలోముఖ్య అతిథులుగా తెలంగాణభవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రాజు హాజరవుతారని వనపర్తి జిల్లాలోని అన్ని మండలాల భవన నిర్మాణ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గంధం మదన్ జిల్లా కార్యదర్శి బొబ్బిలినిక్సన్ వనపర్తి పట్టణ కార్యదర్శి రాబర్ట్ నాయకులు బాలరాజు బాలస్వామి రవి వెంకటయ్య మన్యం తదితరులు పాల్గొన్నారు

కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా.

కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
కలెక్టర్ కార్యాలయ అధికారికి వినతి పత్రం అందజేత

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

 

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం అధికారి మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగు బిల్లులకై,వినతి పత్రం అందజేత.ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన రంగం సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో సంబంధించి దాదాపు 5 నుంచి 6 నెలల మే స్ చార్జీలు, కోడిగుడ్ల బిల్లులు, అలాగే గౌరవ వేతనం దాదాపు నాలుగు నెలల నుంచి పెండింగ్లో ఉన్నవి. దీనివల్ల కార్మికుల ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి కొద్ది రోజుల్లో స్కూలు తిరిగి ప్రారంభం అవుతున్న సందర్భంగా వంట చేయడానికి చేతులు డబ్బులు లేనందున విద్యార్థులకు భోజనాలు పెట్టే పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రభుత్వం గౌరవ వేతనం 10000, రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి 15 నెలలు పూర్తికావస్తున్న కూడా ఎక్కడ కూడా అమలుకు నోచుకున్న పరిస్థితి లేదు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గౌరవ వేతనం 2000, కూడా దాదాపు నాలుగు నెలల నుంచి కార్మికులకు ఇవ్వడం లేదు. కావున ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరైన సమయంలో మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా సి.ఐ.టి.యు పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది.కావున కార్మికులకు రావాల్సిన 5 నెలల పెండింగ్ మెస్ చార్జీలు, కోడిగుడ్ల బిల్లులు వెంటనే అందించి, గౌరవ వేతనం 10000 ,రూపాయలు అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా సి.ఐ.టి.యు అధ్యక్షులు ఎగమాటి ఎల్లారెడ్డి, మధ్యాహ్న భోజన రంగం జిల్లా కార్యదర్శి గురిజాల శ్రీధర్, మరియు కార్మికులు వసంత, సత్తవ్వ, పద్మ, ఎల్లవ్వ, భాగ్య తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల ఉద్యోగ భద్రత సౌకర్యాల సాధన కోసం సిఐటియు ను గెలిపించండి.

కార్మికుల ఉద్యోగ భద్రత సౌకర్యాల సాధన కోసం సిఐటియు ను గెలిపించండి

★చుక్క రాములు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్లోని మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో ఈనెల 5వ తేదీన జరిగే పరిశ్రమ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో సిఐటియు ఘనవిజయం అందించేందుకు కార్మికులు పెద్ద సంఖ్యలో ఓట్లు వేయాలని సిఐటియును గెలిపించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, మహీంద్రా&మహీంద్రా ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు) అధ్యక్షులు కామ్రేడ్ చుక్క రాములు పిలుపునిచ్చారు. మంగళవారం రోజు కంపనీ ముందు జరిగిన ఎన్నికల గేట్ మీటింగ్ లో చుక్క రాములు మాట్లాడుతూ మరో చారిత్రాత్మక వేతన ఒప్పందం 25000 రూపాయలతో చేస్తామని, ఉద్యోగ భద్రత, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని, కార్మికులతో పాటు తల్లిదండ్రులకు మెడికల్ కార్డ్ వర్తించేలా 7లక్షలతో చేస్తామని, 3సంవత్సరాలకు అగ్రిమెంట్, 4.50రూ/- డి ఎ పెంచుతామని ఇలా అనేక కార్మిక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని అన్నారు.

ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఐ ఎన్ టి యు సి నాయకులకు కనీసం కార్మికుల పట్ల అవగాహన లేదనీ, కార్మికుల పట్ల కేవలం అవగాహన ఉండి చారిత్రాత్మక వేతన ఒప్పందాలు సాధించి పెట్టి అనేక సౌకర్యాలు సాధించిన ఘనత సిఐటియు దేనని రాబోయే రోజుల్లోనూ వేతన ఒప్పందం ఉందని ఆ వేతనం ఒప్పందాన్ని కూడా మెరుగైందిగా చేయాలంటే సిఐటియుని గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి.మల్లేశం, సీపీఎం ఏరియా కార్యదర్శి రాంచందర్, వివిధ పరిశ్రమల యూనియన్స్ నాయకులు నాయకులు పాండు రంగ రెడ్డి, బాగారెడ్డి, మహిపాల్, రాజిరెడ్డి, కనకారెడ్డి, గణేష్, నర్సయ్య, మణి, నారాయణ, సందీప్ రెడ్డి, నరేష్, నర్సింలు, తదితరులున్నారు.

చేనేత కార్మికుల కోసం ఎంతో కృషి చేసింది.

