సింగరేణి కార్మికులకు 200 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి…

సింగరేణి కార్మికులకు 200 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి

కామ్రేడ్ చంద్రగిరి శంకర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఏఐ ఎఫ్ టియు రాష్ట్ర నాయకుడు చంద్రగిరి శంకర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సొంత ఇంటి కోసం 200 గజాల స్థలం ఇవ్వాలి
కార్మికుడి సంవత్సర జీవితంలో మూడు నెలలు ఇన్కమ్ టాక్స్ కట్టడానికే సరిపోతున్నది అందువలన కనీసం అధికారులలాగా పేర్క్స్ పై ఇన్కమ్ టాక్స్ను మాఫీ చేయాలని కోరుతున్నాం.
సింగరేణిలో రానున్న కొద్ది సంవత్సరాల్లో అనేక భూగర్భగనులు మూతపడే అవకాశం ఉన్నందున తక్షణం నూతన గనుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం
సేఫ్టీ ట్రైపాడ్ సమావేశాలు గత 18 నెలల నుండి జరగకపోవడం వలన రక్షణ విషయంలో వెనుకబడినట్లుగా భావిస్తున్నాం. నూతన బదిలీ విధానం కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నందున ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం
మెరుగైన క్యాడర్ స్కీమ్ విధానాన్ని ప్రవేశపెట్టి నూతప్రమోషన్ పాలసీని తీసుకురావాలని కోరుతున్నాము
ఏరియా ఆసుపత్రులలో నాణ్యమైన మందులు అందుబాటులో ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం రిఫరల్ సిస్టంను మార్చలని మైన్ యాక్సిడెంట్ అయినప్పుడు యాక్సిడెంట్కు గురైన కార్మికుడిని ముందుగా డిస్పెన్సరీకి తీసుకువెళ్లడం తర్వాత ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లడం తర్వాత రిఫరల్ చేయడంతో చాలా సమయం వృధా అయి విలువైన ప్రాణాలను కోల్పోతున్నందున ప్రమాదం జరిగిన వెంటనే ఏరియా ఆసుపత్రి నుండే డైరెక్టుగా రిఫరల్ చేసేలా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం
40/ లాభాల వాటాను వెంటనే ప్రకటించాలని కోరుతున్నాం
ఎన్నో ఏళ్లుగా కార్మికులు ఎదుర్కొంటున్న మారుపేరుల సమస్యను వెంటనే తీర్చాలని కోరుతున్నాం
పై సమస్యల పరిష్కారానికి తగు చర్యను వెంటనే తీసుకొని సింగరేణి కార్మిక లోకానికి న్యాయం చేయాలని కోరుతున్నాం వివిధ కారణాల వలన ఉద్యోగాలను కోల్పోయిన డిస్మిస్డ్ కార్మికులకు మరొక అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం అన్ని డివిజన్లో ఉన్న వాళ్లకు వన్ టైం సెటిల్మెంట్ లో ఇవ్వాలి సింగరేణి కార్మికుల ఎన్నికలలో వాగ్దానం చేసి ఇప్పటివరకు వాటిని అమలు చేయలేకపోతున్నారు వెంటనే అమలు చేయాలి చంద్రగిరి శంకర్ డిమాండ్ చేశారు

ఉపాధ్యాయుల ప్రమోషన్లు,బదిలీల షెడ్యూల్ ను..

ఉపాధ్యాయుల ప్రమోషన్లు,బదిలీల షెడ్యూల్ ను వెంటనే విడుదల చేయాలి

నడికూడ,నేటిధాత్రి:
యూఎస్ పిసి స్టీరింగ్ కమిటీ రాష్ట్ర నాయకులు నన్నెబోయిన తిరుపతి డిమాండ్
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యు.ఎస్.పి.సి) ఆధ్వర్యంలో నడికూడ మండలంలో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని నడికూడ మండల తహసిల్దార్ రాణి కి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది.ఈ వినతి పత్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కి పంపాలని కోరనైనది.
ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర నాయకులు నన్నెబోయిన తిరుపతి మాట్లాడుతూ ఉపాధ్యాయ విద్యారంగా సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తున్నందున సమస్యల పరిష్కారానికి యూఎస్ పిసి మూడు దశలలో పోరాటానికి సిద్దమైనదన్నారు.మొదటి దశ పోరాటంలో బాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ల ద్వారా వినతిపత్రాలు ఇస్తున్నామన్నారు.వారు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఉపాధ్యాయులకు విద్యారంగానికి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉపాధ్యాయుల ప్రమోషన్లు బదిలీల షెడ్యూల్ ను వెంటనే విడుదల చేసి ఈ నెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ప్రాథమిక పాఠశాలకు ప్రతి తరగతికొక టీచర్ ను నియమించాలని,టీచర్ల క్రమబద్ధీకరణ జీవో 25ను సవరించాలని, ఉపాధ్యాయుల వివిధ రకాల పెండింగ్ బిల్లులు,డీఏలను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర ఉద్యోగులకు పిఆర్సి ని అమలు చేయాలని కోరారు.సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
యూఎస్ పిసి నాయకులు టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రావుల రమేష్ మాట్లాడుతూ 2008 డీఎస్సీ కాంట్రాక్టు టీచర్లకు 12 నెలల వేతనాన్ని ఇవ్వాలని,సమగ్ర శిక్షలో కొనసాగుతున్న వెట్టిచాకిరి శ్రమదోపిడి విధానాన్ని రద్దుచేసి,ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని,ఎస్ ఎస్ ఎ ఉద్యోగుల సమ్మెకాలపు వేతనాన్ని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆగష్టు ఒకటిన జిల్లాలల్లో, ఆగష్టు 23న హైదరాబాద్ లో మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు.
వినతి పత్రం అందించినవారిలో యుఎస్ పిసి మండల నాయకులు శ్రీనివాస్,సుభాని, రవిందర్,కృష్ణంరాజు,విక్రమ్ గౌడ్,సత్యపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version