చేనేత కార్మికుల కోసం ఎంతో కృషి చేసింది

అహల్య భాయ్ హోల్కర్

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

 

శాయంపేట మండల కేంద్రం లోని చేనేత సహకార సంఘం లో పుణ్య శ్లోకలోకమాత రాణి అహల్య భాయ్ హోల్కర్ 300 జయంతి ఉత్సవాన్ని బిజెపి మండల అధ్యక్షుడు నరహరి శెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మిఠాయిలు పంచి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రామకృష్ణ మరియు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయరాకుల మొగిలి ఇరువురు మాట్లాడు తూ మహిళల సాధికారత కోసం వారి యొక్క ఉపాధి కోసం అదేవిధంగా చేనేత కార్మికుల కోసం అహల్యబాయి ఎంతో కృషి చేశారని అన్నారు.

 

మహేశ్వర్‌లో చేనేత పరిశ్రమ స్థాపన

అహిల్యాబాయి హోల్కర్ తన పాలనలో మహేశ్వర్‌ను చేనేత పరిశ్రమ కేంద్రంగా అభివృద్ధి చేశారు.

మహేశ్వర్‌లోని రాజవాడా గోడల డిజైన్లను ఆధారంగా తీసుకుని ప్రత్యేక మైన మహేశ్వరి సారీలను తయారు చేయాలని ఆమె ప్రేరణ ఇచ్చారు.

ఈ సారీల తయారీలో సూరత్, మండవ వంటి ప్రాంతాల నుండి నైపు ణ్యమైన చేనేత కార్మికులను మహేశ్వర్‌కు ఆహ్వానించారు.

ఈ విధంగా చేనేత పరిశ్రమకు ప్రోత్సాహం ఇచ్చి, స్థానిక మహిళలకు ఉపాధి అవకా శాలు కల్పించారు.

 

మహిళల కోసం ఉపాధి అవకాశాలు

మహేశ్వర్‌లోని రెహ్వా సొసైటీ 1978లో స్థాపించబడింది, ఇది అహిల్యాబాయి హోల్కర్ వారసురాలైన రిచర్డ్ హోల్కర్ మరియు ఆయన భార్య సాలీ హోల్కర్ ఆధ్వర్యంలో ప్రారంభించబడింది.

ఈ సొసైటీ ద్వారా మహిళలకు చేనేత శిక్షణ, ఉపాధి అవకాశాలు మరియు ఆరోగ్య సేవలు అందించబడు తున్నాయి. ప్రస్తుతం, ఈ సొసైటీ 250 మంది చేనేత కార్మికులతో కలిసి 110 లూమ్స్‌లో పనిచేస్తోంది.

 

చేనేత పరిశ్రమకు ప్రోత్సా హం

అహిల్యాబాయి హోల్కర్ చేనేత పరిశ్రమను ప్రోత్సహిం చడానికి వివిధ చర్యలు తీసు కున్నారు.

మహేశ్వర్‌లో చేనేత పరిశ్రమను అభివృద్ధి చేయడం ద్వారా, ఆమె స్థానిక మహిళ లకు ఉపాధి అవకాశాలు కల్పించారు.

ఈ విధంగా ఆమె చేనేత కార్మికుల సంక్షే మం కోసం కృషి చేశారు.

అహిల్యా బాయి హోల్కర్ చేనేత పరిశ్రమ అభివృద్ధి, మహిళల కోసం ఉపాధి అవకాశాలు కల్పించ డం మరియు చేనేత పరిశ్రమ కు ప్రోత్సాహం ఇవ్వ డం ద్వా రా చేనేత కార్మికుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నారు.

ఈ కార్యక్ర మంలో భూత అధ్యక్షులు బాసాని నవీన్, కోమటి రాజశేఖర్, బత్తుల రాజేష్, మునుకుంట్ల రాజశేఖర్, మరియు మహిళ లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తెలంగాణ చేనేత కార్మిక సంఘం.

తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా జమ్మికుంట వాసి పెండం సర్వేశం ఎన్నిక
హర్షం వ్యక్తం చేసిన జమ్మికుంట చేనేత సంఘాలు

జమ్మికుంట నేటిధాత్రి:

హైదరాబాద్ (ముగ్దం మోహినుద్దీన్ భవన్) లో జరిగిన తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి సమావేశంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మునిసిపాలిటీ పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన పెండెం సర్వేశం ను రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ సందర్భంగా సర్వేశం గురువారం జమ్మికుంట లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చేనేత పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో ఉండి కార్మికులు పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేతన్నలను చిన్నచూపుచూస్తున్నా
యని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పెట్టి చేనేత పరిశ్రమను దెబ్బతీసిందని ఇప్పటికైనా జిఎస్టి తొలగించాలని, రద్దు చేసిన చేనేత పథకాలను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు జరపాలని సహకార సంఘాల రుణాలతో సహా నేతన్నల కు అన్ని రకాల రుణాలను మాఫీ చేయాలని, సహకార సంఘాలకు,టెస్కోకు ఎన్నికలు నిర్వహించలని కోరారు. పెద్దమొత్తంలో నిధులు కేటాయించి చేనేత కార్మికులకు చేతినిండా పనులు కలిగించి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు లభించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. చేనేత కార్మికులకు ఇల్లు నిర్మించుకోవడానికి రూ.6 లక్షలు ఇవ్వాలని, కార్మికులకు నెలకు రూ. 5000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేనేత సమస్యల పరిష్కారానికి రానున్న కాలంలో కార్మికులను చైతన్య పరిచి ఉద్యమాలు
చేస్తామని చెప్పుకొచ్చారు. తను ఎన్నికకు సహకరించిన సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు, ప్రధాన కార్యదర్శి పాశికంటి లక్ష్మీనరసయ్య లతో పాటు ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో చేనేత కార్మిక సంఘం నాయకులు జమ్మికుంట మండల చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు మాటేటి సమ్మయ్య, నాయకులు బొమ్మకంటి మహేంద్ర చారి, ఈవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

బీడీ కార్మికులకు వెయ్యి బీడీలకు 261.

బీడీ కార్మికులకు వెయ్యి బీడీలకు 261. పైసల. కూలి ఏప్రిల్ నెల నుండి చెల్లించాలి

కార్మికుల వద్ద నుండి ప్రతి నెల
2000 బీడీల వేతనం దోపిడి చేస్తున్న యజమాన్యంపై కార్మిక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి

సిరిసిల్ల టౌన్ ( నేటిధాత్రి ):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని బి.వై నగర్ అమృత లాల్ శుక్ల కార్మిక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీడీ వర్కర్స్ యూనియన్ సి.ఐ.టి.యు అధ్యక్షులు ముశం రమేష్
మాట్లాడుతూ బీడీ కార్మికులకు ప్యాకర్ నెలసరి ఉద్యోగులందరికీ కరువు భత్యం డి.ఏ అన్ని కలుపుకొని. 1000 బీడీలకు పది రూపాయల 40 పైసలు పెరగడం జరిగింది ప్రస్తుతం ఉన్న కూలి పెరిగిన కూలి కలుపుకుంటే 1000 బీడీలకు మొత్తం కూలి 261. 40 రూపాయల పైసలు. కార్మికులకు. నాలుగో నెల నుండి బీడీ యజమాన్యం చెల్లించాలని అన్నారు ప్యాకర్ కు రోజుకు పది రూపాయలు 40 పైసలు పెంచడం జరిగింది
బీడీ కార్మికుల నుండి యజమాన్యం పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతుందని కార్మికుల. వద్దనుండి నెలకు ఎన్ని బీడీలు చేసినా కూడా 2000 బీడీల వేతనం కట్ చేసుకుని ఇస్తున్నారు 2000 బీడీల వేతనం అంటే 552 కూలి కార్మికులు కోల్పోతున్నారు. ఈ లెక్కన కార్మికుల వద్ద నుండి బీడీ ఏమో అని కొన్ని కోట్ల రూపాయల శ్రమను దోచుకుంటున్నది దానికి తోడు గంపకట్ట పేరుతోటి అదేవిధంగా అనేక రకాల పేర్లు చెప్పుకుంటూ కార్మికుల వద్ద నుండి నెలకు 40.50 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది కార్మికులకు పని చేస్తే 3000 వరకు వేతనం వస్తే అందులోకి అన్ని కటింగ్లు పోను 1500 కూడా కార్మికుల చేతిలోకి రావడం లేదు ఈ రకంగా బీడీ కార్మికులు అన్ని విధాలుగా నష్టపోతున్నారు.బీడీ పరిశ్రమలపై లేబర్ అధికారుల తనిఖీలు లేకపోవడంతో బీడీ యజమానుల ఇష్టారాజ్యంగా మారింది కంపెనీల .బీడీలనే నగదు బీడీల పేరుతో కార్మికులతో చేయించుకుని ఒక వెయ్యికి 50 రూపాయల కూలీ తక్కువ చెల్లిస్తున్నారు
దాంతో పాటు పి.ఎఫ్ ఎగ్గొడుతున్నారు.
నగదు బీడీలు చేయిస్తున్న వారిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటే ఎల్లారెడ్డి,బీడీ నాయకులు సూరం పద్మ, జిందం కమలాకర్ పాల్గొన్నారు

కార్మికులను బానిసలుగా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.

కార్మికులను బానిసలుగా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

*కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక
విధానాలు మానుకోవాలి*

BRTU జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ డిమాండ్

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి ):

సిరిసిల్ల పట్టణంలోని BRTU జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక , ప్రజా వ్యతిరేక విధానాలు అవలాంభిస్తూ 4 లేబర్ కోడ్ తెచ్చి కార్మికులను బానిసలను చేసే విధంగా చేయాలని బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అన్నారు.కార్మికులందరికీ కనీస వేతనం 26,000 అమలు చేయాలని తదితర డిమాండ్లతో ఈ రోజు తంగళ్లపల్లిలో బీడీ కార్మికులతో కలసి ఫ్లకార్డులతో నిరసన చేపట్టడం జరిగినది.
ఈ సందర్భంగా కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ఎన్నో ఏండ్లుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను తొలగించి పెట్టుబడిదారులు , యాజమాన్యాలకు అనుకూలంగా కార్మికులను కట్టు బానిసలను చేసే కుట్ర చేస్తుందని మండిపడ్డారు.
కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మే 20 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని దేశంలో నెలకొన్న యుద్ధ వాతావరణం , కొన్ని అనివార్య కారణాల నేపథ్యంలో సార్వత్రిక సమ్మెను జూలై 9 వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వo కార్మిక వ్యతిరేక విధానాలను మానుకొని కార్మిక వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని లేకుంటే రాబోయే రోజుల్లో కార్మిక వర్గ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.లక్షలాది మంది ఆధారపడి జీవనోపాది పొందుతున్న బీడీ పరిశ్రమపై అనేక ఆంక్షలు పెట్టి ఈ రోజు ఉపాధి లేకుండా చేసి బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేసి కార్మికులను రోడ్డుపాలు చేస్తోందని మండిపడ్డారు.జూలై 9న తలపెట్టిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా సంఘటిత , అసంఘటిత అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ తప్పకుండా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా బీడీ కార్మికులందరికీ ఎటువంటి నిబంధనలు లేకుండా 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.

కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర చేస్తున్న కేంద్ర.!

కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొడదాం

సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపు

సిరిసిల్ల టౌన్ మే 20( నేటిధాత్రి ):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక , ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని , కార్మికులందరికీ కనీస వేతనం 26,000 అమలు చేయాలని తదితర డిమాండ్లతో సిఐటియు అఖిలభారత కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు బి.వై. నగర్ లో సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్లతో కూడిన ఫ్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు , హక్కులను తొలగించి పెట్టుబడిదారులు , యాజమాన్యాలకు అనుకూలంగా కార్మికులను కట్టు బానిసలను చేసే కుట్ర పన్నుతున్నదని మండిపడ్డారు.కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మే 20 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని దేశంలో నెలకొన్న యుద్ధ వాతావరణం , ప్రత్యేక పరిస్థితుల్లో నేపథ్యంలో సార్వత్రిక సమ్మెను జూలై 9 వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను మానుకొని కార్మిక వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని లేకుంటే రాబోయే రోజుల్లో కార్మిక వర్గ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడంలో , కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు , హక్కులను కాపాడుకోవడంలో భాగంగా జూలై 9న తలపెట్టిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా సంఘటిత , అసంఘటిత అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ తప్పకుండా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అన్నల్డాస్ గణేష్ , సూరం పద్మ , నక్క దేవదాస్ , బెజుగం సురేష్ , జిందం కమలాకర్ , బింగి సంపత్ , సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.

గీత కార్మికులకు ఎక్స్ గ్రేషియా వెంటనే చెల్లించాలి.

గీత కార్మికులకు ఎక్స్ గ్రేషియా వెంటనే చెల్లించాలి

తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి:

తాడి చెట్టుపై నుండి జారీ పడి మృతి చెందిన గీత కార్మికులకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా వెంటనే చెల్లించాలని గోపా జిల్లా అధ్యక్షుడు కుర్ర శ్రీనివాస్ గౌడ్,డివిజన్ అధ్యక్షుడు తాళ్లపల్లి రమేష్ గౌడ్ లు కోరారు.మండలంలోని కంటయపాలెం గ్రామానికి చెందిన పల్లె యాకయ్య గత 25 రోజుల క్రితం తాటి చెట్టు పైనుండి పడి వరంగల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన పల్లె యాకయ్య గౌడ్ కుటుంబాన్ని గౌడ సంఘల ప్రతినిధులు,గోపా నాయకులు పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొర్రూరు మండలంలో తాటి చెట్టు నుంచి పడి చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. ప్రభుత్వం గీతా కార్మికుల కొరకు సేఫ్టీ మోకులు వెంటనే ఇవ్వాలని, చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం నుంచి వచ్చే ఐదు లక్షల ఎక్సిగ్రేషియా కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సహకార పరపర సంఘం అధ్యక్షులు దీకొండ శ్రీనివాస్ గౌడ్,కౌండిన్య సహకార పర్పస్ సంఘం కార్యదర్శి కుంభ మహేష్ కుమార్ గౌడ్, ట్రెజరర్ పరిదీలా వెంకటేశ్వర్ గౌడ్, సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అసోసియేషన్ అధ్యక్షులు చీకటి అశోక్ గౌడ్, ముఖ్య సలహాదారులు గట్టు కమలాకర్ గౌడ్,కంఠ మహేశ్వర గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గౌడ్, గ్రామ గౌడ సంఘ పెద్దలు పల్లె సర్వయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి లాభాల వాటాను 40% కార్మికులకు ఇవ్వాలి.

సింగరేణి లాభాల వాటాను 40% కార్మికులకు ఇవ్వాలి

మంచిర్యాల నేటి ధాత్రి:

సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ రామగుండం ఏరియా ఆధ్వర్యంలో సెంటినరీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో సింగరేణి సంస్థ సాధించిన వాస్తవ లాభాలను ప్రకటించి లాభాలపై 40 శాతం వాటాన్ని జాప్యం లేకుండా కార్మికులకు చెల్లించాలని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ మరియు డైరెక్టర్ పా) కొప్పుల వెంకటేశ్వర్లు ని కలిసి మెమోరాండం అందించడం జరిగింది.అనంతరం అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ సింగరేణి సంస్థ ప్రకారం 2024-2025 ఆర్థిక సంవత్సరం ముగిసింది.ఇప్పటి వరకు ప్రకటించని వాస్తవ లాభాలు,జాప్యం లేకుండా వెంటనే ప్రకటించి 40% వాటాను పంపిణీ చేయుటకు ఆదేశాలు జారీ చేయాలని సంస్థ డైరెక్టర్ (పా)ని రామగుండం పర్యటనలో కలిసి చర్చించామని,
2023-24 ఆర్థిక సంవత్సరంలో 70.12 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేస్తే 37వేల కోట్ల బిజినెస్ జరిగిందని,వాస్తవ లాభాలు రూ.4701 కోట్లు ప్రకటించి,సిఎస్ఆర్ నిధులు,డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ మళ్లింపులు మినహాయింపులు రూ.2289 కోట్లు పోను రూ.2412 కోట్లలో 33% అంటే 795.96కోట్ల రూపాయలను గత సంవత్సరం చెల్లించడం జరిగిందని తెలిపినారు.అలాగే ప్రధాన కార్యదర్శి యతిపతి సారంగపాణి మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం కార్మికులు కష్టపడి రికార్డ్ స్థాయిలో 72మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి గాను 69.01మిలియన్ టన్నులు సాధించారని,వేల కోట్ల వ్యాపారం జరిగిందని,గత సంవత్సరం పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రికార్డ్ స్థాయిలో ఉత్పత్తి సాధించిన కార్మికుల కోసం ఈ సారి లాభాల వాటా 40% ప్రకటించాలని విజ్ఞప్తి చేసినారు.గతంలో ఇచ్చిన లాభాల వాట వివరాలు ప్రకారo 2015-2016: 23%,2016-2017: 25%,2017-2018: 27%,2018-2019: 28%,2019-2020: 28%,2020-2021: 29%,2021-2022: 30%,2022-2023: 32%,2023-2024: 33% ఇవ్వడం జరిగిందని, 40 శాతానికి పెంచడం వల్ల కార్మిక కుటుంబాలకు పిల్లల చదువులు,కాలేజీ హాస్టల్ స్కూల్స్ ఫీజులు చెల్లించుటకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంటుందని,త్వరితగతిన పూర్తి చేసి జూన్ మాసంలో చెల్లించుటకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నాతాడి శ్రీధర్ రెడ్డి,నాయకులు రౌతు రమేష్,దొనీకిన రమేష్,తిరునహరి కిరణ్ కుమార్,సల్ల వేణు,పాక కృష్ణ, కందుల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ సమావేశం.!

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలంలోని మీనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం రోజున మధ్యాహ్నం రెండున్నర గంటలకు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతింది అని. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మరియు రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి మరియు ఇతర రాష్ట్ర నాయకులు పాల్గొంటున్నారు.అని కావున మండలంలోని మాజీ ప్రజాప్రతినిధులు జడ్పిటిసిలు , ఎంపీపీలు , సర్పంచులు , ఎంపీటీసీలు , వార్డ్ మెంబర్స్ జిల్లాస్థాయి మండల స్థాయి నాయకులు కార్యకర్తలు అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనార్టీ సెల్ విభాగ నాయకులు కార్యకర్తలు మండలంలోని బూత్ ఎన్రోలర్స్ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి కోరినారు.

దేశవ్యాప్త ఒక్కరోజు సమ్మెను కార్మికులంతా విజయవంతం.

దేశవ్యాప్త ఒక్కరోజు సమ్మెను కార్మికులంతా విజయవంతం చేయాలి…

ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ ఆలీ

రామకృష్ణాపూర్  నేటిధాత్రి:

ఈనెల 20వ తారీకు తలపెట్టిన దేశవ్యాప్త ఒక్క రోజు సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణి కార్మికులను ఏఐటియుసి సంఘం సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ కోరారు. శుక్రవారం మందమర్రి ఏరియాలో గల రామకృష్ణాపూర్ పట్టణంలోని సిహెచ్పీ లో ఫిట్ సెక్రటరీ రామకృష్ణ ఆధ్వర్యంలో ఏఐటియుసి యూనియన్ ద్వార సమావేశం ఏర్పాటు చేశారు.ముఖ్య అతిథులుగా ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, ఏరియా బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ లు సుదర్శన్, ఇప్పకాయల లింగయ్య లు హాజరయ్యారు.అనంతరం వారు మాట్లాడారు. 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్స్ చేయడం కార్మికులకు నష్టమని, కార్మికుల హక్కులు కోల్పోతామని, కార్మిక చట్టాలను నీరుగార్చే విధానం అని అన్నారు.

workers

కార్మిక లోకానికి తోడుగా ఏఐటియుసి ఉంటుందని తెలిపారు. అనేక సమస్యలతో ఉన్న కార్మికులకు ఈనెల 20న జరిగే దేశవ్యాప్త ఒక్కరోజు సమ్మెలో పాల్గొనాలని కార్మికులను కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి ఫిట్ సెక్రటరీ నాగేంద్ర బట్టు, దినేష్, వేణుగోపాల్, సిరాజ్ ,నరేంద్ర, అబ్బాస్, స్వామి, శ్రీనివాస్, రాజమౌళి, ఏఐటీయూసీ సంఘ సభ్యులు కార్మికులు పాల్గొన్నారు.

దేశవ్యాప్త ఒక్కరోజు సమ్మెను కార్మికులంతా విజయవంతం.!

దేశవ్యాప్త ఒక్కరోజు సమ్మెను కార్మికులంతా విజయవంతం చేయాలి…

ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ ఆలీ

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

ఈనెల 20వ తారీకు తలపెట్టిన దేశవ్యాప్త ఒక్క రోజు సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణి కార్మికులను ఏఐటియుసి సంఘం సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ కోరారు. శుక్రవారం మందమర్రి ఏరియాలో గల రామకృష్ణాపూర్ పట్టణంలోని సిహెచ్పీ లో ఫిట్ సెక్రటరీ రామకృష్ణ ఆధ్వర్యంలో ఏఐటియుసి యూనియన్ ద్వార సమావేశం ఏర్పాటు చేశారు.ముఖ్య అతిథులుగా ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, ఏరియా బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ లు సుదర్శన్, ఇప్పకాయల లింగయ్య లు హాజరయ్యారు.

Strike

అనంతరం వారు మాట్లాడారు. 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్స్ చేయడం కార్మికులకు నష్టమని, కార్మికుల హక్కులు కోల్పోతామని, కార్మిక చట్టాలను నీరుగార్చే విధానం అని అన్నారు. కార్మిక లోకానికి తోడుగా ఏఐటియుసి ఉంటుందని తెలిపారు. అనేక సమస్యలతో ఉన్న కార్మికులకు ఈనెల 20న జరిగే దేశవ్యాప్త ఒక్కరోజు సమ్మెలో పాల్గొనాలని కార్మికులను కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి ఫిట్ సెక్రటరీ నాగేంద్ర బట్టు, దినేష్, వేణుగోపాల్, సిరాజ్ ,నరేంద్ర, అబ్బాస్, స్వామి, శ్రీనివాస్, రాజమౌళి, ఏఐటీయూసీ సంఘ సభ్యులు కార్మికులు పాల్గొన్నారు.

చేనేత కార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.!

చేనేత కార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు భీమనాదుని సత్యనారాయణ …..

నేటి ధాత్రి .,,……………..

 

 

జయశంకర్ జిల్లా మొగుళ్లపల్లి మండల గ్రామం ఎల్లారెడ్డి పల్లెలో చేనేత కార్మిక కుటుంబాలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్న పద్మశాలి సంఘం నాయకులు తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు భీమనాధుని సత్యనారాయణ మాట్లాడుతూ రోజంతా శ్రమించి కార్మికులకు రోజు 300 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదని కావున ప్రభుత్వం నెలకు 20 వేల రూపాయలు అయ్యేవిధంగా పని కల్పించాలని మరియు ఇందిరమ్మ గృహాలు హెల్త్ కార్డు అందించి చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరారు వరంగల్ జిల్లాలో ఏర్పాటు అవుతున్న కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమలో పద్మశాలీలకు మరియు చేనేత కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కలిపి కల్పించాలని 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులకు పవర్ రూమ్ కార్మికులకు విద్యార్థి పింఛన్ వెంటనే మంజూరు చేయాలని మరియు మగ్గం వేసే ప్రతి కార్మికునికి జియో ట్రాక్ తో సంబంధం లేకుండా చేనేత మిత్ర కింద 2500 అందించి చేనేత కార్మికులకు ఆర్థిక ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు

యజమానుల వైఖరి నిరసిస్తూ వార్పిన్,.!

యజమానుల వైఖరి నిరసిస్తూ వార్పిన్, పై పని కార్మికుల సమ్మె

సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్
కేకే మహేందర్ రెడ్డి కి వినతి పత్రం అందజేత

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని చేనేత కార్మికులకు
ప్రభుత్వం ఉత్పత్తి చేస్తున్న మహిళా సంఘాల చీరలకు కార్మికులకు,మెరుగైన వేతనం ఇవ్వాలని ప్రభుత్వం మీటరుకు రెండు రూపాయలు యజమానులకు పెంచిన కూడా,సరియైన వేతనం ఇవ్వకుండా తగ్గించాలని చూస్తున్నా యజమానులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలిని
రేపు పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘం వద్ద
ధర్నా వై పని,పవర్లూమ్ కార్మికులు పాల్గొని ధర్నాలు విజయవంతం చేయాలి అని పిలుపునివ్వడం జరిగినది.
ఈరోజు అమృత శుక్ల కార్మిక భవనం వద్ద వార్పిన్ కార్మికుల జనరల్ సమావేశం జరిగినది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ముశం రమేష్ మాట్లాడుతూ పవర్లూమ్,వార్పిన్, వై పని కార్మికులు,15 రోజుల క్రితం మహిళా సంఘాల చీరలకు కూలి పెంచాలని సమ్మె చేసిన సందర్భంగా, చేనేత జోలి శాఖ అధికారులు గత బతుకమ్మ చీరలకు ఏ విధంగా అయితే కూలి వచ్చిందో అంతకంటే మెరుగైన వేతనం కార్మికులకు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి సమ్మె విరమించడం జరిగింది.

Warpin, Pyi workers

వారు హామీ ఇచ్చిన ప్రకారంగా కార్మికుల కూలి పెంచడం కోసం మీటరుకు రెండు రూపాయలు బట్ట ధర పెంచడం జరిగింది 32 రూపాయలు ఉన్నది 34 రూపాయలు పెంచడం జరిగింది.కార్మికుల కోసం రెండు రూపాయలు ప్రభుత్వం ఇచ్చిన కూడా కార్మికుల శ్రమకు తగ్గ వేతనం ఇచ్చేందుకు యజమానులు మనసు రావడం లేదు కార్మికులు ప్రభుత్వం నుంచి పోరాడి సాధించినటువంటి కూలీ నుండి కూడా. యజమానులు లాభం పొందాలని చూస్తున్నారు
బతుకమ్మ చీరల కూలి ఇంతకుముందు పవర్ లోన్ కార్మికులకు 5.25 పైసలు ఒక మీటర్ కు కార్మికునికి కూలి ఉంటే ఇప్పుడు ఐదు రూపాయలు ఇస్తామని అంటున్నారు .వార్పిన్. వై పని కార్మికునికి గత బతుకమ్మ చీరల పనికంటే.విపరీతమైన పని భారం పెరిగింది చిన్నకోములు వస్తున్నాయి పోగులు పెరిగినాయి అయినా కూడా పెరిగిన పనికి ధర ఇవ్వడానికి. యజమానులు ఒప్పుకోవడం లేదు.. చేనేత జౌళి శాఖ అధికారులు కూలి నిర్ణయం చేయకపోవడం.యజమానులకు కూలి నిర్ణయించాలని బాధ్యతలు అప్పజెప్పడం వలన ఈ పరిస్థితి రావడం జరిగినది.అధికారుల యజమానుల మధ్య.కార్మికులు నష్టపోవడం జరుగుతుంది.అధికారులు వెంటనే జోక్యం చేసుకొని కూలి సమస్య పరిష్కరించాలి లేని ఎడల
పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు
సమావేశంలో సి.ఐ.టి.యు జిల్లా కార్యదర్శి
కోడం రమణ,అధ్యక్షులు సిరిమల్ల సత్యం, ఉడుత రవి,మచ్చ వేణు,బుట్ల వెంకటేశం, దోమల రమేష్ ఐరన్ ప్రవీణ్,సామల శీను తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి సేవలో సింగరేణి కార్మికులు.

శ్రీవారి సేవలో సింగరేణి కార్మికులు

శ్రీరాంపూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:

 

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు,కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సేవకు తరలి వెళ్లిన సింగరేణి కార్మికులు.కరీంనగర్ లోని గోవిందపతి శ్రీవారి సేవ ఫౌండర్ గోవిందపతి శీనన్న ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు దొమ్మటి విజయ్ కుమార్,రాజేందర్, స్పందన,సత్య ప్రసాద్,నరేష్, శ్రీనివాస్,మోహన్ లు ప్రతి సంవత్సరం తేదీ 28/04 నుండి 05/05/25 వరకు భక్తిశ్రద్ధలతో శ్రీవారి సేవలో మునిగిపోతున్నారు.దేశం, రాష్ట్రం శష్యశ్యామలంగా, సుఖ సంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని వారు ప్రతి సంవత్సరం శ్రీవారి సేవలో వేడుకుంటున్నట్లు తెలిపారు.

అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి.

అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి

బిఆర్టియి జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని వారందరికీ లేబర్ శాఖ ద్వారా సంక్షేమ పథకాలు అందజేయాలని బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు అన్నారు.ఐస్ క్రీమ్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం యూనియన్ అధ్యక్షుడు కొమురయ్య అధ్యక్షతన జరిగింది. గోనె యువరాజు మాట్లాడుతూ దేశంలో నాలుగున్నర కోట్ల మంది కార్మికులు రోజువారీగా పనులు చేసుకుంటూ కార్మిక చట్టాల అమలుకు దూరంగా ఉంటున్నారని వారందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే పార్లమెంటులో సమగ్ర బిల్లు పెట్టి సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా చట్ట సవరణలు చేయడాన్ని నిరసిస్తూ ఈనెల 20న దేశవ్యాప్తంగా అసంఘటిత కార్మికులు సమ్మె చేయబోతున్నారని ఆ సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోగా అధ్యక్షులుగా చెరుపల్లి కొమరయ్య, కార్యదర్శిగా ఎండి అజీమ్, ఉపాధ్యక్షులుగా సలేంద్ర చేరాలు, కోశాధికారిగా గుండు స్వామి, కమిటీ సభ్యులుగా అన్నే బోయిన రాజు, జి సారయ్య,రాజు, మహేందర్ ,నరసయ్య ,శ్రీను బద్రు, పాషా ఎన్నికైనారు.

మే 20 న జేరిగే సమ్మెను కార్మికులు జయప్రదం చేయాలి.

మే 20 న జేరిగే సమ్మెను కార్మికులు జయప్రదం చేయాలి
వనపర్తి నేటిధాత్రి :

 

 

శనివారం సిఐటియు జిల్లా కార్యాలయంలో సిఐటియు మండల సదస్సు బి. కవిత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు మాట్లాడుతూ మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులు ,రైతు ,కూలీల కర్తవమని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు మే 20 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని, సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాలు , వ్యవసాయ కార్మిక సంఘాలు గ్రామీణ భారత్ బందుకు పిలుపునిచ్చాయని అన్నారు. దేశంలోని నూటికి 90 శాతం ప్రజలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నదని కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని కార్మికులు మే 20 న తలపెట్టిన భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను కార్మికులు జయప్రదం చేయాలని కేంద్ర ప్రభుత్వ విధానాలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. . ఈ సదస్సులో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నందిమల్ల రాములు, వనపర్తి అంగన్వాడి ప్రాజెక్టు అధ్యక్షులు జి. జ్యోతి, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు బాల కిష్టమ్మ ,సరళ, నారాయణమ్మ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సానిటరీ వర్కర్స్ అధ్యక్షులు మౌలాల్, నాయకులు ఎన్. కురుమూర్తి, బోన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పరమేశ్వర చారి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు

మే డే సందర్బంగా జెండా ఎగరావేసిన ఓసీ త్రి కార్మికులు.

మే డే సందర్బంగా జెండా ఎగరావేసిన ఓసీ త్రి కార్మికులు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం పరశురాంపల్లి గ్రామ పరిధిలో సింగరేణి ఓసీ త్రి ఏర్పడి ఐదు సంవత్సరాలు అవుతుంది ఓసీ లో పనిచేసే ప్రైవేట్ కార్మికులు నూతనంగా ఏర్పాటు చేసిన యూనియన్. అధ్యక్షులు మాచర్ల కనకయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు దిడ్డి బాలకృష్ణ పటేల్ బుర్ర శంకర్ గౌడ్ మొదటి సారి (మే డే) పురస్కరించుకొని కార్మికులు ఉత్సాహంగా జెండా ఎగరవేశారు.ఓసీ త్రి లో నూతనంగా ఏర్పడిన యూనియన్ కార్యవర్గం, కార్మికులు పాల్గొన్నారు.

మహాప్రస్థానంలో పని చేస్ కార్మికులుకు సన్మానం.

మహాప్రస్థానంలో పని చేస్ కార్మికులుకు సన్మానం
శేరిలింగంపల్లి,నేటి ధాత్రి :-

 

కార్మికుల దినోత్సవం సందర్బంగా రాయదుర్గం లోని వైకుంఠ మహా ప్రస్థానం లో పనిచేసేవారందరికీ శాలువాతో సత్కరించిన శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు మరియు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా కార్మికులు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహా ప్రస్థానంలో పనిచేసేవారందరికీ బహుమతులను మరియు స్వీట్ బాక్స్ లను అందజేశారు. అనంతరం అయన మాట్లాడుతూ “ప్రతి మనిషి ఆఖరి మజిలీ చావు, అట్టి ఆఖరి గమ్యంలో మీరంతా అందించే సేవలు ఆదర్శప్రాయం అని, అతి ముఖ్యంగా కరోనా సమయం లో మహా ప్రస్థానం సిబ్బంది అందించిన సేవలను ఎప్పటికి మర్చిపోలేమనీ కొనియాడారు.

Corona

 

ఒక మనిషి చనిపోతే సొంత కుటుంబికులే రాలేని రోజుల్లో మీరే అన్ని అయ్యి అంత్యక్రియలు చేయడం ఎంతో ఆదర్శం. మీరు అందించే సేవలకు మేము మా తృప్తి కొరకు అందిస్తున్న ఈ చిన్న కానుక”.భవిష్యత్తులో ఏవరికి ఏ అవసరం వచ్చినా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మహాప్రస్థానం మేనేజర్ రాజ్ కుమార్, మహా ప్రస్థానం సిబ్బంది మరియు నాయకులు అంజమ్మ, దారుగుపల్లి నరేష్, రమేష్ గౌడ్, శామ్లెట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version